అంగ్ సాన్ సూకీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 112: పంక్తి 112:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==

{{నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు 1976-2000}}


[[వర్గం:మయన్మార్]]
[[వర్గం:మయన్మార్]]

02:42, 12 మార్చి 2014 నాటి కూర్పు

అంగ్ సాన్ సూకీ
Aung San Suu Kyi
အောင်ဆန်းစုကြည်
Chairperson and General Secretary of
the National League for Democracy
Assumed office
27 సెప్టెంబర్ 1988
అంతకు ముందు వారుOffice Created
Leader of the Opposition
Assumed office
2 మే 2012
అధ్యక్షుడుThein Sein
అంతకు ముందు వారుTun Yi
Member of the Pyithu Hluttaw
for Kawhmu
Assumed office
2 మే 2012
అంతకు ముందు వారుSoe Tint
మెజారిటీ46,730 (71.38%)[1]
వ్యక్తిగత వివరాలు
జననం (1945-06-19) 1945 జూన్ 19 (వయసు 78)
రంగూన్, బ్రిటిష్ బర్మా
(now Yangon)
రాజకీయ పార్టీNational League for Democracy
జీవిత భాగస్వామి
(m. 1971; invalid reason 1999)
బంధువులుAung San (father)
Khin Kyi (mother)
సంతానంAlexander
Kim
కళాశాలUniversity of Delhi
St Hugh's College, Oxford
SOAS, University of London
AwardsRafto Prize
Sakharov Prize
Nobel Peace Prize
Jawaharlal Nehru Award
International Simón Bolívar Prize
Olof Palme Prize
Bhagwan Mahavir World Peace
Congressional Gold Medal
సంతకం

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె బర్మాలో ప్రముఖ రాజకీయవాది మరియు "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " (ఎన్ ఎల్ డి)చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% (మొత్తం 485 స్థానాలలో 382 స్థానాలు) పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది.

సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో మరియు షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో నోబుల్ shanti బహుమతి అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు జవహర్ లాల్ పురస్కారం ఇచ్చింది.వెనుజులా ప్రభుత్వం ఆమెకు " సైమన్ బోలీవర్ " పురస్కారం ఇచ్చి గౌరవించింది. 2007 లో కెనడా ప్రభుత్వం ఆమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి గౌరవించింది. కెనడా నుండి ఈ గౌరవాన్ని అందుకున్న వారిలో ఆమె నాలుగవది. 2011లో ఆమె వాలెన్ బర్గ్ పతకం అందుకున్నది. 2012 సెప్టెంబర్ 19 తేదీన ఆంగ్ కై సూకీ కాంగ్రెస్ బంగరు పతకం అధ్యక్షుని స్వాతంత్ర్య పతకంతో చేర్చి అందుకున్నది.ఇది సంయుక్తరాష్ట్రాల పురస్కారాలలో అత్యుత్తమమైనది.

2012 ఏప్రెల్ 1 ఆమె పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ లీగ్ ఫర్ డెమక్రసీ ఆమె బర్మా దిగువ సభ కొరకు ఎన్నికైనట్లు ప్రకటించింది. ఆమె పార్టీ బర్మా దిగువ సభ 45 ఖాళీ స్థానాలలో 43 స్థానాలను ఎన్నికలలో గెలుచుకుంది. తరువాత రోజు అధికారికం గా ఎన్నికల కమీషన్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాఖిన్ రాష్ట్రం లోని యాంటీ-రోహింగ్యా దౌర్జన్య కారుల విషయంలో మౌనం వహించినందుకు అదే సంవత్సరం కొంతమంది ఉద్యమకారుల చేత ఆమె విమర్శించబడింది. సూకీ ఫాదర్ ఆఫ్ బర్మా గా కీర్తించబడిన అంగ్ సాన్ యొక్క ఏకైక పుత్రిక.

