టీ.జి. కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు
→ఆటలు: రెండు విభాగాలను కలిపాను |
|||
పంక్తి 67: | పంక్తి 67: | ||
* ''కంజన్'' అనే తమిళ సినిమాలోనూ నటించారు. |
* ''కంజన్'' అనే తమిళ సినిమాలోనూ నటించారు. |
||
* 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. |
* 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు. |
||
* చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీ కి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నది.<ref>http://www.hindu.com/2007/04/09/stories/2007040915140200.htm</ref> |
* చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీ కి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నది.<ref>ఏప్రిల్ 9, 2007న హిందూ పత్రికలో [http://www.hindu.com/2007/04/09/stories/2007040915140200.htm చిత్తూరు నాగయ్య 103వ వర్ధంతి] సందర్భంగా వచ్చిన వార్త. జూలై 13, 2007న సేకరించారు.</ref> |
||
==సినిమాల జాబితా== |
==సినిమాల జాబితా== |
15:00, 13 జూలై 2007 నాటి కూర్పు
టి.జి.కమలాదేవి | |
---|---|
జననం | తోట గోవిందమ్మ డిసెంబర్ 29, 1930 కార్వేటినగరం |
వృత్తి | నటి, స్నూకర్స్ క్రీడాకారిణి |
పదవి పేరు | నాటక కళా ప్రపూర్ణ |
భార్య / భర్త | ఆవుల చంద్రబాబు నాయుడు |
తండ్రి | కృష్ణస్వామి నాయుడు |
తల్లి | లక్ష్మమ్మ |
టి.జి.కమలాదేవి (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు)[1] అసలు పేరు తోట గోవిందమ్మ. ఈమెకు వివాహం అయ్యాక పేరు భర్త పేరు అనుసంధానించబడి ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధనటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసి నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి.తరువాత నటించిన మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు తొ జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది.అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలియుగళ గీతానికి ఈమె హీరోయిన్గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్ సినిమాల్లో నటించారు.ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలొ అనేక మంది నటీమణులకు డబ్బింగ్ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.
వ్యక్తిగతం
టి.జి.కమలాదేవి 1930, డిసెంబర్ 29వ తేదీన చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో జన్మించింది. తండ్రి కృష్ణస్వామి నాయుడు వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో కుటుంబ సమేతంగా పుత్తూరుకు చేరాడు. అక్కడ తండ్రి అటవీ శాఖలో పని చేసేవాడు. టి.జి.కమలాదేవికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. థర్డ్ఫారం వరకు పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చదివారు. మళ్ళీ ఐదవక్లాస్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివారు. ఆమె ఏడో ఏట నుండి అమ్మ లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ప్రముఖ గాత్ర విద్వాంసులు చెంచు రామయ్యగారు ఆమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచు రామయ్యగారు వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
ఓ వైపు సంగీతం, మరో వైపు పాఠశాల, వీటికి తోడు నాటకాల్లో కూడా నటించేది. ఓ సారి 'జ్ఞాన సుందరి' నాటకం వేస్తుండగా నాగయ్య గారితో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూడడానికి వచ్చారు. పిఠాపురం రాజవారు కమలాదేవి నటించిన 'సక్కుబాయి' నాటకాన్ని చూసి అందులొ ఈమె బాగా నటించినందుకు బంగారపు గొలుసు ప్రదానం చేస్తానని చెప్పినా , సమయానికి రాజా వారు తన మెడలొ గొలుసు లేకపోవడంతో మరో కార్యక్రమంలో రాజావారు ఈమె కు గొలుసు బహుమానం చేశారు. ఆంధ్ర సెక్రటరియేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ ర్రాష్టాల్లో ప్రదర్శించిన అలెగ్జాండర్ రూక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
బాల్యం
ఎనిమిదేళ్ళ వయసులో ఎవిఎం వారి నాటి సరస్వతి స్టార్స్ తరపున ఓపెన్ రికార్డింగ్లో ఓ పాట పాడేందుకు తొలిసారిగా చెన్నై వెళ్ళింది. టి.చలపతిరావు ఈమెకు 'నేను కనలేని జీవితము...' అనే పాటను సుమారు 20 రోజుల పాటు నేర్పించి ఓపెన్ రికార్డింగ్లో పాడించాడు. చిన్న వయస్సులోనే 'కనకతార', 'భూపుత్రి', 'ఐదు పువ్వుల రాణి' వంటి పలు నాటకాల్లో ఈవిడ నటించింది. ఈమెకు చిన్నతనం నుంది సినిమాలంటే ఆసక్తి ఇష్టం ఉండేది. అక్క జయమ్మ వివాహం చిత్తూరు నాగయ్య తొ జరగడంతో ఈవిడ మిగతా బాల్యం చెన్నైలోని మైలాపూర్, మాంబళంలలో వారింట్లో కొనసాగింది. అప్పట్లోనే చెన్నై ఆకాశవాణి కేంద్రంలొ సంగీత, పౌరాణిక నాటకాలలొ, లైట్ మ్యూజిక్ కచేరిలలోను తన ప్రతిభ కనబరిచింది.
