Jump to content

నెల్లూరు చోడులు

వికీపీడియా నుండి
నెల్లూరు చోడుల నాణేలు. రెండవ భోజరాజు, సా.శ 1216-1316.

నెల్లూరు చోడులు లేదా నెల్లూరు చోళులు తెలుగు చోడులలో ఒక శాఖకు చెందినవారు. వీరు 11, 14 వ శతాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను పరిపాలించారు. వీరు చోళులు, కాకతీయులు, పశ్చిమ చాళుక్యులలాంటి సార్వభౌములకు సేనాధిపతులుగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించారు. వెలనాటి చోడులు క్షీణదశకు చేరుకునేటప్పటికి వీరి ప్రభావం ఉన్నత స్థాయికి చేరింది. వీరు ఆరంభ చోళులకు చెందిన కరికాల చోళుడి వారసులుగా చెప్పుకున్నారు.[1] వీరి గురించిన వివరాలు తెలుగు, తమిళ, సంస్కృత గ్రంథాల్లో కనిపిస్తాయి.[2]

చరిత్ర

[మార్చు]

వీరు ఆరంభ చోళులలో ఒకడైన కరికాల చోళుడు వారసులుగా ప్రకటించుకున్నారు. వీరు విక్రమసింహపురి (ఆధునిక నెల్లూరు) రాజధానిగా చేసుకుని నెల్లూరు, కడప, చిత్తూరు, చెంగల్పట్టు జిల్లా ప్రాంతాలను పరిపాలించారు. నెల్లూరు చోడులలో ముందుగా పేర్కొనదగిన పాలకుడు చోడ బిజ్జన. ఈయన పశ్చిమ చాళుక్య ప్రభువైన మొదటి సోమేశ్వరుడి కింద భూస్వామిగా ఉండేవాడు. ఇతను మొదట చాళుక్యుల తరపున, తర్వాత చోళుల తరపున యుద్ధాలు చేశాడు. కళ్యాణి చాళుక్యుల వంశానికి ఇతను చేసిన సేవలకు గాను రెండవ విక్రమాదిత్యుడు ఇతనికి పాకనాడు ప్రాంతానికి పరిపాలకుడిగా ప్రకటించాడు.

తర్వాత ప్రఖ్యాతి గాంచిన మనుమసిద్ధి తండ్రియైన చోడ తిక్క భూపతి (1223-1248) దక్షిణాన కావేరి నది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. అప్పటికే ప్రాభవం కోల్పోయిన చివరి చాళుక్యులకు నామమాత్రంగా అణిగి ఉన్నాడు. ఇతను హొయసల రాజు వీరనరసింహతో కలిసి మూడవ రాజరాజ చోళునికి యుద్ధం నందు సహాయం చేసి అతని అధికారాన్ని కాపాడాడు.

మూలాలు

[మార్చు]
  1. Yashoda Devi (1993). The History Of Andhra Country 1000 A D 1500 A D. p. 444.
  2. Yashoda Devi (1993). The History Of Andhra Country 1000 A D 1500 A D. p. 443.