బంగారుపాప: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 33: | పంక్తి 33: | ||
దేశాటనం చేసి ఇంటికి తిరిగి వచ్చిన మనోహర్కి పెళ్లివార్త పిడుగులా తగిలింది. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని తగాదా పెట్టాడు. తను మాటిచ్చిన తరువాత ఈ పెళ్లి జరిగితీరాలన్నాడు తండ్రి. అప్పుడయినా నిజం చెప్పి సమస్యను పరిష్కరించగల ధైర్యం మనోహర్కి లేకపోయింది. అదే సమయానికి శాంత చంటిబిడ్డతో బయలుదేరి అతనింటికి వస్తున్నట్టు ఉత్తరం వ్రాసింది. ఎంత గొడవ జరిగినా, శాంత వచ్చాక ఏదో విధంగా పరిష్కారం లభిస్తుందని మనోహర్ సమాధానపడ్డాడు. |
దేశాటనం చేసి ఇంటికి తిరిగి వచ్చిన మనోహర్కి పెళ్లివార్త పిడుగులా తగిలింది. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని తగాదా పెట్టాడు. తను మాటిచ్చిన తరువాత ఈ పెళ్లి జరిగితీరాలన్నాడు తండ్రి. అప్పుడయినా నిజం చెప్పి సమస్యను పరిష్కరించగల ధైర్యం మనోహర్కి లేకపోయింది. అదే సమయానికి శాంత చంటిబిడ్డతో బయలుదేరి అతనింటికి వస్తున్నట్టు ఉత్తరం వ్రాసింది. ఎంత గొడవ జరిగినా, శాంత వచ్చాక ఏదో విధంగా పరిష్కారం లభిస్తుందని మనోహర్ సమాధానపడ్డాడు. |
||
తన శత్రువైన గోపాలస్వామి రామదాసు అనే వర్తకుడికి ఇల్లు అమ్ముతున్నాడనీ, ఆరాత్రి స్టేషనులో దిగుతాడనీ కోటయ్యకు తెలిసింది. పగతీర్చుకునే సమయం వచ్చిందని పట్టరాని ఆవేశంతో అతడు కత్తికి పదును పెట్టాడు. |
|||
తన |
|||
ఆ రాత్రి గాలివాన ప్రళయంగా విజృంభించింది. చీకట్లో కత్తి చేతబట్టి కోటయ్య స్టేషనూ |
|||
==పాటలు== |
==పాటలు== |
09:43, 12 మార్చి 2015 నాటి కూర్పు
బంగారుపాప (1954 తెలుగు సినిమా) | |
దస్త్రం:Bangaru-paapa.jpg | |
---|---|
దర్శకత్వం | బి.ఎన్.రెడ్డి |
రచన | పాలగుమ్మి పద్మరాజు |
తారాగణం | ఎస్వీ.రంగారావు, కొంగర జగ్గయ్య, హేమలత, కృష్ణకుమారి, జమున, రమణారెడ్డి |
సంగీతం | అద్దేపల్లి రామారావు |
సంభాషణలు | పాలగుమ్మి పద్మరాజు |
ఛాయాగ్రహణం | బి.ఎన్.కొండారెడ్డి |
కళ | ఎ. కె. శేఖర్ |
నిర్మాణ సంస్థ | వాహిని పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
- కళ - ఎ.కె.శేఖర్
- నేపధ్య గానం - ఎ.ఎమ్.రాజా, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల
కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.
పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, ఎస్వీఆర్ అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. మల్లీశ్వరి కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.
ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప విజయవంతము కాలేదు.
