ప్రగతి కళామండలి, సత్తెనపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రగతి కళామండలి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో 1948, ఏప్రిల్ 25న ప్రారంభించిన నాటక సంస్థ. ప్రతి ఏటా నాటక పోటీల నిర్వహణతోపాటు 25మంది పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నది.[1]

ప్రారంభం[మార్చు]

సత్తెనపల్లిలోని పత్రి జగన్నాథరావు, పులహరి లక్ష్మోజిబాబు, చలపతిరావు, లింగారెడ్డి మరికొంతమంది మిత్రులు కలిసి ఈ నాటక సంస్థను ప్రారంభించారు.

ప్రదర్శనలు[మార్చు]

  1. అల్లిముఠా
  2. ప్రగతి
  3. కులంలేని పిల్ల
  4. శాంతి
  5. తమాషా
  6. ఆడది
  7. కూలి
  8. ఈ ఇల్లు అమ్మబడును
  9. మాస్టార్‌జీ

పరిషత్తు నిర్వహణ[మార్చు]

1974లో సంస్థ రజతోత్సవాల సందర్భంగా ప్రగతి కళా పరిషత్తును ప్రారంభించి, నాలుగు దశాబ్ధాలకు పైగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నాటక పోటీలను ఏర్పాటుచేస్తున్నారు. సినీరంగం, తెలుగు నాటకరంగంలో పేరుగాంచిన నటులందరూ ఈ పరిషత్తులో పాల్గొన్నారు. ప్రతిఏటా 25మంది పేద కళాకారులకు (రూ. 3,000 నగదు, జ్ఞాపిక, నూతన వస్త్రాలు) ఆర్థిక సహాయం, పత్రి జగన్నాథరావు జ్ఞాపకార్థం కళాసంస్థ నిర్వాహక పురస్కారం, నూతలపాటి సాంబయ్య జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్నారు.[2]

జీవన సాఫల్య పురస్కారం[మార్చు]

  1. 2016: గండవరం సుబ్బరామిరెడ్డి, (త్యాగరాయ గానసభ, హైదరాబాదు, 8 ఆగస్టు 2016)[3]

మూలాలు[మార్చు]

  1. కళా ప్రగతిని నిదర్శనం ప్రగతి కళామండలి, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 20 ఫిబ్రవరి 2017, పుట.14
  2. ప్రజాశక్తి (30 April 2016). "ఆకట్టుకున్న ప్రగతి కళామండలి నాటికలు". Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 8 August 2019.
  3. నవతెలంగాణ, కల్చరల్‌ (9 August 2016). "నాటకమే జీవనం". www.navatelangana.com. Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 8 August 2019.