సికింద్రాబాద్: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →ఇవీ చూడండి |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
*[[హైదరాబాదు]] |
*[[హైదరాబాదు]] |
||
*[[మగ్దూం మొహియుద్దీన్]] |
*[[మగ్దూం మొహియుద్దీన్]] |
||
* [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] |
|||
==మూలాలు== |
==మూలాలు== |
00:13, 13 అక్టోబరు 2015 నాటి కూర్పు
?సికింద్రాబాద్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 17°27′N 78°30′E / 17.45°N 78.5°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 543 మీ (1,781 అడుగులు) |
జనాభా | 204,182 (2001 నాటికి) |
కోడులు • వాహనం |
• TS-10 |
సికింద్రాబాద్ , తెలంగాణ రాష్ట్రము యొక్క రాజధాని అయిన హైదరాబాదుకు జంట నగరముగా ప్రసిద్ధి పొందినది. హుస్సేన్ సాగర్ జలాశయం ఈ రెండు నగరాలను వేరు చేస్తుండగా, కరకట్ట ఈ రెండు నగరాలను కలుపుతుంది. జంట నగరాలుగా పిలువబడినప్పటికీ ఈ రెండింటి మధ్య సాంస్కృతిక పరమైన వ్యత్యాసం ఉంది.
పేరు
1806 కాలంలో నిజాం రాజు సికిందర్ జా పాలించిన గ్రామం పేరు సికిందరాబాద్ గా స్థిరపడింది. సికందర్ ఆబాద్, సికందరాబాద్, సికంద్రాబాద్, సికిందర్ ఆబాద్, సికిందరాబాద్, సికింద్రాబాద్ మున్నగునవి. అర్థం, సికందర్ స్థాపించిన లేదా బస గావించిన లేదా అభివృద్ధిపరచిన నగరం.
చరిత్ర
బ్రిటిష్ వారు మూడవ నిజాం అయిన సికిందర్ జా పరిపాలన కాలంలో హైదరాబాదులో కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు. 1820లో ఒకసారి 1830లో మరోసారి తన కాశీయాత్రల్లో భాగంగా సికిందరాబాద్ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్రచరిత్రలో నాటి విశేషాలు వ్రాశారు. 1830లో రెండవసారి వచ్చినప్పుడు రాసిన కాశీ యాత్రాచరిత్రలో తాను మొదటిసారి పదేళ్ళక్రితం వచ్చిననాటి కన్నా కుంఫిణీ లష్కర్(ఈస్టిండియా కంపెనీ కంటోన్మెంట్) బాగా విస్తరించడాన్ని చూసి ఆశ్చర్యం చెందారు. హైదరాబాద్ నగరం కన్నా లష్కరు పెద్దగా ఎదుగుతోందని తన అభిప్రాయం వ్రాశారు. హైదరాబాద్ నగరంలో న్యాయవిచారణ సరిగా లేకుండడంతో సక్రమమైన న్యాయవిచారణ, సరియైన భద్రత కోసం పలువురు వ్యాపారస్తులు తమ నివాసాలు దండు ప్రాంతం(సికిందరాబాద్)కే మార్చుకుంటున్నారని ఆయన రాశారు.[1] సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా, హైదరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది.తొలుత ఓ ప్రత్యేక కార్పొరేషన్గా ఆవిర్భవించి ఆపై హైదరాబాద్లో అంతర్భాగంగా మారింది.1950లో ప్రత్యేకంగా రూపొందించిన చట్టం మేరకు సికింద్రాబాద్ నగర పాలక సంస్థ (మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సికింద్రాబాద్) అనే స్థానిక పురపాలక సంస్థ ఏర్పాటైంది. కార్పొరేషన్గానే సికింద్రాబాద్ నగర పాలక సంస్థ తన కార్యకలాపాల్ని నిర్వర్తించేది. 28 మంది ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లుగా వ్యవహరించే వారు. 1960 ఆగస్టు మూడో తేదీన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కార్పొరేషన్ను హైదరాబాద్ నగర పాలక సంస్థలో విలీనం చేసింది. అయితే, సికింద్రాబాద్ ప్రాంతవాసులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వ ప్రముఖులు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లలో ఒకరు తప్పనిసరిగా ఎం.సి.హెచ్.కు డిప్యూటీగా వ్యవహరించే పద్ధతిని ప్రారంభించారు.అనంతరం హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు మేయర్గా ఎన్నికయ్యే పక్షంలో సికింద్రాబాద్కు చెందిన కార్పొరేటర్ను డిప్యూటీ మేయర్గా, సికింద్రాబాద్కు చెందిన ప్రతినిధి మేయర్గా ఎన్నికయ్యే పక్షంలో హైదరాబాద్కు చెందిన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యేలా ఏర్పాట్లు చేశారు.గ్రేటర్ హైదరాబాద్ ఆవిర్భవించే వరకూ ఎం.సి.హెచ్. పరిధిలో కొనసాగిన ఏడు సర్కిళ్లలోసికింద్రాబాద్ సర్కిల్ ను డివిజన్గా పరిగణించారు. సికింద్రాబాద్ అదనపు కమిషనర్ హోదాను కూడా పెంచి, ఐ.ఏ.ఎస్. అధికారి ఈ పోస్టులో కొనసాగేలా తీర్చిదిద్దారు.2007లో హైదరాబాద్ను గ్రేటర్గా రూపొందించిన వెంటనే నగరంలోని అన్ని సర్కిళ్ల సరసనే సికింద్రాబాద్ సర్కిల్ను చేర్చి దాని ప్రత్యేకాధికారాలు, స్వయం ప్రతిపత్తిని పూర్తిగా తొలగించారు.
సికంద్రాబాద్ ప్రముఖులు
సికిందరాబాద్ పుట్టి రెండు శతాబ్దాలు పూర్తయిన సందర్భంగా సికిందరాబాద్ పౌరుడు గా ప్రముఖ కవి దాశరధి రంగాచార్య హృదయావిష్కరణ ఇది. రాయప్రోలు సుబ్బారావు కొత్తపల్లి వీరభద్రరావు చువుకుల అప్పయ్య శాస్త్రి, ఆళ్వారు స్వామి వంటి మహామహులు అంతా సికింద్రాబాదు వాసులే.
హైదరాబాద్ మరియు సికింద్రాబాద్
1806 వ సంవత్సరంలో సైన్య సహాకార ఒప్పందంలో భాగంగా హుస్సేన్ సాగర్ అవతల వెలసిన ఆంగ్లేయుల స్థావరం నిజాం పాలకుడు సికిందర్ జాహ్ ఉత్తర్వుల తో సికింద్రాబాద్ గా ఆవిర్బవించింది. జంట నగరాల మధ్య అనేక తేడాలు గానవస్తాయి. సికిందరాబాదులో సాంఘిక సంస్కరణలు ఆంగ్లేయుల ఆచారాలకు అనుగుణంగా జరిగాయి. సంస్కర్తలకు పూర్తి మద్దతు లభించింది. హైదరాబాద్ ఇందుకు బిన్నం, నిజాము సర్కారు ఆచారాలకు అనుగుణం. సంస్కరణలు మార్పులు జరుగలేదు. మగ్దూం మొహియుద్దీన్ ప్రారంభించిన ఉద్యమం తప్ప చెప్పుకోదగ్గ ఉద్యమమే లేదు. నిజాం నిరంకుశ ధోరణి వల్ల హైదరాబాదు వెనుకబడినది. బ్రిటిష్ వారిది పార్లమెంటరీ వ్వవస్థ. స్వార్థం వున్నా ఉదారవాదులుగా చెలామణి. ఈ తేడా జన జీవనంలో చాల స్పష్టంగా కనబడేది. 1806 ఏర్పడిన సికింద్రాబాదు 1946 వ సంవత్సరంలో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం నిజాంకు ఆప్పగించే వరకు సికింద్రాబాద్ ఆంగ్లేయుల పాలన క్రిందే వుండేది. అందుకే హైదరాబాద్ లో ఉర్దూ రాజ్యం చేస్తున్నా సికింద్రాబాద్లో తెలుగు కళ కళ లాడింది. కవులు, రచయితలు, సంస్కర్తలు, సికింద్రాబాద్ వాసులే. హైదరాబాదులో ఉర్దూకవులు రాజ్యమేలారు. అప్పట్లో సికింద్రాబాద్ అంటే ఎంజి రోడ్, ఆర్పీ రోడ్, ఎస్ డి రోడ్, సెకెండ్ బజార్, రెజిమెంటల్ బజార్, ప్రాంతాలే. ఏ హడాహుడి లేదు, కాలుష్యం లేదు చక్కని చల్లనిగాలి, ఎక్కడికైన నడిచే వెళ్లి వచ్చేంత దూరం మాత్రమే. హైదరాబాద్ లో మతకల్లోలాలు జరిగినా సికింద్రాబాదులో ప్రశాంతత ఒక ప్రత్యేకత.
