పుష్యభూతి రాజవంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Pushyabhuti dynasty

6th century–7th century
The original territory of the Pushyabhutis was located around modern Thanesar. (Top map) The Empire of Harsha at its maximum extent. (Bottom map)
The original territory of the Pushyabhutis was located around modern Thanesar. (Top map)
The Empire of Harsha at its maximum extent. (Bottom map)
Location of పుష్యభూతి రాజవంశం
రాజధానిSthanvishvara (modern Thanesar)
Kanyakubja (modern Kannauj)
ప్రభుత్వంMonarchy
చరిత్ర 
• స్థాపన
6th century
• పతనం
7th century
Preceded by
Succeeded by
Later Gupta dynasty
Gauda Kingdom
Gurjara-Pratihara dynasty

పుష్భభూతి రాజవంశం లేదా వర్ధన రాజవంశం అని కూడా పిలువబడే పుష్యభూతి రాజవంశం (IAST: పుస్యభతి) 6 – 7 వ శతాబ్దాలలో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించింది. ఈ రాజవంశం దాని చివరి పాలకుడు హర్ష-వర్ధన ఆధ్వర్యంలో శిఖరాగ్రానికి చేరుకుంది. దీని సామ్రాజ్యం ఉత్తర, వాయవ్య భారతదేశాన్ని చాలావరకు పాలించి తూర్పున కామరూప, దక్షిణాన నర్మదా నది వరకు సామ్రాజ్య విస్తరించింది. ఈ రాజవంశం ముందుగా స్థాన్విశ్వర (ఆధునిక థానేసరు, హర్యానా) రాజధానిగా చేసుకుని పరిపాలించింది. కాని హర్షవర్ధనుడు చివరికి కన్యాకుబ్జా (ఆధునిక కన్నౌజు, ఉత్తర ప్రదేశు) ను తన రాజధానిగా చేసుకుని సా.శ. 647 వరకు పరిపాలించాడు.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఆస్థాన కవి బాణుడు స్వరపరిచిన హర్ష-చరిత ఆధారంగా ఈ కుటుంబాన్ని పుష్యభూతి రాజవంశం (IAST: పుష్యభతి-వనా), [1] లేదా పుష్భభూతి రాజవంశం (IAST: పుపాభతి-వనా) అని పిలుస్తారు. హర్ష-చరితా వ్రాతప్రతులు "పుష్పభూతి" అనే వైవిధ్యాన్ని ఉపయోగిస్తాయి. కాని జార్జి బుహ్లెరు ఇది లేఖకుల లోపం అని, సరైన పేరు పుష్యభూతి అని ప్రతిపాదించాడు.[2] అనేక మంది ఆధునిక పండితులు ఇప్పుడు "పుష్భభూతి" రూపాన్ని ఉపయోగిస్తున్నారు. మరికొందరు "పుష్యభూతి" అనే వైవిధ్యాన్ని ఇష్టపడతారు.[3] పుష్య నక్షత్రాల కూటమిని సూచిస్తుంది. విభూతి అంటే పవిత్రమైన బూడిద లేదా ఆశీర్వాదం. ఈ పుష్యభూతి అంటే "పవిత్ర నక్షత్ర రాశి ఆశీర్వాదం" అంటే "దైవిక / స్వర్గపు ఆశీర్వాదాలను" సూచిస్తుంది.

కొన్ని ఆధునిక పుస్తకాలు రాజవంశాన్ని "వర్ధన"గా అభివర్ణిస్తాయి. ఎందుకంటే దాని రాజుల పేర్లు "-వర్ధన" అనే వంశనామంతో ముగుస్తాయి. ఏదేమైనా ఇతర రాజవంశాల రాజుల పేర్లు కూడా ఈ ప్రత్యయంతో ముగుస్తున్నందున ఇది తప్పుదారి పట్టించవచ్చు. [1]

ఆవిర్భావం[మార్చు]

రాజవంశం మూలాలు గురించి కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. 7 వ శతాబ్దపు కవి బాణబట్ట రచించిన హర్షచరిత వారి మూలం గురించి ఒక పురాణ కథనాన్ని ఇస్తుంది. పుష్యభూతిని రాజవంశం స్థాపకుడిగా పేర్కొంది. ఈ పురాణం ఆధారంగా పుష్యభూతి శ్రీకంఠ జనపద (ఆధునిక కురుక్షేత్ర జిల్లా) లో నివసించారు. దీని రాజధాని స్టానవిశ్వర (ఆధునిక థానేసరు). శివుడి భక్తుడైన పుష్యభూతి "దక్షిణాది" గురువైన భైరవాచార్య ప్రభావంతో శ్మశానవాటికలో తాంత్రిక కర్మలో పాల్గొన్నాడు. ఈ కర్మ ముగింపులో ఒక దేవత (లక్ష్మిగా గుర్తించబడింది) ఆయనకు రాజుగా అభిషేకం చేసి గొప్ప రాజవంశం స్థాపకుడిగా ఆశీర్వదించింది.[4]

బాణబట్టు రచనలో పేర్కొన్న పుష్యభూతి ఒక కల్పిత పాత్రగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజవంశం శాసనాలు లేదా మరే ఇతర మూలాలలోనూ పేర్కొనబడలేదు..[5]

చరిత్ర[మార్చు]

పుష్యభూతి రాజవంశం మొదట వారి రాజధాని స్థానేశ్వర (థానేసరు) చుట్టూ ఉన్న ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించింది. హన్సు టి. బక్కరు ఆధారంగా వారి పాలకుడు ఆదిత్య-వర్ధన (లేదా ఆదిత్య-సేన) బహుశా కన్నౌజు మౌఖారీ రాజు షర్వ-వర్మనుకు పాలెగాడు. ఆయన వారసుడు ప్రభాకర-వర్ధన తన ప్రారంభ రోజులలో మౌఖారీ రాజు అవంతి-వర్మనుకు పాలెగాడుగా ఉండి ఉండవచ్చు. ప్రభాకరవర్ధనుడి కుమార్తె రాజశశ్రీ అవంతి-వర్మను కుమారుడు గ్రుహ-వర్మను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఫలితంగా ప్రభాకరవర్ధనుడి రాజకీయ స్థితి గణనీయంగా పెరిగింది. ఆయన పరమ-భట్టారక మహారాజాధిరాజా అనే సామ్రాజ్య బిరుదును పొందాడు. ("అతని శౌర్యం, ఆప్యాయత కారణంగా ఇతర రాజులు ఆయనకు నమస్కరించారు").[6]

హర్షచరిత ఆధారంగా ప్రభాకరవర్ధనుడి మరణం తరువాత మాళవరాజు గౌడ పాలకుడి మద్దతుతో కన్నౌజు మీద దాడి చేశారు. మాళవ రాజు గ్రాహ-వర్మనును చంపి రాజ్యశ్రీని స్వాధీనం చేసుకున్నాడు.

[7] రాజు కానీ చరిత్రకారులు ఆయన తరువాతి గుప్తరాజవంశం పాలకుడు అని ఊహించారు. [8] ప్రభాకరవర్ధనుడి పెద్ద కుమారుడు రాజ్య-వర్ధనుడు మాళవపాలకుడిని ఓడించినప్పటికీ గౌడ రాజు ఆయనను చంపాడు.[9]

గౌడ రాజును, ఆయన మిత్రులను నాశనం చేస్తామని ప్రభాకరవర్ధనుడి చిన్న కుమారుడు హర్ష-వర్ధనుడు శపథం చేశాడని హర్షచరిత పేర్కొంది.[10]తిరిగి బాణబట్టు గౌడ రాజు పేరును ప్రస్తావించలేదు. కాని చరిత్రకారులు ఆయనను శశాంక-దేవా (మౌఖారీ సామంతుడు (మహాసమంత) ) గా గుర్తిస్తారు. కామరూపరాజు భాస్కరువర్మనుతో హర్షవర్ధనుడు ఒక కూటమిని ఏర్పరచుకుని బలవంతంగా శశాంకను వెనకకు పంపాడు. ఫలితంగా తదనంతరం సా.శ. 606 లో హర్వర్ధనుడు అధికారికంగా చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు.[11] తరువాత ఆయన ఉత్తర భారతదేశంలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. (హర్ష సామ్రాజ్యం చూడండి).[12] హర్షసామ్రాజ్యం కచ్చితమైన పరిధికి భిన్నమైన అంచనాలు ఉన్నాయి. కాని ఆయన ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాలను నియంత్రించాడు; ఆయన ఆధిపత్యాన్ని పశ్చిమాన వల్లభీరాజు, తూర్పున కామరూప రాజు భాస్కరవర్మను అంగీకరించారు; దక్షిణాన ఆయన సామ్రాజ్యం నర్మదా నది వరకు విస్తరించింది.[13]

చివరికి హర్షవర్ధనుడి కన్యాకుబ్జ (ఉత్తర ప్రదేశులోని ఆధునిక కన్నౌజు) ను తన రాజధానిగా చేసుకున్నాడు.[2]సా.శ. సి. 647 ఆయన వారసుడు లేకుండా మరణించాడు. ఇది పుష్యభూతి రాజవంశం ముగింపుకు దారితీసింది.[12]

పాలకులు[మార్చు]

సా.శ.606-647 లో ముద్రించబడిన హర్షవర్ధనుడు జారీ చేసిన నాణెం[14]

పుష్యభూతి (వర్ధన) రాజవంశంలోని పాలకులు వారి పాలనా కాలం. (పేర్లు బ్రాకెట్టులో ఉన్నాయి).[15]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 D. C. Ganguly 1981, p. 240.
  2. 2.0 2.1 Baijnath Sharma 1970, p. 89.
  3. Max Deeg 2016, p. 99.
  4. Hans Bakker 2014, pp. 78–79.
  5. Hans Bakker 2014, p. 80.
  6. Hans Bakker 2014, p. 79.
  7. Hans Bakker 2014, p. 81.
  8. Hans Bakker 2014, p. 82.
  9. Hans Bakker 2014, pp. 85–86.
  10. Hans Bakker 2014, p. 87.
  11. Hans Bakker 2014, p. 88.
  12. 12.0 12.1 Sukla Das 1990, p. 2.
  13. Upinder Singh 2008, p. 562.
  14. "CNG Coins". Archived from the original on 2 మే 2019. Retrieved 28 నవంబరు 2019.
  15. Ronald M. Davidson 2012, pp. 38–39.

గ్రంధసూచిక[మార్చు]