పేరు వెనుక చరిత్ర

ఆంగ్ సాన్ సూకీ పేరు మూడు బాంధవ్యాల నుండి తీసుకో బడింది. ఆంగ్ సాన్ అనేది తండ్రి నుండి, సూ అనేది తాత నుండి, కీ అనేది తల్లి ఖిన్ కీ నుండి గ్రహించబడింది. డా అనేది ఆమె పేరులో భాగం కాదు. డా అనేది అమ్మగారు (మేడం) లా గౌరవ పదం. ఇది పెద్ద వారిని పేరున్న స్త్రీలను సూచించే పదం. బర్మీయులు ఆమెను తరచుగా " డా సూ "(లేక ఆమయ్ సూ, అనుయాయులు మదర్ సూ ) అని సంబోధిస్తుంటారు. ఇంకా సూ ఆంటీ మరియు దాక్టర్ సూ ఆని కూడా పిలుస్తుంటారు. మిస్ సూకీ అని విదేశీయ మాధ్యమం అంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇతర బర్మీయులకు ఉన్నట్లు ఆమెకు మారు పేరు ఏమీ లేదు.

వ్యక్తిగత జీవితం

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ 19 తారీఖున రంగూన్ (ప్రస్తుతం యాంగన్) లో పుట్టింది. ఆమె తండ్రి అయిన ఆంగ్ సాన్ 1947 లో బర్మా సైన్య స్థాపకుడే కాక బర్మీయుల స్వాతంత్రం కొరకు ఆంగ్లేయులతో దౌత్యం నడిపాడు. అదే సంవత్సరం ఆయన తన రాజకీయ శత్రువుల చేత కాల్చి చంపబడ్డాడు. ఆమె తన తమ్ములైన సాన్ లిన్ మరియు ఆంగ్ సాన్ ఊ తల్లి పోషణలో బర్మాలో నివసించారు. ఆంగ్ సాన్ ఊ తమ ఇంటి వద్ద ఉన్న అలంకార సరస్సులో పడి తన ఎనిమిదవ సంవత్సరంలో మరణించాడు. పెద్ద సహోదరుడైన సాన్ లిన్ కాలిఫోర్నియా లోని శాన్ డియోగో కు వలస వెళ్ళి తరువాత సంయుక్తరాష్ట్రాల పౌరుడు అయ్యాడు. ఆంగ్ సాన్ మరణించిన తరువాత కుటుంబం ఇన్యా లేక్ ప్రాంతానికి నివాసం మార్చుకున్నది. అక్కడ సూకీకి వైవిద్యమైన నేపథ్యం కలిగిన ప్రజల పరిచయం అయింది. రాజకీయ నేపధ్యం మరియు మతం వాటిలో ప్రధానమైనవి. సూకీ " మెథడిస్ట్ ఇంగ్లీషు హైస్కూల్" లో విద్యాభ్యాసం సాగించింది. ఆమె తరువాత బౌద్ధ మతానికి చెందినది.

సూకీ తల్లి ఖిన్‌కీ కొత్తగా రూపొందించబడిన బర్మా ప్రభుత్వంలో రాజకీయ ప్రాముఖ్యత సంపాదించింది. 1960లో ఆమె భారతదేశప్రభుత్వానికి మరియు నేపాల్ ప్రభుత్వానికి రాజకీయ ప్రతినిధులను నియమించింది. ఆమెను అనుసరించిన ఆంగ్ సాన్ సుకీ ఢిల్లీ లోని జీసెస్ అండ్ మేరీ స్కూల్ కాన్వెంటులో విద్యాభ్యాసం పూర్తిచేసి న్యూఢిల్లీ శ్రీ రాం కాలేజ్‌లో పట్టభద్రురాలైంది. ఆమె 1964లో పొలిటికల్ పట్టభద్రురాలైంది. సూకీ తన విద్యాభ్యాసం కొనసాగించి 1969లో ఆక్స్‌ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్ మరియు ఎకనమిక్స్ మాస్టర్ డిగ్రీ పొందింది. విద్యాభ్యాసం తరువాత ఆమె కుటుంబ మిత్రుడూ ఒకప్పుడు బర్మా పాప్ గాయకుడు అయిన మా తాన్ ఈ తో న్యూయార్క్ నగరంలో నివసించింది. ఆమె సంయుక్త రాష్ట్రాలలో మూడు సంవత్సరాలు ప్రణాళిక వ్యవహారాల శాఖలో పని చేసింది. 1971లో సూకీ టిబెటన్ సంస్కృతి స్కాలర్" డాక్టర్ మైకేల్ ఆరిస్" ను వివాహం చేసుకుని భూటాన్‌లో నివసించసాగింది. తరువాత సంవత్సరంలో ఆమె లండన్ నగరంలో తన మొదటి సంతానమైన అలెగ్జాండర్ ఆరిస్‌కు జన్మనిచ్చింది. 1977లో ఆమె రెండవ కుమారుడైన కిం కు జన్మనిచ్చింది. 1985-1987 మధ్య కాలం లో బర్మీస్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంటుగా లండన్ లోని " ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ " అనే పాఠశాలలో పనిచేసింది. 1990లో ఆమె ఆనరరీ ఫెలోగా ఎన్నిక చెయ్యబడింది. తరువాత రెండు సంవత్సరాలు ఆమె సిమ్లాలోని " ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాంస్డ్ స్టడీస్ " లో ఫెలో గా ఉన్నది. ఆమె గవర్నమెంట్ ఆఫ్ యూనియన్‌లో కూడా పనిచేసింది.

1988లో బర్మాకు తిరిగి వచ్చిన సూకీ ప్రారంభంలో రోగగ్రస్థురాలైన తల్లి కొరకు అక్కడే ఉండి పోయింది. తరువాత మెల్లగా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాయకత్వం వహించింది. 1995లో ఆఖరిసారిగా ఆరిస్ క్రిస్‌మస్ సందర్భంలో సూకీ ని కలుసుకుని తిరిగివెళ్ళడమే వారి చివరి కలయిక. తరువాత బర్మా నియంతృత్వ ప్రభుత్వం ఆరిస్‌ను బర్మాలోకి ప్రవేశించడానికి అనుమతించలేదు. 1997లో ఆరిస్‌కు కేన్సర్ ఉన్నట్లు గుర్తించబడింది. అది చివరికి ఆరిస్ మరణానికి దారితీసింది. అంతర్జాతీయ ప్రముఖులు, పలు సంస్థలు అమెరికా దేశం నుండి, ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు " కోఫీ అన్నన్ " మరియు రెండవ పోప్ జాన్‌పాల్ వంటి వారు అభ్యర్ధించినా బర్మా ప్రభుత్వం ఆరిస్ ప్రవేశం ను అనుమతించలేదు. బదులుగా ఆరిస్ ను చూడడానికి శాశ్వతంగా దేశం వదిలి పొమ్మని సూకీని ఆదేశించింది. అందుకు వారు ఆరిస్ సంరక్షణ భారం వహించే వసతి వారి వద్దలేదన్న సాకు చెప్పి ఆ అభ్యర్థనలను తిరస్కరించారు. తిరిగి బర్మాలో ప్రవేశించవచ్చని ఆమెను బర్మా ప్రభుత్వం తాత్కాలికంగా విడుదల చేసింది. అయినప్పటికీ ఆమె నిరంకుశ ప్రభ్యుత్వాన్ని విశ్వసించక బర్మాను వదిలి వెళ్ళడానికి నిరాకరించింది.

