కందుకూరి రాజ్యలక్ష్మమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 15: | పంక్తి 15: | ||
[[వర్గం:1910 మరణాలు]] |
[[వర్గం:1910 మరణాలు]] |
||
[[వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు]] |
[[వర్గం:తెలుగువారిలో సంఘసంస్కర్తలు]] |
||
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]] |
12:52, 4 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (1851-1910) ప్రముఖ సంఘ సేవకురాలు. ఈమె సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి భార్యామణి.
జీవిత విశేషాలు
ఈమె నవంబరు 5, 1851 తేదీన తూర్పు గొదావరి జిల్లా కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య మరియు కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట కందుకూరి వీరేశలింగంతో వివాహం జరిగింది. అప్పటికి వీరేశలింగం వయసు 12 సంవత్సరాలు. ఈమె చిన్నతనములో చదివిన చదువుల వల్లను, మేనమామ నేర్పిన సంస్కారం వల్లను తన భర్త సంఘసేవ కార్యక్రమాలలో చేదోడు వాదోడుగా నిలిచింది.
భర్త స్థాపించిన వితంతు శరణాలయములోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదరించింది. వారికి తగిన వరులు దొరికి వివాహం జరిపినపుడు పెండ్లి పీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసెడివారు. ఈమె తను నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కొరకు ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించి ప్రతి రోజు ఉదయము, సాయంకాలములలో ప్రార్థనలు జరిపేది. ఈమె సంగీతము కొంత అభ్యసించి భగవద్భక్తి పరమైన కీర్తనలు కొన్ని రచించింది.
మరణం
ఈమె 1910, ఆగస్టు 11వ తేదీన మరణించింది.