మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎కాన్పూరు: ++లక్నో, ఝాన్సీ విభాగాలు
→‎తిరుగుబాటు తదనంతర పరిణామాలు: ++బీహార్, ఇండోర్ విభాగాలు
పంక్తి 175: పంక్తి 175:


=== లక్నో ===
=== లక్నో ===
[[File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|ఎడమ|thumb|The interior of the Secundra Bagh, several months after its storming during the second relief of Lucknow. Albumen silver print by [./https://en.wikipedia.org/wiki/Felice_Beato Felice Beato], 1858]]
[[File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|link=https://en.wikipedia.org/wiki/File:Image-Secundra_Bagh_after_Indian_Mutiny_higher_res.jpg|ఎడమ|thumb|రెండవ లక్నో విముక్తి యుద్ధంలో దెబ్బతిన్న సికంద్రా బాగ్]]
మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధ్ (ఔధ్) లో తిరుగుబాటు తలెత్తింది. బ్రిటిషు వారు దాన్ని ఆక్రమించుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయింది. తిరుగుబాటుదార్లు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు. లోపల సిపాయీలతో కలిపి మొత్తం 1700 మంది ఉన్నారు. తిరుగుబాటుదార్లు శతఘ్ని దాడులు, తుపాకి కాల్పులు జరిపారు. బ్రిటిషు కమిషానరు సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు. బాంబులతో గోడలను పేల్చి, సొరంగం తవ్వీ లోపలికి వెళ్ళేందుకు తిరుగుబాటుదార్లు ప్రయత్నించారు.<ref name="HCRE2">{{cite book|last=Porter|first=Maj Gen Whitworth|title=History of the Corps of Royal Engineers Vol I|year=1889|publisher=The Institution of Royal Engineers|location=Chatham}}</ref>{{rp|486}} 90 రోజుల ముట్టడి తరువాత, రెసిడెన్సీ లోపల 300 మంది సిపాయీలు, 350 మంది బ్రిటిషు సైనికులు, 550 మంది అసైనికులూ మిగిలారు.
మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధ్ (ఔధ్) లో తిరుగుబాటు తలెత్తింది. బ్రిటిషు వారు దాన్ని ఆక్రమించుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయింది. తిరుగుబాటుదార్లు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు. లోపల సిపాయీలతో కలిపి మొత్తం 1700 మంది ఉన్నారు. తిరుగుబాటుదార్లు శతఘ్ని దాడులు, తుపాకి కాల్పులు జరిపారు. బ్రిటిషు కమిషానరు సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు. బాంబులతో గోడలను పేల్చి, సొరంగం తవ్వీ లోపలికి వెళ్ళేందుకు తిరుగుబాటుదార్లు ప్రయత్నించారు.<ref name="HCRE2">{{cite book|last=Porter|first=Maj Gen Whitworth|title=History of the Corps of Royal Engineers Vol I|year=1889|publisher=The Institution of Royal Engineers|location=Chatham}}</ref>{{rp|486}} 90 రోజుల ముట్టడి తరువాత, రెసిడెన్సీ లోపల 300 మంది సిపాయీలు, 350 మంది బ్రిటిషు సైనికులు, 550 మంది అసైనికులూ మిగిలారు.


ముట్టడిలో ఉన్న బ్రిటిషు వారికి సహాయకంగా ఉండేందుకు సెప్టెంబరు 25 న సర్ హెన్రీ హావెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూరు నుండి లక్నోకు బయలుదేరింది. దారి పొడుగునా వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదార్లను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూరు చేరుకున్నారు. ఈ చిన్న దళానికి తిరుగుబాటుదార్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోట లోని ద్ళంతో చేరిపోయారు. అక్టోబరులో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్‌బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదార్లను ఓడించింది. ఆ తరువాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిషు వారందరినీ ముందు ఆలంబాగ్‌కు, ఆ తరువాత కాన్పూరుకూ తరలించారు. ఈ క్రమంలో ఆలంబాగ్‌లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు.
ముట్టడిలో ఉన్న బ్రిటిషు వారికి సహాయకంగా ఉండేందుకు సెప్టెంబరు 25 న సర్ హెన్రీ హావెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూరు నుండి లక్నోకు బయలుదేరింది. దారి పొడుగునా వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదార్లను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూరు చేరుకున్నారు. ఈ చిన్న దళానికి తిరుగుబాటుదార్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోట లోని ద్ళంతో చేరిపోయారు. అక్టోబరులో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్‌బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదార్లను ఓడించింది. ఆ తరువాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిషు వారందరినీ ముందు ఆలంబాగ్‌కు, ఆ తరువాత కాన్పూరుకూ తరలించారు. ఈ క్రమంలో ఆలంబాగ్‌లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు.


అవధ్‌లో తిరుగుబాటును అణచేందుకు 1858 మార్చిలో క్యాంప్‌బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు. ఆలంబాగ్‌లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు. అతడికి సహయంగా జంగ్ బహదూర్ రాణా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటుంది.<ref>{{Harvnb|Hibbert|1980|pp=358, 428}}</ref> మార్చి 21 న జరిగిన చివరి యుద్ధంతో క్యాంప్‌బెల్ తిరుగుబాటుదార్లను పారదోలాడు.<ref name="HCRE2" />{{rp|491}}
అవధ్‌లో తిరుగుబాటును అణచేందుకు 1858 మార్చిలో క్యాంప్‌బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు. ఆలంబాగ్‌లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు. అతడికి సహయంగా జంగ్ బహదూర్ రాణా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటుంది.<ref>{{Harvnb|Hibbert|1980|pp=358, 428}}</ref> మార్చి 21 న జరిగిన చివరి యుద్ధంతో క్యాంప్‌బెల్ తిరుగుబాటుదార్లను పారదోలాడు.<ref name="HCRE2" />{{rp|491}} దీన్ని రెండవ


=== ఝాన్సీ ===
=== ఝాన్సీ ===
పంక్తి 190: పంక్తి 190:


ఝాన్సీ, కల్పీ ల నుండి పారిపోయిన లక్ష్మీబాయి, కొందరు మరాఠా వీరులూ కలిసి, సిందియాలను ఓడించి గ్వాలియరును స్వాధీనం చేసుకున్నారు. సింధియాలు బ్రిటిషు వారికి సన్నిహితులు. ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో గానీ, సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియరుపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున, జూన్ 17 న, రాణి లక్ష్మీబాయి మారణించింది. తరువాతి మూడు రోజుల్లో కంపెనీ సిన్యం గ్వాలియరును తిరిగి వశపరచుకుంది. ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.<ref>Lachmi Bai Rani of Jhansi, the Jeanne d'Arc of India (1901), White, Michael (Michael Alfred Edwin), 1866, New York: J.F. Taylor & Company, 1901.</ref>
ఝాన్సీ, కల్పీ ల నుండి పారిపోయిన లక్ష్మీబాయి, కొందరు మరాఠా వీరులూ కలిసి, సిందియాలను ఓడించి గ్వాలియరును స్వాధీనం చేసుకున్నారు. సింధియాలు బ్రిటిషు వారికి సన్నిహితులు. ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో గానీ, సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియరుపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున, జూన్ 17 న, రాణి లక్ష్మీబాయి మారణించింది. తరువాతి మూడు రోజుల్లో కంపెనీ సిన్యం గ్వాలియరును తిరిగి వశపరచుకుంది. ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.<ref>Lachmi Bai Rani of Jhansi, the Jeanne d'Arc of India (1901), White, Michael (Michael Alfred Edwin), 1866, New York: J.F. Taylor & Company, 1901.</ref>

==== ఇండోర్ ====
ఇండోర్‌లో ఉన్న నాటి కంపెనీ రెసిడెంటు కల్నల్ హెన్రో మార్లన్ డ్యురండ్ ఇండోర్లో తిరుగుబాటు వస్తుందనడాన్ని కొట్టిపారేసాడు.<ref>{{cite web|url=http://www.hyperhistory.com/online_n2/people_n2/women_n2/holkar1.html|title=Biographies|publisher=}}</ref> అయితే, జూలై 1 న హోల్కారు సైన్యంలోని సిపాయీలు తిరుగుబాటు చేసి, బ్రిటిషు ఆఫీసర్లతో కూడిన భోపాల్ దళంపై కాల్పులు జరిపారు. వాళ్ళను ఎదుర్కొనేందుకు కల్నల్ ట్రావెర్స్ ముందుకు పోగా, అతన్ని అనుసరించేందుకు భోపాల్ పదాఅతి దళం తిరస్కరించింది. భోపాల్ శతఘ్ని దళం కూడా తిరస్కరించి, తమ తుపాకులను యూరపియన్ల మీద ఎక్కుపెట్టింది. ఇక చేసేదేమీ లేక, డ్యురండ్ యూరపియన్లందరినీ సమీకరించి, తప్పించుకున్నాడు. ఈలోగా 39 మంది యూరపియన్లను చంపేసారు.<ref>{{Citation|url=https://books.google.com/?id=AIABAAAAQAAJ&pg=PA346&lpg=PA346#PPA333,M1|title=A history of the Sepoy war in India, 1857–1858 – John William Kaye (sir.) – Google Books|date=1876|accessdate=17 September 2012|last1=Kaye|first1=Sir John William}}</ref>

