కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 31: | పంక్తి 31: | ||
రమకు తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నా తరచూ స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్తూ వాళ్ళ క్షేమసమాచారాలు విచారిస్తూనే ఉంది. ఒకరోజు ఆమెకు బెలూరులో జరిగిన కస్తూరి సురేష్ల ప్రేమాయణం గురించి తెలిసింది. తన స్నేహితురాలి క్షేమం కోరి ఆమెను హెచ్చరించి సురేష్ను మరచిపొమ్మని చెప్పింది. కస్తూరి అది అంత తేలికైన విషయం కాదని, తనకు పెళ్ళంటూ జరిగితే సురేష్తోనే జరగాలనీ తను అతనిపై పెంచుకున్న ఆశలను స్నేహితురాలికి వివరించింది. తనకు ఇంట్లోవాళ్ళు ఏదో సంబంధం చూస్తున్నట్లు ఈ విషయం తను సురేష్కు రాసినట్లు కూడా ఆమె రమతో చెప్పింది. సురేష్ తనను తప్పక స్వీకరిస్తాడని కస్తూరి నమ్మకం. |
రమకు తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నా తరచూ స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్తూ వాళ్ళ క్షేమసమాచారాలు విచారిస్తూనే ఉంది. ఒకరోజు ఆమెకు బెలూరులో జరిగిన కస్తూరి సురేష్ల ప్రేమాయణం గురించి తెలిసింది. తన స్నేహితురాలి క్షేమం కోరి ఆమెను హెచ్చరించి సురేష్ను మరచిపొమ్మని చెప్పింది. కస్తూరి అది అంత తేలికైన విషయం కాదని, తనకు పెళ్ళంటూ జరిగితే సురేష్తోనే జరగాలనీ తను అతనిపై పెంచుకున్న ఆశలను స్నేహితురాలికి వివరించింది. తనకు ఇంట్లోవాళ్ళు ఏదో సంబంధం చూస్తున్నట్లు ఈ విషయం తను సురేష్కు రాసినట్లు కూడా ఆమె రమతో చెప్పింది. సురేష్ తనను తప్పక స్వీకరిస్తాడని కస్తూరి నమ్మకం. |
||
కానీ సురేష్ తేనె పూసిన కత్తి అన్న సంగాతి ఆ అమాయకురాలు గ్రహించలేకపోయింది. అతను అంబికకు తానొక పెద్దమనిషిలా ఉత్తరం వ్రాస్తూ కస్తూరి తనను ప్రేమిస్తున్నట్లుగ ఉత్తరం రాసిందని, ఇలా ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించేసేంత బలహీనురాలా నీ స్నేహితురాలు అంటూ దెప్పిపొడుస్తూ, కస్తూరి తనకు రాసిన ఉత్తరాన్ని కూడా ఆమెకు పంపించాడు. |
కానీ సురేష్ తేనె పూసిన కత్తి అన్న సంగాతి ఆ అమాయకురాలు గ్రహించలేకపోయింది. అతను అంబికకు తానొక పెద్దమనిషిలా ఉత్తరం వ్రాస్తూ కస్తూరి తనను ప్రేమిస్తున్నట్లుగ ఉత్తరం రాసిందని, ఇలా ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించేసేంత బలహీనురాలా నీ స్నేహితురాలు అంటూ దెప్పిపొడుస్తూ, కస్తూరి తనకు రాసిన ఉత్తరాన్ని కూడా ఆమెకు పంపించాడు. అంబిక ఆ ఉత్తరాలు చూసుకుని హతాశురాలై, కస్తూరి నిర్మలమైన ప్రేమను గుర్తించలేక ఆమెను దూషించింది. ఆ అవమానాన్ని భరించలేక కస్తూరి ఆత్మహత్య చేసుకుంది. |
||
రమ ప్రైవెటు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించిన కొన్నాళ్ళకు ఒక ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్లో ఆమెకు టీచర్ ఉద్యోగం లభించింది. తన కుటుంబానికి ఎంతో సాయపడుతున్నానన్న ఆత్మ సంతృప్తితో పాటు, ఆమెకు విద్యార్థుల ఆదరాభిమానాలు కూడా లభించాయి. ముఖ్యంగా తన విద్యార్థులలో ఒకరైన నాగేంద్ర పట్ల ఆమెకు అభిమానం ఏర్పడింది. అతని హుందాతనం, వినయ విధేయతలు ఆమెను ఆకర్షించాయి. నాగేంద్ర్ కూడా ఒక పల్లెటూరులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా, తన ఉద్యోగంలో ఉన్నతావకాశాల కోసమని ఇన్స్టిట్యూట్లో చదువుకోడానికి వచ్చాడు. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
16:02, 26 మే 2017 నాటి కూర్పు
కంకణ 1974లో విడుదలైన కన్నడ చలనచిత్రం. ఎం.బి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం కన్నడలో జాతీయ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా ఎంపికయ్యింది. త్రివేణి రచించిన నవల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చాడు.
