పానగల్ కోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పానగల్ పరిదృశ్యం

పానగల్‌ కోట వనపర్తి జిల్లా లోని గిరి దుర్గాలలో ప్రముఖమైనది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఒక మండల కేంద్రమైన పానగల్ సమీపంలో ఈ కోట ఉంది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ కోటలో, ఈ ప్రాంత ప్రజల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలిచే అనేక నిర్మాణాలు ఉన్నాయి. అబ్బురపరిచే కట్టడాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలలో ముగ్ధులని చేసే శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. ఈ ప్రాంతపు జానపదుల అనేక కథలలోనూ ఈ కోట ప్రస్తావన ఉంది. కోటలోని పరివారానికి నాడు ఆహారం కొరకు రకరకాల పళ్ళ చెట్లు కూడా కోటలో పెంచేవారని తెలుస్తుంది. కోటకు వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యాలను ప్రభుత్వాలు కల్పించకపోయినా, తరుచుగా సందర్శకులు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. గుప్త నిధుల వేటగాళ్ళ బారినపడి ఇక్కడి అపురూపమైన ప్రాచీన సాంస్కృతిక కట్టడాలు నేలమట్టమైపోతున్నాయి. విగ్రహాలు ధ్వంసమైపోతున్నాయి. ఈ ప్రాంతంలో లభించిన అనేక శాసనాలను, ఫిరంగులను జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో భద్రపరిచారు. 1830లో ఈ కోటని కాశీయాత్రలో భాగంగా సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రచరిత్రలో పానగల్ కోటను గూర్చి వ్రాశారు. పానగల్ కొండ కింద, కొండ మీద విశాలమైన దుర్గం ఉందని వ్రాశారు. ఆ గ్రామం బస్తీ కాకున్నా ఇంగ్లీషు లష్కర్‌కి సరంజామా చేసి వాడుక పడింది కనుక యాత్రికులకు అవసరమైన వస్తువులు దొరుకుతున్నాయని వ్రాశారు.[1]

ఉనికి[మార్చు]

వనపర్తి నుండి కొల్లాపూర్‌కు వెళ్ళేదారిలో వనపర్తికి 30 కిలోమీటర్ల దూరంలో పానగల్ సమీపంలో ఈ కోట కనిపిస్తుంది,

కోట నిర్మాణం[మార్చు]

ఈ కోటను ఎత్తైన దుర్గం మీద నిర్మించారు. ఈ పర్వతశ్రేణి మూడు వైపుల గుర్రం నాడా ఆకారంలో ఉండి, తూర్పు దిక్కున రెండు మొనలను కలిగి ఉంది. కొండపై 20 అడుగుల ఎత్తున ప్రాకారాలను నిర్మించారు. సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు మైళ్ళ వైశాల్యంలో కోటను నిర్మించారు[2]. పెద్ద పెద్ద బండరాళ్ళతో ఈ కోటను నిర్మించారు. ఇది 11 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యుల సామంతులచే నిర్మింపబడినదని అంటారు. శత్రు దుర్బేధ్యమైన ఈ కోటలో 60 దాకా బురుజులు ఉన్నాయి. ఎత్తైన ఈ దుర్గం మీద విశాలమైన పల్లం కలిగి అందులో బావులు, గుడులు, గోపురాలు, మసీదులు ఉన్నాయి. కోట తూర్పు భాగంలో నాలుగు ప్రాకారాలు, వాటిపై ఫిరంగుల స్థావరాలు, సైన్యానికి ఏర్పాటుచేసిన విడిది శాలలు కనిపిస్తాయి.

సప్త ప్రాకారాలు[మార్చు]

చాలా విశాలమైన ఈ కోటలోకి ప్రవేశించడానికి సప్త ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది. వీటిలో చాలా వరకు నేడు శిథిలమై ఉన్నాయి. కాని ప్రధాన ప్రాకార ద్వారం మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ ద్వారానికి ముండ్లగౌని ద్వారమని పేరు. ఈ ద్వారంపై ఉన్న కళానైపుణ్యం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. ద్వారం తలుపులపై బంగారం, పంచలోహాలతో చేసిన చెక్కడాలు, తాపడాలు ఉండేవట. వాటిని గుప్తనిధుల వేటగాళ్ళ దొంగిలించారట.

రామ గుండం[మార్చు]

ఈ కోటలో ఒకే రాతిపై పెద్ద నడబావిని తవ్వించి దానికి రామ గుండం అని పేరు పెట్టారు. నాడు రామగుండంలోని నీటిని తోడి పల్లపు ప్రాంతంలో ఉన్న భూములకు పారించి, పంటలు పండించేవారట. ఇప్పటికీ బావికి రెండువైపులా పెద్ద మోట, చిన్న మోట అనే కట్టడాలు కనిపిస్తాయి.