బహుముఖ ప్రఙ్ఞాశాలి
రంగస్థలం, చిత్రసీమ, ఆకాశవాణి, క్రీడారంగం నాలుగు మాధ్యమాల్లోనూ నిలదొక్కుకున్న కళాకారణి. నాటక రంగం ఆమె ప్రధాన వ్యాపకం, అభిమాన రంగం. మద్రాసులో ఉన్న చెన్నపురి ఆంధ్రమహాసభ కార్యక్రమాల వెనుక ఆమె కార్యదీక్ష, దక్షత, ముందుచూపు ఉన్నాయి. 1950లో ఆ సంస్థలో సభ్యత్వం పొంది 1956 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా వివిధ హోదాల్లో సేవ చేస్తుంది.
సినిమాలు
1939 సంవత్సరం పుత్తూరులో వందేమాతరం చిత్ర కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్యకు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థన గీతాన్ని ఆలకించాడు. ఆ పాటతో ఆమె ప్రతిభ తెలుసు కొన్న నాగయ్య చెన్నై వెళ్ళాక బి.ఎన్.రెడ్డి తొ కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఆమెని మద్రాసుకి పిలిపించి ఇద్దామను కొన్న పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే చూడామణి చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతొ 1941లో వెండితెరమీద కనిపించిన టి.జి.కమలాదేవి, తరువాతి కాలంలొ అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకుల్ని మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. 'తెనాలి రామకృష్ణ' సినిమాలో నటించి హెచ్.ఎం.రెడ్డి ఆశీస్సులు పొందింది. దక్షయజ్ఞంలో రోహిణిగా, సీతారామ జననంలో అహల్యంగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం 'సీతారామ జననం'లో 'నే ధన్యనైతిని రామా' అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపు పొందే పాత్రలు ధరించింది.
రంగస్థలం
కమలాదేవికి చిన్నతనం నుండి రంగస్థలం అంటే ఎంతో అభిమానం. సతీసావిత్రి, తులాభారం, కీచక వధ వంటి నాటకాలు ఈమెను నటిగా నిలబెట్టాయి. పాఠశాలలోనే 'కనకతార' వంటి నాటకాల్లో నటిస్తూ బాల కళాకారిణి గుర్తింపు పొందింది. 'లవకుశ' సినిమా గ్రామఫోను రికార్డు ఈమెకి మంచి పేరు తెచ్చింది. ఈమె వయసు పెరిగే కొద్దీ 'సావిత్రి, వరూధిని, కీచకవధ' వంటి నాటకాల్లో ఆడుతూ పాడుతూ నటిస్తూ నటిగా పేరుతో పాటు అనుభవం గడించింది. అప్పటి ఆంధ్ర సెక్రటేరియట్ నాటక సమాజం ఆంధ్ర రాష్ట్రంలోనేకాక గుజరాత్, రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించిన 'అలెగ్జాండర్' నాటకంలొ కమలాదేవి 'రుక్సానా' పాత్రను 20 మార్లు నటించి, ఆపాత్రకు జీవాన్ని ఇచ్చింది. బళ్ళారి రాఘవ, స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, సి.ఎస్.ఆర్, ఎ.వి.సుబ్బారావు, రఘురామయ్య, సూరిబాబు, జగ్గయ్య వంటి మహానటుల సరసన కథానాయకిగానో, సహనటిగానో నటించి రంగస్థలం చరిత్రలో తనస్థానం అభిమానులలొ పదిలం చేసుకొన్నది. 'అన్నా చెల్లెలు, రోషనార, కబీరు, నూర్జహాన్, పరివర్తన' వంటి నాటకాలు ఆమెకు ఆంధ్రలొ, కబీరు, నూర్జహాన్ తమిళనాడులొ మంచి పేరు తెచ్చాయి. ఆంధ్ర మహాసభలో ఎన్నో వందల నాటకాలలో నటించింది. నాటకాలలో ఆమెకు ఒక స్వర్ణ పతకం, 25 వెండి పతకాలు లభించాయి. 1983లో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఈమెకు నాటక కళా ప్రపూర్ణ బిరుదు ఇచ్చి సత్కరించింది.
ఆకాశవాణిలో
ఈమె తొలినుండి ఆకాశవాణి ఆస్థాన గాయని. ప్రయాగ నరసింహశాస్త్రి ప్రేరణతో రేడియోలో లలిత సంగీతంలో, నాటకాలు, నాటికలు, సంగీత రూపకాల్లో పాడుతూ శ్రోతల ప్రశంసలందుకొన్నది. 1945 నుంచే ఆకాశవాణిలొ 'ఎ' గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది రజనీకాంతరావు, వింజమూరి అనసూయ, సీత, రావుబాల సరస్వతీదేవి, మల్లిక్, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో కలసి చాలా మార్లు గానం చేసింది. 'అనార్కలి' నాటకంలో ఆవుల చంద్రబాబునాయుడు అనే మద్రాసు కార్పొరేషన్ వాటర్వర్క్స్ విభాగం ఇంజినీరుతో కలసి నటించారు. అలా నటిస్తున్నప్పుడే ఇద్దరి పరిచయం, ప్రణయంగా మారి పరిణయంగా రూపుదాల్చింది. 1946 అక్టోబర్లో వివాహం తర్వాత సినిమాలకు బాగా దూరమయ్యారు. మొదట మాంబళంలో వుండే కమలాదేవి దంపతులు 1947లో షెనాయ్నగర్ వెళ్ళారు. అప్పటినుంచి కమాలాదేవి అక్కడే ఉంటున్నారు.
ఆటలు
1947లో సరదాగా ఆమె బిలియర్డ్స్ నేర్చుకొన్నారు. ఇంకో కధనం ప్రకారం 54 సంవత్సరాల వయసులో తొలిసారిగా స్నూకర్ను ఆడటం ప్రారంభించింది[2]. 1956లో ఆస్ట్రేలియా ఛాంపియన్ బాబ్ మార్షల్తో బెంగుళూరులో తలపడ్డారు. ఆ తర్వాత అఖిలభారత ఛాంపియన్ సెల్వరాజ్తో క్వార్టర్ ఫైనల్ వరకు పోటీపడ్డారు. 1994, 1995లలో బెంగుళూరులో జరిగిన స్నూకర్ పోటీలలో విజేతగా నిలిచింది. తిరిగి 1994లో ఓపెన్ బిలియర్డ్స్ స్నూకర్స్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ విజేత ఆమె. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో కూడా ఆమె ఆడింది. బిలియర్డ్స్ ఆడి, విజేత అయిన మొదటి స్త్రీ. బిలియర్డ్స్ ఆటలో 1991 జెంషెడ్పూర్లో, ఆ తరువాత 1995 బెంగుళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీలలో విజేతగా నిలచింది. దాదాపు 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ స్నూకర్ పోటీలలో పాల్గొంటుంది[3].
