Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476

హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 273: పంక్తి 273:


== చెరువులు ==
== చెరువులు ==
{{main|హైదరాబాదు చెరువులు}}
#[[దుర్గం చెరువు]]
# [[దుర్గం చెరువు]]


== పుస్తక శాలలు ==
== పుస్తక శాలలు ==

13:49, 10 జూన్ 2018 నాటి కూర్పు

  ?హైదరాబాదు
తెలంగాణ • భారతదేశం
ఎడమ పై నుంచి గడియారం ముల్లు తిరిగే దిశలో- చార్మినార్,కొత్త ఆకాశ హర్మ్యాలు, హుస్సైన్ సాగర్, గోల్కొండ కోట, చౌమహల్లా భవనం మరియు బిర్లా మందిరం
ఎడమ పై నుంచి గడియారం ముల్లు తిరిగే దిశలో- చార్మినార్,కొత్త ఆకాశ హర్మ్యాలు, హుస్సైన్ సాగర్, గోల్కొండ కోట, చౌమహల్లా భవనం మరియు బిర్లా మందిరం
ఎడమ పై నుంచి గడియారం ముల్లు తిరిగే దిశలో- చార్మినార్,కొత్త ఆకాశ హర్మ్యాలు, హుస్సైన్ సాగర్, గోల్కొండ కోట, చౌమహల్లా భవనం మరియు బిర్లా మందిరం
అక్షాంశరేఖాంశాలు: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
తీరం
625 కి.మీ² (241 sq mi)
• 536 మీ (1,759 అడుగులు)
• 0 km (0 mi)
వాతావరణం
అవపాతం
ఉష్ణోగ్రత
వేసవికాలం
శీతాకాలం
Aw (Köppen)
• 803 mm (31.6 in)
26.0 °సె (79 °ఫా)
• 30.3 °సె (87 °ఫా)
• 23.5 °సె (74 °ఫా)
దూరాలు
ఢిల్లీ నుండి
ముంబాయి నుండి
చెన్నై నుండి

• 1,499 కి.మీలు S (land)
• 711 కి.మీలు SE (land)
• 688 కి.మీలు N (land)
ప్రాంతం తెలంగాణ
జిల్లా (లు) హైదరాబాదు జిల్లా జిల్లా
జనాభా
జనసాంద్రత
ఆడ-మగ నిష్పత్తి
68,09,970

population_metro = 77,49,334 (2011 నాటికి)
సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "population"/కి.మీ² (సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు/చ.మై) (6th) (2011)
• 1.07

మేయరు బొంతు రామ్మోహన్
కమీషనరు ఎమ్ మహేందర్ రెద్డ్డి
నిర్మించిన సం. 1591
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 500 xxx
• +91-40
• INHYD
• TS-07,TS-08,TS-09,TS-10,TS-11,TS-12,TS-13,TS-14,TS-15
వెబ్‌సైటు: www.ghmc.gov.in/

హైదరాబాదు, తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని, హైదరాబాదు జిల్లా మరియు రంగారెడ్డి జిల్లాల ముఖ్యపట్టణం . దీనిని భాగ్యనగరము అని, గ్రామీణ ప్రజలు "పట్నం" అని కూడా పిలుస్తారు. హైదరాబాదు నగరము సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు, హస్తకళలకు మరి

జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ

యు నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు భారత దేశములో ఐదవ అతిపెద్ద మహానగరము[1]. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.[2]

హైదరాబాదు భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు మరియు సికింద్రాబాద్లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందినాయి. హుస్సేన్‌ సాగర్‌ ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, ట్యాంకు బండ్ వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ 1562లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ సరస్సు. హైదరాబాదుకు మధ్యలో చార్మినారును మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో అప్పటిదాకా విజృంభించిన ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నముగా నిర్మించారు.

చరిత్ర

మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5వ కుతుబ్ షాహీ సుల్తాన్, హైదరాబాదు నగర స్థాపకుడు.

హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు[3]. గోల్కొండలోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్తులు ఇప్పటి తెలంగాణ ప్రాంతాన్ని మరియు కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని భాగాలను పాలించారు.[4] 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతు బ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత చించలం (ఇప్పుడు శాలిబండ ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశా డు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు టావెర్నియర్ నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు.

పేరు పుట్టుక

హైదరాబాదుకు ''భాగ్యనగరం '' అనే పేరు కూడా ఉంది. మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్యనగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది[5]. ఉర్దూ భాషాయుక్తంగా చూస్తే హైదరాబాదు పేరు వెనక మరొక అర్థం ఉంది. హైదర్ (రాజు పేరు) ఎక్కడయితే ఆబాదు (ప్రఖ్యాతి) అయ్యాడో ఆ నగరమే హైదరాబాదు అని ప్రతీతి.

గోల్కొండ కోటపై నుండి హైదరాబాదు నగరం

స్వాతంత్ర్యం అనంతరం

1947లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్యకు ఉపక్రమించింది. సెప్టెంబరు 17, 1948న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు (సెప్టెంబరు 17, 1948 నుండి 1956 నవంబర్ 1వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. 1956 నవంబర్ 1న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం మరియు దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర ప్రదేశ్లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.

వాణిజ్య వ్యవస్థ

హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే ముత్యాల మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ మరియు కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని 1996లో నిర్మించారు[6]. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.[7]

హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు మరియు విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:

హైదరాబాదులోనే స్థాపించబోయే మరికొన్ని ముఖ్యమయిన ప్రాజెక్టుల వివరాలు

  • జీనోము వ్యాలీ :- ఇది ICICI బ్యాంకు మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టు. బయోటెక్నాలజీ కంపెనీలకు ఉపయుక్తంగా ఉండేటట్లు 200 ఎకరాలలో ఒక నాలేడ్జి పార్కును స్థాపించే ప్రయత్నం ఇది.[8]
  • రాజీవ్ గాంధీ నానో టెక్ సిలికాన్ ఇండియా పార్కు :- దీనిని శంషాబాదులో నిర్మింప తలపెట్టిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో నిర్మిస్తున్నారు. దీనిని 350-ఎకరాలలో (మొదటి దశ 50 ఎకరాలు) నిర్మించాలని తలపెట్టారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 250 కోట్ల (మొదటి దశలో 60 కోట్లు)అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని అంచానా వేస్తున్నారు.[9]

రియల్ ఎస్టేట్ రంగము

భారత దేశంలోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం హైటెక్ సిటీని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు సింగపూరులో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని హైటెక్ సిటీ దగ్గర ఐటీ పార్కుని నిర్మించటానికి ఎల్&టితో మరియు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు [10]. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, CESMA International అనే సింగపూరుకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది [11].

సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము

రియల్ ఎస్టేట్

ఐటి రంగము

1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును బెంగుళూరు తరువాత రెండో సిలికాను వ్యాలీగా పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ సత్యం కంప్యూటర్స్ యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. ఐ బి ఎం, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్,డెల్, కాన్బే, జిఇ, సొన్స్ ఈన్దీ, డెలాయిట్, హెచ్ఎస్‌బిసి, జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న ప్రముఖ కంపెనీలలో కొన్ని. ప్రతిష్ఠాత్మకమయిన ఫ్యాబ్ సిటీ ప్రాజెక్టును సాధించి తానే భవిష్యత్తు ఐటి కేంద్ర బిందువునని చాటి చెప్పింది[12].

విద్య

విద్య పరంగా హైదరాబాదు దక్షిణ భారతంలో ప్రముఖ కేంద్రం. 2006 జనగణన ప్రకారం లింగనిష్పత్తి 1.07 [13].

ఇక్కడ రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలు, రెండు డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మరియు ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉన్న పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటి. సాంకేతిక విద్యకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ విశ్వవిద్యాలయం, ఇంటర్నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి విద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము హైదరాబాదుకు విద్యారంగంలో ఖ్యాతి తెచ్చిన సంస్థల్లో కొన్ని. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, నల్సార్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రముఖ సంస్థలెన్నో ఉన్నాయి. దక్షిణ భారతంలోనే అతిపెద్ద ఇస్లామిక్ విశ్వవిద్యాలయం అయిన జామియా నిజామియా కూడా ఇక్కడే ఉంది. కొత్తగా ఐ ఐ టిని నెలకొల్పారు .

పౌర పరిపాలన

నగర పరిపాలన హైదరాబాదు మహా నగరపాలక సంస్థ [14] చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. ప్రస్తుతం బొంతు రామ్మోహన్ మేయరుగా, క్రిష్నబాబు హైదరాబాదు నగరపాలక సంస్థ ప్రస్తుత మునిసిపల్ కమిషనరుగా ఉన్నారు. మునిసిపల్ కమీషనరుగా వ్యవహరిస్తున్నారు. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవిన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.

భారతదేశంలోని ఇతర మహానగరములలో వలెనే, హైదరాబాదు పోలీసుకు పోలీసు కమీషనరుగా ఒక ఐపీఎస్‌ అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. Telangana రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే Telangana ఉన్నత న్యాయస్థానము యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై చిన్న సమస్యల (small causes) న్యాయస్థానము మరియు నేర విచారణ కొరకు ఒక సెషన్స్ న్యాయస్థానము ఉన్నాయి. హైదరాబాదు నగరానికి లోక్‌సభలో రెండు సీట్లు మరియు Telangana రాష్ట్ర శాసనసభలో పదమూడు సీట్లు ఉన్నాయి.

కొత్త మాస్టర్‌ ప్లాన్‌

బృహత్తర ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) ప్రకారం కోర్‌ ఏరియా 172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 2001లో నగర జనాభా 75.86 లక్షలు కాగా... 2031 నాటికి అది 1.84 కోట్లకు పెరుగుతుందనే అంచనాలతో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా 22 ప్రాంతాలకు మల్టిపుల్‌ జోన్లుగా గుర్తింపు. ఐదు ప్రాంతాల్లో అంతస్తుల (మల్టీ లెవెల్‌) పార్కింగ్‌ ఏర్పాటుచేస్తారు. 70 కమర్షియల్‌ రోడ్లను గుర్తించారు. 150 హెరిటేజ్‌ భవనాలను గుర్తించి వాటి పరిరక్షణకు ప్రణాళిక రూపకల్పనచేశారు. 29 కొత్త రోడ్లు వేస్తారు.అంతర్గత రోడ్లను 40 అడుగులకు పరిమితం చేస్తారు. కొత్తగా పది ఫ్త్లెఓవర్ల నిర్మిస్తారు . మూసీనది, హుస్సేన్‌సాగర్‌ నాలాలపై 13 వంతెనలకు ప్రతిపాదన చేశారు.హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలాలకు గ్రీన్‌ బెల్టుగా గుర్తించి, రెండు వైపులా తొమ్మిది మీటర్ల చొప్పున పచ్చదనం పెంపు చేస్తారు.ఆజామాబాద్‌, సనత్‌నగర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలకు వర్క్‌ సెంటర్లుగా గుర్తించారు.జాతీయ రహదారులను 120-150 అడుగుల మేరకు విస్తరిస్తారు.ఏడు చోట్ల రైల్‌ అండర్‌ బ్రిడ్జిలు, కందికల్‌ గేట్‌ వద్ద ఆర్వోబీ, తాడ్‌బండ్‌ వద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. రోడ్ల విస్తరణలో స్థలాన్నిచ్చే వారికి చెల్లించే పరిహారం 100 శాతంగా ఉన్న ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్స్‌ రైట్స్‌ను 150 శాతానికి పెంచుతారు. ఎంజీబీఎస్‌ మినహా మిగిలిన ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను బహుళ అవసరాలకు వినియోగించుకుంటారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, హైటెక్‌ సిటీ ఫ్త్లెఓవర్‌ నిర్మాణం పూర్తిచేస్తారు. హుస్సేన్‌సాగర్‌లోకి రసాయనాలు మోసుకొచ్చే పికెట్‌, కూకట్‌పల్లి నాలాలపై మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటర్‌ రీసైక్లింగ్‌ ద్వారా ఆ నీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తారు. బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో ట్రక్స్‌ పార్కు ఏర్పాటు చేస్తారు. సాగర్‌ హైవేపై మంగల్‌పల్లి వద్ద 20 ఎకరాల్లో మరో ట్రక్‌ పార్కు ఏర్పాటు చేస్తారు.

రవాణా వ్యవస్థ

విమానాశ్రయాలు

ఇప్పుడు హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరుతో 15,మార్చి, 2008తేదీన ప్రారంభించబడింది.[15] ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, మరియు కొన్ని అంతర్జాతీయ గమ్యములకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.[16]. మధ్య ప్రాచ్యము, నైరుతి ఆసియా, దుబాయి, సింగపూరు, మలేషియా మరియు చికాగో, ఫ్రాంక్‌ఫర్ట్ మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు చక్కని విమాన ప్రయాణ సౌకర్యములు ఉన్నాయి. ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమనాశ్రయాలలో స్థానం సంపాదించింది.

ఇక్కడి నుండి సంవత్సరానికి 5 కోట్ల మంది విమానా సౌకర్యాన్ని వినియోగించుకో గలుగుతారు[17]. అంతేకాదు 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు.[18] ప్రస్తుతం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయము మూసివేయబడింది.

రైలు రవాణా

నక్లెస్ రోడ్డులోని ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను

హైదరాబాదుకు జంటనగరమైన సికింద్రాబాదులో దక్షిణమధ్య రైల్వే ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. హైదరాబాదులో మొత్తం మూడు ముఖ్య రైల్వేస్టేషన్లు ఉన్నాయి:

  1. సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
  2. నాంపల్లి రైల్వేస్టేషను (హైదరాబాదు దక్కన్)
  3. కాచిగూడ రైల్వేస్టేషను

హైదరాబాదు నగరంలో 2003లో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థను మొదలు పెట్టారు. ప్రస్తుతం సికింద్రాబాదు - లింగంపల్లి, హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - ఫలక్‌నుమా, లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఫలక్‌నుమా - శంషాబాదు, సికింద్రాబాదు - మనోహరబాదుల మధ్య రైలు బండ్లు తిరిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.నగరం చుట్టూ నిర్మితమవుతున్నఔటర్‌ రింగ్‌రోడ్‌ అవతల చుట్టుపక్కల ప్రాంతాలైన భువనగిరి, షాద్‌నగర్‌, సంగారెడ్డి, శంకర్‌పల్లి వంటి చుట్టుపక్కల పట్టణాలను కలుపుతూ వెళ్లే పెరిఫరల్‌ రింగ్‌ రోడ్ దారిలోనే అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైల్‌ నిర్మాణం చేపడతారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లకు అనుసంధానంగా మెట్రో రైల్‌ లైన్‌ నిర్మిస్తారు. హైటెక్‌సిటీ, మౌలాలీ, మేడ్చల్ ‌, శంషాబాద్‌ లలో నాలుగు పాసింజర్‌ టెర్మినల్స్‌ నిర్మిస్తారు. సరకు రవాణా అవసరాల కోసం బెంగళూరు మార్గంలోని తిమ్మాపూర్‌ వద్ద ఒకటి, నాగులపల్లి-వికారాబాద్‌ మార్గంలో మరొకటి, బీబీనగర్‌-భువనగిరి మార్గంలో ఇంకొకటి కలిపి మూడు ఏర్పాటు చేస్తారు.నాంపల్లి-మలక్ పేట స్టేషను లను కలిపే కొత్తలైను ప్రతిపాదనలో ఉంది. 204 ఎకరాల ప్రైవేటు భూములు సేకరించి, మియాపూర్‌-చైతన్యపురి, సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, తార్నాక-హైటెక్‌సిటీ మార్గాల్లో మొత్తం 71 కిలోమీటర్ల నిడివి కలిగిన మూడు మెట్రో కారిడార్లను నిర్మిస్తారు. అయిదువేల ఇళ్లు, రెండువేల వాణిజ్య సముదాయాలు కనుమరుగౌతాయి.

రోడ్డు రవాణా

హైదరాబాదులోని ఒక ఫై ఓవరు

హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో బెంగళూరు, ముంబాయి, పూణె, నాగ్‌పూర్, విజయవాడ, వరంగల్, గుంటూరు మరియు కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన ఎన్‌హెచ్-7, ఎన్‌హెచ్-9 మరియు ఎన్‌హెచ్-202 నగరంలో నుంచే వెళ్తుంటాయి.

హైదరాబాదు నగరం లోపలకూడా అత్భుతమైన రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు 3-లేన్ సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను ఔటర్ రింగు రోడ్డు నిర్మాణము తల పెట్టారు. ఇందుకు మొదటి దశకు 500 కోట్లు, మలిదశకు 2500 కోట్లతో ప్రణాలికలు కూడా సిద్దంచేశారు[19]. మొత్తం 160కీమీల పొడవు ఉండే ఈ రింగురోడ్డు ఇంకో 4-5 సంవత్సరాలలో పూర్తవుతుందని ఒక అంచనా.

హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ [20], లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న మహత్మా గాంధీ బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.

భౌగోళికము

హైదరాబాదు దాదాపు Telangana రాష్ట్రము మధ్యలో ప్రాంతములో ఉంది. ఇది దక్కను పీఠభూమిపై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).