=== బీహార్ ===
బీహారులో తిరుగుబాటు ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతం లోనే ఎక్కువగా జరిగింది. అయితే, గయ జిలాలో కూడా దోపిడీలు, దౌర్జన్యాలూ జరిగాయి.<ref name="Singh1966">{{cite journal|title=Gaya in 1857-58|author=S. B. Singh|journal=Proceedings of the Indian History Congress|volume=28|year=1966|pages=379–387|jstor=44140459}}</ref> తిరుగుబాట్లలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు జగదీష్‌పూర్ జమీందారు, 80ఏళ్ళ కన్వర్ సింగ్. అతడి జమీని బ్రిటిషు వారు జప్తు చేసే పనిలో ఉన్నారు. అతడు తిరుగబాటును ఎగదోసి, దానికి నాయకత్వం వహించాడు.<ref>{{Citation|url=https://books.google.com/?id=hcVGAAAAIAAJ&pg=PA76#PPA76,M1|title=The revolt in Hindustan 1857–59 – Evelyn Wood, Sir Evelyn i. e. Henry Evelyn Wood – Google Boeken|date=1908|accessdate=17 September 2012|last1=Wood|first1=Sir Evelyn}}</ref> అతడి తమ్ముడు, అతడి సేనాధ్యక్షుడూ ఇందుకు సహకరించారు.<ref>{{cite journal|title=Kunwar Singh's Failure in 1857|author=S. Purushottam Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=44|year=1983|pages=360–369|jstor=44139859}}</ref>

జూలై 25 న దీనాపూర్ సైనిక స్థావరంలో తిరుగుబాటు రాజుకుంది. తిరుగుబాటుదార్లు అర్రా నగరం వైపు సాగిపోయారు. అక్కడ వారితో కన్వర్ సింగ్, అతడి సైన్యం కలిసింది.<ref name="Boyle1858">{{cite book|last1=Boyle|first1=Robert Vicars|title=Indian Mutiny. Brief Narrative of the Defence of the Arrah Garrison.|date=1858|publisher=W. Thacker & Co.|location=London}}</ref> బోయిల్ అనే బ్రిటిషు రైల్వే ఇంజనీరు అలాంటి దాడుల నుండి రక్షణగా ఉండేందుకు ముందుచూపుతో తన నివాసంలో ఒక భవంతిని నిర్మించుకుని ఉన్నాడు.<ref>''John Sergeant's Tracks of Empire'', BBC4 programme.</ref> తిరుగుబాటుదార్లు అర్రాకు చేరుకునేటప్పటికి యూరపియన్లందరూ బోయిల్ ఇంటిలో తలదాచుకున్నారు.<ref name="Halls1860">{{cite book|last1=Halls|first1=John James|title=Two months in Arrah in 1857|date=1860|publisher=Longman, Green, Longman and Roberts|location=London}}</ref> తిరుగుబాటుదార్లు ఆ ఇంటిని ముట్టడించారు. రెండు మూడు వేల మంది తిరుగుబాటుదార్లు జరిపే ముట్టడి ఎదుర్కునేందుకు వారివద్ద 50 మంది విధేయ సిపాయీలు ఉన్నారు.<ref name="Gazette22050">{{cite news|title=Supplement to The London Gazette, October 13, 1857|url=https://www.thegazette.co.uk/London/issue/22050/page/3422|accessdate=18 July 2016|issue=22050|pages=3418–3422|date=13 October 1857}}</ref>

వీళ్ళను రక్షించేందుకు దీనాపూర్ నుండి 400 మందిని అర్రాకు పంపించారు. ఈ దళాన్ని దారిలోనే తిరుగుబాటుదార్లు అడ్డుకుని వెనక్కు పారదోలారు. బక్సార్ వైపు నదిలో ప్రయాణం చేస్తున్న బ్రిటిషు దళం ఒకటి బక్సార్ చేరుకోగానే అర్రా ముట్టడి వార్త తెలిసింది. ఆ దళ నాయకుడు మేజర్ విన్సెంట్ ఐర్ వెంటనే దళాన్ని ఆయుధాలనూ పడవల్లోంచి దింపి అర్రా వైపు సాగిపోయాడు. అటు వెళ్ళవద్దని అతడికి ఆదేశాలు వచ్చినప్పటికీ అతడు పట్టించుకోలేదు.<ref name="Sieveking1910">{{cite book|last1=Sieveking|first1=Isabel Giberne|title=A turning point in the Indian mutiny|date=1910|publisher=David Nutt|location=London}}</ref> ఆగస్టు 2 న అర్రాకు 9.7 కి.మీ. దూరాన ఉండగా తిరుగుబాటుదార్లు వాళ్ళపై మెరుపుదాడి చేసారు. అప్పుడూ జరిగిన పోరులో బ్రిటిషు దళం గెలిచింది.<ref name="Gazette22050" /> ఆగస్టు 3 న మేజర్ ఐర్ తన దళంతో సహా ముట్టడి ఇంటిని చేరుకుని ముట్టడిని తొలగించాడు.<ref>{{Citation|url=https://books.google.com/?id=pryl7f3SZ14C&printsec=frontcover#PPA181,M1|title=The Sepoy Revolt. A Critical Narrative – Google Books|date=|isbn=9781402173066|accessdate=17 September 2012}}</ref><ref>{{Citation|url=https://books.google.com/?id=Ty8OAAAAQAAJ&pg=PA449#PPA450,M1|title=John Cassell's Illustrated history of England – William Howitt, John Cassell – Google Boeken|date=1864|accessdate=17 September 2012|last1=Smith|first1=John Frederick}}</ref>

మరికొన్ని దళాలను పొందాక, మేజర్ ఐర్ కన్వర్ సింగ్‌ను వెంబడించి జగదీష్‌పూర్ చేరుకున్నాడు. అప్పటికే కన్వర్ సింగ్ తప్పించుకున్నాడు. ఐర్ సింగ్ ఇంటిని, అతడి సోదరుల ఇళ్ళనూ ధ్వంసం చేసాడు.<ref name="Gazette22050" />

గయ, నవాడా, జెహానాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ ఖాన్, గులామ్ ఆలీ ఖాన్, ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి.<ref>{{cite journal|title=The Revolt of 1857: 'Real Heroes of Bihar Who Have Been Dropped From Memory|author=Sarvesh Kumar|journal=Proceedings of the Indian History Congress|volume=68|year=2007|pages=1454|jstor=44145679}}</ref>


==తిరుగుబాటు నాయకులు==
==తిరుగుబాటు నాయకులు==

08:42, 13 మార్చి 2019 నాటి కూర్పు

మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమము

1912 నాటి ఉత్తరభారతదేశం - తిరుగుబాటు 1957-59 దేశపటం. దీనిలో తిరుగుబాటు కేంద్రాలు గుర్తించారు.
తేదీ1857 మే 10 (1857-05-10) – 20 జూన్ 1858 (1858-06-20)
(1 సంవత్సరం, 1 నెల, 2 వారాలు , 5 రోజులు)
ప్రదేశంభారత దేశం (cf. 1857)[1]
ఫలితంఅంగ్లేయులు విజయం సదించారు* తిరుగుబాటును అణిచివేయటం జరిగింది* మొఘల్_సామ్రాజ్యం యొక్క పతనం* భారతదేశంలో కంపెనీ పాలనకి ముగింపు* బ్రిటీష్ క్రౌన్కు పరిపాలన బదిలీ
రాజ్యసంబంధమైన
మార్పులు
ఈస్ట్ ఇండియా కొపేని పాలిత ప్రాంతం నుంచి బ్రిటిషు ఇండియా సమ్రాజ్య స్థాపన (కొన్ని భూములు స్థానిక పాలకులు తిరిగి వచ్చాయి,కొంత భూమిని బ్రిటిషు ప్రభుత్వం స్వదీనం చెసుకుంది)
ప్రత్యర్థులు
East India Company rebel sepoys
Seven Indian princely states
 British Empire
East India Company loyalist sepoys
Native irregulars
East India Company British regulars

United Kingdom British and European civilian volunteers raised in the Bengal Presidency
21 princely states


Kingdom of Nepal
సేనాపతులు, నాయకులు
మూస:Country data Mughal Empire Bahadur Shah II
Nana Sahib Peshwa
Bakht Khan
Rani Lakshmibai
Tantya Tope
Begum Hazrat Mahal
Babu Kunwar Singh
Ishwori Kumari Devi, Rani of Tulsipur
Commander-in-Chief, India:
United Kingdom George Anson (to May 1857)
United Kingdom Sir Patrick Grant
United Kingdom Sir Colin Campbell (from August 1857)
Jang Bahadur[2]

1857–-58 మధ్యకాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం అనీ, 1857 సిపాయిల తిరుగుబాటు అనీ పరిగణిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకూ బ్రిటీష్ అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు ఈ తిరుగుబాట్లకు దారితీసాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిష్ వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి.


ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటుకు ప్రత్యేకస్థానం ఉంది. దీన్ని బ్రిటిష్ సామ్రాజ్యాధికారంపై స్వదేశీ బలాలు చేసిన చారిత్రక తిరుగుబాటుగా పేర్కొన్నారు. కానీ ఈ తిరుగుబాటుకు భారతదేశంలో మెజార్టీ వర్గం మద్దతు లభించలేదు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేయగలిగారు. 1757 ప్లాసీ యుద్ధానంతర సంఘటనలన్నీ బ్రిటిషర్లకు విజయాలను తెచ్చిపెట్టాయి. ప్లాసీ యుద్ధం తరువాత సరిగ్గా ఒక శతాబ్ది కాలానికి జరిగిన ఈ తిరుగుబాటులో అణచివేతకు గురైన ఒక చిన్న వర్గం మాత్రమే బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి పోరాడింది.

మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన హైదరాబదు, మైసూరు, తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్ లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.[3]


అంతేకాకుండా భారత సైన్యంలో కూడా ఒక వర్గం బ్రిటిష్‌పై వ్యతిరేక భావాన్ని చూపగలిగింది. ఏదేమైనా 1650 తర్వాత భారతదేశంలో పునాదులు పాతుకుపోయి, దేశమంతటా వ్యాపించిన ఈస్టిండియా కంపెనీ అధికార దాహానికి అడ్డుకట్ట వేసి, కంపెనీ పాలనకు స్వస్తి పలికిన చారిత్రాత్మక సంఘటన ఇది. 1857 మే 10న మీరట్‌లో మొదలైన తిరుగుబాటు 1858 సెప్టెంబరు 20న ఢిల్లీలో ముగిసింది.


తిరుగుబాటు స్వభావం

వి.డి. సావర్కర్ 1909లో లండన్‌లో ప్రచురించిన "First War of Indian Independence" అనే పుస్తకం 1857 తిరుగుబాటు స్వరూప స్వభావాలను ప్రశ్నించింది. దీనిపై జాతీయ వాదులు, చరిత్రకారుల మధ్య చర్చలు మూడు అంశాల చుట్టూ పరిభ్రమించాయి. అవి 1) తిరుగుబాటు అనేది సిపాయిల ప్రతిఘటన (పితూరి). 2) అది జాతీయ పోరాటం లేదా స్వాతంత్య్రం యుద్ధం 3) అది జమీందార్ల అసంతృప్తి, వారి ప్రతిచర్య.

సిపాయిల పితూరి

19వ శతాబ్దం చివర్లో బ్రిటిష్ చరిత్రకారులు, కొంతమంది పరిశీలకులు ఈ తిరుగుబాటును ‘సిపాయిల పితూరి’గానే అభిప్రాయపడ్డారు. సిపాయిలు తరుచూ అతి స్వల్ప కారణాలకు సైతం తిరుగుబాటు చేయడం వల్ల జాన్ లారెన్‌‌స, స్మిత్ లాంటి చరిత్రకారులు దీన్ని కేవలం ‘సిపాయిల పితూరి’గా వర్ణించారు. ఈ సంఘటన గురించి ‘పూర్తిగా దేశభక్తి లోపించింది, సరైన స్వదేశీ నాయకత్వం లేదు. మద్దతు లేదు’ అని జాన్, సీలే పేర్కొన్నారు.

టి. ఆర్. హోల్నెస్ అనే చరిత్రకారుడు 1857 తిరుగుబాటును ‘నాగరికత, అనాగరికతల మధ్య జరిగిన సంఘర్షణ’ గా పేర్కొన్నాడు. బ్రిటిషర్లకు నాగరికత ఉందని, భారతీయులకు లేదనే తడి భావం అనేక విమర్శలకు గురైంది. ‘హిందువులకు కష్టాలు సృష్టించడానికి మహమ్మదీయుల కుట్ర’ అని ౌఠ్టట్చ, ఖ్చీడౌట లాంటి వాళ్లు అభిప్రాయపడ్డారు.


మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం

20వ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును V.D. Savarkar. "A planned war of National Independence‘ అని పేర్కొన్నారు. డా॥ఎస్.ఎన్.సేన్ తన గ్రంథం "Eighteen fifty Seven‘లో వి.డి.సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించారు.1857 తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డా॥ఆర్.డి.మజుందార్ అంగీకరించలేదు

ఈ తిరుగుబాటులో పాల్గొన్న సిపాయిల కంటే పాల్గొనని సిపాయిల సంఖ్య అధికం. ఏది ఏమైనా 1857 తిరుగుబాటును స్వాతంత్య్ర సమర యుద్ధమని చెప్పలేమన్న దానికే ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించారు.[ఆధారం చూపాలి] 1857 తిరుగుబాటు గురించి మార్క్సిస్టు వాదులు ‘కర్షక సైనికుల తిరుగుబాటు విదేశీయులైన, భూస్వామ్య సంకెళ్లపైన’ అని అన్నారు.[ఆధారం చూపాలి]

తిరుగుబాటుకు కారణాలు

1857 తిరుగుబాటు వలస పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ విధానాలు, ఆర్థిక దోపిడి, పరిపాలనా సంస్కరణలు అన్నీ కలసి.. భారతదేశంలోని సంస్థానాలు, సిపాయిలు, జమీందారులు, కర్షకులు, వ్యాపారస్థులు, కళాకారులు, చేతివృత్తులవారు, పండితులు, మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి.

డల్హౌసీ రాజ్యసంక్రమణ సిద్దాంతం, మొగలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుత్బ్ కు తరలిపొమ్మనటం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఆయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం పి/53 లీ ఏన్ఫిల్ద్ రైఫిల్, 557 కాలిబర్ రైఫిళ్ళలో ఆవు, పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం. సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి, రైఫిళ్ళలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు. ఆయితే బ్రిటీష్ వారు ఆ తూటాలను మార్చామనీ, కొవ్వులను తేనె పట్టునుండి లేదా నూనెగింజలనుండి సొంతంగా తయారు చేసుకోవటాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేక పోయాయి.

1857 మార్చినెలలో 34వ దేశీయ పదాతిదళానికి చెందిన మంగళ్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జంట్ మీద దాడిచేసి అతని సహాయకుని గాయపరచాడు. జనరల్ హెన్రీ మగళ్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి, మంగళ్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించటంతో తిరుగుబాటు మొదలయిందని చెప్పవచ్చు. బ్రిటీష్ వారు మంగళ్ పాండే ని,జమేదార్నుఏప్రిల్ 7న ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు. మే 10న 11వ, 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు. మే 11న ఇతర భారతీయులతో కలసి సిపాయిలు ఢిల్లీ చేరుకొని చివరి మొగలు చక్రవర్తి బహదూర్‌షా 2 నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీసుల్తాన్ గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా వత్తిడి చేసారు. బహదూర్‌షా మొదట అంగీకరించకపోయినా, తరువాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు.

ఇలా ప్రారంభమైన తిరుగుబాటు, వేగంగా ఉత్తర భారతం మొత్తానికి నిస్తరించింది. మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలు తిరుగుబాటు తలెత్తిన ముఖ్యప్రాంతాలు. బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించనప్పటకీ, తరువాత తీవ్రమైన బలప్రయోగంతో తిరుగుబాటుని అణచివేసేందుకు యత్నించారు. వారు క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్న పటాలాలనీ, చైనా వెళ్ళేందుకు బయలుదేరిన ఐరోపా పటాలాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి, బ్రిటిష్ వారికీ ఢిల్లీకి దగ్గరలోని బద్ల్-కీ-సరైలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి పారద్రోలి తరువాత ఢిల్లీని ఆక్రమించారు. ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటీష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించారు. జూన్ 20న గ్వాలియర్‌లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణీ లక్ష్మీబాయి మరణించింది. ఆయితే చెదురుమదురు పోరాటాలు 1859 లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసేవరకూ జరిగాయి. ఔధ్ రాజు అంతరంగికుడైన అహ్మదుల్లా, నానా సాహిబ్ మరియూ రావ్ సాహిబ్ పరివారము, తాంతియా తోపే, అజ్ముల్లాఖాన్, రాణీ ఝాన్సీ లక్ష్మీబాయి, కున్వర్సింగ్, బీహారులోని రాజపుత్ర నాయకుడైన జగదీష్పూర్, మొగలుచక్రవర్తి బంధువైన ఫిరోజ్ షా, 2వ బహాదుర్ షా, ప్రాణ్ సుఖ్ యాదవ్ మరియూ రెవారి బ్రిటీష్ వారిని ఎదిరించిన తిరుబాటుదారులలోని ముఖ్య నాయకులు.

రాజకీయ కారణాలు

1757 ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనకు పునాదులుపడ్డాయి. ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధం, దాని ఫలితంగా కుదిరిన 1765 అలహాబాద్ సంధి బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ, పన్నులు వసూలు చేసే హక్కు కల్పించింది.

ఇదే సమయంలో రాబర్‌‌ట క్లైవ్ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ రాజులు, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 1798లో గవర్నర్ జనరల్‌గా భారతదేశానికి వచ్చిన లార్‌‌డ వెల్లస్లీ సైన్యసహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వెల్లస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు. హైదరాబాదు, మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ పాలన కింద తొత్తులయ్యాయి.

1848లో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి డల్హౌసీ సతారా (1848), శంబల్‌పూర్ (1849), బగ ల్ (1850), ఉదయ్‌పూర్ (1852), ఝాన్సీ (1853), నాగపూర్ (1854) లను ఆక్రమించారు. 1856లో పరిపాలనా వైఫల్యం అనే నెపంతో అయోధ్యను ఆక్రమించి బ్రిటిషర్ల దృష్టిలో డల్హౌసీ మంచి పేరు సంపాదించాడు.