సీతారాముల పాదాలు[మార్చు]

రామ గుండం రాతిపై దక్షిణం వైపు రెండు జతల పాదముద్రలు ఉన్నాయి. వీటికి సీతారాముల పాదముద్రలని పేరు. అందుకే చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నేటికీ హైందవ పర్వదినాలైన తొలి ఏకాదశి, శివరాత్రి, శ్రీరామ నవమి మొదలగు రోజుల్లో ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చి, రామగుండంలో స్నానాలు చేసి, సీతారాముల పాదాలకు పూజలు నిర్వహిస్తుంటారు.

శాసనాలు[మార్చు]

ఈ కోటలో చాలా శాసనాలు లభించాయి. ఒకటి తెలుగు, కన్నడ మిశ్రమలిపిలో రాయబడిన శాసనం లభించింది. కాని ఇది శిథిలమైనందున, అందులోని విషయం పూర్తిగా తెలిసిరాలేదు. కోటలో గణపతి గుండు అను పాశానంపై మరో శాసనం ఉంది. దీనికి ఖైరాత్‌ఖాన్‌ శాసనం అని పేరు. ఇది తెలుగు, కన్నడ, అరబిక్ భాషలలో మిశ్రమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ శాసనాలను చిన్న మంత్రి అనే శాసన రచయిత చెక్కినట్లు తెలుస్తుంది.

మక్కా మసీదు[మార్చు]

కోటలో మక్కా మసీదు పేరుతో నిర్మించిన ప్రార్థనామందిరం ఉంది. అది ఇప్పటికీ చెక్కుచెదరలేదు. మసీదుపై ఉన్న మినారులను మాత్రం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ మసీదు ముందు ప్రధాన ద్వారానికి రెండువైపుల రాతి సింహాలు ఉన్నాయి. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ఉయ్యాల మండపం[మార్చు]

కోటలో నాటి రాజులు విరామ సమయాలు గడపడానికి, సరదాగా ఊగడానికి ఒక పెద్ద ఊయలను, దానికో ఆరామాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. దీనికి ఉయ్యాల మండపం అని పేరు.

దుర్గంలో దర్గాలు[మార్చు]

హజ్రత్ అగా దావుద్ దర్గా ఉంది. ఇక్కడికి హిందూ, ముస్లిం భక్తులు విరివిగా వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. దుర్గం దిగువ భాగంలోనూ ప్రసిద్ధ బార్లాపీర్ల దర్గా ఉంది. హిందూ ముస్లింల సమైక్యతకు ఈ దర్గాలు ఈ ప్రాంతంలో ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

చరిత్ర[మార్చు]

పాన్గల్! పాలమూరుజిల్లాలో కొలువైన ఈ ఖిల్లా పేరువినగానే గుర్తుకొచ్చేవి గట్లు!దానిమీదుగా నిత్యం ప్రయాణించే బాటసారులకు అదో సాధారణ గుట్ట మాత్రమే! అందుకే దాని ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం ఆ చుట్టుపక్కలవాళ్లక్కూడా తెలియదు! ఆ గట్ల వెనకాలే ఉన్న బాలపీర్లను దర్శించుకునే ప్రజలు సైతం... ఈ ఖిల్లాను దర్శించుకున్న దాఖలాల్లేవ్! ఇది కొంచెం ఆశ్చర్యమే! కళ్లముందు కనిపిస్తూనే కడుపులో బోలెడంత చారివూతక రహస్యాన్ని దాచుకున్న బర్లగట్టు ఉరఫ్ ఖిల్లాగట్టు ఉరఫ్ పాన్గల్ గట్టు గుట్టువిప్పే కథనం ఇది....

చుట్టూ నాలుగు పెద్ద దుర్గాలు... ఆ దుర్గాల మధ్య మైదానం.. నవాబులు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న కోటలు... ఇక్కడ విస్తరించిన పచ్చిక, పెద్దపెద్ద చెట్లు, గుట్టలు, కాలుష్యం లేకుండా వీచే చల్లని గాలి సందర్శకులను ఆహ్లాద పరుస్తాయి. గుట్టపైకి ఎక్కి చూస్తే నలుదిక్కులా ఊర్లు అగుపిస్తాయి. పాములా పాకిపోతున్నట్లు రహదారుల ఆకారం గోచరిస్తుంది. గుండాల్లోని చల్లనినీరు దాహార్తిని తీర్చడమే కాదు స్వస్థతనూ చేకూరుస్తుంది. కారణం అందులో వనకమూలికలుండడం! తీర్థయావూతపూందుకు కాళ్లకు కాసింత పనిచెప్పి ఇక్కడికి వస్తే మనసు కుదుటపడుతుందనే అనుభూతి కలుగుతుంది.