నగర జనాభా

2001 జనాభా లెక్కల ప్రకారము నగర జనాభా 36.9 లక్షలుగా అంచనా వేయబడింది. కానీ మహానగర ప్రాంతము యొక్క జనాభా 63.9 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. హైదరాబాదులో ముస్లిం జనాభా 40%గా ఉంది. తెలుగు, ఉర్దూ, హిందీ ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో ఇంగ్లీషు ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు.

1901లో నగర జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే. 1951 నాటికి 10లక్షలకు పెరిగి రెట్టింపు అయింది. 1971 నాటికి 16 లక్షలకు, 1981 నాటికి 22 లక్షలకు, 1991 నాటికి 31 లక్షలకు చేరింది.[21]

ప్రముఖులు

సంస్కృతి

ఛార్మినార్ నుండి ఒక దృశ్యం

హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. సిక్కులు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు తెలుగు, ముస్లిములు ఉర్దూ మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు

ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. http://www.happynewyearmessage.org/ ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.

రుచులు

హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. బిరియానీ, బగారాబైంగన్ (గుత్తి వంకాయ), ఖుబానీ కా మీఠా, డబల్ కా మీఠా, హలీమ్, ఇరానీ చాయ్ మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి మధ్య ప్రాచ్యము అందులో ప్రత్యేకముగా దుబాయి వెళ్ళడము వలన, ఇప్పుడు హలీం ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్‌ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌)ని సొంతం చేసుకొంది.

బావర్చీ, సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్, వివిధ ప్రదేశాల్లో ఉన్న హైదరాబాద్ హౌస్లు బిరియానీకి పెట్టింది పేరు. ఏ కెఫేలకి వెళ్ళినా ఆలూ సమోసా ఇరానీ చాయ్లు జంటనగరాల్లో లభిస్తాయి. కోఠి లోని గోకుల్ ఛాట్ భండార్ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది

మీడియా

హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి. Sakshi tv, Etv, tv 9,NTV,ABN,TV5,HM TV,T NEWS...

ఎఫ్‌ఎం రేడియో

బొల్ హయదరాబాద్ 90.4 MHz రేడియో సిటి 91.1 MHz బిగ్ ఎఫ్ ఎమ్ 92.7 MHz రెడ్ ఎఫ్.ఎమ్ 93.5 MHz రేడియో మిర్ఛి 98.3 MHz రెయిన్బో 101.9 MHz వివిధ భారతి 102.80 MHz జ్ఞాన్ వాణి 105.6 MHz

ప్రస్తుత సమస్యలు

తాగునీటి సమస్య హైదరాబాదు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల్లో ఒకటి. హిమాయత్ సాగర్, సింగూరు జలాశయం, కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. కృష్ణా నది నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

దక్కను పీఠభూమి పైనున్న హైదరాబాదు పెద్ద ఎర్రరాళ్ళతో కూడుకొని ఉంది. నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఈ రాళ్ళను పగలగొట్టడం జరుగుతూ ఉంది. ఇది పర్యావరణంపై ప్రభావం చూపుతుండడంతో శిలా సంరక్షణ సమితి పేరుతో ఏర్పడిన ఒక సంస్థ రాళ్ళను సంరక్షించే పనికి నడుం కట్టింది.

మతఘర్షణలకు, ఉద్రిక్తతలకు హైదరాబాదు తరచూ గురవుతూ ఉంటుంది. హిందూ, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఘర్షణలకు అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా ఘర్షణలను చాలావరకు నివారించగలిగినా ఉద్రిక్తతలు మాత్రం అంతగా తగ్గుముఖం పట్టలేదు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ తీవ్రవాదుల కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చాయి.

మిగతా నగరాలలో లాగానే హైదరాబాదుకి కూడా ట్రాఫిక్ సమస్య తప్పట్లేదు. MMTS (మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం) రైళ్ళు అన్ని ప్రదేశాలని తాకకపోవటంతో వీటి ఉపయోగం కూడా తక్కువనే ఉంది. ట్రాఫిక్ సమస్యని తగ్గించటంలో వీటి పాత్ర అంతంత మాత్రమే.