1999 మార్చ్ 27 తేదీన తన 23వ ఏట ఆరిస్ తుది శ్వాస విడిచాడు. ఆరిస్ భార్య సూకీ గృహనిర్బంధంలో ఉంచబడిన తరువాత ఆమెను ఐదు మార్లు మాత్రమే కలుసుకున్నాడు. 1995లో కలుసుకున్నదే ఆఖరి కలయిక. సూకీ నుంచి వారి కుమారులు దూరం చేయబడ్డారు. సూకీ కి దూరంగా యునైటెడ్ కింగ్ డం లో నివసిస్తున్న ఆమె కుమారులు ఆమెను 2011 నుండి కలుసుకుంటున్నారు. 2008 మే మాసం లో నర్గీస్ తుఫాను బర్మాను దెబ్బతీసిన తరుణం లో సూకీ తన ఇంటి కప్పును కోల్పోయి విద్యుత్ కొరత కారణంగా శిధిలమైన సరస్సు తీర గృహంలో ఒంటరిగా గాఢాంధకారంలో మిగిలి పోయింది.

ఆరంభకాల రాజకీయాలు

1988లో సూకీ బర్మాలో ప్రవేశించిన సమయంలోనే అధికకాలం సైనికపాలకుడైన జనరల్ నే విన్ పాలన పతనం అయింది. ఆ సందర్భంలో 1988 ఆగస్ట్ 8 తేదీన సామూహిక విధ్వంసకాండ చెలరేగింది. (8-8-88 తేదీ శుభప్రథమైనదిగా భావించబడుతుంది). ఈ రోజు 8888 పునరుత్థానంగా అభివర్ణించబడింది.సూకీ 1988 ఆగస్ట్ 26 "షూడగాన్ పగోడా" లో గుమికూడిన 5 లక్షల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రజాప్రభుత్వ నిర్మాణానికి ఆహ్వానం పలికింది. అయినప్పటికీ సెప్టెంబర్‌లో ఎలాగో కొత్త సైనికాధికారి " జుంటా" అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.

మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితమైన సూకీ బౌద్ధ మత అహింసా సిద్ధాంతాన్ని బలపరుస్తూ 1988 సెప్టెంబర్ 27న " నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ " పార్టీని స్థాపించింది. జుంటా ప్రభుత్వం సూకీని 1989 జూలై 20వ తేదీన గృహనిర్బంధంలో ఉంచింది . ఆమె దేశం వదిలి వెళ్ళిపోతే స్వతంత్రంగా ఉండడానికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ సూకీ ఆ అవకాశాన్ని నిరాకరించింది.


1990 ఎన్నికలు

1996 దౌర్జన్యం

1996లో నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులైన టిన్ ఊ, యూకై మౌంగ్ , మరో తొమ్మిది మంది ఇతరులు ఉన్న మోటర్ వాహనం యాంగన్‌లో ప్రయాణిస్తున్న తరుణంలో ఆమె మీద దాడి జరిగింది. 200 మంది మనుషులు ఇనుపగొలుసులు, ఇనుప లాఠీలు, రాళ్ళు మరియు ఇతర ఆయుధాలతో వాహనాన్ని అడ్డగించారు. ఈ దాడిలో సూకీ కారు ముందు భాగం ధ్వంసం అయింది.ఈ దాడికి పాల్పడింది యూనియన్ సాలిడారిటీ మరియు డెవలప్ మెంట్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కిరాయి సైన్యం అని ఊహించబడింది. ఎన్ ఎల్ డి ప్రభుత్వానికి అధికారిక ఫిర్యాదు చేసింది రిపోర్టుల ఆధారంగా విచారణ జరిపినా ఎలాంటి చర్య తీసుకో లేదు.

