పెండ్యాల రాఘవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెండ్యాల రాఘవరావు
పెండ్యాల రాఘవరావు


నియోజకవర్గం వరంగల్

వ్యక్తిగత వివరాలు

జననం (1917-03-15)1917 మార్చి 15
చిన్నపెండ్యాల, వరంగల్ జిల్లా
మరణం 1987 సెప్టెంబరు 10(1987-09-10) (వయసు 70)
రాజకీయ పార్టీ Peoples Democratic Front (Hyderabad)
జీవిత భాగస్వామి వెంకటమ్మ
సంతానం 2 కుమారులు
మతం హిందూమతం
వెబ్‌సైటు [1]

పెండ్యాల రాఘవరావు (Pendyala Raghava Rao) లోక్‌సభ సభ్యుడు. ఇతడు 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంటుకు భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1][2]

ఇతడు శ్రీ పెండ్యాల రామచంద్రరావు గారి కుమారుడు. ఇతడు వరంగల్ జిల్లాలోని చిన్నపెండ్యాల గ్రామంలో 1917 సంవత్సరంలో జన్మించాడు. వరంగల్ ఉన్నత పాఠశాలలో చదువుకొని 1934లో వెంకటమ్మను వివాహం చేస్తుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.

ఇతడు Conversion Movement (1935-36) ను వ్యతిరేకించి; 1938లో కాంగ్రెసు సత్యాగ్రహంలో చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వం అందులకు రూ. 300 జరిమానాను విధించి ఖైదు చేసింది. తర్వాత ఆంధ్ర మహాసభలో చేరాడు. ఇతడు రజాకర్ల ఉద్యమాన్ని వ్యతిరేకించి Peoples Democratic Front సభ్యునిగా చేరాడు. 1952లో 1వ లోక్‌సభకు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-03-19. Retrieved 2009-07-06.
  2. Eenadu (17 November 2023). "కమ్యూనిస్టు యోధుడు.. పెండ్యాల". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
  3. BBC News తెలుగు (4 October 2023). "తెలంగాణ ఎన్నికలు - పెండ్యాల రాఘవరావు: ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత.. ఆయన తర్వాత ఇది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.