శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 61: పంక్తి 61:
శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును [[మదరాసు]]లో నెలకొలిపి పిమ్మట దానిని [[రాజమహేంద్రవరము]]<nowiki/>నకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయింది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.
శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును [[మదరాసు]]లో నెలకొలిపి పిమ్మట దానిని [[రాజమహేంద్రవరము]]<nowiki/>నకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయింది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.


==ఇతర విశేషాలు==
==మున్సిపల్ మ్యూజియంలో విగ్రహం==
[[రాజమహేంద్రవరం]] మున్సిపల్ కార్పొరేషన్ [[సంగ్రహాలయం|మ్యూజియం]] పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు. దీన్ని ఇంకా సముచిత స్థానంలో పెట్టాలని పలువురు అంటున్నారు. ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి [[పూల మాల|పూలమాల]] వేసి భక్త్యంజలి ఘటించేవారు.
[[రాజమహేంద్రవరం]] మున్సిపల్ కార్పొరేషన్ [[సంగ్రహాలయం|మ్యూజియం]] పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు.
ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి [[పూల మాల|పూలమాల]] వేసి భక్త్యంజలి ఘటించేవారు.
శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి సార్ధ శత జయంత్యుత్సవం (150ఏళ్ళ వేడుక) ఆశ్వియుజ బహుళ షష్టి అక్టోబరు 21 శుక్రవారం సాయంత్రం త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ఆధ్వర్యాన నిర్వహించారు. ఉదయం మున్సిపల్ మ్యూజియంలో శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి విగ్రహం దగ్గర శ్రీ రామేన బ్రహ్మం కుటుంబ సభ్యులతో కల్సి శ్రీపాద వారి ప్రపౌత్రుడు శ్రీ కల్లూరి శ్రీరామ్, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు[[(విశాఖపట్నం)]] పూజాదికాలు నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ శ్రీ వి.విజయరామరాజు హాజరయ్యారు. శ్రీపాద విగ్రహానికి పొష్పాంజలి ఘటించారు. సాయంత్రం [[గోదావరి]] గట్టునగల సమితి స్వస్థలంలో ఆత్మీయ పూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు శ్రీ వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ స్వాగతం పలికారు. [[హైదరాబాద్]] కేంద్రీయ విశ్వ విద్యాలయం ఆచార్య బేతవోలు రామబ్రహం అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ శ్రీ [[విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి]], ప్రవచన రాజహంస డాక్టర్ [[ధూళిపాళ మహాదేవమణి]], సంస్కృత భాషోద్యమ సారథి శ్రీ దోర్బల ప్రభాకర శర్మ అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీ కల్లూరి శ్రీరామ్ రూపొందించిన శ్రీపాద వారి ప్రత్యేక సంచికను ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు. నఖచిత్రకారుడు డాక్టర్ [[రవి పరస]] గోటితో వేసిన శ్రీపాద వారి చిత్రపటాన్ని ఆచార్య బేతవోలు ఆవిష్కరించారు.
శ్రీ పోతుకూచి సూర్యనారాయణమూర్తి శ్రీ అమరేశం రాజేశ్వర శర్మ, శ్రీ చెబియ్యం వెంకట్రామయ్య, శతావధాని డాక్టర్ [[అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు]], మాజీ ఎం.ఎల్.ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు, ఆదాయపు పన్ను శాఖ అధికారి శ్రీ రామావతారం, వంకలంక రామం, రామేన బ్రహ్మం, ఎర్రాప్రగడ రామకృష్ణ,చాగంటి శరత్ బాబు, పెరుమాళ్ళ రఘునాధ్,అశోక కుమార్ జైన్,ఓ.ఎన్.జి.సి. రిటైర్డ్ అధికారి శ్రీ విజయకుమార్, శ్రీపాద జిత్ మోహన్ మిత్ర, డాక్టర్ తల్లావఝల పతంజలి శాస్త్రి, ఎర్రాప్రగడ ప్రసాద్, నల్లగొండ రవిప్రకాష్, జోరా శర్మ, డాక్టర్ పివి మురళీకృష్ణ,జూపూడి వెంకట రమణారావు,కల్లూరి శ్రీరాములు,నిమ్మలపూడి వీర్రాజు, రత్నం సన్ పెన్వర్క్స్ అధినేత డాక్టర్ కె.వి.రమణమూర్తి దంపతులు, డాక్టర్ పీ.ఎస్.రవికుమార్, గ్రంథి రామచంద్రరావు, పెమ్మరాజు గోపాలకృష్ణ, దినవహి బాపిరాజు, మరాశాస్త్రి, డాక్టర్ ఏ.ఎస్.వి మహాలక్ష్మి, [[బులుసు వెంకటేశ్వర్లు]], [[సత్యమూర్తి]], అజ్జరపు హరిబాబు, ప్రజాపత్రిక సుదర్శన్, దీక్షితుల సుబ్రహమణ్యం, వాడ్రేవు దివాకర్, రామనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 29న [[విశాఖపట్నం|విశాఖ]]<nowiki/>లో శ్రీపాద వారి సార్ధ శతజయంతి నిర్వహిస్తారు.
<ref>https://www.youtube.com/watch?v=k5PlXbIbovU&feature=share</ref>
<ref>సార్ధక బిరుదాంకితులు పండిత యశస్వి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, http://sarikothasamacharam.com/%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%95-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B0%BE%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B0%82/</ref>
<ref>శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 150వ జయంతి సాక్షి దినపత్రిక(22.10.16)</ref>
ఈతీరున బత్త్రి కాసంపాదకులై, శతాధిక గ్రంథరచయితలై, భారత బాగవత రామాయణాంధ్రీకర్తలై, కవిరాజులై, కవిసార్వభౌములై, కళాప్రపూర్ణులై, మహామహోపాధ్యాయులై, ఆంధ్రవ్యాసులై, కనకాభిషిక్తులై, పూర్ణపురుషాయుషజీవులై విరాజిల్లుచున్న కృష్ణమూర్తి శాస్త్రిగారి సమగ్రజీవితము వ్రాసినచో మఱియొక మహాభారతము.
https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:AndhraRachaitaluVol1.djvu/243


