పార్లమెంట్ సభ్యుడు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పార్లమెంట్కు ఎన్నుకోబడిన సభ్యుడిని పార్లమెంట్ సభ్యుడు అంటారు. పార్లమెంట్ సభ్యుడిని ఆంగ్లంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (member of parliament) అంటారు. పార్లమెంట్ సభ్యుడిని సంక్షిప్తంగా ఎంపి (M.P) అంటారు. అనేక దేశాలలో పార్లమెంట్ ద్విసభలను కలిగి ఉంటుంది. వీటిని దిగువ సభ, ఎగువ సభ అంటారు, కొన్ని దేశాలలో ఎగువ సభను సెనేట్ అని, అలాగే సభ్యులను సెనేటర్స్ అంటారు. పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ బృందాలుగా ఉంటారు (పార్లమెంటరీ పార్టీలు అని కూడా అంటారు). వీరు ఏ రాజకీయపార్టీ తరపున ఎన్నుకోబడ్డారో అదే పార్టీతో ఉంటారు.
భారతదేశం[మార్చు]
భారతదేశంలో దిగువసభను ప్రజాసభ లేక లోక్సభ అంటారు. లోక్సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రజల చేత ఎన్నికోబడినవారు.
ఎగువసభను రాజ్యసభ అంటారు. రాజ్యసభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు నేరుగా ప్రజలచే కాక పరోక్షంగా ఎన్నుకోబడతారు.
లోక్ సభ[మార్చు]
లోక్సభ ప్రజాప్రతినిధుల సభ. వయోజన ఓటింగు పద్ధతిపై ప్రత్యక్షంగా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీరిని ఎన్నుకుంటారు. ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి లోక్సభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు. లోక్సభ సభ్యుల సంఖ్య 550 కి మించరాదు. ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య 545. వీరిలో 530 మంది సభ్యులు 29 రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడగా 13 మంది 2 (530+13+2=545) కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపిక చేయబడతారు. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం లభించనిచో ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు.
లోక్సభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి:
- భారత పౌరుడై ఉండాలి.
- 25 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవులలో ఉండరాదు.
- పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
కాలపరిమితి:
లోక్సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు.
రాజ్యసభ[మార్చు]
రాజ్యసభ సమాఖ్యసభ. ఇందులో 250కి మించకుండా సభ్యులుంటారు. వీరిలో 238 మంది సభ్యులు రాష్ట్రాల విధానసభలలోని ఎన్నికైన సభ్యుల ద్వారా నిష్పత్తి ప్రాతినిధ్యపు ఎన్నిక విధానంలో పరోక్షంగా ఎన్నిక అవుతారు. కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు పార్లమెంటు నిర్ణయించిన పద్ధతి ప్రకారం ఎన్నిక అవుతారు. మిగతా 12 మంది సభ్యులను సాహిత్యం, విజ్ఞానం, కళలు, సంఘసేవలలో ప్రముఖులైనవారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. రాష్ట్రాల జనాభాను బట్టి రాజ్యసభ సభ్యుల సంఖ్యను నిర్ణయిస్తారు.
రాజ్యసభ సభ్యత్వానికి పోటీచేసే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి:
- భారత పౌరుడై ఉండాలి.
- 30 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవులలో ఉండరాదు.
- పార్లమెంటుచే నిర్ణయించబడిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి.
కాలపరిమితి:
రాజ్యసభ శాశ్వతసభ. అంటే, ఈ సభలోని సభ్యులందరూ ఒకేమారు పదవీ విరమణ చేయరు. అందుచే, లోక్సభ వలె ఈ సభ 5 సంవత్సరాలకొకసారి రద్దుకాదు. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరు సంవత్సరాలు. కాని, ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నిక అవుతారు.
పార్లమెంటు సభ్యుని పదవీకాలం 5 సంవత్సరాలు వుంటుంది. ప్రస్తుతం 16వ లోకసభ కొనసాగుతున్నది. లోకసభ లోని సగం సభ్యులు ఏ పార్టీకి మద్దతు ఇస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు