బసవరాజు అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 107: పంక్తి 107:


*హెచ్చరిక
*హెచ్చరిక

*యమునా సాంత్వనము

*దగాయీత

*గోపాలకృష్ణుడు

*చంద్రగ్రహణము

*కోణంగి పద్దు

*గురువర్య

*నోరు విడబడుతున్నదయ్యా

*కైపు

*యశోధరా విలాపము

*ఉత్తుత్త పెళ్ళి

*భూదేవి

*ప్రళయాగ్ని

*కయ్యాల విందు

*డాబులు

*నీటి బుగ్గలు

*వియోగి విలాపము

*మాయమై పోతె

*పలుకవేలనే

*తెలియని వలపు

*సౌఖ్యమే లేదా


== ప్రాచుర్యం ==
== ప్రాచుర్యం ==

10:33, 1 జనవరి 2016 నాటి కూర్పు

 ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి. 
బసవరాజు అప్పారావు
జననం
బసవరాజు వేంకట అప్పారావు

(1894-12-13) 1894 డిసెంబరు 13 (వయసు 129)
పటమట, విజయవాడ, కృష్ణా జిల్లా
మరణం1933 జూన్ 10(1933-06-10) (వయసు 38)
పటమట, విజయవాడ, కృష్ణా జిల్లా
మరణ కారణంమనోవైకల్యము
జాతీయతభారతీయుడు
విద్యబి. ఏ., బి. యల్.
విద్యాసంస్థప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు
వృత్తికవి, సంపాదకుడు, న్యాయవాది
క్రియాశీల సంవత్సరాలు1916-1932
ఉద్యోగంఆంధ్రపత్రిక, భారతి
జీవిత భాగస్వామిరాజ్యలక్ష్మి
తల్లిదండ్రులుపిచ్చయ్య, వెంకమ్మ

బసవరాజు వెంకట అప్పారావు (1894 - 1933) ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకనిగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.

జీవిత విశేషాలు

బసవరాజు అప్పారావు (1894-1933) విజయవాడ సమీపంలోని పటమట గ్రామంలో, 13 - 12 - 1894 న జన్మించాడు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ. పాసైనాడు. 1916లో రాజ్యలక్ష్మమ్మని వివాహం చేసుకొన్నాడు. గాంధీ ఉద్యమంతో సంబంధం పెట్టుకొని, జాతీయ గీతాలు వ్రాశాడు. 1921 ప్రాంతంలో ఆంధ్రపత్రిక , భారతికి సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.

సంసారిక జీవితం

ఆయన భార్య రాజ్యలక్ష్మి సౌదామిని కలం పేరుతో కవితలు వెలువరించారు. ఆమె భర్త ప్రముఖ కవి బసవరాజు అప్పారావు సాంగత్యంలో కవిత్వం పట్ల ఆసక్తి పెంపొందించుకుని కవయిత్రిగా ఎదిగానని స్వయంగా చెప్పుకున్నారు. ఈ క్రమంలో ఆమె హృదయాన్ని కదిలించే కవితలు రాశారు.[1] అప్పారావు గారు - నేను పేరుతో ఆత్మకథ రచించారు. పూర్తిస్థాయి వ్యాసం: బసవరాజు రాజ్యలక్ష్మి

రచన రంగం

బసవరాజు అప్పారావు , దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావులు "భావకవులు" అనబడేవారు ఆ కాలంలో. అప్పారావు సరళ శైలిలో గీతాలు వ్రాస్తే , నండూరి జానపద శైలిలో గేయాలు వ్రాసేవాడు. అందుకే దేవులపల్లి ఇలా అన్నాడు."సుబ్బారావు పాట నిభృత సుందరం, అప్పారావు పాట నిసర్గ మనోహరం" అని.

అప్పారావుగారి గీతాలు

  • నా కవిత్వ ధాటి
  • చెవిటి మల్లయ్య పెళ్ళి
  • జీవయాత్ర
  • నా ముక్తి
  • క్రాస్ పరీక్ష
  • నా జీవిత నాటకము
  • వృధాన్వేషణము
  • శారదాభంగము
  • హెచ్చరిక
  • యమునా సాంత్వనము
  • దగాయీత
  • గోపాలకృష్ణుడు
  • చంద్రగ్రహణము
  • కోణంగి పద్దు
  • గురువర్య
  • నోరు విడబడుతున్నదయ్యా
  • కైపు
  • యశోధరా విలాపము
  • ఉత్తుత్త పెళ్ళి
  • భూదేవి
  • ప్రళయాగ్ని
  • కయ్యాల విందు
  • డాబులు
  • నీటి బుగ్గలు
  • వియోగి విలాపము
  • మాయమై పోతె
  • పలుకవేలనే
  • తెలియని వలపు
  • సౌఖ్యమే లేదా

ప్రాచుర్యం

అప్పారావు వ్రాసిన పాటలను గూడవల్లి రామబ్రహ్మం తన సినిమా మాలపిల్లలో(1938) పరిచయం చేశాడు.సూరిబాబు పాడిన "కొల్లాయి గట్టితేనేమి? మా గాంధి మాలడై తిరిగితేనేమి?" అప్పట్లో ప్రతి గొంతుకలో మారుమ్రోగింది. కాంచనమాల సుందరమ్మలు పాడిన "నల్లవాడే గొల్లపిల్లవాడే" చాలా ప్రాచుర్యం పొందిన పాట. "గుత్తొంకాయ్ కూరోయ్ బావా, కూరి వండినానోయ్ బావా" అనే పాటను బందా కనకలింగేశ్వరరావు పాడాడు. తాజ్‌మహల్ను దర్శించినప్పుడే, "మామిడి చెట్టును అల్లుకొన్నదీ మాధవీలతొకటి" అనే పాటను రాశాడు. ఆయన వ్రాసిన లలితగీతాలను టంగుటూరి సూర్యకుమారి, బాల మురళీకృష్ణ, రావు బాలసరస్వతీ దేవి మధురంగా పాడారు. అప్పారావు 1933 లోమరణించాడు.

మూలాలు

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. రాజ్యలక్ష్మి ఆత్మకథ "అప్పారావు గారు - నేను"