కథాసంగ్రహం
కోటయ్య అమాయకుడు. కోటయ్య గోపాలస్వామిని గురువులా పూజించాడు. రామి తన వలపులరాణి అనుకున్నాడు. రామితో తన పెళ్లికి అంతా నిశ్చయమైపోయింది. కాని రహస్యంగా రామికీ, గోపాలస్వామికీ స్నేహం కుదిరిందని అతనికి తెలియదు. గోపాలస్వామి, రామి కలిసి తాము చేసిన దొంగతనాన్ని అతనికి అంటగట్టి అతన్ని జైలుకు పంపారు. భయంకరమైన పగ అతడి మనస్సును ఆవహించింది. మానవత్వంలో నమ్మకం పోయి అతను పశువుగా మారిపోయాడు. కొలిమి వదలని కోటయ్యకు కల్లుపాక, జూదపుశాల ఆవాసాలయ్యాయి. రామిని, గోపాలస్వామిని అంతమొందించడం అతని జీవిత ధ్యేయంగా మారింది.
సుందర్రామయ్య ఆ గ్రామంలోకల్లా పెద్ద గృహస్థుడు. కొడుకు మనోహర్కి ఒక సంబంధం స్థిరపరిచాడు. అప్పుడు మనోహర్ ఊళ్ళో లేడు. అయినా తను మాటిచ్చిన తరువాత కొడుకు కాదనలేడనే ధైర్యం సుందర్రామయ్యది. కాని తండ్రికి తెలియకుండా మనోహర్ శాంత అనే అమ్మాయిని పెళ్లాడి బెంగుళూరులో కాపురం పెట్టాడు. వాళ్లకొక ఆడపిల్ల కూడా పుట్టింది.
దేశాటనం చేసి ఇంటికి తిరిగి వచ్చిన మనోహర్కి పెళ్లివార్త పిడుగులా తగిలింది. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని తగాదా పెట్టాడు. తను మాటిచ్చిన తరువాత ఈ పెళ్లి జరిగితీరాలన్నాడు తండ్రి. అప్పుడయినా నిజం చెప్పి సమస్యను పరిష్కరించగల ధైర్యం మనోహర్కి లేకపోయింది. అదే సమయానికి శాంత చంటిబిడ్డతో బయలుదేరి అతనింటికి వస్తున్నట్టు ఉత్తరం వ్రాసింది. ఎంత గొడవ జరిగినా, శాంత వచ్చాక ఏదో విధంగా పరిష్కారం లభిస్తుందని మనోహర్ సమాధానపడ్డాడు.
తన శత్రువైన గోపాలస్వామి రామదాసు అనే వర్తకుడికి ఇల్లు అమ్ముతున్నాడనీ, ఆరాత్రి స్టేషనులో దిగుతాడనీ కోటయ్యకు తెలిసింది. పగతీర్చుకునే సమయం వచ్చిందని పట్టరాని ఆవేశంతో అతడు కత్తికి పదును పెట్టాడు.
ఆ రాత్రి గాలివాన ప్రళయంగా విజృంభించింది. చీకట్లో కత్తి చేతబట్టి కోటయ్య స్టేషనూ
పాటలు
- యవ్వన మధువనిలో వన్నెల పూవుల ఉయ్యాలా - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: పి.సుశీల, ఎ.ఎమ్. రాజా)
- వెన్నెల వేళలు పోయినా ఏమున్నది - పి.సుశీల
- తాధిమి తకథిమి తోలుబొమ్మా (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: మాధవపెద్ది సత్యం)
- పండు వెన్నెల మనసునిండా వెన్నెల - సుశీల, ఎ.ఎమ్. రాజా
- బ్రతుకు స్వప్నం కాదు - మాధవపెద్ది సత్యం
- ఏ కొర నోములు ఏమి నోచెనో - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి)
- ఘల్ ఘల్మని గజ్జలు మ్రోగ - పిఠాపురం నాగేశ్వరరావు
- కనులకొకసారైన కనపడని నా - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: పి.సుశీల
- వెడలె ఈ రాజకుమారుడు - ఎ.ఎమ్. రాజ, పి.సుశీల, మాధవపెద్ది సత్యం బృందం