ఈ లోప భూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంతృప్తి, వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్‌ను అవమానించిడం, ఝాన్సీలో లక్ష్మీబాయిని అణగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి. రిచర్‌‌డ టెంపుల్ మాటల్లో .. ‘‘రాబర్‌‌ట క్లైవ్ భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని తయారు చేస్తే, దాన్ని వెల్లస్లీ ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు. కానీ డల్హౌసీ బ్రిటిష్‌ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు’’ అన్నాడు.

ఆర్థిక కారణాలు

బ్రిటిషర్ల మార్కెటిజం, ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా 1857 తిరుగుబాటుకు కారణమయ్యాయి. వలస పాలనతో భారతీయ చేతివృత్తులు, కళాకారులు, కర్షకులు ఆర్థిక జీవనంపై ప్రభావం చూపింది. బ్రిటిష్ విధానాల వల్ల భారతీయ కుటీర పరిశ్రమలు, వ్యవసాయం తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. బ్రిటిష్ పాలనలో వివిధ గవర్నర్ జనరల్‌లు ప్రవేశపెట్టిన జమీందారి, మహల్వారీ, రైత్వారీ పద్ధతులతో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు. 1813 చార్టర్ చట్టంతో బ్రిటిష్ నుంచి ఉత్పత్తులు భారత మార్కెట్‌లో వరదల్లా ప్రవహించాయి. భారతదేశం నుంచి ముడి సరుకులు లండన్‌కు ఎగుమతయ్యేవి. ఉత్పత్తులు ఎగుమతి చేసే భారత్ ముడిసరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది. చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు. భారత గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది.

అప్పుడు బెంటిక్ ‘‘భారత భూభాగాలు, చేతి వృత్తుల వారి ఎముకలతో శ్వేత వర్ణమయ్యాయి’’ అని అన్నాడు. ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిష్ విధానాలు దెబ్బతీశాయి. రాజులు, రాకుమారులు ఇతర మంత్రులు, అధికారులు వారికి రావాల్సిన పెన్షన్‌ను నష్టపోయి, సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు. ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి. భూస్వామ్య వ్యవస్థ నశించింది. ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిపాయిలకు మద్దతు పలికారు.

సామాజిక, మత కారణాలు: ఈస్టిండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి, మత మార్పిడులకు ఆహ్వానం పలికింది. ఈ చట్టం భారతీయుల మతజీవనంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది. బలవంత మత మార్పిడులకు బహిరంగంగా ప్రోత్సహించారు.

ఇంగ్లిష్ విద్యావిధానం ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరైంది. ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి. 1833 నుంచి హిందూ, ముస్లింలను బహిరంగంగా క్రైస్తవమతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సంప్రదాయాలు దెబ్బతిన్నాయి. భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు, లేదా మార్పు చేశారు. 1829లో సతీ నిషేధ చట్టం, 1846లో స్త్రీ శిశుహత్యా నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి. వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి.

సైనిక కారణాలు

1853లో కార్‌‌లమార్‌‌క్స ‘బ్రిటిషర్లు భారతీయ సైనిక సహాయంతో రాజ్యాన్ని స్థాపించి, భారతదేశ సొమ్ముతోనే పాలన కొనసాగించార’ని పేర్కొన్నారు. 1856 నాటికి బ్రిటిష్ సైన్యంలో 2,32,234 మంది భారతీయ సిపాయిలున్నారు. కంపెనీ చట్టాలతో వీరు అవమానానికి గురయ్యారు. బ్రిటిష్ సైనికులతో సమాన వేతనాలు వీరికి అందలేదు. 1854-1856 మధ్య జరిగిన యుద్ధానికి భారతీయ సైనికులు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది. సముద్రాన్ని దాటడాన్ని అప్పటి భారతీయ సమాజం అంగీకరించేది కాదు. దీన్ని బ్రిటిష్ సైన్యంలోని బ్రాహ్మణ సైనికులు వ్యతిరేకించారు.

లార్‌‌డ కానింగ్ 1856లో ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియుక్త చట్టం భారతీయ సైనికుల్లో అసంతృప్తి కలిగించింది. ముస్లింలు, సిక్కులు, ఇతర భారతీయ సైనికులు కూడా బ్రిటిషర్ల వలే ఉండాలనే చట్టం అమలు చేశారు.

తక్షణ కారణం

డల్హౌసీ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్‌ఫీల్డ్ తుపాకీలు ప్రవేశపెట్టారు. వీటికి ఉపయోగించే మందుగుండ్లకు (Catridges) ఆవు కొవ్వు లేదా పందికొవ్వుతో పూత పూసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది. సైనికులు పంటితో బుల్లెట్లకు పూసిన కొవ్వును తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి. సైన్యంలో ఎక్కువ మంది హిందువులు, ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది.

తిరుగుబాటు ప్రారంభం, గమనం, వ్యాప్తి

మందుగుండుకు కొవ్వు పూత పూస్తున్నట్లు 1857 జనవరి 23న డండం అనే ప్రాంతంలో వార్త మొదలై అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. 1857, మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ స్వదేశీ దళానికి చెందిన మంగల్‌పాండే అనే సేనాని ఎన్‌ఫీల్డ్ తుపాకీతో ఇద్దరు బ్రిటిష్ అధికారులను కాల్చి చంపాడు. ఈ తిరుగుబాటును బ్రిటిషర్లు పూర్తిగా అణచివేసి, ఏప్రిల్ 6న మంగల్‌పాండేను ఉరితీశారు. ఈ వార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. 19, 34వ స్వదేశీ దళాలను బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసింది.

భారతీయ సైనికులందరూ బ్రిటిషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మే 31ని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని, చపాతీలు, కలువ పూలు పంచారు. కానీ విప్లవం మే 10నే ప్రారంభమైంది. మే 8వ తేదీన మీరట్‌లోని 3వ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు.

కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు. దీంతో 1857 మే 10న సైనికులు అక్కడి అధికారులను చంపి మే 11న ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి అప్పటి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్‌షాను భారత జాతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఢిల్లీలోని ఈ విజయంతో దేశంలో ఉత్తర, కేంద్ర ప్రాంతాలు - అవధ్, రోహిల్‌ఖండ్, పశ్చిమ బీహార్‌ల్లో తిరుగుబాట్లు చెలరేగాయి.

తొలి దశ

బహదూర్ షా జఫర్ ను భారత దేశ చక్రవర్తిగా ప్రకటించారు. దీనికి అతడు సుముఖంగా లేనప్పటికీ, సైనికులు, అతడి దర్బారులోని ఉద్యోగులూ చేసిన బలవంతం మీద అతడు ఒప్పుకొన్నాడని ఆనాటి చరిత్రకారులు, ఆధునికులూ కూడా భావిస్తున్నారు.[4] గడచిన శతాబ్దాల్లో మొగలుల అధికారం చాలావరకూ క్షీణించినప్పటికీ, ఉత్తర భారతంలో వారి పేరుకు ఇంకా చాలా ప్రతిష్ఠ ఉంది.[5] పౌరులు, కులీనులు, ఇతర పెద్దలూ అతడికి విధేయులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు. చక్రవర్తి తన పేరిట నాణేలు విడుదల చేసాడు. తమ అధికారాన్ని వెల్లడి చేసే పద్ధతి ఇది. మొగలులతో అనేక యుద్ధాలు చేసిన పంజాబీ సిక్ఖులు తిరిగి మహమ్మదీయ పాలనలోకి వెళ్ళేందుకు ఇష్టపడలేదు. అందుచేత వారు తిరుగుబాటును వ్యతిరేకించారు. ఈ తిరుగుబాటు సమయంలో బెంగాలు అంతా దాదాపుగా స్తబ్దుగానే ఉంది. జాఫర్ ఇచ్చిన తిరుగుబాటు పిలుపుకు సామాన్యులు స్పందించిన తీరుకు బ్రిటిషర్లు విస్తుపోయారు.[5]

తొలుత తిరుగుబాటు దార్లు కంపెనీ సైన్యాన్ని తరిమేసి, హర్యానా, బీహార్, కేంద్ర పరగణాలు, ఐక్య పరగణాల్లోని అనేక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ దళాలను కూడదీసుకుని ఎదురుదాడి చెయ్యడం మొదలుపెట్టే సమయానికి తిరుగుబాటు దార్లకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది. బఖ్త్ ఖాన్ వంటి నాయకులు కొందరున్నప్పటికీ, తిరుగుబాటుదార్లు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాధీశుల నాయక్త్వంలోనే యుద్ధం చేసారు. వీరిలో కొందరు గట్టిగానే పోరాడినప్పటికీ, మిగతావారు మాత్రం స్వార్థపూరితంగాను, అసమర్ధులుగానూ మిగిలిపోయారు.

