మండలి బుద్ధ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.
"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.
==సాహిత్య సేవ==
==సాహిత్య సేవ==
*తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశాడు. <ref name=Mandali>{{Cite web| title=అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక) |url=https://groups.google.com/forum/#!topic/sahitibandhu/8-H5GZdwm3Y|accessdate=2014-03-21}}</ref>
* భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం '''వజ్రభారతి''' కి సంపాదకత్వం వహించాడు.<ref>{{Cite book|title=వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం|last=మండలి|first=బుద్ధప్రసాద్ (సం)|url=http://archive.is/Mrbxp|accessdate=2014-03-20
* భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం '''వజ్రభారతి''' కి సంపాదకత్వం వహించాడు.<ref>{{Cite book|title=వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం|last=మండలి|first=బుద్ధప్రసాద్ (సం)|url=http://archive.is/Mrbxp|accessdate=2014-03-20
|publisher= కృష్ణా జిల్లా రచయితల సంఘం|year=2007}}</ref>
|publisher= కృష్ణా జిల్లా రచయితల సంఘం|year=2007}}</ref>
పంక్తి 42: పంక్తి 43:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}


== మూలాలు ==
<references/>


<!-- వర్గాలు -->
<!-- వర్గాలు -->

15:57, 20 మార్చి 2014 నాటి కూర్పు

మండలి బుద్ధ ప్రసాద్

అధికార భాషా సంఘ అధ్యక్షుడు

వ్యక్తిగత వివరాలు

జననం (1956-05-26) 1956 మే 26 (వయసు 67)
నాగాయలంక, కృష్ణా జిల్లా
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
నివాసం హైదరాబాదు

మండలి బుద్ధ ప్రసాద్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, మరియు తెలుగు భాషాభిమాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం కలగలిపిన మనిషి. తెలుగు భాషా మరియు సంస్కృతులపై ఆసక్తి గల వ్యక్తి గా సుపరిచితులు.

వ్యక్తిగత జీవితం

మండలి బుద్ధ ప్రసాద్ మే 26, 1956 నాగాయలంక, కృష్ణా జిల్లాలో జన్మించాడు. ఆయన తండ్రి మండలి వెంకట కృష్ణారావు ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు సమాజ సేవకుడు. బుద్ధప్రసాద్ ఆర్ట్స్ లో పట్టాపుచ్చుకున్నాడు. విజయలక్ష్మిని పెళ్లిచేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు. [1]

రాజకీయ జీవితం

అవనిగడ్డ నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పుష్కరకాలం పనిచేశాడు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థకమరియు పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వం నిర్వహించాడు. రైతు కుటుంబ నుండి వచ్చినవాడు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డాడు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించాడు. ఆయన తండ్రి జీవితాశయమైన పులిగొండ -పెనమూడి వారధిని నిజం చేశాడు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నాడు. [1]

2012 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు[2]. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.[3]

సామాజికసేవ

"గాంధేయ" సమాజసేవాసంస్థకు కార్యదర్శిగా పనిచేశాడు. తెలుగుకి ప్రాచీన భాషా హోదా కొరకు ఏర్పాటైన భాషోద్యమశాఖకు బలమైన ఆధారంగా నిలిచాడు. దక్షిణ భారత హిందీ ప్రచార సభకు సేవలందించాడు.

సాహిత్య సేవ

  • తెలుగు మాధ్యమంగా పాఠశాల విద్యకొరకు జి.వో సాధించటానికి కృషి చేశాడు. [4]
  • భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం వజ్రభారతి కి సంపాదకత్వం వహించాడు.[5]
  • పసిడి పేరుతో ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాషా, సంస్కృతి సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా 112 వ్యాసాల సంకలనానికి సహసంపాదకునిగా వ్యవహరించాడు. [6]

మూలాలు

  1. 1.0 1.1 పి, రమేష్ రెడ్డి (2012). "ప్రజల మనిషి మండలి". తెలుగు తేజం. బొగ్గవరపు మాల్యాద్రి. 4 (12): 24.
  2. అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012
  3. తెలుగు టైమ్స్ వార్త
  4. "అనుభవం (అంధ్రజ్యోతి దినపత్రిక)". Retrieved 2014-03-21.
  5. మండలి, బుద్ధప్రసాద్ (సం) (2007). వజ్రభారతి : భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా 60 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో వివిధ రంగాలలో తెలుగువారి ప్రగతి సమీక్షగా 216 వ్యాసాల అనుశీలనా గ్రంథం. కృష్ణా జిల్లా రచయితల సంఘం. Retrieved 2014-03-20.
  6. మండలి, బుద్ధప్రసాద్ మరియు ఇతరులు (2006). పసిడి : ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో 50 ఏళ్ళ తెలుగు భాషా, సంస్కృతి సాహిత్య వికాస పరిణామాల సమీక్షగా 112 వ్యాసాల సంకలనం. కృష్ణా జిల్లా రచయితల సంఘం.