ఇతర విశేషాలు
- పాతాళభైరవి సినిమాలో ఇతిహాసం విన్నారా- ఆ అతిసాహసులే ఉన్నారా గీతాన్ని ఆలపించారు
- ఎవరే పిలిచే రల్లన మెల్లన పిల్లనగ్రోవిని ప్రియా ప్రియా అన్న దేవులపల్లి గీతాలు పాడారు
- దొంగలున్నారు జాగ్రత్తలో జి.వరలక్ష్మికి, భక్త రామదాసులో కన్నాంబకు, గొల్లభామలో అంజలీదేవికి నేపధ్య గానం చేశారు.
- సంపూర్ణ రామాయణంలో పద్మినికి, పాండురంగ మహత్యంలో బి.సరోజాదేవికి, ఇతర భాషా నటీమణులకు డబ్బింగ్ చెప్పారు.
- కంజన్ అనే తమిళ సినిమాలోనూ నటించారు.
- 1956నుండి చెన్నపురి ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలిగా పని చేస్తున్నారు.
- చిత్తూరు నాగయ్య జ్ఞాపకార్ధం నెలకొల్పిన చిత్తూరు నాగయ్య మెమోరియల్ అకాడమీ కి ఈమె ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నది.[4]
సినిమాల జాబితా
కమలాదేవి దాదాపు 50 తెలుగు, తమిళ సినిమాలలో నటించింది.[5] ఈ జాబితా అసమగ్రము.
- నటిగా
సంవత్సరము | సినిమా | బాష | పాత్ర |
1941 | దక్షయజ్ఞం | తెలుగు | రోహిణి |
1941 | చూడామణి | తెలుగు | |
1942 | బాలనాగమ్మ | తెలుగు | |
1942 | సీతారామ జననం | తెలుగు | అహల్య |
1943 | గరుడ గర్వభంగం | తెలుగు | |
1945 | మాయలోకం | తెలుగు | |
1946 | ముగ్గురు మరాఠీలు[6] | తెలుగు | |
1947 | కంజన్ | తమిళం | మరగతం |
1949 | గుణసుందరి కథ | తెలుగు | పార్వతీ దేవి |
1951 | మల్లీశ్వరి | తెలుగు | ఇష్టసఖి జలజ |
1951 | పాతాళభైరవి | తెలుగు | |
1951 | చంద్రవంక | తెలుగు | |
1952 | పల్లెటూరు | తెలుగు | |
1954 | తోడుదొంగలు | తెలుగు | రాముని భార్య |
1954 | చక్రపాణి | తెలుగు | మనవరాలు |
1956 | తెనాలి రామకృష్ణ | తెలుగు | |
1958 | పార్వతీ కళ్యాణం | తెలుగు | |
1967 | కంచుకోట | తెలుగు | |
1968 | అసాద్యుడు | తెలుగు | |
1968 | బంగారు పంజరం | తెలుగు | |
1968 | బంగారు సంకెళ్లు | తెలుగు | |
1969 | కథానాయకుడు | తెలుగు | |
1970 | పెత్తందార్లు | తెలుగు |
- నేపథ్యగాయనిగా
మూలాలు
- ↑ http://www.oldtelugusongs.com/cgi-bin/search/search.pl?scode=p85
- ↑ లైవ్ స్పేసెస్లోని మనీస్ స్పేస్ అనే ఒక బ్లాగులేని పోస్టు నుండి సేకరించారు. ఈ పోస్టులో కమలా చంద్రబాబు 54 సంవత్సరాలప్పుడు స్నూకర్ ఆడటం ప్రారంభించిందని చెప్పారు. జూలై 13 2007న సేకరించారు.
- ↑ 2006 జనవరి 3 హిందూ పత్రికలో స్నూకర్ పోటీలపై వచ్చిన వార్త. జూలై 13 2007న సేకరించారు.
- ↑ ఏప్రిల్ 9, 2007న హిందూ పత్రికలో చిత్తూరు నాగయ్య 103వ వర్ధంతి సందర్భంగా వచ్చిన వార్త. జూలై 13, 2007న సేకరించారు.
- ↑ http://manikns.spaces.live.com/blog/cns!FEA72452726CF2A8!144.entry
- ↑ http://www.spicevienna.org/showPerson.php?p=20313
- ↑ http://www.employees.org/~kommu/songdb.html