1857 జూలై 30 న రెడాన్ బ్యాటరీపై తిరుగుబాటుదార్ల దాడి

మీరట్ చుట్టుపట్ల ఉన్న గ్రామీణ ప్రాంతంలో గుర్జర్ల తిరుగుబాటు బ్రిటిషర్లకు అతి పెద్ద బెడద తెచ్చిపెట్టింది. పరీక్షిత్‌గఢ్ లో గుర్జర్లు చౌధురీ కదమ్ సింగ్‌ను తమ నాయకుడిగా ప్రకటించి, కంపెనీ పోలీసులను పారదోలారు. కదమ్ సింగ్ గుర్జర్ 2 వేల నుండి 10 వేల వరకూ ఉన్న పెద్ద సైన్యానికి నాయకత్వం వహించాడు.[6] బులంద్‌షహర్ వలిదాద్ ఖాన్ నాయకత్వంలోను, బిజ్‌నోర్ మహో సింగ్ నేతృత్వంలోనూ గుర్జర్ల నియ్ంత్రణ లోకి వచ్చింది. సమకాలికుల నివేదికల ప్రకారం, మీరట్ ఢిల్లీల మధ్య ఉన్న గుర్జర్ల గ్రామాలన్నీ తిరుగుబాటులో పాల్గొన్నాయి. వారికి కొన్ని చోట్ల జలంధర్ మద్దతు లభించింది. జూలై అంతానికి గాని బ్రిటిషర్లు ఈ ప్రాంతంపై నియంత్రణ తెచ్చుకోలేకపోయారు; అది కూడా స్థానిక జాట్‌ల సహాయంతో.[6]

లాహోరుకు చెందిన ముస్లిము పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిషు వారికి వ్య్తిరేకంగా రావ్ తులా రాం కు మద్దతు ఇమ్మని ఫత్వా జారీ చేసాడు. ఆ తరువాత నర్నౌల్ వద్ద జరిగిన పోరులో 1857 నవంబరు 16 న రావ్ తులా రాం ఓడిపోయాడు. ముఫ్తీ నిజాముద్దీన్‌ను, అతడి సోదరుడు, బావమరిదినీ బ్రిటిషు వారు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి ఉరితీసారు.[7]


ఢిల్లీ

కాశ్మీరీ గేట్ ఆక్రమణ -1857 సెప్టెంబరు 14

తిరుగుబాటును అణచడంలో మొదట్లో బ్రిటిషు వారు కొంత మందకొడిగా వ్యవహరించారు. బ్రిటను నుండి సైన్యాలు సముద్రం మీదుగా రావడం కొంత ఆలస్యమైంది. చైనా వెళ్ళే దాఅరిలో ఉన్న కొన్ని దళాలను భారత్‌కు మళ్ళించారు.

మీరట్, సిమ్లాల నుండి బ్రిటిషు దళాలు ఢిల్లీకి బయల్దేరి దారిలో అనేకమంది తిరుగుబాటుదార్లను చంపుతూ కర్నాల్‌ వద్ద కలుసుకున్నాయి. ఈ రెండు సైన్యాలు నేపాల్ నుండి వచ్చిన రెండు గూర్ఖా దళాలతో కలిసి బద్లీ కే సరాయ్ వద్ద తిరుగుబాటుదార్ల ప్రధాన దళాన్ని ఎదుర్కొన్నాయి.

ఢిల్లీకి ఉత్తరాన స్థావరాన్ని నిర్మించుకుని కంపెనీ దళాలు నగరాన్ని ముట్టడించాయి. జూలై 1 నుండి సెప్టెంబరు 21 దాకా ఈ ముట్టడి కొనసాగింది. అయితే నగరాన్ని చుట్టుముట్టేంత సైన్యం బ్రిటిషు వారి వద్ద లేదు. తిరుగుబాటు సైన్యం బ్రిటిషు సైన్యం కంటే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉంది. ముట్టడిలో ఉన్నది ఢిల్లీ కాదు, బ్రిటిషు సైన్యమా ఆన్నట్టు ఉండేది. తిరుగుబాటుదార్ల నిరంతర దాడులు, రోగాలు, అలసట కారణంగా బ్రిటిషు సైన్యం వెనక్కి తగ్గుతుందేమో అన్నట్టుండేది. ఆగస్టు 14 న పంజాబు నుండి బ్రిటిషు, సిక్ఖు, పఖ్తూన్ దళాలు జాన్ నికోల్సన్ నాయకత్వంలో వచ్చి చేరడంతో బ్రిటిషు సైన్యాం బలపడింది.[8][9]

సెప్టెంబరు 7 న బ్రిటిషు వారి శతఘ్నులతో గోడలను బద్దలు కొట్టి తిరుగుబాటుదార్ల శతఘ్నులను పట్టుకున్నారు.[10]: 478  సెప్టెంబరు 14 న కాశ్మీరీ గేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు బ్రిటిషు దళాలు ప్రయత్నించారు.[10]: 480  నగరంలో కాలుమోపినప్పటికీ బ్రిటిషు దళాలకు అపార నష్టం జరిగింది. జాన్ నికోల్సన్ కూడా మరణించాడు. బ్రిటిషు కమాండరు వెనక్కి తగ్గాలని అనుకున్నాడు. కానీ, అతడి కింది అధికారులు నచ్చజెప్పడంతో పోరు కొనసాగించాడూ. ఒక వారంలో బ్రిటిషు దళాలు ఎర్రకోటను పట్టుకున్నాయి. ఢిల్లీ తిరిగి బ్రిటిషు వారి స్వాధీనమైంది. బహదూర్ షా జఫర్ అప్పటికే హుమాయూన్ సమాధికి పారిపోయాడు.

1857 సెప్టెంబరు 20 న హుమాయూన్ సమాధి వద్ద బహదూర్ షా జఫర్, అతడి కుమారులను విలియమ్ హోడ్సన్ పట్టుకున్న దృశ్యం

బ్రిటిషు సైన్యాలు నగరంలో దోపిడీలు దౌర్జన్యాలు చేసాయి. అనేకమంది పౌరులను చంపారు. ప్రధాన మసీదును, ఇతర ప్రాంతాలనూ శతఘ్నులతో పేల్చివేసారు. కులీన ముస్లిముల ఇళ్ళను ధ్వంసం చేసారు.

బహదూర్ షా జఫర్‌ను అరెస్టు చేసారు. అతడి కుమారులలో ఇద్దరిని, ఒక మనుమడినీ బ్రిటిషు ఏజెంటు కాల్చి చంపించాడు. ఈ సంగతి తెలిసి బహదూర్ షా మ్రాన్పడి పోయాడు. అతడి భార్య జీనత్ మహల్ మాత్రం ఇక తన కొడుకు జఫర్ వారసుడౌతాడని సంతోషించింది.[11]


కాన్పూరు

తాంతియా తోపే సైనికులు
బీబీఘర్ బావి వద్ద బ్రిటిషు వాళ్ళు 1860 లో స్థాపించిన స్మారకం. స్వాతంత్ర్యం తరువాత దీన్ని కాన్పూరు లోని ఆల్ సెయింట్స్ మెమోరియల్ చర్చి వద్దకు తరలించారు. శామ్యూల్ బర్న్, 1860

జూన్‌లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి, యూరపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు. ఒక సైనికుడిగా వీలర్‌ను అందరూ గౌరవించేవారు. అతడొక హిందూ స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తనకున్న ప్రతిష్ఠపైన, నానా సాహిబ్‌తో తనకున్న మంచి సంబంధాల పైనా ఆధారపడి, ముట్టడిని ఎదుర్కోవడంలోను, ఆహారాన్ని నిల్వ చేసుకోవడంలోనూ అతడు కొంత అలసత్వం వహించాడు. మూడు వారాల ముట్టడి తరువాత వాళ్ల వద్ద మూడే రోజులకు సరిపడా ఆహారం మిగిలి ఉంది.

జూన్ 25 న యూరపియన్లను భద్రంగా అలహాబాదు వెళ్ళనిస్తానని నానా సాహిబ్ ప్రతిపాదించాడు. బ్రిటిషు వాళ్ళు అందుకు అంగీకరించారు. 26 రాత్రి వెళ్ళమని నానా చెప్పగా 27 పగలు వెళ్తామని, తమవెంట పిస్తోళ్ళు ఉంచుకుంటామనీ వాళ్ళు షరతు విధించారు. 27 ఉదయాన్నే యూరపియన్లు తమ నివాసాలు వదలి గంగానదిలో నానా సాహెబ్ సిద్ధం చేసి ఉంచిన పడవల వద్దకు బృందంగా బయలుదేరారు.[12] కంపెనీకి విధేయులుగా ఉన్న అనేక మంది సిపాయిలను - వారి విధేయత కారణంగా గాని, వాళ్ళు "క్రైస్తవులుగా మారిపోయారని" గానీ - తిరుగుబాటుదార్లు చంపేసారు. బృందానికి కొద్దిగా వెనకగా నడుస్తున్న కొందరు గాయపడ్డ బ్రిటిషు అధికారులను కూడా చంపేసారు. దాదాపు యూరపియన్లందరూ రేవు వద్దకు చేరుకునేటప్పటికి నదికి రెండు ఒడ్డుల పైనా సిపాయిలు మోహరించి ఉన్నారు.[13] కాల్పులు మొదలయ్యాయి. నావికులు పడవలను వదిలిపెట్టి పారిపోయారు.[14] కొన్ని పడవలను చెక్క బొగ్గులతో తగలబెట్టారు.[15] యూరపియన్లు పడవలెక్కి నదిలోకి పారిపోవాలని ప్రయత్నించారు గానీ మూడు పడవలు మాత్రమే వెళ్ళగలిగాయి. డజను మంది గాయపడిన మగవారితో ఉన్న ఒక పడవ కొంత దూరం పోగలిగినప్పటికీ తిరుగుబాటుదార్లు దాన్ని పట్టుకుని తిరిగి వెనక్కు తెచ్చారు. చివరిలో తిరుగుబాటుదార్లు నీళ్ళ లోకి దూకి, చావకుండా నదిలో ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళను కూడా చంపేసారు.[15] కాల్పులు ఆగాక, బ్రతికి ఉన్న వాళ్ళను చుట్టుముట్టి, వారిలో మగవాళ్ళను చంపేసారు.[15] ఈ నరమేధం ముగిసేటప్పటికి, దాదాపుగా మగవాళ్ళందరూ చనిపోయారు. మిగిలిన స్త్రీలు, పిల్లలను బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్లను కూడా బీబీఘర్ నరమేధంలో చంపేసారు.[16] నలుగు మగవాళ్ళు మాత్రమే - ఇద్దరు ప్రైవేట్ సైనికులు, ఒక లెఫ్టినెంటు, కెప్టెన్ మౌబ్రే థామ్సన్ - తప్పించుకోగలిగారు. మౌబ్రే థామ్సన్ ది స్టోరీ ఆఫ్ కాన్‌పోర్ (లండన్, 1859) అనే పుస్తకంలో ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాలను రాసాడు.

