అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి →చిత్రకళ |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
==చిత్రకళ== |
==చిత్రకళ== |
||
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''ఆనంద తాండవం'' మొదలగు చిత్రాలు తిరువాన్కూరు [[మ్యూజియం]]లో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. |
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం [[డెన్మార్కు]] ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''ఆనంద తాండవం'' మొదలగు చిత్రాలు తిరువాన్కూరు [[మ్యూజియం]]లో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు. |
||
==రచనలు== |
==రచనలు== |
||
పంక్తి 75: | పంక్తి 75: | ||
* పల్నాటి యుద్ధం |
* పల్నాటి యుద్ధం |
||
మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదింపబడ్డాయి. |
మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు [[కన్నడ]] భాషలోకి అనువదింపబడ్డాయి. |
||
==వనరులు, బయటి లింకులు== |
==వనరులు, బయటి లింకులు== |
03:22, 4 జనవరి 2017 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అడివి బాపిరాజు | |
---|---|
జననం | అక్టోబరు 8, 1895 భీమవరం |
మరణం | సెప్టెంబరు 22, 1952 |
ఇతర పేర్లు | బాపిబావ |
వృత్తి | కవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు |
తండ్రి | కృష్ణయ్య |
తల్లి | సుబ్బమ్మ |
అడివి బాపిరాజు (Adivi Bapiraju) (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.
బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.
సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.
చిత్రకళ
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్కూరు మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
రచనలు
నవలలు
- నారాయణరావు (1934) - సాంఘికం
- తుఫాను (1945) - సాంఘికం
- గోనగన్నారెడ్డి (1945) - చారిత్రకం
- కోనంగి (1946)- సాంఘికం
- హిమబిందు (నవల) - చారిత్రకం
- అడవి శాంతిశ్రీ - చారిత్రకం
- అంశుమతి - చారిత్రకం
- నరుడు (1946 ) - సాంఘికం
- జాజిమల్లి (1951) - సాంఘికం
- మధురవాణి (అసంపూర్ణం, పూరణ - దిట్టకవి శ్యామలా దేవి)
- శిలారథం (అసంపూరణం)
- కైలాసేశ్వరుడు (అసంపూర్ణం)
రేడియో నాటికలు
- దుక్కిటెద్దులు
- ఉషాసుందరి
- భోగీరలోయ
- నారాయణరావు
- శైలబాల
- పారిజాతం
- నవోదయం
- ఏరువాక
కథాసంపుటాలు
- తరంగిణి[1] - 7 కథల సంపుటి
- రాగమాలిక[2] - 9 కథల సంపుటి
- అంజలి - 6 కథల సంపుటి
- తూలికా నృత్యం - 3 కథల సంపుటి
- భోగీర లోయ - 6 కథల సంపుటి
- వింధ్యాచలం - 4 కథల సంపుటి
ప్రసిద్ధి చెందిన కథలు
- తూలికా నృత్యం
- హంపి శిథిలాలు
- శైలబాల
- వీణ
- నాగలి
- నేలతల్లి
- బొమ్మలరాణి
- సోమసుత
- సూర్యసుత
దర్శకత్వం వహించిన సినిమాలు
- మీరాబాయి
- అనసూయ
- ధ్రువ విజయం
- పల్నాటి యుద్ధం
మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదింపబడ్డాయి.
వనరులు, బయటి లింకులు
- http://www.vepachedu.org/Bapiraju.htmlలో వ్యాసం - ఎమ్.ఎల్.నరసింహారావు 'నూరుగురు తెలుగు ప్రముఖులు' ఆధారంగా వ్రాసినది.
- http://www.andhrabharati.com/kavitalu/shashikaLa/index.html బాపిరాజు కవిత 'శశికళ' ఇక్కడ చూడవచ్చును.