భాష సంస్కృతి
హైదరాబాద్లో తెలుగు తక్కువే. తెలుగు మాట, తెలుగు అచ్చు, తెలుగు సినిమా, తెలుగు నాటకం, తెలుగు సభ ఇలాంటివీ తక్కువే. ఒకసారి ఇలా అనిపిస్తుంది "హైదరాబాద్ అంటే ఉర్దూ - సికింద్రాబాద్ అంటే తెలుగు". మహబూబ్ కాలేజి, బురుగు మహదే హాలు వంటివి అలాంటి సాంస్కృతి కార్యక్రమాలకు నెలవు. వివేకానందుడు వచ్చినా, కృష్ణమీనన్ వచ్చినా ఇంకెవరు వచ్చినా వారి సభలు ఇక్కడే జరిగేవి. 1959 లో జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. ప్రదానికి ఘనంగా పౌర సన్మానం జరిగింది. హైదరాబాద్ మేయరు, సికింద్రాబాద్ మేయరు ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరూ పూల దండలేశారు. నెహ్రూకు ఒక సందేహం: "ఒన్ సిటి, టూ మేయర్స్?" అని ప్రశ్నించారు. సమాధానం చెప్పే దైర్యం ఎవరికుంటుంది? రెండు వేరు వేరు నగరాలు, వెరు వేరు సంస్క్రుతులు, వేరు వేరు జీవన విధానాలు.1946వ సంవత్సరంలో ఆంగ్లేయులు సికింద్రాబాద్ ను నిజాము అప్పగించారు. ఈ విభిన్న హృదయాలు ఒక్కటయాయి. సికింద్రాబాద్ హైదరాబాద్ లో భాగం అయి పోయింది. సికింద్రాబాద్ ప్రజలు దీన్ని జీర్ణించు కో లేక పోయారు. వ్వతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం లేదు. రెండు నగరాలు ఒక్కటయ్యి జంట నగరాలుగా మారాయి. అయినా సికింద్రాబాద్ తన ప్రత్యేకతను అనాటి నుండి చాటు కుంటూనే వున్నది. సికింద్రాబాద్ అభివృద్దికి కృషి చేసిన ముదలియార్లకు, సదా ఋణ పడి వుంటుంది. ప్రుడెన్షియల్ బాంకు, కీస్ ఉన్నత పాఠశాల, దక్కన్ క్రానికల్ లాంటివి వారిచ్చిన కానుకలే. క్రైస్తవ మిషనరీల సేవలు కూడ కానవస్తాయి. బడులు, ఆసుపత్రులు రెడ్ క్రాస్ లను వారే నడిపారు. రాను రాను తెలుగు విద్యావేత్తలు మరియు వైద్యులు తమ సేవలను విస్తరించారు. విస్తరణలో ఆనాటికి ఈనాటికి పోలికే లేదు.
ఇవీ చూడండి
మూలాలు
- (ఈనాడు: ఆదివారం: 4 జూన్ 2006)
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.