చారివూతక సంపద ఒకప్పుడు ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనడానికి ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులున్నాయి... శిల్పసంపద... పూజించుకునేందుకు దేవుళ్లు... శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల, కోటలు... ఇవన్నీ గతవైభవ దీప్తులే! మిగిలిన చారివూతక సంపదలే! చనిపోయిన వారిని ఖననం చేసిన శ్మశానం కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్లగవిని అనే ప్రధానద్వారం ఈనాటికీ దర్జాగా నిలబడి ఉంది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లనుపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులున్నాయి! ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది! శిలా శాసనాలు ఈ ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూ లిపిలో ఓ శిలా శాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది భైరాన్ఖాన్ మూడో శాసనమని మాత్రం అవగతమవుతున్నది. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. ‘‘స్వస్తీశ్రీ జయభ్యుదయ శాలివాహన వర్షంబులు 1540 అగుననేడి చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్షా వారి సుబేదారుడు భైరాన్ఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించి ఈ సుభాకొండలోని కుమ్మరివీధిలో నడ బావిని తవ్వించి రాతి కట్టడంతోపాటు సున్నపుగచ్చు వేయించి ఆ చంద్రార్కరము నిలుచునట్లు ప్రతిష్ఠ చేసె’నని ఆ శాసన సారాంశం. fire ఇక్కడి శిల్పాలపై ఏనుగు, నెమళ్ల చిత్రాలు చెక్కి ఉన్నాయి. సా.శ. 1604లో రాజమాత నివసించేందుకు వీలుగా భవంతిని నిర్మించినట్లు తెలుస్తున్నది. 1786లో నైజాం వంశీయులైన నిజాంఆలీఖాన్ బహదూర్ కోటలో కొంత కాలం నివసించినట్లు తెలుస్తున్నది. అలంపూర్, జటవూపోలు, నందివడ్డెమాన్, కోయిలకొండ, ఖిల్లా ఘనపురం కేంద్రాలుగా పాలన జరిగినప్పుడు ఇక్కడ నవాబులు కూడా వైభవంగా పాలించారు. రామగుండం ఖిల్లాలో పడమటి దిశగా ఒక పుష్కరిణి ఉన్నది. దాన్ని రామగుండం అంటారు. ఇప్పటికీ ఆ పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాముల వారి పాదాలను చెక్కారు. ఈ ఖిల్లాలో సీతమ్మ గుండం కూడా ఉన్నది. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ ఏకాదశినాడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి రామగుండంలో స్నానాలు ఆచరించి సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటారు. యుద్ధాలు ఇక్కడ రెండు సార్లు యుద్ధాలు జరిగినట్లు చారివూతక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్, కులీకుతుబ్షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి సా.శ. 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్షా ఓడిపోయినట్లు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ అనే గ్రంథంలో ఉంది. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు ఫిరంగులు మాత్రమే కనిపిస్తాయి. ఈ ఖిల్లాపై లభించిన చిన్న ఫిరంగులను నాగర్కర్నూలు, గోపాల్పేట, వనపర్తి, పాన్గల్ పోలీస్స్టేషన్లలో ఉంచారు. stone గుప్తనిధుల కోసం తవ్వకాలు రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతూనే ఉన్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి. పడమటి వైపున ఓ ఫిరంగిని అలాగే కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగపై దాడి చేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న గుర్తులు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో పేరెన్నికగన్న పాన్గల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ ఖిల్లానే వేదికగా చేసుకున్నాడు. పరిరక్షిస్తే.. పాన్గల్ ఖిల్లాపై ఉన్న చారివూతక సంపదను పరిరక్షించి, పచ్చదనాన్ని కాపాడి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాని 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ పి. కృష్ణయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. పురావస్తు, పర్యాటక, అటవీ శాఖలు ఈ ఖిల్లాపై దృష్టి నిలిపినట్లు కనిపించదు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ గట్టును అభివృద్ధి చేస్తే బాగుంటుందనే భావన స్థానికుల్లో బలంగా ఉంది.

మహబూబ్‌నగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి, కొల్లాపూర్ దారిలో ఈ పాన్‌గల్ ఖిల్లా ఉంది. ఇక్కడికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పాన్‌గల్‌లోని ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఖిల్లా కనిపిస్తుంది. తగిన ఏర్పాట్లతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలిసిన వారు వెంటరావడం తప్పనిసరి. ఇక్కడ సంచరించే అడవి జంతువుల పట్ల జాగ్రత్త వహించాలి.

బార్హా షరిఫ్ దర్గా[మార్చు]

ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. సాయంత్రం వేళలో, అక్కడ ఎవరూ ఉండటానికి సాహసించరు. రాత్రి సమయంలో అక్కడికి ఒక సింహం వచ్చి దర్గాను శుభ్రం చేస్తుంది.అ సమయంలో అక్కడ ఎవరు ఉన్నా రక్తం కక్కుకుని చనిపోతారు, అని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
  2. సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 34