తరువాత జరిగిన విచారణలో, యూరపియన్లను చంపాలనే పథకమేమీ లేదని చెబుతూ తాంతియా తోపే ఇలా చెప్పాడు: యూరపియన్లు పడవల్లో ఎక్కేసారు. పడవలను పోనిమ్మని సూచిస్తూ తాంతియా తోపే కుడి చెయ్యెత్తాడు. సరిగ్గా అప్పుడు అక్కడున్న గుంపు లోంచి ఎవరో ఈల వేసారు. దాంతో అలజడి రేగింది. సరంగులు పడవల్లోంచి దూకేసారు. తిరుగుబాటుదార్లు విచ్చలవిడిగా కాల్పులు మొదలుపెట్టారు. దగ్గర్లోనే ఉన్న సవాదా కోఠిలో ఉన్న నానా సాహెబ్‌కు ఈ సంగతి తెలిసి కాల్పులను ఆపేందుకు వెంటనే వచ్చాడు.[17] బ్రిటిషు చరిత్రకారులు కొందరు కూడా దీన్ని ఒక అనుకోని హఠాత్ సంఘటనగా భావించారు; ఎవరో మొదటి కాల్పు కాల్చాడు, ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు, ఇక ఆ తరువాత జరిగిన నరమేధాన్ని ఎవరూ ఆపలేక పోయారు.[18]

బందీలను ముందు సవాదా కోఠికి తీసుకువెళ్ళారు. ఆ తరువాత స్థానిక మేజిస్ట్రేటు గుమాస్తా వద్దకు (బీబీఘర్) తీసుకువెళ్ళారు.[19] అక్కడ ఫతేగఢ్ నుంచి వచ్చిన కాందిశీకులు కూడా ఉన్నారు. మొత్తం ఐదుగురు మగవారు, 206 గురు స్త్రీలు, పిల్లలూ బీబీఘర్‌లో రెండు వారాల పాటు బందీలుగా ఉన్నారు. ఒక వారంలో 25 మంది విరేచనాలు, కలరా కారణంగా చనిపోయారు.[14] ఇదిలా ఉండగా, అలహాబాదు నుండి కంపెనీ దళాలు కాన్పూరుకు బయల్దేరాయి. నానాసాహెబ్ కాన్పూరును కాపాడుకోలేడని జూలై 15 నాటికి స్పష్టమైంది. బందీలను చంపెయ్యాలని నానా సాహెబ్, ఇతర నాయకులూ నిర్ణయించారు. సిపాయీలు ఈ పని చేసేందుకు నిరాకరించగా, ఇద్దరు ముస్లిము కసాయిలు, ఇద్దరు హిందూ రైతులు, నానా అంగరక్షకుడొకరూ కలిసి బీబీఘర్ లోకి వెళ్ళారు. కత్తులు, గొడ్డళ్ళతో వాళ్ళు యూరపియన్లను చంపేసారు.[20] ఆ హత్యాకాండ తరువాత అక్కడి గోడలు రక్తంతో తడిసిన చేతుల మరకలతో నిండిపోయాయి. నేలపై మనుషుల మాంసఖండాలు చెల్లచెదురుగా పడ్డాయి.[21] చనిపోయిన వాళ్లను, చనిపోతున్న వాళ్లనూ దగ్గర్లోని బావిలో పడవేసారు. 15 మీటర్ల లోతున్న బావి, పైనుండి 1.8 మీటర్ల వరకూ నిండిపోయింది [22] మిగిలిన శవాలను గంగానదిలోకి విసిరేసారు.[23]

ఈ క్రూర హంతక చర్యకు చరిత్రకారులు అనేక కారణాలను చెప్పారు. బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూరు వస్తున్న బ్రిటిషు సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని భావించి ఇలా ఆదేశించి ఉండవచ్చు. బ్రిటిషు వాళ్ళు కాన్పూరును తిరిగి స్వాధీనం చేసుకున్నాక, వాళ్లకు సమాచారమేమీ తెలియకుండా ఉండేందుకు చేసి ఉండవచ్చు. నానా సాహిబ్‌కు బ్రిటిషు వారితో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే కుట్రతో కొందరు ఈ పని చేసి ఉండవచ్చు.[24] గంగా నది వద్ద జరిగిన కాల్పుల్లో తాము పాల్గొన్నామని బందీలు గుర్తు పడతారేమోననే భయంతో కొందరు ఇలా చేసి ఉండవచ్చు.[16]

సతీచౌరా ఘాట్ వద్ద మారణ కాండ దృశ్యం. ఆ కాలం నాటి చిత్రం.

ఈ మారణకాండతో సిపాయిల పట్ల బ్రిటిషు వారి వ్యతిరేక ధోరణి మరింత బలపడింది. ఈ సంఘటన గురించి విన్న బ్రిటిషు ప్రజలు హతాశులయ్యారు. సామ్రాజ్య వ్యతిరేక, భారత అనుకూల వర్గాలు తమకున్న మద్దతును పూరిగా కోల్పోయాయి. మిగిలిన తిరుగుబాటు కాలమంతా బ్రిటిషు వారికి కాన్పూరే రణనినాదమైంది. తిరుగుబాటు అంతాన నానా సాహిబ్ అదృశ్యమయ్యాడు. ఏమయ్యాడో తెలియదు.

కొన్ని బ్రిటిషు కథనాల ప్రకారం [25][26][27] బీబీఘర్ మారణకాండకు రెండు వారాల ముందు, అలహాబాదు నుండి వస్తున్న బ్రిటిషు సైన్యం విచక్షణ లేకుండా ప్రజలపై దమనకాండ జరిపింది. ఫతేపూర్‌లో ఒక గుంపు స్థానిక యూరపియన్లపై దాడిచేసి చంపివేసారు. ఆ నెపంతో, బ్రిటిషు కమాండరు నీల్, గ్రాండ్ ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాలన్నిటినీ తగలబెట్టి, అక్కడి ప్రజలను ఉరితీయాలని ఆదేశించాడు. నీల్ పద్ధతులు "క్రూరం, దారుణం"[28] ఇవి ప్రజలను భయపెట్టకపోగా, అంతకు ముందు తిరుగుబాటులో పాల్గొనని సిపాయీలను కూడా అందుకు పురికొల్పాయి.

నీల్ సెప్టెంబరు 26 న లక్నో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఆనాటి కొందరు బ్రిటిషర్లు నీల్‌ను గొప్పగా కీర్తించారు.[29] బ్రిటిషర్లు కాన్పూరును స్వాధీనం చేసుకున్నాక, బందీలుగా పట్టుకున్న సిపాయీలను బీబీఘర్‌కు తీసుకువెళ్ళి అక్కడి గోడలపైన, నేలపైనా ఉన్న రక్తపు మరకలను వాళ్ళ చేత నాకించారు.[30] కొంత మందిని ఉరితీసారు. మరి కొందరిని శతఘ్నులలో పెట్టి పేల్చివేసారు. ఆ సిపాయీలు మారణకాండలో పాల్గొనలేదుగదా అని కొందరు అన్నప్పటికీ, దాన్ని వీళ్ళు ఆపలేదు కదా అని జవాబిచ్చారు. కెప్టెన్ థాంప్సన్ ఈ సంగతిని ధ్రువీకరించాడు.


లక్నో

రెండవ లక్నో విముక్తి యుద్ధంలో దెబ్బతిన్న సికంద్రా బాగ్

మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధ్ (ఔధ్) లో తిరుగుబాటు తలెత్తింది. బ్రిటిషు వారు దాన్ని ఆక్రమించుకుని అప్పటికి ఒక్క సంవత్సరమే అయింది. తిరుగుబాటుదార్లు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు. లోపల సిపాయీలతో కలిపి మొత్తం 1700 మంది ఉన్నారు. తిరుగుబాటుదార్లు శతఘ్ని దాడులు, తుపాకి కాల్పులు జరిపారు. బ్రిటిషు కమిషానరు సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు. బాంబులతో గోడలను పేల్చి, సొరంగం తవ్వీ లోపలికి వెళ్ళేందుకు తిరుగుబాటుదార్లు ప్రయత్నించారు.[31]: 486  90 రోజుల ముట్టడి తరువాత, రెసిడెన్సీ లోపల 300 మంది సిపాయీలు, 350 మంది బ్రిటిషు సైనికులు, 550 మంది అసైనికులూ మిగిలారు.

