బసవరాజు రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సాహితీకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:సాహిత్యంలో మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 35: పంక్తి 35:
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:తెలుగు కవయిత్రులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]

15:27, 5 మార్చి 2014 నాటి కూర్పు

బసవరాజు రాజ్యలక్ష్మి తెలుగు కవయిత్రి. ఆమె ప్రముఖ కవి బసవరాజు అప్పారావు భార్య.

రచన రంగంలో

రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.[1] అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు.

ఉదాహరణలు

సూర్యుండు పడమటా కుంకేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
చంద్రకాంతం పూలు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
ఆవు లంబా యనుచు అరిచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
బీరల్ల పూవుల్లు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
అరుణోదయమ్ము వేళను
ఆకసమున బారె పిట్ట
లానందముగను బాడుచు
మంగళగీతములతోను!

పారిజాత పూవులన్ని
పడిపోయెను పాదులలో
పుణ్య భరతభూమి పైన
పూలక్షతలు చల్లినటుల!

నే నిటులే గడుపుచుంటి
నీవు లేని జీవితమ్ము,
నొంటిగా విసిగివేసట
నావికుడు లేని నావవలె![2]

మూలాలు

  1. రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"
  2. చైతన్యదేహళి:ఇరవైయవ శతాబ్దపు తెలుగు కవితాసంపుటి(సం:డా.కల్లూరి శ్యామల; ప్ర:నేబుట్ర)

ఇవి కూడా చూడండి

బసవరాజు అప్పారావు