వీరశైవ మతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 79: పంక్తి 79:


== మత ప్రచారం ==
== మత ప్రచారం ==

నాటి వైదిక మతం కంటే ఒక అడుగు వెనకకు వేసి, కేవలం మూఢ భక్తి ప్రధానమైన మత ప్రచారానికి పూనుకుంది. కనుకనే, ఈ ఉద్యమం రెండు వందల సంవత్సరాలలో నశించింది. కులభేదాలను రూపుమాపటానికి పూనుకున్న జంగములు తామొక కులమ ఐనారు. కన్నడ దేశంలో లింగాయుతులను పేరుతోను, ఆంధ్రదేశంలో జంగాలు అను పేరుతో వేరు సమాజంలో ఒక భాగంగా మిగిలిపోయారు. బ్రాహ్మణ అధికారంపట్ల ప్రజలలో గల నిరసన భావం వేరశైవ మత రూపం లో వ్యక్తమైంది.
ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.

వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు.

మిగతా పీఠాలు:-
ఉజ్జయిని-మరుళారాధ్య
కేదారనాథ్-ఎకోరామారాధ్య
శ్రీశైల-పండితారాధ్య
కాశీ-విశ్వారాధ్యులు.

వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు.కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది.

== పండిత త్రయం ==
== పండిత త్రయం ==
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.

14:00, 28 నవంబరు 2014 నాటి కూర్పు

ఉపోద్ఘాతం

శైవమతం భారత దేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి ఉంది. మొదటి నుండి ప్రజాసామమాన్యం ఎక్కువగా ఈ మతాన్ని ప్రాచీన కాలం నుండి అవలంబిస్తూ వచ్చారు. భూస్వామ్య రాచరిక యుగంలో నానా బాధలు పడుతూ, తమ కష్టాలకి మూల కారణం గమనించని అమాయక ప్రజల క్రోధావేశాలు, ఆగ్రహం, మతకల్లోలాల రూపంలో అనేక సార్లు చరిత్రలో ప్రత్యక్షమౌతూ వచ్చాయి.

వీరశైవ మత స్తాపకులు:

ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్తాపించడం జరిగింది.ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలొ చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి.శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.

రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.


రేణుకాచార్యులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా కొలనుపాకలో అన్ని కులాలవారికీ వీరశైవ దీక్షలు ఇవ్వటమే కాక ప్రతి కులానికీ ఒక మఠాన్ని స్థాపించటం జరిగింది. ఇప్పటికీ అక్కడ పాడుబడిపోయిన ఆనాటి కులాల వారీ మఠాలు నేటికీ కనిపిస్తాయి. ఆ తరువాత రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.

రేణుకాచార్యులవారు కొలనుపాకలోని శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు పురాణపరమైన ఆధారాలు:

రేణుకాచార్యుల వారు నల్గొండ జిల్లా కొలనుపాకలోని సోమేశ్వర లింగోద్భవులని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని సిద్దంతశిఖామనిలోని 4వ పటలములోని శ్లోకాలు వివరిస్తాయి.

అథ త్రిలింగ విషయే కొల్లిపాక్యభిధేపురే ! సోమేశ్వరమహాలింగాత్ ప్రాదురాసీత్ స రేణుకః !! (4-1)

ప్రదుర్భూతం తమాలోక్య శివలింగాత్ త్రిలింగజా: ! విస్మితాః ప్రాణినః సర్వే బభూవురతి తేజసమ్ !! (4-2)

2. రేణుకాచార్యులు కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించారని 28 శివాగమాలలొ ఒకటైన స్వయంభువాగమం 9వ పటలం లో చెప్పబడింది. ఈ 9వ పటలంలో మొత్తం అయిదుగురు పంచాచార్యుల గురించి వివరంగా తెలుపబడి ఉంది, శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల చరిత్ర ఒకటైన వీరాగమంలో ఉంటుందిమరియు స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో కుడా రేణుకాచార్యుల గురించి వివరించబడి ఉంది,

శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే! సోమేశ్వర లింగ జనన మావాసః కదళీపురే  !! (స్వయంభువాగమం, చాప్టర్-9)

3. రేణుకస్యచతత్రైవ - తీర్ధం సిద్ద సాధ్యాది | తత్రస్నాత్వాభవేద్విప్రో -నిర్మలశ్చంద్రమా యధా || తా: రేణుక తీర్ధములో స్నానము చేయుట వలన పౌర్ణమి చంద్రునివలే పరిశుభ్రుడగును అని మహాభారతమున అరణ్య (వన) పర్వము 82వ అధ్యాయము 52వ శ్లోకమున చెప్పబడి ఉన్నది. ఈ రేణుక తీర్ధము కేదారకేత్రములో వెలసి ఉన్న ఉషామఠమునకు 2 (రెండు) మైళ్ళ దూరములో ఉన్నది.

4. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు ప్రతి యుగమున కొలనుపాక శ్రీ స్వయం భూ సోమేశ్వర లింగమునుండి ఉద్భవించి కృతయుగమున ఏకాక్షర శివాచర్యులు అని, త్రేతాయుగమున ఏకవక్త్ర శివాచార్యులు అని, ద్వాపరయుగమున రేణుకాచార్యులు అని, కలియుగమున రేవణారాధ్యులు అని ప్రసిద్ది కాంచి ఉన్నారు. 5. శ్రీ రేణుకాచార్య భగవత్పాదుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి వీరశైవ సిద్దాంతమును ఉపదేశించారు. 6. త్రేతాయుగమునందు మహా శివభక్తుడైన రావణుని సోదరుడైన విభీషణుడి ప్రార్ధన మేరకు ఒకే ముహుర్తమున 3 కోట్ల శివ లింగములను లంకా నగరములో ప్రతిష్ఠించారు. 7. ద్వాపర యుగములో అనేక మహిమలను ప్రదర్సించడం రేణుక తీర్ధము లేక రేణుక సరోవరము అని సుక్షేత్రముగా ప్రసిద్ది గాంచినది. కలియుగమున విక్రమాదిత్యుడు, చోళరాజులతో పాటు అనేక మంది రాజులను, చక్రవర్తులను అనుగ్రహించి వారికి శైవ సిద్దాంతమును బోధించి వేయి సంవత్సరములపాటు భారతావని అంతటా సంచరించి శివ ఙ్ఞానామృతాన్ని సర్వులకు ఉపదేశించి చివరికి తాము ఉద్భవించిన కొలనుపాక శ్రీ స్వయంభూ సోమేశ్వర లింగము నందు ఐక్యమై శివ స్సన్నిధ్యమును చేరిరి.

రేణుకాచార్యులవారు కొలనుపాకలోని స్వయం భూ సోమేశ్వర లింగోద్భవులని తెలుపు చారిత్రక ఆధారాలు:

1. రేణుకాచార్యులు ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంధస్తం చేయటం జరిగింది. ఈ గ్రంధం అప్పటికే వీరాగమాది 28 గ్రంధాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుతుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు భోదించటం వలన దీనిని "రేణుకాగీత" అనికూడా పిలవబడుతుంది.

2. ఈ గ్రంధమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము. ఈ సిద్దాంత శిఖామణి గూర్చి తరువాత పలు గ్రంధాలలో ప్రస్తుతించటం జరిగింది. బ్రహ్మసూత్రములకు భాష్యము - శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు తన గ్రంధమున సిద్దాంతశిఖామణి నుండి కొన్ని ప్రమాణములను పేర్కోన్నాడు, తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదాహరించటం జరిగింది.

అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా: "పవిత్రంతే - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్” అని

"రేణుక భగవత్పాద చార్యేణాపి - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు. 3. శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములను

 	 ప్రమాణ యుక్తముగా ఉదాహరించుట జరిగింది., తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను 
            బ్రహ్మ సూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ 

            ముక్త  శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదాహరించుట జరిగింది..

4. ప్రసిద్ద సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక" , "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంధములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదాహరించుట జరిగింది.

రేణుకాచార్యులు కొలనుపాక లింగోద్భవులని తెలిపిన కొన్ని గ్రంధాలు – రచయితలు: (ఈ వివరాలు శివశ్రీ రవికోటి మఠం వీరభద్రయ్య గారు రచించిన శ్రీక్షేత్ర కొలనుపాక వీరశైవ విభూతి రేవణసిద్దుడు" నుండి గ్రహించబడినవి):

