కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44: పంక్తి 44:
== రచనా వ్యాసాంగం ==
== రచనా వ్యాసాంగం ==


కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో [[తెనాలి]] బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో [[యద్దనపూడి సులోచనారాణి]] తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=584657|title=ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం}}</ref>
కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో [[తెనాలి]] బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో [[యద్దనపూడి సులోచనారాణి]] తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.<ref>{{Cite web|url=http://www.andhrajyothy.com/artical?SID=584657|title=ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం}}</ref>

సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంధాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ [[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని నాగేశ్వర రావు]]<nowiki/>కు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే [[సత్య సాయి బాబా|పుట్టపర్తి సాయిబాబా]] మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/sociologist-doctor/|title=సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-06|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>


==రచనలు ==
==రచనలు ==

17:07, 10 జూన్ 2018 నాటి కూర్పు

డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి
సత్య సాయి బాబా తో కె.వి.కృష్ణకుమారి
జననంకృష్ణ కుమారి
India తెనాలి, గుంటూరు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుకృష్ణక్క
వృత్తిడాక్టర్
రచయిత్రి
మతంహిందూ
తండ్రిడాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు
తల్లిసత్యవతి

కె. వి. కృష్ణకుమారి తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు.[1] ఆమె కృష్ణక్క గా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తున్నది.

జీవిత విశేషాలు

ఆమె తెనాలి లో 1947లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.

మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యాయి.[2]

రచనా వ్యాసాంగం

కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో యద్దనపూడి సులోచనారాణి తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.[3]

సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంధాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావుకు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.[4]

రచనలు

  • కర్మయోగి [5]
  • భద్రాకళ్యాణం [6]
  • మనిషి లో మనీషి డాక్టర్ అక్కినేని[7]
  • మంచుపూలు
  • శ్రీ కృష్ణామృతం
  • సశేషం[8]

పురస్కారాలు

  1. 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
  2. 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
  3. 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం
  4. 1994 లో మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం
  5. 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం
  6. 1997 లొ భరతముని పురస్కారం
  7. 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
  8. 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
  9. 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
  10. విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
  11. 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
  12. డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
  13. 2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.[9]

వనరులు

మూలాలు

  1. "Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com". healcon.com. Retrieved 2018-06-10.
  2. "సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం".
  3. "ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం".
  4. "సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-06. Retrieved 2018-06-10.
  5. "Karmayogi,K V Krishna Kumari - online Telugu Books". www.logili.com. Retrieved 2018-06-10.
  6. Prof. V. Viswanadham, Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari - reading by Prof. V. Viswanadham Part-1, retrieved 2018-06-10
  7. "Manishilo Maneeshi Doctor Akkineni - మనిషిలో మనీషి డాక్టర్‌ అక్కినేని".
  8. "Sasesham - సశేషం".
  9. ""కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-22. Retrieved 2018-06-10.

బయటి లింకులు