పాండవులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వివరణ: {{commons category|Pandavas}}
చి clean up using AWB
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం}}
{{అయోమయం}}
{{విస్తరణ}}
{{విస్తరణ}}
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] యొక్క ఐదుగురు [[కుమారులు]] '''పాండవులు'''. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగలేదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.
[[మహాభారతం]]లోని [[పాండురాజు]] యొక్క ఐదుగురు [[కుమారులు]] '''పాండవులు'''. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగలేదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన [[కుంతి]], [[మాద్రి]] లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.


;పంచపాండవులు
;పంచపాండవులు
పంక్తి 33: పంక్తి 33:
{{commons category|Pandavas}}
{{commons category|Pandavas}}


[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}

[[వర్గం:మహాభారతంలోని పాత్రలు]]

18:25, 7 మార్చి 2015 నాటి కూర్పు

మహాభారతంలోని పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు పాండవులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగలేదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు.

పంచపాండవులు
  1. యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
  2. భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
  3. అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
  4. నకులుడు
  5. సహదేవుడు

వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రి కుమారులు. పాండవులకు ద్రౌపది వలన కలిగిన పుత్రులను ఉప పాండవులు అంటారు.

వంశవృక్షము

 
యాదవ వంశము
 
 
 
 
 
 
 
కురు వంశము
 
మాద్ర వంశము
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
శూరసేనుడు
 
వ్యాసుడు
 
 
 
అంబాలిక
 
 
 
 
శల్యుడు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
కుంతి
 
 
 
 
పాండురాజు
 
 
 
 
మాద్రి
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ధర్మరాజు
 
భీముడు
 
అర్జునుడు
 
నకులుడు
 
సహదేవుడు

వివరణ

పాండురాజు కొమారులు. వీరు అయిదుగురు- 1. ధర్మరాజు 2. భీమసేనుఁడు 3. అర్జునుఁడు 4. నకులుఁడు 5. సహదేవుఁడు. ఇందు మొదటి మువ్వురును కుంతి కొడుకులు కావున కౌంతేయులు అని కడపటి ఇరువురును మాద్రి కొడుకులు కనుక మాద్రేయులు అనియు చెప్పఁబడుదురు. వీరు పాండురాజు మృతి చెందిన పిదప హస్తినాపురియందు ధృతరాష్ట్రుని ఒద్ద పెరుగుచు ధనుర్వేదాది విద్యలయందు మహానిపుణులు అయి ఉండఁగా వీరిమేలిమిచూచి ధృతరాష్ట్రుని పెద్దకొడుకు అయిన దుర్యోధనుఁడు ఓర్వచాలక, శకుని కర్ణదుశ్శాసనులతో కూడుకొని అనవరతము వీరలకు హింసకావించుచు ఉండెను. అది ఎట్లనిన ఒకనాడు దుర్యోధనుఁడు భీముఁడు నిద్రపోవుచు ఉండుతఱిని అతనిని లావుత్రాళ్లతో కట్టి గంగమడువునందు త్రోయించెను. మఱియొకనాడు అతని సర్వాంగములందును కృష్ణసర్పములను పట్టి కఱపించెను. ఇంకొకనాడు భోజనసమయమునందు వానికి విషము పెట్టించెను. అతఁడు అనంతసత్వుఁడును దివ్యపురుషుఁడును కాన అవియెల్ల అతనిని చంపనేరవయ్యెను. మఱియు దుర్యోధనుఁడు పాండవులకు అందఱకును అపాయముచేయ సమకట్టి వారణావతమునందు లక్కయిల్లు ఒకటి కట్టించి అందు పాండవులను చేర్చి అనలము దరికొల్పయత్నింపఁగా వారు ఈవృత్తాంతమును విదురుని మూలముగ ఎఱఁగి అచటి నుండి తప్పించుకొనిపోయి జననీ సహితముగ విప్రవేషధారులు అయి ఏకచక్రాపురమందు కొంతకాలము ఉండి అనంతరము ద్రుపదరాజుపట్టణమునకు పోయి అచట అర్జునుఁడు ద్రౌపదీస్వయంవరమున మత్స్య యంత్రమును అశ్రమమున ఉరలనేసి సకలరాజ లోకంబును ఓడించి ద్రౌపదిని చేకొని గురువచనమున ఆమెను ఏవురును వివాహము అయిరి. అంత ఆవృత్తాంతము అంతయు ధృతరాష్ట్రుఁడు ఎఱిఁగి పాండవులను రావించి వారికి అర్ధరాజ్యము ఇచ్చి ఇంద్రప్రస్థపురమున ఉండ పంచిన, వారి రాజ్యవిభూతియు గుణసంపదయు చూచి దుర్యోధనుఁడు ఓర్వ చాలక శకుని కైతవమున మాయజూదము ఆడి ధర్మరాజును పరాజితుని చేసి పండ్రెండు ఏండ్లు వనవాసమును ఒక యేడు జనపదమున అజ్ఞాతవాసమును చేయునట్లుగా సమయముచేసి భూమి వెలువరించెను. అట్లు పాండవులు వనవాసముచేసి సమయము తప్పక అజ్ఞాత వాసమును జరపి మరలివచ్చి తమపాలు అడిగిన ఈయక దుర్యోధనుఁడు వారలతో విరోధించి ఎదిరించి యుద్ధము చేసి మడిసెను. పాండవులును శత్రువులను చంపి రాజ్యమును మరలకైకొని అశ్వమేధాదియాగములచే జనులకు హర్షము కావించుచు ఉండి కృష్ణనిర్యాణానంతరము పరీక్షిత్తునకు రాజ్యాభిషేకము చేసి స్వర్గారోహణము కావించిరి.

"https://te.wikipedia.org/w/index.php?title=పాండవులు&oldid=1440700" నుండి వెలికితీశారు