కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కందుకూరి రాజ్యలక్ష్మమ్మ''' (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త [[కందుకూరి వీరేశలింగం]] గారి భార్యామణి.
'''కందుకూరి రాజ్యలక్ష్మమ్మ''' (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త [[కందుకూరి వీరేశలింగం]] గారి భార్యామణి.


ఈమె 5 నవంబరు 1851 తేదీన తూర్పు గొదావరి జిల్లా [[కంతేరు]] గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. వీరి తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ పెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగారు
ఈమె [[నవంబరు 5]], [[1851]] తేదీన తూర్పు గొదావరి జిల్లా [[కంతేరు]] గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట [[కందుకూరి వీరేశలింగం]]తో వివాహం జరిగింది. అప్పటికి [[కందుకూరి వీరేశలింగం|వీరేశలింగం]] వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది. భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది. ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది. ఈమె [[1910]], [[ఆగస్టు 11]]వ తేదీన మరణించింది.


[[వర్గం:1851 జననాలు]]
[[వర్గం:1851 జననాలు]]

16:08, 4 నవంబరు 2015 నాటి కూర్పు

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.

ఈమె నవంబరు 5, 1851 తేదీన తూర్పు గొదావరి జిల్లా కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది. భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది. ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది. ఈమె 1910, ఆగస్టు 11వ తేదీన మరణించింది.