ఆకర్షణలు

  • టాంక్ బండ్ హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలను కలుపుతున్న మార్గము
  • లుంబిని పార్కు-హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది హుస్సేన్ సాగర్ ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
  • పబ్లిక్ గార్డెన్స్ - శాసనసభ, జూబిలీ హాలు వంటీ కట్టడాలతో కూడిన చక్కటి వనం.
  • లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్- ఈ యస్ ఐ వద్ద : లక్ష్మీనారాయణ యాదవ్ పార్కు హైదరాబాదు లోని ప్రముఖ పార్కుల్లో ఒకటి. ఇది ESI బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • చార్మినారు- ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదు చిహ్నం.
  • లాడ్ బజార్- చార్మినారుకు పశ్చిమాన ఉంది. గాజులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమిది.
  • మక్కా మసీదు - చార్మినారుకు నైరుతిలో ఉన్న రాతి కట్టడం.
  • గోల్కొండ కోట - భారత్‌లో ప్రసిద్ధి చెందిన కోటల్లో ఇది ఒకటి.
  • హుస్సేన్‌ సాగర్‌ - హైదరాబాదు, సికిందరాబాదులను వేరుచేస్తున్న మానవనిర్మిత కాసారం.
  • సాలార్‌జంగ్ మ్యూజియం- పురాతన వస్తువులతో కూడిన పెద్ద సంగ్రహాలయమిది.
  • బిర్లా ప్లానిటేరియం - నగర మద్యంలో నౌబత్ పహాడ్ గుట్టపై ఉంది.
  • అష్టలక్ష్మి దేవాలయం - దిల్ షుక్ నగర్ దగ్గరి వాసవి కాలనీలో ఉంది.
  • ఓషన్ పార్కు,మౌంట్ ఓపేరా వంటి థీమ్ పార్కులు ఉన్నాయి.
  • రామోజీ ఫిల్మ్ సిటీ
  • ఇస్కాన్ దేవాలయం-ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.[22]
  • శిల్పారామం
  • కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్
  • రేమండ్స్‌ స్తూపం

ప్రముఖ వాణిజ్య ప్రదేశాలు

సెల్ ఫోన్ల కొనడం, రిపేర్లు - జగదీష్ మార్కెట్ (అబిడ్స్)

కంప్యూటర్లూ, లాప్ టాప్, సాఫ్ట్ వేర్లు - చెన్నైట్రేడింగ్ సెంటర్ (సికిందరాబాద్),ఆదిత్య ట్రేడ్ సెంటర్, అమీర్ పేట్

అకడమిక్ & కాంపిటేటివ్ పుస్తకాలు -కోటి విమెన్స్ కాలేజీ (హైదరాబాద్), రైల్వే స్టేషన్ రోడ్ సికిందరాబాద్

బట్టల క్లాత్ మెటీరియల్ - మదీనా (హైదరాబాద్), టొబాకో బజార్ (సికిందరాబాద్)

రెడీమేడ్ బట్టల (జీన్స్ & షర్ట్స్) - నారాయణ్ గూడ "X" రోడ్, కాచిగూడ, తిరుమల్ గిరి, కార్ఖానా

ఫర్నిచర్ -నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్

హోల్ సేల్ కిరాణా సామగ్రి, ఆఫీసు స్టేషనరి, గిఫ్ట్ ఐటెమ్, స్టీల్ సామగ్రి -అఫ్జల్ గంజ్, ఒస్మాన్ గంజ్, బేగమ్ బజార్

ఎలెక్ట్రానిక్ సామాను -గుజరాతీ గల్లీ (కోఠి)

బంగారం, నగల దుకాణాలు - అబిడ్స్, ఛార్మినార్, బేగమ్ బజార్, బషీర్ బాగ్, పంజాగుట్ట

నట్లు, బొల్టులు, స్క్రూలు., ఇంజనీరింగ్ సామానుకు - రాణిగంజ్

మోటార్ పంపులు -జాంబగ్ (కోఠి), రాణిగంజ్

కరెంట్ సామానులకి - ట్రూప్ బజార్ (అబిడ్స్), రాణిగంజ్

చెప్పులకి -ఛార్మినార్, అబిడ్స్

ప్రింటింగ్ కి - లకిడీకపుల్ (రెడ్ హిల్ల్స్, ఖైరతాబాద్), గౌలిగూడ

పెండ్లి పత్రికలకి - గౌలిగూడ, చత్త బజార్ (ఛార్మినార్), ఆర్.పి. రోడ్ (సికిందరాబాద్)

చిత్రమాల

షాపింగ్ మాల్ లు

  • హైదరాబాద్ సెంట్రల్ - పంజగుట్ట
  • షాపర్స్ స్టాప్ - బేగంపేట
  • సిటీ సెంట్రల్ - అబీడ్స్ మరియు బంజారా హిల్స్
  • బ్రాండ్ ఫ్యాక్టరీ - అబీడ్స్ మరియు బంజారా హిల్స్
  • జీవీకె మాల్ - బంజారా హిల్స్
  • ఇనార్బిట్ - విబీఐట పార్కు

మల్టీప్లెక్సు థియేటర్లు

హైదరాబాదులో మొత్తం ఆరు మల్టీప్లెక్సులు ఉన్నాయి.