==ముఖ్యమైన రచనలు==
==ముఖ్యమైన రచనలు==

07:09, 11 మే 2018 నాటి కూర్పు

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
జననం1866, అక్టోబరు 29
మరణం1960, డిసెంబరు 29
వృత్తిరచయిత
పిల్లలుకల్లూరి విశాలాక్షమ్మ,
సుదర్శన శాస్త్రి
తల్లిదండ్రులు
  • వెంకట సోమయాజులు (తండ్రి)
  • వెంకట సుబ్బమ్మ (తల్లి)

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి (జననం: 1866 - మరణం: 1960) ఆధునిక తెలుగు ఆస్థాన కవి.

జననం

కృష్ణమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఎర్నగూడెం లో 1866 సంవత్సరంలో అక్టోబరు 29 వ తేదీనాడు (అక్షయ సం. ఆశ్వయుజ బహుళ షష్థీ సోమవారము) రాత్రిజాము గడిచిన పిదప పునర్వసు తృతీయ చరణమున వెలనాటి వైదిక బ్రాహ్మణ వంశంమున వెంకట సుబ్బమ్మ వెంకట సోమయాజులను పుణ్యదంపతులకు జన్మించారు/

పదుగురు పిల్లలు గతించిన పిదప వల్మీక ప్రాంతమున శ్రీకృష్ణారాధనము చేసిన ఆనంతరము జనించి, విషూచివలన రెండేళ్ళ ప్రాయమున అస్తమించి, శ్వశానవాటికలో పునర్జన్మ నంది, గర్భాష్థనము దాటిన పిదప ఉపనయన దీక్షారాంభమందే శ్రౌతస్మార్తముల నెరంగి కావ్యపఠనము సాగించి, రఘువంశ పరిశీలనమందె సంస్కృత కవనపుజాడలు గ్రహించి, 16వయేట తెలుగు కవిత్వమును చెప్పనేర్చి, బహుళశ్లోకములందు స్వీయచరిత్రను వ్రాసి, తండ్రి యజ్ఞములో అధ్వర్యమును సలిపి, బాల్యమును కాటవరమున గడిపి, శ్రీ ఇవటూరి నాగలింగశాస్త్రి గారిని ఆశ్రయించి, శ్రీ మధిరసుబ్బన్న దీక్షితులను సహాధ్యాయముతో బహుళశాస్త్రాంశము లెరిగి, వాగ్దేవి నారాధించి శాస్త్రులుగారు దీర్ఘోపాసనకు పూనుకొనిరి.. వీరికి వేదవిద్యలో పాండిత్యం సంపాదించి గ్రాంథిక భాష మీద గౌరవంతో తన రచనలను కొనసాగించారు. వీరు సుమారు 200 పైగా గ్రంథాలు రచించారు. వానిలో నాటకాలు, కావ్యాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ఉన్నాయి. వీరి కుమార్తె కల్లూరి విశాలాక్షమ్మ కూడా కవయిత్రి. ఈమె శతకాలు, కావ్యాలు 30కి పైగా వ్రాశారు.