గృహనిర్బంధం

ఆంగ్ సాన్ సూకీ 21 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు గృహనిర్బంధంలోనే జీవితం గడిపింది. ఆమె రాజకీయజీవితం ఆరంభించిన కాలం నుండి ఆమెకు అనేక సందర్భాలలో తనపార్టీ నాయకులతో సమావేశాలు, విదేశీ అతిధులతో కలయిక వంటివి నిరాకరించబడ్డాయి. సూకీ ఒక ముఖాముఖిలో తాను గృహనిర్బంధం లో ఉన్న సమయయంలో ఆమె తన భర్త పంపిన మనస్తత్వ పుస్తకపఠనం, రాజకీయాలు మరియు జీవితకథలను చదవడంతో గడిపానని వివరించింది. ఆమె కొన్నిమార్లు పియానోవాయించడం, అనుమతించిన అతిధులతో సమావేశాలు వంటి వాటితో ఆమె సమయం గడిచింది. మాధ్యమం కూడా సూకీని చూడడానికి వీలుపడకుండా కట్టడి చేయబడింది. 1994 సెప్టెంబర్ 20 తేదీన పత్రికా సంపాదకుడైన మౌరిజియో జియూలినో ఆమె చాయాచిత్రాలు తీస్తున్న సమయంలో అధికారులతో అడ్డగించబడి ఫొటో ఫిలిం, టేపులు మిగిలిన వ్రాతలు స్వాధీనం చేసుకొనబడ్డాయి. బదులుగా ఆమె గృహనిర్బంధ కాలంలొ 1994 లో బర్మా నాయకుడైన జనరల్ ఖిన్ న్యుయంట్ తో మొదటిసారిగా సమావేశం జరిగింది. సూకీ ఆరోగ్యం క్షీణించి కొన్ని సందర్భాలలో ఆసుపత్రిలో చేర్చబడింది.

బర్మా ప్రభుత్వం సూకీని అడ్డగించి గృహనిర్బంధం లో పెట్టడం బర్మాదేశం సమాజ శాంతి భద్రత లను మరియు దేశ స్థిరత్వాన్ని భూస్థాపితం చేసినట్లు భావించబడింది. 1975లో అమలు చేయబడిన "స్టేట్ ప్రొటెక్షన్ ఏక్ట్" (ఈ చట్టం ప్రభుత్వానికి ప్రజలను విచారణ లేకుండా ఐదు సంవత్సరాల కాలం నిర్బంధం లో ఉంచడానికి అనుమతిస్తుంది) మరియు సెక్షన్ 22 చట్టం " తిరుగుబాటు దార్ల ప్రమాదం నుండి దేశాన్నిరక్షించాలి " అన్న కారణంతో అమలుకు తీసుకురాబడింది. ఆమె తన విడుదల కొరకు వదలకుండా అప్పీలు చేస్తూనే వచ్చింది. 2010 నవంబర్ 12 న నిరంకుశ ప్రభుత్వం నేపథ్యంలో పనిచేసిన " యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యు.ఎస్.డి.పి)ఎన్నికలలో గెలిచిన తరువాత దాదాపు 20 సంవత్సరాల తరువాత నిరంకుశ ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ విడుదల పత్రాలమీద సంతకం చేసింది. సూకీ గృహనిర్బంధం 2010 నవంబర్ 13 తేదీన ముగింపుకు వచ్చింది.

ఐక్యరాజ్యసమితి జోక్యం

ఐక్యరాజ్యసమితి (యు.ఎన్) జుంటా మరియు సుకీ మధ్య రాజీచర్చలకు మార్గం సుగమం చెయ్యడానికి ప్రయత్నించింది. 2002 మే 6 న ఐక్యరాజ్యసమితి నాయకత్వంలో జరిగిన రహస్య సమావేశం సుకీ విడుదలకు దారితీసింది. బర్మాప్రభుత్వ స్పోక్స్ మాన్ " మేము ఇరువురం ఒకరిని ఒకరం విశ్వసిస్తున్నాం కనుక ఆమెను స్వతంత్రంగా తిరగడానికి అనుమతించాం". 2003 మే 30 తేదీన 1996 లో జరిగినట్లు తిరిగి దాడి జరిగింది. ఉత్తరప్రాంత గ్రామమైన " డిపేయిన్" లో ఆమెప్రయాణం చేస్తున్న కారవేన్ మీద ప్రభుత్వ నియమిత కూలి మూక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ దాడిలో సుకీ మద్దతుదార్లను చంపడం, గాయపరచడం చేసారు. సుకీ కారు డ్రైవర్ కో క్యా సో లిన్ " సాయంతో పారిపోయి నిరాపాయంగా తప్పించుకున్నది. అయినప్పటికీ యే-ఈ చేరుకునే సమయానికి ఖైదు చేయబడింది. బర్మా ప్రభుత్వం ఆమెను రంగూన్ లోని ఇంసేయిన్ జైలులో బంధించింది. 2003 ఆమె సర్జరీ తరువాత తిరిగి రంగూన్ జైలులో బంధించబడింది.

