రమణ మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అచ్చుతప్పులు, కొన్ని పదాల సవరణలు
పంక్తి 51: పంక్తి 51:
* [http://www.kheper.net/topics/gurus/Ramana_Maharshi.html Kheper article, information on Sri Ramana Maharshi]
* [http://www.kheper.net/topics/gurus/Ramana_Maharshi.html Kheper article, information on Sri Ramana Maharshi]
* [http://www.ramanacentre.com/ The Ramana Maharshi Centre for Learning(RMCL) - established to create greater awareness of the timeless heritage and culture of India, with particular focus on the life and teachings of Bhagavan Sri Ramana Maharshi]
* [http://www.ramanacentre.com/ The Ramana Maharshi Centre for Learning(RMCL) - established to create greater awareness of the timeless heritage and culture of India, with particular focus on the life and teachings of Bhagavan Sri Ramana Maharshi]
* [http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Unnadi%20Nalubadi%20Sadvidya&author1=Sri%20Ramana&subject1=&year=0%20&language1=telugu&pages=83&barcode=2020120002136&author2=&identifier1=&publisher1=NIRANJANA%20NANDA%20SWAMY&contributor1=1941&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=SRI%20KRISHNA%20DEVARAYA%20ANDHRABHASHA%20NILAYAM&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,%20%20HYD.&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0002/137 రమణ మహర్షి వ్రాసిన ఉన్నది నలుబది సద్విద్య గ్రంథపు అనువవాదం]


[[వర్గం:1879 జననాలు]]
[[వర్గం:1879 జననాలు]]

12:17, 9 మార్చి 2015 నాటి కూర్పు

భగవాన్ శ్రీ రమణ మహర్షి
రమణ మహర్షి
తత్వంఅద్వైత వేదాంతము
ఉల్లేఖనమేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

శ్రీ రమణ మహర్షి (ఆంగ్లం : Sri Ramana Maharshi) (తమిళం : ரமண மஹரிஷி)(డిసెంబరు 30, 1879ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు.[1] బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి" గా ప్రకటించుకున్నారు.[2].

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. [3] వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.[4] ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవారు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడివడియున్ననూ అడిగినవారి మనస్థితిని బట్టి వారికి మార్గముల భక్తిని కూడా బోధించేవారు.[5]

కుటుంబ నేపధ్యం

శ్రీ రమణ మహర్షి గా ప్రఖ్యాతి గాంచిన ఈ మహానుభావుడికి తల్లి తండ్రులు పెట్టిన పేరు 'వెంకట్రామన్ అయ్యర్'. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం(పునర్వసు నక్షత్రము)' నాడు జన్మించారు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు(నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వారు.

బాల్యం

పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుడ్యుం కలిగిఉండేవారు. బాల్యం లో చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు. తిరుచ్చుళి లో సరైన విద్యాసౌకర్యం లేక పోవడం కారణం చేత వాళ్ళ చిన్నాన వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళారు. రమణులు చిన్నతనం లో బాగా నిద్ర పోయేవారు, ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి(రమణ గారి అన్నయ్య),రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయారు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు, ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా , ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తేలియని గోప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానివేసారు.


బోధనలు

స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.[5]

  • "The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
  • It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
  • "In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

శ్రీ రమణ మహర్షి శిష్యులు

భగవాన్ గురించి చలం

  • భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.
  • చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, వొక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called ( Tejolingam).Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.

మూలాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.