ముట్టడిలో ఉన్న బ్రిటిషు వారికి సహాయకంగా ఉండేందుకు సెప్టెంబరు 25 న సర్ హెన్రీ హావెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూరు నుండి లక్నోకు బయలుదేరింది. దారి పొడుగునా వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదార్లను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూరు చేరుకున్నారు. ఈ చిన్న దళానికి తిరుగుబాటుదార్లను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోట లోని ద్ళంతో చేరిపోయారు. అక్టోబరులో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్‌బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదార్లను ఓడించింది. ఆ తరువాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిషు వారందరినీ ముందు ఆలంబాగ్‌కు, ఆ తరువాత కాన్పూరుకూ తరలించారు. ఈ క్రమంలో ఆలంబాగ్‌లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు.

అవధ్‌లో తిరుగుబాటును అణచేందుకు 1858 మార్చిలో క్యాంప్‌బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు. ఆలంబాగ్‌లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు. అతడికి సహయంగా జంగ్ బహదూర్ రాణా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటుంది.[32] మార్చి 21 న జరిగిన చివరి యుద్ధంతో క్యాంప్‌బెల్ తిరుగుబాటుదార్లను పారదోలాడు.[31]: 491  దీన్ని రెండవ

ఝాన్సీ

ఝాన్సీ, బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మారాఠాల పాలనలో ఉన్న సంస్థానం. 1853 లో ఝాన్సీ రాజు కొడుకులు లేకుండా మరణించగా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ కింద ఆ రాజ్యాన్ని బ్రిటిషు రాజ్యానికి కలిపేసుకున్నారు. తమ దత్తపుత్రునికి రాఅజ్యాధికారం నిరాకరించడాన్ని రాణి లక్ష్మీబాయి ఎదిరించింది. యుద్ధం మొదలు కాగానే ఝాన్సీ తిరుగుబాటుకు ఒక కేంద్రంగా మారింది. కొందరు కంపెనీ అధికారులు, వారి కుటుంబాలతో సహ ఝాఅన్సీ కోటలో తలదాఅచుకున్నారు. వారి విడుదలకు రాణి లక్ష్మీబాయి అంగీకరించింది. అయితే, విడుదల కాగానే ఈ కంపెనీ వాళ్ళను తిరుగుబాటుదార్లు ఊచకోత కోసారు. ఈ తిరుగుబాటుదార్లతో రాణికి ఏ సంబంధమూ లేదు; ఆమె పదేపదే చెప్పినప్పటికీ ఆమె కుట్ర చేసిందన్న అనుమానం బ్రిటిషర్లను వీడలేదు.

1857 అంతానికి బుందేల్‌ఖండ్, తూర్పు రాజస్థాన్‌ ప్రాంతాల్లో చాలావరకు కంపెనీ నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రాంతాల్లోని బెంగాలు సైన్యం కూడా తిరుగుబాటు చేసి, ఢిల్లీ, కాన్పూరుల్లోని యుద్ధాల్లో పాల్గొనేందుకు తరలి పోయింది. ఈ ప్రాంతంలోని అనేక సంస్థానాలు తమలో తాము పోరాడుకోవడం మొదలుపెట్టాయి. 1857 సెప్టెంబరు అక్టోబరుల్లో పొరుగు రాజ్యాల దాడులను రాణి లక్ష్మీ బాయి జయప్రదంగా తిప్పికొట్టింది.

1858 మార్చిలో సర్ హ్యూ రోజ్ ఝాన్సీని ముట్టడించాడు. కంపెనీ సైన్యాలు నగరాన్ని ఆక్రమించగా, రాణి మారువేషంలో తప్పించుకుంది.

ఝాన్సీ, కల్పీ ల నుండి పారిపోయిన లక్ష్మీబాయి, కొందరు మరాఠా వీరులూ కలిసి, సిందియాలను ఓడించి గ్వాలియరును స్వాధీనం చేసుకున్నారు. సింధియాలు బ్రిటిషు వారికి సన్నిహితులు. ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో గానీ, సర్ హ్యూ రోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియరుపై దాడి చేసింది. అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున, జూన్ 17 న, రాణి లక్ష్మీబాయి మారణించింది. తరువాతి మూడు రోజుల్లో కంపెనీ సిన్యం గ్వాలియరును తిరిగి వశపరచుకుంది. ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జోన్ ఆఫ్ ఆర్క్‌తో పోల్చారు.[33]

ఇండోర్

ఇండోర్‌లో ఉన్న నాటి కంపెనీ రెసిడెంటు కల్నల్ హెన్రో మార్లన్ డ్యురండ్ ఇండోర్లో తిరుగుబాటు వస్తుందనడాన్ని కొట్టిపారేసాడు.[34] అయితే, జూలై 1 న హోల్కారు సైన్యంలోని సిపాయీలు తిరుగుబాటు చేసి, బ్రిటిషు ఆఫీసర్లతో కూడిన భోపాల్ దళంపై కాల్పులు జరిపారు. వాళ్ళను ఎదుర్కొనేందుకు కల్నల్ ట్రావెర్స్ ముందుకు పోగా, అతన్ని అనుసరించేందుకు భోపాల్ పదాఅతి దళం తిరస్కరించింది. భోపాల్ శతఘ్ని దళం కూడా తిరస్కరించి, తమ తుపాకులను యూరపియన్ల మీద ఎక్కుపెట్టింది. ఇక చేసేదేమీ లేక, డ్యురండ్ యూరపియన్లందరినీ సమీకరించి, తప్పించుకున్నాడు. ఈలోగా 39 మంది యూరపియన్లను చంపేసారు.[35]

బీహార్

బీహారులో తిరుగుబాటు ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతం లోనే ఎక్కువగా జరిగింది. అయితే, గయ జిలాలో కూడా దోపిడీలు, దౌర్జన్యాలూ జరిగాయి.[36] తిరుగుబాట్లలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు జగదీష్‌పూర్ జమీందారు, 80ఏళ్ళ కన్వర్ సింగ్. అతడి జమీని బ్రిటిషు వారు జప్తు చేసే పనిలో ఉన్నారు. అతడు తిరుగబాటును ఎగదోసి, దానికి నాయకత్వం వహించాడు.[37] అతడి తమ్ముడు, అతడి సేనాధ్యక్షుడూ ఇందుకు సహకరించారు.[38]

జూలై 25 న దీనాపూర్ సైనిక స్థావరంలో తిరుగుబాటు రాజుకుంది. తిరుగుబాటుదార్లు అర్రా నగరం వైపు సాగిపోయారు. అక్కడ వారితో కన్వర్ సింగ్, అతడి సైన్యం కలిసింది.[39] బోయిల్ అనే బ్రిటిషు రైల్వే ఇంజనీరు అలాంటి దాడుల నుండి రక్షణగా ఉండేందుకు ముందుచూపుతో తన నివాసంలో ఒక భవంతిని నిర్మించుకుని ఉన్నాడు.[40] తిరుగుబాటుదార్లు అర్రాకు చేరుకునేటప్పటికి యూరపియన్లందరూ బోయిల్ ఇంటిలో తలదాచుకున్నారు.[41] తిరుగుబాటుదార్లు ఆ ఇంటిని ముట్టడించారు. రెండు మూడు వేల మంది తిరుగుబాటుదార్లు జరిపే ముట్టడి ఎదుర్కునేందుకు వారివద్ద 50 మంది విధేయ సిపాయీలు ఉన్నారు.[42]

వీళ్ళను రక్షించేందుకు దీనాపూర్ నుండి 400 మందిని అర్రాకు పంపించారు. ఈ దళాన్ని దారిలోనే తిరుగుబాటుదార్లు అడ్డుకుని వెనక్కు పారదోలారు. బక్సార్ వైపు నదిలో ప్రయాణం చేస్తున్న బ్రిటిషు దళం ఒకటి బక్సార్ చేరుకోగానే అర్రా ముట్టడి వార్త తెలిసింది. ఆ దళ నాయకుడు మేజర్ విన్సెంట్ ఐర్ వెంటనే దళాన్ని ఆయుధాలనూ పడవల్లోంచి దింపి అర్రా వైపు సాగిపోయాడు. అటు వెళ్ళవద్దని అతడికి ఆదేశాలు వచ్చినప్పటికీ అతడు పట్టించుకోలేదు.[43] ఆగస్టు 2 న అర్రాకు 9.7 కి.మీ. దూరాన ఉండగా తిరుగుబాటుదార్లు వాళ్ళపై మెరుపుదాడి చేసారు. అప్పుడూ జరిగిన పోరులో బ్రిటిషు దళం గెలిచింది.[42] ఆగస్టు 3 న మేజర్ ఐర్ తన దళంతో సహా ముట్టడి ఇంటిని చేరుకుని ముట్టడిని తొలగించాడు.[44][45]

మరికొన్ని దళాలను పొందాక, మేజర్ ఐర్ కన్వర్ సింగ్‌ను వెంబడించి జగదీష్‌పూర్ చేరుకున్నాడు. అప్పటికే కన్వర్ సింగ్ తప్పించుకున్నాడు. ఐర్ సింగ్ ఇంటిని, అతడి సోదరుల ఇళ్ళనూ ధ్వంసం చేసాడు.[42]

గయ, నవాడా, జెహానాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ ఖాన్, గులామ్ ఆలీ ఖాన్, ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి.[46]

తిరుగుబాటు నాయకులు

నానాసాహెబ్: కాన్పూర్‌లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండుపంత్. ఇతడు మరాఠా చివరి పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. తిరుగుబాటు సమయంలో బితూర్ (కాన్పూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్) లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు. జూన్ 4న 2వ అశ్విక దళం, 1వ స్వదేశీ పదాతి దళం కాన్పూర్‌లో తిరుగుబాటు చేసి అనేకమంది బ్రిటిష్ అధికారులను చంపాయి. ఈ తిరుగుబాటుకు నానాసాహెబ్ నాయకత్వం వహించారు.