పాత్రలు - పాత్రధారులు
- రమ - రేవతి
- కస్తూరి - దివ్య అధికారి
- అమృత - వసుమతి
- సుశీల - గిరిజ
- వేదవల్లి - డి.భారతి
- అంబిక - ప్రమీల
- నాగేంద్ర - హెచ్.బి.యాజమాన్
- సురేష్ - సురేష్ హెబ్లికర్
సాంకేతిక వర్గం
- దర్శకత్వం : ఎం.బి.ఎస్.ప్రసాద్
- కథ : త్రివేణి
- సంభాషణలు, స్క్రీన్ ప్లే : యు.ఆర్.అనంతమూర్తి
- ఛాయాగ్రహణం : ఎస్.రామచంద్ర
- కళ : ఆర్.ఎం.హాద్పాడ్
- సంగీతం : హెచ్.జె.ఇమామ్
- కూర్పు : ఉమేష్ కులకర్ణి
చిత్రకథ
అది మైసూరు పట్టణం. అప్పుడే బి.ఏ. పరీక్షలు రాసి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ కుర్చున్నారు ఆరుగురు అమ్మాయిలు. కాలేజీలో చదువుకుంటుండగా - వాళ్ళ మధ్య ఏర్పడిన మైత్రి అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు ఒక చోట కూర్చుని భవిష్యత్తు పట్ల తమ ఆశలు, ఆశయాలు చెప్పుకుంటూ, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడం పట్ల ఎంతో ఆసక్తి చూపారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు.
ఒక్కొక్కరి కుటుంబంలోను రకరకాల సమస్యలు... రమ, సుశీలల కుటుంబాలు పెద్దవి.అంచేత వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, తమ తమ కుటుంబాలకు సాయపడదామనుకున్నారు. వేదవల్లి గృహిణిగా స్థిరపడాలని అనుకున్నా, ఆమె నల్లగా ఉండడంవల్ల సంబంధం చేసుకోడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడగడడమో - లేదా పిల్ల నచ్చలేదనడమో ఆమెకు ఒక సమస్యగా పరిణమించించిది. కస్తూరికి పెద్ద చదువులు చదువుకుని - పెద్ద ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్ళాడాలని కోరిక. అమృతకు పెళ్ళి మీద అంతగా ఆసక్తి లేదు. ఇక వాళ్ళందరితో పోలిస్తే - ఏ చీకూ చింతా లేని అమ్మాయి - అంబిక. ఆమె శ్రీమంతుల ఇంట్లో పుట్టడమే అందుకు కారణం!
చదువైపోగానే సరదాగా కొంత కాలం గడపకుండా అప్పుడే రకరకాల ఆలోచనలతో సతమతమైపోవడం ఎందుకని - అంబిక - తన స్నేహితురాళ్ళందరినీ తీసుకుని ' చిక్మగళూర్' లోని తన మామయ్యగారి కాఫీ ఎస్టేట్కు విహారయాత్రకు బయలుదేరింది.
అక్కడ ఈ అమ్మాయిలకు అంబిక అత్తగారి దూరపు బంధువు సురేష్ పరిచయం అయ్యడు. కస్తూరి సురేష్ పట్ల ఆకర్షణకు లోనయ్యింది. అతని వీళ్ళందర్నీ బేలూరుకు తీసుకువెళ్ళాడు. సురేష్తో ఏర్పడిన సాన్నిహిత్యం కస్తూరిని ఊహాలోకాల్లో విహరింపజేసింది. అందరూ బేలూరు నుంచి శృంగేరి వెళ్దామనుకున్నారు. కానీ అక్కడి వాతావరణం కస్తూరికి పడకపోవడంతో ఆమెకు అకస్మాత్తుగా జబ్బు చేసింది. తన స్నేహితురాళ్ళను విహారయాత్ర కొనసాగించమని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయింది. మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన సురేష్ ఆమెకు వైద్యచికిత్స చేశాడు. ఆ సమయంలోనే ఆమెపట్ల తనకు కలిగిన ప్రేమను వ్యక్తం చేశాడు.
విహారయాత్రను ముగించుకుని అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. రమ - ఒక కాంట్రాక్టరు భార్యకు చదువుచెప్పే ఉద్యోగాన్ని సంపాయించుకుంది. సుశీల ఓ కార్యాలయంలో రిసెప్షనిస్ట్ అయింది. వేదవల్లి -సాల్డాన్హా అనే మాస్టరు వద్ద సితార్ నేర్చుకోసాగింది. మరోప్రక్క ఆమెకు పెళ్ళి చూపుల బేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమృత కుట్లూ అల్లికలతో కాలక్షేపం చేయసాగింది.
రమకు తన కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఎలా ఉన్నా తరచూ స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్తూ వాళ్ళ క్షేమసమాచారాలు విచారిస్తూనే ఉంది. ఒకరోజు ఆమెకు బెలూరులో జరిగిన కస్తూరి సురేష్ల ప్రేమాయణం గురించి తెలిసింది. తన స్నేహితురాలి క్షేమం కోరి ఆమెను హెచ్చరించి సురేష్ను మరచిపొమ్మని చెప్పింది. కస్తూరి అది అంత తేలికైన విషయం కాదని, తనకు పెళ్ళంటూ జరిగితే సురేష్తోనే జరగాలనీ తను అతనిపై పెంచుకున్న ఆశలను స్నేహితురాలికి వివరించింది. తనకు ఇంట్లోవాళ్ళు ఏదో సంబంధం చూస్తున్నట్లు ఈ విషయం తను సురేష్కు రాసినట్లు కూడా ఆమె రమతో చెప్పింది. సురేష్ తనను తప్పక స్వీకరిస్తాడని కస్తూరి నమ్మకం.
కానీ సురేష్ తేనె పూసిన కత్తి అన్న సంగాతి ఆ అమాయకురాలు గ్రహించలేకపోయింది. అతను అంబికకు తానొక పెద్దమనిషిలా ఉత్తరం వ్రాస్తూ కస్తూరి తనను ప్రేమిస్తున్నట్లుగ ఉత్తరం రాసిందని, ఇలా ఒక్కసారి పరిచయం అయిన వ్యక్తిని ప్రేమించేసేంత బలహీనురాలా నీ స్నేహితురాలు అంటూ దెప్పిపొడుస్తూ, కస్తూరి తనకు రాసిన ఉత్తరాన్ని కూడా ఆమెకు పంపించాడు. అంబిక ఆ ఉత్తరాలు చూసుకుని హతాశురాలై, కస్తూరి నిర్మలమైన ప్రేమను గుర్తించలేక ఆమెను దూషించింది. ఆ అవమానాన్ని భరించలేక కస్తూరి ఆత్మహత్య చేసుకుంది.
రమ ప్రైవెటు ట్యూషన్లు చెప్పడం ప్రారంభించిన కొన్నాళ్ళకు ఒక ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్లో ఆమెకు టీచర్ ఉద్యోగం లభించింది. తన కుటుంబానికి ఎంతో సాయపడుతున్నానన్న ఆత్మ సంతృప్తితో పాటు, ఆమెకు విద్యార్థుల ఆదరాభిమానాలు కూడా లభించాయి. ముఖ్యంగా తన విద్యార్థులలో ఒకరైన నాగేంద్ర పట్ల ఆమెకు అభిమానం ఏర్పడింది. అతని హుందాతనం, వినయ విధేయతలు ఆమెను ఆకర్షించాయి. నాగేంద్ర్ కూడా ఒక పల్లెటూరులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా, తన ఉద్యోగంలో ఉన్నతావకాశాల కోసమని ఇన్స్టిట్యూట్లో చదువుకోడానికి వచ్చాడు.