పోట్స్డామ్ కాన్ఫరెన్స్
| పాట్స్డామ్ కాన్ఫరెన్స్ | |
|---|---|
పాట్స్డామ్ కాన్ఫరెన్సులో క్లెమెంట్ అట్లీ, హారిస్ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్ | |
| నిర్వహించు దేశం | మిత్రరాజ్యాల ఆక్రమణలోని జర్మనీ |
| తేది | 1945 జూలై 17 – ఆగస్టు 2 |
| వేదిక(లు) | సెసిలియన్హాఫ్ |
| నగరాలు | పాట్స్డామ్ |
| సభ్యులు | జోసెఫ్ స్టాలిన్ (సోవియట్ యూనియన్) విన్స్టన్ చర్చిల్ క్లెమెంట్ అట్లీ (యునైటెడ్ కింగ్ డమ్) హారీ ఎస్. ట్రూమన్ (అమెరికా సంయుక్త రాజ్యాలు) |
| పంథా | యల్టా కాన్ఫరెన్స్ |



పోట్స్డామ్ సమావేశం రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమి అనంతరం సోవియట్ ఆక్రమణ జోన్లోని జర్మనీలోని పోట్స్డామ్లో 1945 జూలై 17 నుండి ఆగస్టు 2 వరకు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాకా 1919 నాటి పారిస్ శాంతి సమావేశంలో జరిగిన పొరబాట్లను నివారిస్తూ, మూడు ప్రముఖ మిత్రరాజ్యాలు యుద్ధానంతర శాంతిని ప్లాన్ చేయడానికి ఇది ఉద్దేశించింది. దీనిలో సోవియట్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ పాల్గొన్నాయి. ఈ దేశాలకు వరుసగా జనరల్ సెక్రటరీ జోసెఫ్ స్టాలిన్, ప్రధాన మంత్రులు విన్స్టన్ చర్చిల్, క్లెమెంట్ అట్లీ, అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రూమాన్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశానికి తొమ్మిది వారాల ముందు బేషరతుగా లొంగిపోవడానికి అంగీకరించిన జర్మనీని ఎలా పరిపాలించాలో నిర్ణయించుకోవడానికి వారు సమావేశమయ్యారు. యుద్ధం తరువాత ప్రపంచం సాగే విధానాన్ని ఏర్పాటు చేయడం, శాంతి ఒప్పందంపై సమస్యలను పరిష్కరించడం, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడం కూడా ఈ సమావేశ లక్ష్యాలలో ఉన్నాయి.