పండితయశస్వి

'ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి గండపెండేరం సత్కారం, గజారోహణం ఇలా ఎన్నో సత్కారాలు జరిగాయి. ఎన్నో బిరుదులూ ఉన్నాయి. ఆ బిరుదులన్నీ సార్థక బిరుదులే. శతాధిక గ్రంథాలను రాసిన శ్రీపాదవారు కృతి కర్తె కాదు. కృతి భర్త కూడా. ప్రజ్ఞా వంతుడు. ప్రతిభావంతుడు. యశస్వి. శ్రీపాదవారి తర్వాత అంతటి కీర్తిప్రతిష్ఠలు పొందినవాళ్ళు చాలా అరుదుగా వున్నారని చెప్పవచ్చు. అసలు హర్షుడు రాసిన నైషధీయ చరితాన్ని, శ్రీనాధుడు రాసిన శృంగార నైషధాన్ని మళ్ళీ రాయాలని సంకల్పించడమే ఓ సాహసం. అయితే ఎక్కడా కూడా మూల గ్రంథాల సహజత్వం పోకుండా చూసారు. అద్భుతంగా నైషద చరితాన్ని అందించిన ఘనత శ్రీపాద వారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇక శ్రీపాద వారికి వచ్చిన పతకాలు, వస్తువులు ఆంధ్రాయూనివర్సిటీకి ఇచ్చేశారు. అయితే అందులో కొన్ని మ్యూజియంకి తరలించగా, కొన్ని ఇంకా ఎక్కడ ఉంచారో వెతుకుతున్నారు.

వీరికృతులలో ముగుల ప్రధానమైనది భారతాంధ్రీకరణము. లక్షశ్లోకములను కొన్ని వేల పద్యములందు పరివర్తన మొనరించిరి.ఆంధ్రశారదకు ఎనలేని భూషణములను సమర్పించిరి.తిక్కన భారతములో అనుశాసన పర్వములో పరమేశ్వరమహిమను వర్ణనము విడువబడింది. శ్రీ శంకరాచార్యులు భాష్యమువలన ఈనామములు విశేషప్రశస్తినొందినవి.స్తోత్రములు, కవచములు, అష్టకములు నిత్యపారాయణములు నిత్యపారాయణము వలన నిష్టారైసిద్ధిని చేకూర్చును గదా! వీనిని విడువక శ్రీ శాస్త్రులుగారు మూలానుసారముగా తమ ఆంధ్రీకరణమును సాగించిరి.తెలుగు కవితకు మిగుల సొంపు చేకూర్చ వివిధ రసములను, గుణాలంకారాదులను శ్రీశాస్త్రులుగారి రచనలందు పొడగాంతుము.వీరు దీనిని రెండు దశాబ్దములలోపున ముగించిరి.

బొబ్బిలి యుద్ధము నాటకమును శ్రీశాస్త్రిగారు వ్రాసిరి.ఇది రంగస్థలమున కెక్కిన దినములలో ఆంధ్ర వసుంధర పునాదులతో కదలినది.జయచంద్రుని తాళపుచెవి కనోజినుండి జారిపడి, విజయరామరాజు చేతులపడగా శత్రువున కాతడు దానినందిచెను-బొబ్బిలి రుధిరప్లావితమయినది.ఇది చాలా ఆదరణ పొందిన నాటకము. ఈగ్రంధమును శ్రీ శాస్త్రిగారు దివంగతుడైన తమ తనయుడు సుదర్శన సుధికి అంకితమొనరించిరి.ఈబాలుడు 9ఏళ్ళు అల్లారుముద్దుగా పెరిగి, మేధానిధియై దైవప్రేరణమున తలిదండ్రులను బాసి వారికి తీరని దుఃఖమును కలిగించిపోయెను. స్వరాజ్యోదయము అను గ్రంథము శాస్త్రిగారి దేసభక్తి వ్యక్తీకరించింది. ఆంధ్రాభ్యుదయము అను చరిత్రాత్మిక పద్యకావ్యములో ఆంధ్రప్రముఖుల గుణగణములను సంక్షేపముగా వివరించిరి. భగవద్గీతాంధ్రీకరణము ను శాస్త్రిగారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పండితునకు సమర్పించిరి. సంస్కృతమున డాక్టర్ రాజేంద్రప్రసాద్ జీవిత చరిత్రను వ్రాసిరి. ఇతర రచనలు[మూలపాఠ్యాన్ని సవరించు] మొత్తం 225 గ్రంథములను శాస్త్రిగారు రచించారు.ఇందు కావ్యములు, ప్రబంధములు, నవలలు, నాటకములు, ప్రహసనములు, నిఘంటువులు, శతకములు, అష్టకములు, చంధోవ్యాకరణములు, చిత్రకవిత్వములు, బంధకవిత్వము, గర్భకవిత్వములు మొదలయినవి ఉన్నాయి.

ఆంధ్రవిశ్వకళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదమొసగినది. వెనుకటి ప్రభుత్వము వీరికి మహామహోపాధ్యాయ అని వారిని కీర్తించింది.1958లో శాస్త్రిగారు ఆంధ్రాస్థాన కవియై సన్మానింపబడిరి. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి కవీంద్రుడు వీరి శిష్యుడు. వీరితో శాస్త్రిగారికి కొంతకాలము వైరము గడిచినను అటుపై అది సమసినది. గిడుగు రామమూర్తి తోకూడా అదేవైఖరి నడిచినను అటుపై సఖ్యులుగా ఆత్మీయులుగా నడుచుకొనిరి.కవిసార్వభౌముడు తపస్వి. బాల నారధించిన కవీంద్రుడు.

పదబంధ నేర్పరి శ్రీపాద వారు

గోదావరి తీరం,రాజమహేంద్రవరం తాలూకు ప్రశస్తిని చాటిన శ్రీపాదవారు తన రచనలో ఎన్నో కొత్త పదాలు వాడడమే కాదు, ఒకపదం వేస్తే అర్ధం ఎలా మారుతుంది, ఓ పదం తీసేస్తే అర్ధం ఎలా ఉంటుంది వంటి ప్రయోగాలు చేసారని విశ్లేషించారు.'మరందం, మకరందం' వంటి పదాలు అందుకు ఉదాహరణ. సజాతి,విజాతి, విలోమ పదాలతో పదబంధం చేసిన నేర్పరి శ్రీపాద. శివదండకం, సరస్వతి దండకం ఇలా దండకాలను కూడా పొదిగారు.ముఖ్యంగా వసంతరాత్ర వర్ణన, దమయంతి వర్ణన అమోఘం. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఒంటిచేత్తో రామాయణ, మహాభారత, భాగవతాలను అనువదించడమే కాక శతాధిక గ్రంథాలను రాసారు. పద్యం, గద్యం, లలితపదాలు అన్నీ ఆయన రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. స్మార్తం, వేదం, శ్రౌతం ఈ మూడు నేర్చుకున్న గొప్ప పాండిత్యం గల శ్రీపాద వారు ఆయన తండ్రి నిర్వహించిన యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు. ఇంటికి వచ్చినవాళ్ళు చివరకు కోర్టుకేసులు వేసినవాళ్లు వచ్చినాసరే ఆతిధ్యం ఇచ్చి అన్నంపెట్టిన మహోన్నత వ్యక్తిత్వం ఈయనిది.


