Jump to content

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

వికీపీడియా నుండి
పాల్వాయి గోవర్ధన్ రెడ్డి
జననం(1936-11-20)1936 నవంబరు 20
ఇడికుడ, చండూరు మండలం, నల్గొండ జిల్లా
మరణం2017 జూన్ 9(2017-06-09) (వయసు: 80)
కులు, హిమాచల్ ప్రదేశ్
చదువుబి. ఎ
పాఠశాల/కళాశాలలువివేకవర్ధిని కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు
భాగస్వామిసృజమణి
పిల్లలుప్రేమిందార్ రెడ్డి (కుమారుడు), స్రవంతి (కుమార్తె)
తల్లిదండ్రులు
  • రంగారెడ్డి (తండ్రి)
  • అనసూయమ్మ (తల్లి)

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ తరపున పలు ఎన్నికల్లో పోటీ చేశాడు.[1]

జీవిత విశేషాలు

పాల్వాయి స్వగ్రామం నల్గొండ జిల్లా, చండూరు మండలం, ఇడికుడ. ఆయన నవంబరు 20, 1936న జన్మించాడు. ఆయన తండ్రిపేరు రంగారెడ్డి. తల్లిపేరు అనసూయమ్మ. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని వివేకవర్ధిని కళాశాలలో బి. ఎ. చదివాడు. జూన్ 16, 1962 ఆయనకు సృజమని తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు మరియు ఒక కుమార్తె కలిగారు. [2]

రాజకీయ జీవితం

పాల్వాయి యూత్ కాంగ్రెస్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని వీడకుండా అందులోనే ఉన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలతో ఆయనకు మంచి పరిచయం ఉంది. 1967 లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గంలో పనిచేశాడు. 2017తో ఆయన రాజ్యసభ సభ్యుడి పదవీకాలం ముగియనుంది.

మరణం

జూన్ 9, 2017 న ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని కులు పర్యటనలో ఉండగా గుండెపోటుతో మరణించాడు.

మూలాలు

  1. "కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి కన్నుమూత". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. the original నుండి 9 June 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 June 2017.
  2. "ఎలక్షన్స్.ఇన్ లో గోవర్ధన్ రెడ్డి ప్రొఫైలు". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 June 2017.