చలసాని ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:గుండెపోటు మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 18: పంక్తి 18:
[[వర్గం:2015 మరణాలు]]
[[వర్గం:2015 మరణాలు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుండెపోటు మరణాలు]]

13:43, 25 జూలై 2015 నాటి కూర్పు

చలసాని ప్రసాద్ ప్రముఖ కవి,రచయిత మరియు విమర్శకులు. ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు.[1]

జీవిత విశేషాలు

చలసాని ప్రసాద్ స్వస్థలం కృష్ణా జిల్లా డిసెంబరు 8 1932 న భట్ల పెనుమర్రు లో జన్మించారు[2]. విరసం స్థాపనలో ఆయనది కీలకమైన పాత్ర. అత్యవసర పరిస్థితి కాలంలో ఆయన జైలుకు వెళ్లారు. నమ్మిన విప్లవ సిద్ధాంతానికి కట్టుబడిన ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.[3] శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి, కెవిఆర్‌లతో ఆయన సన్నిహిత సంబంధాలుండేవి. పలు గ్రంథాలను ఆయన సంకలనం చేశారు. శ్రీశ్రీ సాహిత్యంపై ఆయనకు ఎనలేని పట్టు ఉంది. సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్లో ఆయన ముఖ్యమైన భూమిక పోషించారు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విప్లవ సాహిత్యోద్యమంలో ఆయన చివరి శ్వాస వరకు పాల్గొంటూ వచ్చారు. కమ్యూనిస్టు కుటుంబంలో జన్మించిన ఆయన చివరి వరకు కమ్యూనిస్టుగానే కొనసాగారు.

కమ్యూనిస్ట్ ఉద్యమంలో కీలక పాత్రవహించిన చలసాని ప్రసాద్.. నమ్మిన సిద్ధాంతాలకోసం చాలామందితో విబేధించారు. విరసం స్థాపకుల్లో చలసాని ఒకరు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఎమర్జన్సీ కాలంలో చలసాని ప్రసాద్ జైలు శిక్ష అనుభవించారు. సాహితీ విమర్శకుడుగా ఎందరికో స్ఫూర్తి నిచ్చారు. విప్లవ రచయితల సంఘం స్థాపనలో శ్రీశ్రీతో కలిసి పనిచేశారు. ప్రజా ఉద్యమాల అణిచివేతలపై జీవితకాలం పోరాడారు. ఎన్నోసార్లు జైలు జీవితం గడిపారు. నిబద్ధత అంకితభావం, అప్యాయతలకు చలసాని మారుపేరు. శ్రీశ్రీ, రంగనాయకమ్మలకు చలసాని అత్యంత సన్నిహితులు.[4]

మరణం

ఆయన జూలై 25 2015 శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో తన నివాసంలోనే గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అంబులెన్స్ చేరుకునేలోగానే ఆయన మరణించారు.[5]

మూలాలు

ఇతర లింకులు