i. రేణుకావిజయం (ప్రథమ మంజరి: 27,37 శ్లోకాలు) - సిద్దనాథ శివాచార్య, సంస్కృతం ii. రేవణ సిద్దేశ్వర పురాణము (సంధి 2, పద్యము- 53) – బొమ్మరస, కన్నడము. iii. రేవణ సాంగత్య (సంధి-2 పద్య-21) – చన్నబసవ, కన్నడము. iv. రేవణ సిద్దేశ్వర రగళె (నిరత స్థలం - 57 వ పంక్తి) - మహాకవి హరీశ్వర, కన్నడము. v. కవికర్ణ రసాయనం (ప్రథప సర్గ-శ్లోకం-6) - మహాకవి షడక్షర దేవ, కన్నడము. vi. రేణుక విజయము (ప్రథమాశ్వాసం-పద్యము-49) - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, తెలుగు. vii. పంచబ్రహ్మొదయ భాష్యం (పుట-17) - సోసల చిక్క వీరనాధ్య, కన్నడము. viii. శివాధిక్య శిఖామణి (ప్రథమోపదేశమ్ – పుట- 2) - సోసల రేవణారాధ్య, కన్నడము.


కొలనుపాకలో అన్ని కులాల వారికీ రేణుకుల వారు మఠాలు కట్టించి దీక్షా సంస్కారాలు ఇవ్వటం జరిగింది. అవి నేడు చాలా వరకు కనుమరుగైపోగా కొన్ని మఠాలు మాత్రం శిథిలావస్థలో ఉన్నవి. కొలనుపాకలో నేడు గల మఠాలు:

1. పెద్ద మఠము 2. కురుమ మఠము 3. కాపు మఠము 4. కోమటి మఠము 5. గౌండ్ల మఠము 6. చాకలి మఠము 7. మంగలి మఠము 8. పద్మశాలి మఠము 9. మేదరి మఠము 10. పెరుక మఠము 11. మాల మఠము 12. మీమ్మాఱు మఠము (వడ్రంగి, కంచరి, కమ్మరి, శిల్పి) 13. గొల్ల మఠము 14. ఒడ్డెర మఠము (దీనిని నక్క రామేశుని గుడి అనీ అంటారు) 15. సంగరి మఠము 16. తెనుగు మఠము 17. మేరె మఠము 18. గాండ్ల మఠము


కొలనుపాకలో రేణుకుల సంస్కరణల ప్రభావం నేటికీ ఉందని, అన్ని కులాలవారు పుట్టినపుడే లింగాలు ధరిస్తారని, ఈ ఊరిలో లింగవంతులైన మాలవాండ్లు మిగతా గ్రామాలలో మాదిరి ఊరి వెలుపల కాక ఊరు మధ్యలోనే నివసిస్తున్నారని శ్రీ ఉజ్జయిని జగద్గురువులు శ్రీ తరుళబాళు శివకుమార ఆచార్యులు తమ 1-జనవరి 1962 నాటి కొలనుపాక క్షేత్ర పర్యటన వివవరాలను 19-4-1963 (సంచిక- 37) నాటి నవసందేశ కన్నడ పత్రికలో వివరించారు.

మత ప్రచారం

ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు అప్పటికీ వైదికమతాన్ని, ఆచారాలను త్రోసిపుచ్చుతూ బహుళ ప్రాచుర్యతకు నోచుకుంటున్న బౌద్ద, జైన, చార్వాకాది మతాలను నిలువరింపజేసే క్రమంలో వీరశైవ మతాన్ని అందరూ ఆదరించే విధంగా తీర్చిదిద్దటం జరిగింది. అవైదిక మతాలకు ఆకర్షింపబడుతున్న హిందూదేశపు అంత్యకులాలవారిని అక్కున జేర్చుకోవటం జరిగింది. సంఘ సంస్కరణలో భాగంగా రేణుకాచార్యులు భారతదేశం అంతటా పర్యటించి అవైదిక మతాలను ఖండిస్తూ వీరశైవ మతాన్ని ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది.

వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు.

మిగతా పీఠాలు:- ఉజ్జయిని-మరుళారాధ్య కేదారనాథ్-ఎకోరామారాధ్య శ్రీశైల-పండితారాధ్య కాశీ-విశ్వారాధ్యులు.

వీరి గురించి ఆగమాల్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పీఠాదిపాతులను జగద్గురువులుగా సంబోదిస్తారు.కాగా పస్తుతం రేణుకాచార్య పీఠం శాఖ వారు మాత్రం కొలనుపాకలో కాక కర్ణాటకలోని బాలేహోన్నూరులో కొనసాగాబడుతుంది.

పండిత త్రయం

కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వేరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో వేరశైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో శైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.

మల్లికార్జున పందడితారాధ్యుడు