రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎మూలాలు: +వర్గం
→‎పాఠశాల నిర్వహణ: +రాజ్యసభలో
పంక్తి 20: పంక్తి 20:
== పాఠశాల నిర్వహణ ==
== పాఠశాల నిర్వహణ ==
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే. ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.
నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే. ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.

==రాజ్యసభలో==
1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి [[రాజ్యసభ]]కు నియమితురాలైనది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువుల పై కౄరత్వ నిరోధ చట్టం (1960) <!--Prevention of Cruelty to Animals Act (1960)--> తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో కౄరత్వ నిరోధ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]], సూత్రప్రాయంగా అంగీకరించి, ప్రభుత్వము అటువంటి చట్టము తప్పక చేస్తుందని హామీ ఇచ్చి బిల్లును వెనక్కి తీసుకోమని కోరాడు.<ref>http://rajyasabha.gov.in/publ/golden_jubi/nominated%20.htm</ref> రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసినది.


== బిరుదులు ==
== బిరుదులు ==

07:17, 8 ఆగస్టు 2007 నాటి కూర్పు

రుక్మిణీదేవి అరండేల్

రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.

జననం

అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్

ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి,శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.

వివాహం

ఈమె తన అభిరుచులకతో, ఆలోచనలతో ఏకీభవించిన అరండేల్ అనే విదేశీయుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు 16, అరండేల్ కు 40. వీరి వివాహము పెద్దల విపరీతమైన అభ్యంతరాల మధ్య ముంబైలో రిజిస్టర్ ఆఫీసులో జరిగింది.

నాట్య అభ్యాసం

వివాహానంతరం ఈమె తన భర్తతో అనేక ప్రదేశాలను దర్శించే అవకాశం లభించింది. ఆమె తనకు సహజంగానే ఉన్న కళలయందున్న ఆసక్తిచేత అన్నాబావ్లే అనే రష్యా కళాకారిణి చేసిన బాలే నృత్యము పట్ల ఆకర్షితురాలై, ఆమె సహాయంతోనే ఆమె గురువైన కిళియోనర్టిని గురువుగా స్వీకరించి రుక్మిణీ దేవి బాలే నృత్యాన్ని అభ్యసించింది. ఆపై అన్నాబావ్లే సలహా అనుసరించి తన భరతనాట్య శిక్షణకు కావసిన ప్రయత్నాలు ప్రారంభించింది. కాని ఆరంభంలో అనేక తిరస్కారాలను చవిచూసింది. ఆ రోజులలో స్త్రీలు నాట్యాన్ని అభ్యసించడం అవమానంగా భావించడం చేత ఆరంభంలో అనేక విమర్శలు ఎదుకున్నా ఆమె తన పట్టు విడవకుండా మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర శిష్యరికం చేసి భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది.

అరంగేట్ట్రం

రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలకు పాత్రురాలు అయినది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రమఖుల సముఖంలో జరిగిన ఈ ప్రదర్శన జేంస్ కజిన్స్ అనే ఇర్లాండ్ కవిని ఆకర్షించింది.

నాట్య పాఠశాల ఆరంభం

ఐర్లాండ్ కవి ఆమె యొక్క ప్రతిభను పది మందికి పంచి పెట్ట మని,అందుకు తగిన విధంగా నాట్య పాఠశాల ఆరంభించాలని కోరిక వెలిబుచ్చాడు.కవి జేంస్ కోరిక ఆమెను నాట్య పాఠశాల ఆరంభించేలా ఉత్తేజ పరచింది. ప్రారంభంలో ఆమె నాట్య పాఠశాలకు "ఇంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్" నామకరణం చేసి అనేక మంది ప్రముఖుల సమక్షం లో జరిగింది.తరువాత కాలంలో అదే కళాక్షేత్రంగా రూపుదిద్దుకుంది.

పాఠశాల నిర్వహణ

నాట్య పాఠశాలకు ఆమె మొదటి గురువైన సుందరం పిళ్ళై, అతని అల్లుడు చొక్కలింగం పిళ్ళై ఉపాధ్యాయులుగా ఉన్నారు. మొదటి విద్యార్ధుల సంఖ్య కేవం నలుగురు మాత్రమే. ఈ పాఠశాలలో నాట్యమేకాక సంగీతమూ నేర్పుతారు.అందమైన తోటలు,తామర కొలనులు,సంప్రదాయమైన కట్టడాలు ఈ పాఠశాలను నాట్య దేవాలయంలా చేశాయి. అడుగడుగునా ఆమె కృషి, అభిరుచి ప్రతిభింభిస్తూ ఈ పాఠశాల నాట్య రంగానికి ఎనలేని కృషి చేస్తూ ఉంది. ఈ పాఠశాలకు ఆమె సేవ ఆమెను చిరకాలం గుర్తుంచుకునేలా చేసింది.

రాజ్యసభలో

1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభకు నియమితురాలైనది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువుల పై కౄరత్వ నిరోధ చట్టం (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో కౄరత్వ నిరోధ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, సూత్రప్రాయంగా అంగీకరించి, ప్రభుత్వము అటువంటి చట్టము తప్పక చేస్తుందని హామీ ఇచ్చి బిల్లును వెనక్కి తీసుకోమని కోరాడు.[1] రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసినది.

బిరుదులు

రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెను "పద్మభూషణ్", శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదులతో సత్కరించింది. భరతనాట్యానికి గుర్తింపు గౌరవాన్ని కలిగించి,దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీ దేవి అరండేల్ కు ప్రదాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్న వారు అనేకమంది.

ఇతర విశేషాలు

1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి పరిశీలించాడు.[2] అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.[3]

మూలాలు