Coordinates: 15°44′33″N 79°16′10″E / 15.742362°N 79.26939°E / 15.742362; 79.26939

మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:
స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించినారు. [4]
స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించినారు. [4]
===శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
స్థానిక గుండికానదీతీరాన వెలసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-10వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి జన్మ నక్ష్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించినారు. అనంతరం మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [5]
స్థానిక గుండికానదీతీరాన వెలసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-10వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి జన్మ నక్ష్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించినారు. అనంతరం మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. []
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
స్థానిక కంభం రహదారిలోని నాగులపాటి వీరాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. []


==బ్యాంకులు==
==బ్యాంకులు==

14:05, 12 మే 2015 నాటి కూర్పు

మార్కాపురం
—  మండలం  —
ప్రకాశం పటంలో మార్కాపురం మండలం స్థానం
ప్రకాశం పటంలో మార్కాపురం మండలం స్థానం
ప్రకాశం పటంలో మార్కాపురం మండలం స్థానం
మార్కాపురం is located in Andhra Pradesh
మార్కాపురం
మార్కాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో మార్కాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°44′33″N 79°16′10″E / 15.742362°N 79.26939°E / 15.742362; 79.26939
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రం మార్కాపురం
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,06,863
 - పురుషులు 54,669
 - స్త్రీలు 52,194
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.27%
 - పురుషులు 74.55%
 - స్త్రీలు 47.36%
పిన్‌కోడ్ 523316


మార్కాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు రెవిన్యూ డివిజన్ కేంద్రము. ఇది పలకలకు ప్రసిద్ధి చెందింది. పిన్ కోడ్ నం. 523 316 ., ఎస్.టి.డి.కోడ్ = 08596. మార్కాపురం పలకలకు ప్రసిద్ధి. మార్కాపురం వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది. శ్రీ కృష్ణదేవరాయలు పరిపాలనలో ఉండినది. మార్కాపురము లో చెన్నకేశవ స్వామి వారి ఆలయము నకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఒక పుణ్యక్షేత్రము.

పేరువెనుక చరిత్ర

"కృతయుగే గజారణ్యే, త్రేతాయాం మాధవీపురీ ద్వాపరే స్వర్గసోపానం, కలౌ మారికాపురీ" అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు, కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపరయుగంలో స్వర్గసోపానంగా పిలుచేవారని అర్థం. మార్కాపురం చెన్నకేశవస్వామివారు అవతరించిన పుణ్యస్థలం. స్వామి వారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు మార్కండేయ మహర్షి రచించిన 'గజారణ్య సంహిత' ద్వారా మనకు తెలుస్తోంది.

చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.

కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ, నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమై, తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా, తన భర్త మారికయ్య, బంధువులతో చెప్పి, ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'మారికాపురం' అనే పేరు ఏర్పడిందనీ, కాలక్రమేన అదే 'మార్కాపురంగా' మారిందని చెబుతుంటారు. అలాగే మార్కపురానికి పక్కనున్న 'చెన్నరాయుడుపల్లె'కు ఆమె కుమారుడైన చెన్నరాయుడి పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతుంటారు.[1]

శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం

  1. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది.లక్ష్మీచెన్నకేశవస్వామివారికి ఎడమచేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు.గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకొచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని 'విజయసూచిక'గా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టు నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగువపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్థుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన తొమ్మిది అంతస్థులను పూర్తిచేసుకుంది.
  2. శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి. [1]

శ్రీ అల్లూరు పోలేరమ్మ ఆలయం

మార్కాపురంలో తర్లుపాడు రహదారిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారం నాడు, ఆదివారోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైనవి. ఉగాది పర్వదినానికి ముందు నెల (ఫాల్గుణ మాసం) లో వచ్చే ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేక మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని, రజత ఆభరణాలు, పట్టుచీరతో శోభాయమానంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించినారు. భక్తులు, వేకువఝామున ఐదు గంటల నుండియే, అమ్మవారి దర్శనానికి బారులుదీరినారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పొయ్యిలలో, మహిళలు పొగళ్ళు వండి, తరువాత, తమను చల్లంగ చూడమని కోరుకుంటూ వీటిని అమ్మవారికి సమర్పించినారు. నాగమయ్య దేవతలు, నాగపుట్టల వద్ద భక్తులు పాలు పోసి పూజలు చేసినారు. [3]

శ్రీ రామనామ క్షేత్రం

ఈ క్షేత్రం స్థానిక జవహర్ నగర్ లో ఉన్నది.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించినారు. [4]

శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం

స్థానిక గుండికానదీతీరాన వెలసిన ఈ ఆలయంలో, 2015,మే నెల-10వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి జన్మ నక్ష్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించినారు. అనంతరం మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. []

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

స్థానిక కంభం రహదారిలోని నాగులపాటి వీరాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. []

బ్యాంకులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు.

విద్యా సంస్థలు

  • స్థానిక పూల సుబ్బయ్య వీధిలో, 2014,మే-18న, 'చైతన్య కళా స్రవంతీ వారి ఆధ్వర్యంలో "సద్గురు త్యాగరాజ సంగీత కళాశాల" ప్రారంభించెదరు. [2]

బందెలదొడ్డి

పూర్వం బందెలదొడ్డిగా ఉన్న స్థలంలో శ్రీశైలం యాత్రికులకు సత్రం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బందెల దొడ్డి స్థలాన్ని రెవెన్యూ శాఖ వారు మునిసిపాలిటీకి బద లాయించారని మునిసిపల్ ఛైర్మన్‌ చెబుతున్నారు

మండలంలోని గ్రామాలు

ఇడుపూరు

మూలాలు

[3] ఈనాడు ప్రకాశం; 2015,ఫిబ్రవరి-23; 9వ పేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-5; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-11వతేదీ; 4వపేజీ.

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషులు వివరాలు ఇక్కడ చూడండి.[1]