Jump to content

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం

వికీపీడియా నుండి
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం
రకంప్రభుత్వ
స్థాపితం2025
ఛాన్సలర్ఆంధ్రప్రదేశ్ గవర్నర్
వైస్ ఛాన్సలర్డి.మునిరత్నంనాయుడు (ఇన్‌ఛార్జి)
స్థానంరాజమహేంద్రవరం, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంత
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 మే 23న ఉత్తర్వులు జారీ చేసింది.[1]

నేపధ్యం

[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు హైదరాబాదు కేంద్రంగా 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాడు. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆ విశ్వవిద్యాలయం సేవలందించింది. దానికి అనుబంధంగా శ్రీశైలం, రాజమహేంద్రవరం, కూచిపూడిలలో పీఠాలూ కొనసాగాయి. 2025 మార్చి 18న తెలంగాణ ప్రభుత్వం ఆ విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది.[2] దాని పీఠాల పరిధిలోని కోర్సులకు విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది..

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "తెలుగు వైభవం.. విశ్వ వ్యాపితం". EENADU. Retrieved 2025-10-25.
  2. "తెలంగాణలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు". Eenadu. 18 March 2025. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.