తండ్రి మరణం తర్వాత ఇతనికి రావాల్సిన పెన్షన్‌ను కంపెనీ నిలిపివేసి, పీష్వా పదవిని రద్దు చేసింది. నానాసాహెబ్ తిరుగుబాటుకు తాంతియాతోపే మద్దతు పలికాడు. అనేక అపజయాలు ఎదుర్కొన్న నానాసాహెబ్ నేపాల్ అడవులకు పారిపోయాడు. తాంతియాతోపే ఝాన్సీ వెళ్లి లక్ష్మీబాయితో చేతులు కలిపాడు.

రెండో బహదూర్‌షా: చివరి మొగల్ చక్రవర్తై బహదూర్‌షాను 1857 తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా భారత సైనికులు ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. షా హిందీ, ఉర్దూ భాషల్లో పండితుడు. ‘జాఫర్’ అనే కలంపేరుతో రచనలు చేశాడు. తిరుగుబాటు సమయంలో భారతీయులను కాపాడడానికి తన శాయశక్తులా ప్రయత్నించి, బ్రిటిషర్లకు దొరికిపోయాడు. 1862లో రంగూన్ జైల్లో మరణించాడు. షా చక్రవర్తిగా అనేక సంస్కరణలు కూడా చేశాడు. ఢిల్లీలో గోవధను నిషేధించాడు. అతని మరణం ముందు అతని గొప్పదనం చెప్పాలంటే ‘‘మొగలు చక్రవర్తి జాఫర్ భౌతికకాయాన్ని పూడ్చడానికి అతడు 2 గజాల భూమిని కూడా నిలుపుకోలేకపోయాడు’’

ఝాన్సీ లక్ష్మీబాయి: లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమెను ఝాన్సీ రాజు గంగాధరరావుతో వివాహం చేశారు. భర్త మరణంతో దామోదరరావును దత్తపుత్రుడిగా తీసుకున్నారు. 1848లో డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు. దీంతో 1857 జూన్ 4 న ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు చేసి యుద్ధభూమిలో మరణించింది. ఈ తిరుగుబాటును సర్‌ హ్యూ రోజ్ అణచివేశాడు. ఆమెకు సహకరించిన తాంతియా తోపేను బ్రిటిషర్లు ఉరితీశారు. లక్ష్మీబాయి గురించి సర్‌ హ్యూ రోజ్ ‘‘1857 తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన, ధైర్యమైన నాయకురాలు’’ అని పొగిడాడు

తిరుగుబాటు తదనంతర పరిణామాలు

1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య మలుపుగా చెప్పవచ్చు. బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దుచేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనావ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయిని నియమించారు. ఈవిధంగా భారతదేశం నేరుగా బ్రిటీష్ పాలనలోకి వచ్చింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటీష్ రాణి ప్రమాణం చేసింది, అయినప్పటికీ బ్రిటిష్ వారిపట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు. ఈ అనుమానాలు 1857 తిరుగుబాటు అనంతరం విస్తృతమయ్యాయి.

బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని, జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేసారు. భూఆక్రమణలకు స్వస్తి పలికారు, మతవిషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేసారు. భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు, అయితే ఆచరణలో క్రిందితరగతి ఉద్యోగాలకే పరిమితం చేసారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచటం, ఫిరంగులు మొదలయిన భారీ అయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేసారు. బహదూర్‌షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించారు. 1862 లో అతను బర్మాలో మరణించటంతో భారతరాజకీయాలలో మొగలాయిల వంశం అంతమైందని చెప్పవచ్చు. 1877 లో బ్రిటన్ రాణి, తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది.

ఇవీ చూడండి

బయటి లింకులు

అంతకు ముందువారు
Second Anglo-Sikh War
Indo-British conflicts తరువాత వారు
Hindu German Conspiracy
  1. File:Indian revolt of 1857 states map.svg
  2. The Gurkhas by W. Brook Northey, John Morris. ISBN 81-206-1577-8. Page 58
  3. Spear 1990, pp. 147–148
  4. The Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 34.
  5. 5.0 5.1 Dalrymple 2008, p. 23
  6. 6.0 6.1 Stokes, Eric; Bayly, Christopher Alan (1986), The peasant armed: the Indian revolt of 1857, Clarendon Press, ISBN 978-0-19-821570-7
  7. Hakim Syed Zillur Rahman (2008), "1857 ki Jung-e Azadi main Khandan ka hissa", Hayat Karam Husain (2nd ed.), Aligarh/India: Ibn Sina Academy of Medieval Medicine and Sciences, pp. 253–258, OCLC 852404214
  8. God's Acre. The Hindu Metro Plus Delhi. 28 October 2006.
  9. 'The Rising: The Ballad of Mangal Pandey' Archived 14 జూలై 2007 at the Wayback Machine. Daily Mail, 27 August 2005.
  10. 10.0 10.1 Porter, Maj Gen Whitworth (1889). History of the Corps of Royal Engineers Vol I. Chatham: The Institution of Royal Engineers.
  11. Dalrymple 2006, p. 400
  12. The story of Cawnpore: The Indian Mutiny 1857, Capt. Mowbray Thomson, Brighton, Tom Donovan, 1859, pp. 148–159.
  13. Essential Histories, the Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 49.
  14. 14.0 14.1 S&T magazine No. 121 (September 1998), p. 56.
  15. 15.0 15.1 15.2 Hibbert 1980, p. 191
  16. 16.0 16.1 A History of the Indian Mutiny by G. W. Forrest, London, William Blackwood, 1904.
  17. Kaye's and Malleson's History of the Indian Mutiny. Longman's, London, 1896. Footnote, p. 257.
  18. Edwardes, Battles of the Indian Mutiny, p. 56.
  19. David 2003, p. 250
  20. Harris 2001, p. 92
  21. Harris 2001, p. 95
  22. Essential Histories, the Indian Mutiny 1857–58, Gregory Fremont-Barnes, Osprey 2007, p. 53.
  23. S&T magazine No. 121 (September 1998), p. 58.
  24. John Harris, The Indian mutiny, Wordsworth military library 2001, p. 92.
  25. J. W. Sherer, Daily Life during the Indian Mutiny, 1858, p. 56.
  26. Andrew Ward, Our bones are scattered – The Cawnpore massacres and the Indian Mutiny of 1857, John Murray, 1996.
  27. Ramson, Martin & Ramson, Edward, The Indian Empire, 1858.
  28. Michael Edwardes, Battles of the Indian Mutiny, Pan, 1963 ISBN 0-330-02524-4
  29. Units of the Army of the Madras Presidency wore blue rather than black shakoes or forage caps.
  30. Raugh, Harold E. (2004), The Victorians at War, 1815–1914: An Encyclopaedia of British Military, Santa Barbara: ABC-CLIO, p. 89, ISBN 978-1-57607-925-6, OCLC 54778450
  31. 31.0 31.1 Porter, Maj Gen Whitworth (1889). History of the Corps of Royal Engineers Vol I. Chatham: The Institution of Royal Engineers.
  32. Hibbert 1980, pp. 358, 428
  33. Lachmi Bai Rani of Jhansi, the Jeanne d'Arc of India (1901), White, Michael (Michael Alfred Edwin), 1866, New York: J.F. Taylor & Company, 1901.
  34. "Biographies".
  35. Kaye, Sir John William (1876), A history of the Sepoy war in India, 1857–1858 – John William Kaye (sir.) – Google Books, retrieved 17 September 2012
  36. S. B. Singh (1966). "Gaya in 1857-58". Proceedings of the Indian History Congress. 28: 379–387. JSTOR 44140459.
  37. Wood, Sir Evelyn (1908), The revolt in Hindustan 1857–59 – Evelyn Wood, Sir Evelyn i. e. Henry Evelyn Wood – Google Boeken, retrieved 17 September 2012
  38. S. Purushottam Kumar (1983). "Kunwar Singh's Failure in 1857". Proceedings of the Indian History Congress. 44: 360–369. JSTOR 44139859.
  39. Boyle, Robert Vicars (1858). Indian Mutiny. Brief Narrative of the Defence of the Arrah Garrison. London: W. Thacker & Co.
  40. John Sergeant's Tracks of Empire, BBC4 programme.
  41. Halls, John James (1860). Two months in Arrah in 1857. London: Longman, Green, Longman and Roberts.
  42. 42.0 42.1 42.2 "Supplement to The London Gazette, October 13, 1857". No. 22050. 13 October 1857. pp. 3418–3422. Retrieved 18 July 2016.
  43. Sieveking, Isabel Giberne (1910). A turning point in the Indian mutiny. London: David Nutt.
  44. The Sepoy Revolt. A Critical Narrative – Google Books, ISBN 9781402173066, retrieved 17 September 2012
  45. Smith, John Frederick (1864), John Cassell's Illustrated history of England – William Howitt, John Cassell – Google Boeken, retrieved 17 September 2012
  46. Sarvesh Kumar (2007). "The Revolt of 1857: 'Real Heroes of Bihar Who Have Been Dropped From Memory". Proceedings of the Indian History Congress. 68: 1454. JSTOR 44145679.