ఐఖ్యరాజ్యసమితి ప్రత్యేక దూత రాజాళీ ఇస్మాయిల్ " ఆంగ్ సాన్ సుకీ " ని కలుదుకున్నాడు. బర్మాలో తిరిగి ప్రవేశించడానికి అనుమతించని కారణంగా ఇస్మాయిల్ తన పదవికి రజీనామా చేసాడు. 2006లో ఇబ్రహీం గాంబారి " యుఎన్ అండర్ సెక్రెటరీ-జనరల్ (యు.ఎస్.జి) ఆఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ " ఆంగ్ సాన్ సుకీని కలుసుకున్నాడు. 2004 తరువాత సుకీతో విదేశీదూత సమావేశం ఇదే. అదే సంవత్సరం తరువాత మరొకసారి అయన సుకీని కలుసుకుని సంభాషించాడు. 2007 అక్టోబర్ 2వ తేదీన గాంబారి తిరిగి వచ్చి షూ మరియు ఇతర సభ్యులను కలుసుకున్న తరువాత నైపిడాలో సుకీతో సంభాషించాడు. బర్మా టెలివిషన్ గాంబారి మరియు సుకీ సమావేశం ప్రసారం చేసింది. ఖైదు చేసిన నాలుగు సంవత్సరాల అనంతరం సుకీ మాధ్యమంలో కనిపించడం ఇదే మొదటి సారి.

ఐఖ్యరాజ్యసమితి బర్మాప్రభుత్వ ఈ ఏకపక్ష ఖైదును గురించి తమ అభిప్రాయం తెలియజేస్తూ ఇది స్వాతంత్రాన్ని అణగదొక్కే ఈ ఏకపక్ష నిర్ణయం " ఆర్టికల్ 9 యూనివర్సల్ డిక్లరేషన్ " ప్రకారం మానవహక్కుల ఉల్లంఘన అని ఖండిస్తూ సుకీని విడుదల చేయమని బర్మా అధికారులను కోరింది. బర్మా అధికారులు ఆ అభ్యర్ధను తోసిపుచ్చింది. బర్మా ప్రభుత్వం తమ ప్రత్యుత్తరంలో " ఆంగ్ సాన్ సుకీని ఖైదు చేయలేదు, ఆమెను రక్షణ కొరకు మాత్రమే సురక్షితమైన నిర్బంధంలో ఉంచాము. తరువాత దేశీయ చట్టఉల్లంఘన నెపంతో సుకీ మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలను మాయాన్మార్ పోలీస్ ఫోర్స్ అధికారి బ్రిగ్-జనరల్ ఖిన్-యి నిరాకరించాడు. 2007 జనవరి 18తేదీన ప్రభుత్వం చేత నడుపబడుతున్న " న్యూ లైట్ ఆఫ్ మాయన్మార్ " నోబుల్ బహుమతి ధనాన్ని ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్ను చెల్లించకుండా దేశం వెలుపల వెచ్చించబడిందని సుకీని నిందిస్తూ ప్రచురించింది. ఐఖ్యరాజ్య యు.ఎస్ కు చెందిన ఐఖ్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌంసిల్ నిర్ణయంతో ఆ నిందారోపణ అపజయంపాలైంది. వారు ఇది అంతర్జాతీయ బధ్రతకు బెదిరింపని బర్మాప్రభుత్వాన్ని ఖందించారు. ఈ నిర్ణయం జుంటా ప్రభుత్వంతో బలంసిన సంబంధాలు కలిగి ఉన్న చైనాప్రభుత్వ బలమైన వ్యతిరేకత కారణంగా వీగిపోయింది. (తరువాత చైనా ప్రభుత్వం రష్యా మరియు దక్షిణాఫ్రికాలతో చేరి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసింది).

