కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43: పంక్తి 43:


==రచనలు==
==రచనలు==
* కాళ్ళకూరి నారాయణరావు [[1919]] లో రాసిన " పద్మవ్యూహం" నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.

===వరవిక్రయం===
===వరవిక్రయం===
{{main|వరవిక్రయం (నాటకం)}}
{{main|వరవిక్రయం (నాటకం)}}
పంక్తి 66: పంక్తి 67:
== మరణం ==
== మరణం ==
ఈయన [[1927]], [[జూన్ 27]]న మరణించాడు.
ఈయన [[1927]], [[జూన్ 27]]న మరణించాడు.

* కాళ్ళకూరి నారాయణరావు [[1919]] లో రాసిన " పద్మవ్యూహం" నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.


==శిష్యులు,అభిమానులు==
==శిష్యులు,అభిమానులు==

07:26, 29 జూన్ 2018 నాటి కూర్పు

కాళ్ళకూరి నారాయణరావు
కాళ్ళకూరి నారాయణరావు
జననంకాళ్ళకూరి నారాయణరావు
ఏప్రిల్ 28, 1871
తూర్పగోదావరి జిల్లాలోని కాకినాడ మత్స్యపురి గ్రామం
మరణంజూన్ 27, 1927
ఇతర పేర్లు‘మహాకవి’
వృత్తిప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు
ప్రసిద్ధినాటకకర్త, సంఘ సంస్కర్త.
తండ్రిబంగారురాజు
తల్లిఅన్నపూర్ణమ్మ

కాళ్ళకూరి నారాయణరావు (ఏప్రిల్ 28, 1871 - జూన్ 27, 1927) ప్రముఖ నాటకకర్త, సంఘసంస్కర్త, ప్రథమాంధ్ర ప్రచురణ కర్త, జాతీయవాది, ఛాయా గ్రహణ వాద్యాదురంధరుడు, ‘మహాకవి’ బిరుదాంకితుడు.

జననం

ఈయన తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ మత్స్యపురి గ్రామంలో 1871, ఏప్రిల్ 28 న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో చింతామణి (1921), వర విక్రయం (1923) మరియు మధుసేవ (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. తెలుగు సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.

రచనలు

  • కాళ్ళకూరి నారాయణరావు 1919 లో రాసిన " పద్మవ్యూహం" నాటకంలో పద్యాలతో ఉన్న సంభాషణలను పొందుపరిచారు.

వరవిక్రయం

వరకట్నం దురాచారాన్ని నిరసిస్తూ కాళ్లకూరి వారు రచించిన నాటకం. ఎంతో ప్రాచుర్యమున్న నాటకం. ఇది లీలాశుకుని చరిత్ర. ఆనాటి కాకినాడ వేశ్యల గుట్టుమట్లు ఆ నాటకంలో బట్టబయలు చేశాడు. ఈ నాటకం ఎన్నో సార్లు ప్రదర్శిత మైంది. ఆనాడు చింతామణిని ప్రదర్శించని నాటక పమాజమంటూలేదు. ఈ నాటకంలోని పద్యాలు ప్రజల నోటిలో తాండవించాయి. సంస్కార భారతి వారు ఈ నాటకాన్ని ఇటీవల కాలం వరకు ప్రదర్శించారు.

చింతామణి

చింతామణి నాటకం వేశ్యావృత్తికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న కాలంలో రాయబడింది. వేశ్యావృత్తిని నిరసిస్తూ కాళ్లకూరి వారి రచన ఈ నాటకం. ఈ నాటకం బహుళ ప్రాచుర్యం పొందింది. నేటికీ విజయంవంతంగా ప్రదర్శితమవుతోంది.

మధుసేవ

మద్యపానం వలన కలిగే దుష్పరిణామాలను ఎత్తి చూపిన నాటకం.[1]

చిత్రాభ్యుదయం

ఇది రాజరాజ నరేంద్రుని కుమారుడని పేర్కొనే సారంగధరునికీ మరియు చిత్రాంగికీ నడుమ జరిగిన కథ.[2]

ఇతర రచనలు

పద్మవ్యూహం (1919), సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.

మరణం

ఈయన 1927, జూన్ 27న మరణించాడు.

శిష్యులు,అభిమానులు

  • గుమ్మడి గోపాలకృష్ణ
  • డాక్టర్ కొత్తె వెంకటాచారి గారు (నారాయణరావు గారి నాటకాల మీద పి హెచ్ డీ చేశారు)

మూలాలు

బయటి లింకులు

  1. నారాయణరావు, కాళ్ళకూరి. మధుసేవ. Retrieved 13 January 2015.
  2. నారాయణరావు, కాళ్ళకూరి. చిత్రాభ్యుదయము.[dead link]