  • ఐనోక్స్ - జివికె వన్ మాల్, బంజారా హిల్స్, రోడ్డు నెం 8
  • సినిమ్యాక్స్ - ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా, బంజారా హిల్స్, రోడ్డు నెం 3
  • బిగ్ సినిమాస్ - బిగ్ బజార్ కాంప్లెక్సు, అమీర్ పేట
  • పి వి ఆర్ - సెంట్రల్ మాల్, పంజగుట్ట
  • ప్రసాద్స్ ఐమ్యాక్స్ - ఎన్ టీ ఆర్ గార్డెన్స్ ప్రక్కన, ఎన్ టీ ఆర్ మార్గ్
  • సినీ ప్లానెట్ - కొంపల్లి

జి వి కె మాల్ - బంజారా హిల్స్

  • సుజనా ఫోరమ్ మాల్ కెపిహెబి

చెరువులు

  1. దుర్గం చెరువు

పుస్తక శాలలు

చూడండి

గుణాంకాలు

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06
  1. "World Gazetteer:India - largest cities (per geographical entity)". Archived from the original on 2012-12-04. నుండి 28/10/2006న సేకరించబడినది.
  2. ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా నుండి 28/10/2006 న సేకరించబడినది.
  3. హైదరాబాదు అధికారిక వెబ్‌సైటు నుండి హైదరాబాదు చరిత్ర గురించి 29/10/2000న సేకరించబడినది.
  4. ఆర్.ప్లంకెట్, టి.కాన్నన్, పి.డేవిస్, పి.గ్రీన్‌వే మరియు పి.హార్డింగ్‌లు, (2001)లో రాసిన Lonely Planet South India అనే పుస్తకములోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: Lonely Planet
  5. హైదరాబాదుకు ఆ పేరు ఎలా వచ్చింది ఇండియా ట్రావెల్ టైంస్ సైటు నుండి మే 12, 2007న సేకరించబడినది
  6. రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు నుండి 28/10/2006న సేకరించబడినది.
  7. గిన్నీసు బుక్కులో అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.
  8. జీనోము వ్యాలీ నుండి 28/10/2006 న సేకరించబడినది.
  9. ఏపి ప్రభుత్వ సైటు నుండి 28/10/2006న సేకరించబడినది.
  10. ఎసెండాస్ ఇంఫోసిటీ వెబ్‌సైటు నుండి 28/10/2006న సేకరించబడినది.
  11. TELANGANA గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైటు లో సంస్కృతి గృహసముదాయం గురించిన వివరణ, 28/10/2006న సేకరించబడినది.
  12. ఎకనామిక్ టైంస్ లో ఫ్యాబ్ సిటీ ఒప్పందం గురించి 10/2/2006న వచ్చిన వార్త, 28/10/2006న సేకరించబడినది.
  13. "Enforcement of PNDT Act to be made stringent". హిందూ పత్రిక. మార్చి 13 2006. Retrieved 2007-05-05. {{cite web}}: Check date values in: |date= (help)
  14. హైదరాబాదు నగరపాలకసంస్థ జాలస్థలం
  15. ది హిందూ ఆంగ్ల దినపత్రిక నుండి వివరాలు రాజీవ్ గాంధీ విమానాశ్రయ ప్రారంభం, 20/06/2008న సేకరించబడినది.
  16. భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది.
  17. శంషాబాద్ లో నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వివారాలు 29/10/2006న సేకరించబడినది.
  18. శంషాబాద్ లో నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సౌకర్యాలు 29/10/2006న సేకరించబడినది.
  19. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు 29/10/2006న సేకరించబడినది.
  20. Telangana రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్
  21. Handbook of Statistics, Hyderabad Dist, 1997-98, published by CPO Hyderabad, Page No 31
  22. http://www.iskcon-hyderabad.com/directions.html

బయటి లింకులు