పుంగనూరు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుంగనూరు పురపాలక సంఘం
పుంగనూరు
స్థాపన1985
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

పుంగనూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం లోని, పుంగనూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర[మార్చు]

పుంగనూరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని మునిసిపాలిటీ. 1985 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘంలో 24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 54,746 జనాభా ఉండగా అందులో పురుషులు 27,235, మహిళలు 27,511 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 78.68% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.07% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 72.40%.అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 6260 ఉన్నారు.[1]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా యస్.షమేన్, [2] వైస్ చైర్మన్‌గా సి.అమరేంద్ర పనిచేస్తున్నారు.[2]

ఇతర వివరాలు[మార్చు]

ఈ పురపాలక సంఘం 15.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.31 రెవెన్యూ వార్డులు,24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 33 మురికివాడలు ఉండగా అందులో జనాభా 20013 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Punganur Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు[మార్చు]