2007 నవంబర్ లో సుకీ తన రాజకీయ మద్దతుదారులైన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ నాయకులను ప్రభుత్వ మంత్రి సమక్షంలో కలుసుకున్నారు. ఐఖ్యరాజ్యసమితి దూత ఇబ్రహీం గాంబారి రెండవసారి బర్మాకు వచ్చి వెళ్ళిన కొన్ని గంటల తరువాత జుంటా ప్రభుత్వ టెలువిషన్‌లో అధికారిక ప్రకటన చేసాడు. సుకీతో సంభాషించడానికి ఆహ్వానం ఎన్.ఎల్.డి నిర్ధారించిందని ఆ ప్రకటన సారాంశం. 2009 జూలై 3 తేదీన ఐఖ్యరాజ్యసమితి సెక్రెటరీ బాన్ కీ-మూన్ బర్మాకు వెళ్ళి సుకీని విడుదల చేయమని ప్రజాప్రభుత్వ సంస్కరణలు చేయమని బర్మా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చాడు. ఏమైనప్పటికీ ఆయన బర్మాను విడిచి పోయే సమయంలో జుంటా అధికారి సుకీని కలుసుకోవడానికి నిరాకరించడం వలన తాను చాలా నిరాశకు గురి అయ్యానని అన్నాడు. అలాగే ఆయన వారు ముఖ్యమైన అవకాశాన్ని జారవిడుచుకున్నందుకు కూడా తాను చాలా నిరాశకు గురి అయ్యానని బర్మా ప్రభుత్వ అధికారులతో అన్నాడు.

నిర్బంధ కాలజీవితం

  • 1989 జూలై 20వ తేదీన " మార్షియల్ లా " ఆధారంగా బర్మాప్రభుత్వం విచారణ రహితంగా మూడు సంవత్సరాల కాలం సుకీని ఖైదులో ఉంచింది.
  • 1995 జూలై 10వ తేదీన గృహనిర్బంధం నుండి విడుదల.
  • 2000 సెప్టెంబర్ 23వ తేదీన గృహనిర్బంధంలో ఉంచబడింది.
  • 2002 మే 6వ తేదీన 19 మాసాల గృహనిర్బంధం తరువాత విడుదల చెయ్యబడింది.
  • 2003 మే 30వ తేదీన " డిపేయిన్ మాస్‌క్రీ " తరువాత ఆమె రహస్యంగా ఖైదుచేయబడి మూడు నెలల తరువాత గృహనిర్బంధంలో ఉంచబడింది.
  • 2007 మే 25వ తేదీన ఐఖ్యరాజ్య సమితి సెక్రెటరీ కోఫీ అన్నన్ నేరుగా చేసిన అభ్యర్ధిన త్రోసివేస్తూ జనరల్ తాన్ షూ సుకీ గృహనిర్బంధాన్ని ఒక సంవత్సరం పొడిగించాడు.
  • 2007 అక్టోబర్ 24 నాటికి

2007 ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన

2009 ఆక్రమణ సంఘటన

అంతర్జాతీయ వత్తిడి మరియు దేశీయ ఎన్నికలు

విడుదల

మధ్యంతర ఎన్నికలు

రాజకీయ విశ్వాసం

అంతర్జాతీయ మద్దతు

సేవాసంస్థలు

పరిశోధనలు

ఆత్మకథ

ఇతరాలు

మూలాలు

  1. "Myanmar election commission announces NLD wins overwhelmingly in by-elections". Xinhua News Agency. 2 April 2012. Retrieved 2 April 2012.

వెలుపలి లింకులు