శ్రీనివాస మంగాపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 36: పంక్తి 36:
[[వర్గం:పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా దర్శనీయ స్థలాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ హిందూ దేవాలయాలు]]

13:50, 29 మే 2017 నాటి కూర్పు

కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం

శ్రీనివాస మంగాపురం తిరుపతికి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనంలో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.

శ్రీనివాస మంగాపురం తిరుపతి, మదనపల్లి రోడ్డులో తిరుపతికి దగ్గరలో ఉంది. గతంలో ఈ ఆలయం పురావస్తు శాఖ వారి ఆదీనంలో వుండి నిత్య పూజా కార్యక్రమాలకు దూరంగా వుండేది. పురావస్థు శాఖ వారి బోర్డు ఈ నాటికి ఆలయ ప్రాంగణంలో చూడ వచ్చు. ఆ తర్వాత సకల పూజా కార్యక్రమాలు జరుగు తున్నవి. ఇక్కడి శ్రీ వేంకటేశ్వరుని ఆలయం చాల పెద్దది. విశాల మైనది. ఇక్కడి శ్రీ వారి ప్రధాన మూర్తి తిరుమలలో వున్న దాని కంటే పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసు కోవచ్చు.

గతంలో మంగాపురంలో రైల్వే స్టేషను కూడా వుండేది. భక్తులు ఇక్కడ దిగి ముందు స్వామివారిని దర్శించుకొని తిరుమలకు వెళ్లేవారు. శ్రీ వారి మెట్టు ఇక్కడికి దగ్గరే. అక్కడి నుండే తిరుమల కొండ పైకి మెట్లదారి ఉంది. ఇది చాల దగ్గిర దారి. తిరుపతి అలిపిరి నుండే వుండే మెట్ల దారి కంటే ఇది చాల దగ్గర. సుమారు ఒక గంట లోపలే తిరుమల కొండ పైకి చేరవచ్చు. చాల మంది ఇక్కడి నుండి తిరుమల కొండపైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకొని ఆతర్వాత తిరుపతి వైపు మెట్ల దారి గుండ కిందికి దిగేవారు. కాని అలిపిరి వద్ద నున్న మెట్లదారి గుండా పైకి ఎక్కి నూరు మెట్ల దారి గుండా దిగే వారు ఎవరు ఉండరు. తిరుపతి చూడ నవసరం లేదనుకొనే వారు మాత్రం గతంలో ఈ దారినే ఎక్కువగా వాడే వారు. అప్పట్లో శ్రీనివాస మంగాపురం శ్రీనివాసుని దర్శించుకునే భక్తులు చాల తక్కువ. ఇక్కడ భక్తుల రద్దీ తిరుమలతో పోలిస్తే చాల తక్కువ గాన తనివి తీర శ్రీనివాసుని దర్శించు కోవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య బాగ పెరిగింది.

తిరుమలకు మెట్ల దారి ద్వారా నడచి వెళ్ళే భక్తుల సౌకర్యార్థం తిరుపతి అలిపిరి వద్ద నుండి శ్రీవారి మెట్టు వద్ద నున్న మెట్ల దారి వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉంది. ఉచితముగా భక్తుల సామానులను కొండపైకి తీసుకెళ్ళే సౌకర్యము కూడా ఉంది. నడచి వెళ్ళేభక్తులకు ఇచ్చే ప్రత్యేక టోకన్లు అలిపిరి వద్ద ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఈ మెట్ల దారు (నూరు మెట్లదారి) అతి దగ్గర దారి. ఈ మద్య కాలంలో భక్తులు ఈ మెట్ల దారిని మరచి పోయినారు. తి.తి.దే. వారు కల్పించిన సౌకర్యాల వలన ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య బాగా పెరుగు తున్నది. ఇది అతి దగ్గరి దారి అయినందున గత కాలంలో ఈ మెట్ల దారి ద్వారా పరిసర పల్లె ప్రజలు పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు మొదలగు వాటిని ఈ మెట్ల దారి ద్వారనే తిరుమల కొండకు చేరవేసే వారు.

చిత్రమాలిక

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు