ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{సమాచారపెట్టె పుస్తకం |
{{సమాచారపెట్టె పుస్తకం |
||
| name |
| name = ఉన్నమాట |
||
| title_orig |
| title_orig = |
||
| translator |
| translator = |
||
| editor |
| editor = |
||
| image |
| image = |
||
| image_caption = |
| image_caption = |
||
| author |
| author = ఎం.వి.ఆర్.శాస్త్రి |
||
| illustrator |
| illustrator = |
||
| cover_artist = |
| cover_artist = |
||
| country |
| country = [[భారతదేశం]] |
||
| language |
| language = [[తెలుగు భాష|తెలుగు]] |
||
| series |
| series = |
||
| subject |
| subject = |
||
| genre |
| genre = |
||
| publisher |
| publisher = ఎ.వి.కె.ఫౌండేషన్ |
||
| release_date = 2008 |
| release_date = 2008 |
||
| english_release_date = |
| english_release_date = |
||
| media_type |
| media_type = |
||
|dedication = |
|dedication = |
||
| pages |
| pages = |
||
| isbn |
| isbn = |
||
| preceded_by |
| preceded_by = |
||
| followed_by |
| followed_by = |
||
|dedication = |
|dedication = |
||
|number_of_reprints = |
|number_of_reprints = |
03:16, 19 జూన్ 2014 నాటి కూర్పు
ఉన్నమాట | |
కృతికర్త: | ఎం.వి.ఆర్.శాస్త్రి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | ఎ.వి.కె.ఫౌండేషన్ |
విడుదల: | 2008 |
ఉన్నమాట వ్యాససంకలనాన్ని ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రి రాశారు.
రచన నేపథ్యం
తెలుగు పత్రికారంగంలో రెండు దశాబ్దాల పాటు సాగిన ఉన్నమాట కాలమ్ నుంచి ఎంపికచేసిన వ్యాసాల సంకలనం ఇది. ఈ శీర్షిక 1990దశకంలో ఆంధ్రప్రభ పత్రిక ఆదివారం సంచికలను వారపత్రికల సైజులో ముద్రించిన సందర్భంగా కొత్తశీర్షిక (కాలమ్) శాస్త్రి ఉన్నమాటను ప్రారంభించారు. 1992 మే 24 తేదీ సంచికలో సభవారు చెప్పింది వేదం అన్న శీర్షిక (టైటిల్)తో శాసనసభా హక్కుల వైరుధ్యాలను చర్చించే వ్యాసంతో ఉన్నమాట ప్రారంభమైంది. 1994 డిసెంబరులో ఆంధ్రభూమి దినపత్రికకు శాస్త్రి సంపాదకత్వ బాధ్యతలు చేపట్టాకా, ఆంధ్రభూమి ఆదివారం సంచికలో కాలమ్ కొనసాగింది.[1]
విజయవంతంగా కొనసాగిన ఉన్నమాటలో ఎంపిక చేసిన వ్యాసాలను ఆగస్ట్ 2008లో అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్ (ప్రస్తుతం అప్పాజోస్యుల విస్సాభొట్ల కాందాళం ఫౌండేషన్) వారు తొలి ముద్రణ చేశారు. దుర్గా పబ్లికేషన్స్ సంస్థ ద్వారా మే 2010లో ద్వితీయ ముద్రణ చేశారు.
రచయిత గురించి
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు. 1975లో ఆంధ్రజ్యోతి పత్రికలో విలేకరిగా, 1978 నుంచి 1990 వరకూ ఈనాడు దినపత్రికలో వివిధ హోదాల్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయి వరకూ పనిచేశారు. 1990 నుంచి 1994 వరకూ ఆంధ్రప్రభ దినపత్రికకు సంపాదకునిగా పనిచేస్తున్నారు. 18 సంవత్సరాలుగా ఉన్నమాట, 14 సంవత్సరాలుగా వీక్ పాయింట్ శీర్షికలను నిర్వహించారు. రచయితగా ఆయన మన చదువులు, ఉన్నమాట, వీక్ పాయింట్, ఏది చరిత్ర?, ఇదీ చరిత్ర, 1857, మన మహాత్ముడు, కాశ్మీర్ కథ, కాశ్మీర్ వ్యథ, ఆంధ్రుల కథ తదితర గ్రంథాలు రచించారు.[2]
అంశాలు
ఈ గ్రంథంలోని వ్యాసాల్లో సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలు వ్యాసాలుగా ఉన్నాయి. ఆనాటి అంశాలు ఐనా నేటికీ సమకాలీనంగా ఉన్నవే సంకలనం చేసినట్టు, తిరిగి తిరిగి వచ్చిన కొన్ని విషయాలను తొలగించినట్టు శాస్త్రి వివరించారు. వ్యాసాలను వివిధ అధ్యాయాలుగా మలిచారు.
అధ్యాయాలు
- స్టార్స్xసైన్స్: జ్యోతిష్యం శాస్త్రం కాదని, విశ్వవిద్యాయాల్లో బోధించడం తగదని పలువురు వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో జ్యోతిష్యం శాస్త్రసమ్మతమని నిరూపించే క్రమంలో వ్రాసిన వ్యాసాలు.
- గోవుల గోడు: గోవధ నిషేధాన్ని సమర్థిస్తూ రాసిన ఈ వ్యాసాల్లో 19వ శతాబ్దం చివరిరోజుల్లో హిందూ-ముస్లిము ఐక్యమై గోవధను వ్యతిరేకించి, దాన్ని బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతగా మలిచిన ఉద్యమ చరిత్రను గురించి, సమకాలీన సమాజంలో దాని సంభావ్యతను గురించి రాసిన వ్యాసాలు.
- తెలుగు తెగులు: అధికార భాషగా తెలుగు పూర్తిగా అమలు కావట్లేదని వాపోతూ, విద్యాబోధనలో, పత్రికల్లో, సినీరంగంలో, రచనారంగంలో తెలుగు దుస్థితినీ, ఆటా, తానా వంటి ప్రవాసాంధ్రుల సంస్థలను గురించి ఈ వ్యాసాల్లో సవివరంగా ప్రస్తావించారు.
- మీడియా: ఈ విభాగంలోని వ్యాసాల్లో పత్రికా ప్రమాణాలలో దిగజారుడుతనం, ప్రభుత్వం పత్రికలపై విధిస్తున్న ఆంక్షలు.
- అవీ ఇవీ: వైవిధ్యభరితమైన వేర్వేరు అంశాల గురించి రాసిన వ్యాసాలు ఈ విభాగంలో ఇచ్చారు.[3]