పత్రికా సంపాదకుడిగా

శ్రీ శాస్త్రులుగారు పత్రికాసంపాదకతచే గొంతకీర్తి సంపాదించుకొనిరి. 'కళావతి' యను ముద్రణాలయమును మదరాసులో నెలకొలిపి పిమ్మట దానిని రాజమహేంద్రవరమునకు మార్చి యవిచ్ఛిన్నముగా దానిని పదియేండ్లు నడపిరి. 'గౌతమి' యను తెనుగుమాసపత్రిక 1908 లో నారంభించిరి. అది యొకయేడు నడచి యాగిపోయింది. వీరి వజ్రాయుధము, మానవసేన, వందేమాతరం అను పత్రికలు నాడు మంచి ప్రచారము లోనికి వచ్చినవి.

ఇతర విశేషాలు

రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మ్యూజియం పార్కులో శ్రీపాద వారి విగ్రహాన్ని గతంలోనే ఏర్పాటుచేశారు.

ఇక శ్రీ రామేన ఆదినారాయణకు శ్రీపాద వారంటే ఎనలేని భక్తిప్రపత్తులు వుండేవి. అందుకే శ్రీ ఆదినారాయణ జీవించివున్నంతకాలం శ్రీపాద వారి జయంతికి మేళతాళాలతో ఊరిగింపు నిర్వహించేవారు. శ్రీపాద వారి విగ్రహానికి పూలమాల వేసి భక్త్యంజలి ఘటించేవారు.

ముఖ్యమైన రచనలు

నాటకాలు

  • కలభాషిణి
  • రాజభక్తి
  • భోజరాజ విజయం
  • శ్రీనాథ కవి రాజీయం

పద్య కావ్యాలు

  • గౌతమీ మహత్యం
  • సత్యనారాయణోపాఖ్యానం
  • గజానన విజయం
  • శ్రీకృష్ణ కవి రాజీయం
  • సావిత్రీ చరిత్రం
  • వేదాద్రి మహాత్మ్యము
  • యజ్ఞవల్క్య చరిత్ర

అచ్చతెలుగు కావ్యాలు

  • బ్రహ్మానందం
  • శాకుంతలం

వచన గ్రంథాలు

  • సంస్కృత కవి జీవితాలు
  • కాళిదాస విలాసము
  • తెనాలి రామకృష్ణ చరిత్రము
  • చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (మొదటి భాగము)
  • చెళ్ళపిళ్ళ వారి చెరలాటము (రెండవ భాగము)

అనువాదాలు

  • శ్రీకృష్ణ భారతం
  • శ్రీకృష్ణ రామాయణం
  • శ్రీకృష్ణ భాగవతం

ఇతర రచనలు

కపిరగిర్ చరిత్రము

  • శ్రీకృష్ణస్వీయచరిత్రము
  • మార్కండేశ్వర మహత్యము (స్థల పురాణము)
  • జగద్గురు చరిత్రము ( శంకర విజయము)
  • సానందసాయుజ్యము
  • ద్వారకా తిరుమల మహత్యము (స్థల పురాణము)
  • గౌతమీ పుష్కర మహత్యము
  • కావేరీ మహత్యము
  • విజయలక్ష్మీ విలాసము
  • కామాక్షీ విజయము
  • ఆంధ్రరాష్ట్ర తృతీయ వార్షికోత్సవము

జీవితచరిత్ర

ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, బహుగ్రంథకర్త, గ్రాంథికవాది శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవిత చరిత్రమిది. కృష్ణమూర్తిశాస్త్రి తన జీవితంలోని వివిధ సంఘటనలను చెప్పగా విని ఆకళించుకుని ప్రభుత్వోన్నతోద్యోగి, సాహిత్యాభిలాషి అనంతపంతుల రామలింగస్వామి ఈ గ్రంథాన్ని రచించారు.[1] ఇది వజ్రాయుధపత్రిక నుండి 1933 సంవత్సరంలో పునర్ముద్రించబడింది.

బిరుదులు

  • మహామహోపాధ్యాయ
  • కవిసార్వభౌమ
  • కవిరాజు
  • కవిబ్రహ్మ
  • ఆంధ్రవ్యాస
  • అభినవ శ్రీనాథ
  • వేద విద్యా విశారద
  • ప్రసన్న వాల్మీకి
  • కళాప్రపూర్ణ

మూలాలు

  1. భారత డిజిటల్ లైబ్రరీలో శ్రీకృష్ణకవి చరిత్రము పుస్తక ప్రతి.