Coordinates: 13°56′13″N 77°16′10″E / 13.9369°N 77.2694°E / 13.9369; 77.2694

మడకశిర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 129: పంక్తి 129:
* [[సీ.కోడిగెపల్లె]]
* [[సీ.కోడిగెపల్లె]]
*[[తిరుమలదేవరహళ్ళి]]
*[[తిరుమలదేవరహళ్ళి]]
*[గుండుమాల]


==మూలాలు==
==మూలాలు==

17:32, 4 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

మడకశిర
—  మండలం  —
అనంతపురం పటంలో మడకశిర మండలం స్థానం
అనంతపురం పటంలో మడకశిర మండలం స్థానం
అనంతపురం పటంలో మడకశిర మండలం స్థానం
మడకశిర is located in Andhra Pradesh
మడకశిర
మడకశిర
ఆంధ్రప్రదేశ్ పటంలో మడకశిర స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°56′13″N 77°16′10″E / 13.9369°N 77.2694°E / 13.9369; 77.2694
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండల కేంద్రం మడకశిర
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,222
 - పురుషులు 37,344
 - స్త్రీలు 35,878
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.72%
 - పురుషులు 66.76%
 - స్త్రీలు 40.15%
పిన్‌కోడ్ 515301
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మడకశిర (ఆంగ్లం: Madakasira), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 515301.

చరిత్ర

స్థానిక చరిత్ర ప్రకారం మడకశిరకు ముందున్న పేరు మడకలపల్లి. పూర్వపు గ్రామం ఇప్పుడున్న గ్రామానికి ఆగ్నేయంగా ఉండేది. ప్రస్తుత మడకశిరను మైసూరు శీర నాయకులు కట్టించారు. ఈ వంశాన్ని విజయనగరరాజుల కాలంలో హీర ఉడయరు స్థాపించాడు. చితాల్‌దుర్గ్ ప్రాంతంలో పన్నెండు గ్రామాలు జమీగా పొంది, శీర వద్ద పాతకోటను ఈయనే కట్టించాడు. బీజాపూరు రాజుల దండయాత్రవళ్ల రాజ్యాన్ని కోల్పోయిన వీరికి ప్రత్యామ్నాయంగా రత్నగిరి, మడకశిర ఇవ్వబడ్డాయి.[1] 1520లో స్థానిక నాయకుడు రత్నగిరి సర్జిప్ప రాయప్ప రాజా అడవిని చదును చేసి ఇక్కడ ఒక గ్రామాన్ని మరియు ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించినాడని కథనం.[2] 1728లో మరాఠుల చేతిలోకి వెళ్ళింది. మురారిరావు ఇక్కడ ఒక కోటను, మహలును నిర్మించాడు. హిందూరావుగా పేరొందిన మురారిరావు తండ్రి సిద్ధోజి రావు ఇక్కడే మరణించాడని. తాలూకా ఆఫీసు తూర్పున ఉన్న సమాధి ఈయనదే అని భావిస్తారు.[1] 1762లో మడకశిరను హైదర్ అలీ ఆక్రమించుకున్నారు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంపై హైదర్ అలీ పట్టు క్షీణించడంతో మురారి రావు మడకశిరను తిరిగి చేజిక్కుంచుకున్నడు. తిరిగి1774లో హైదర్ అలీ ఆధీనంలోకి వెళ్ళి 1799లో టిప్పు సుల్తాను ఆంగ్లేయుల చేతిలో మరణించేవరకు వారి ఆధీనంలోనే ఉన్నది. ఇక్కడ చోళరాజు కట్టించిన ఆలయంలో ఒక శాసనం ఉన్నది. చోళరాజు ఇక్కడ ఆలయం కట్టించాడంటే ఈ గ్రామం 1520కి చాలా పూర్వం నుండి ఉండి ఉండాలి.[2]

మండలంలోని గ్రామాలు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మడకశిర&oldid=1109240" నుండి వెలికితీశారు