రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
}} |
}} |
||
'''రావు బాలసరస్వతీ దేవి''' (జననం: [[ఆగష్టు 29]], [[1928]]) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . [[ఆకాశవాణి]] సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం]</ref> |
'''రావు బాలసరస్వతీ దేవి''' (జననం: [[ఆగష్టు 29]], [[1928]]) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . [[ఆకాశవాణి]] సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం]</ref> |
||
==నేపధ్యము== |
|||
రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం మద్రాసు<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు">{{cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267671|title=ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date= 2016-7-18|accessdate=2016-7-18}}</ref>. అక్కడ లో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు [[1928]], [[ఆగస్టు 29]]న జన్మించింది . వీరి తాతగారు మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్న మహల్ అని సినిమా థియేటర్ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం గుంటూరు తరలి వచ్చింది. |
|||
==విశేషాలు== |
==విశేషాలు== |
||
ఈమె [[గుంటూరు]] |
ఈమె [[గుంటూరు]]. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో '''సతీఅనసూయ ధృవవిజయం''' అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.<ref>[http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=13511 ఆంధ్రపత్రిక దినపత్రిక 25, నవంబర్, 1990 ఆదివారం అనుబంధం పేజీ 7] </ref> 1944లో [[కోలంక]] జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.<ref>[https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi R Balasaraswathi (b. 1928)]</ref> |
||
==చిత్రసమాహారం== |
==చిత్రసమాహారం== |
08:49, 18 జూలై 2016 నాటి కూర్పు
రావు బాలసరస్వతీ దేవి | |
---|---|
జననం | సరస్వతి 1928 జూలై 29 |
వృత్తి | నటి, నేపథ్యగాయని |
పురస్కారాలు | రామినేని పౌండేషన్ అవార్డు |
రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 29, 1928) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.[1]
నేపధ్యము
రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం మద్రాసు[2]. అక్కడ లో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు 1928, ఆగస్టు 29న జన్మించింది . వీరి తాతగారు మద్రాసు హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. గుంటూరులో వీరికి రత్న మహల్ అని సినిమా థియేటర్ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి కుటుంబం గుంటూరు తరలి వచ్చింది.
విశేషాలు
ఈమె గుంటూరు. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె పి.పుల్లయ్య దర్శకత్వంలో సతీఅనసూయ ధృవవిజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.[3] 1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.[4]
చిత్రసమాహారం
నేపథ్యగాయనిగా
ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ,సింహళీసు బాషలలో 2000కు పైగా పాటలు పాడింది. ఈమె నేపథ్య సంగీతం అందించిన తెలుగు సినిమాల జాబితా:
- ఇల్లాలు (1940)
- భాగ్యలక్ష్మి (1943)
- చెంచులక్ష్మి (1943)
- మాయా మచ్ఛీంద్ర (1945)
- రాధిక (1947)
- లైలా మజ్ను (1949)
- స్వప్న సుందరి (1950)
- పరమానందయ్య శిష్యుల కథ (1950)
- షావుకారు (1950)
- ఆహుతి (1950)
- వాలి సుగ్రీవ (1950)
- మాయలమారి (1951)
- రూపవతి (1951)
- మానవతి (1952)
- ప్రియురాలు (1952)
- ప్రేమ (1952)
- శాంతి (1952)
- చిన్నకోడలు (1952)
- దేవదాసు (1953)
- నా చెల్లెలు (1953)
- నా ఇల్లు (1953)
- పిచ్చి పుల్లయ్య (1953)
- మా గోపి (1954)
- వద్దంటే డబ్బు (1954)
- జయసింహ (1955)
- తెనాలి రామకృష్ణ (1956)
- దాంపత్యం (1957)
- పెద్దరికాలు (1957)
- రాణి రంగమ్మ (1957)
- వీరకంకణం (1957)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- వచ్చిన కోడలు నచ్చింది (1959)
- గాంధారి గర్వభంగం (1959)
- పెళ్ళి సందడి (1959)
నటిగా
లింకులు
మూలం
- ↑ టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం
- ↑ "ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు". ఆంధ్రజ్యోతి. 2016-7-18. Retrieved 2016-7-18.
{{cite web}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ ఆంధ్రపత్రిక దినపత్రిక 25, నవంబర్, 1990 ఆదివారం అనుబంధం పేజీ 7
- ↑ R Balasaraswathi (b. 1928)