అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 40: పంక్తి 40:
{{అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మండలంలోని గ్రామాలు}}{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా) మండలంలోని గ్రామాలు}}{{నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు]]
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు]]
[[వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా పురపాలక సంఘాలు]]

15:12, 24 మార్చి 2019 నాటి కూర్పు

అచ్చంపేట, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా,అచ్చంపేట మండలానికి చెందిన పట్టణం.

ఉమామహేశ్వరాలయం

ఈ పట్టణం నల్లమల అడవులకు సమీపంలో ఉంది. హైదరాబాదు, శ్రీశైలం, మహబూబ్ నగర్‌ల నుంచి ఇది సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణాపరంగా ఈ పట్టణం మంచి సౌకర్యాలను కలిగిఉంది. వ్యాపారంలో కూడా ఈ పట్టణం అభివృద్ధిలో ఉంది. బస్సు డిపో కూడా ఈ పట్టణంలో ఉంది. విద్యాపరంగా మంచి పాఠశాలలు, కళాశాలలు డిగ్రీ వరకు బోధన సాగిస్తున్నాయి.

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం - 28384, గ్రామీణ జనాభా 40504.పిన్ కోడ్ నం. 509375 ., ఎస్.టి.డి.కోడ్ = 08541.

విద్యాసంస్థలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1970-71)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన:1993-94)
  • త్రివేణి జూనియర్ కళాశాల (స్థాపన:1992-93)
  • ప్రగతి జూనియర్ కళాశాల (స్థాపన:2002-03)
  • ప్రగతి డిగ్రీ కళాశాల
  • తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (స్థాపన:1996-97), ఫోను నెం:08541-272040

పర్యాటక ప్రదేశాలు

  • ఉమామహేశ్వరము. (శ్రీశైలం ఉత్తర ద్వారము)
  • మల్లెలతీర్థం: శ్రీశైలం వెళ్ళేదారిలో వటవర్లపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉంటుంది.
  • లొద్ది మల్లయ్య స్వామి దేవాలయం.
  • సలేశ్వరం: తెలంగాణా అమరనాథ్‌గా పిలవబడుతుంది. ప్రత్యేకమైన ఉత్సవాల రోజుల్లో మాత్రమే ఇక్కడికి ప్రజలు వస్తుంటారు.
  • ఫరహాబాద్ దృశ్య కేంద్రం: నల్లమల్ల అడవుల్లోనుండి కృష్ణానది సౌందర్యాన్ని చూడటానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఒక ప్రదేశం.
  • మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం
  • అక్కమహాదేవి గుహలు
  • శ్రీ సాయిబాబా మందిరం:అవతారమూర్తిగా భక్తుల ప్రణతుల్ని అందుకుంటున్న శ్రీ సాయిబాబా మందిరం, ఒక సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంది. 2001లో రాజస్థానులోని జైపూరు నుండి తెప్పించి ప్రతిష్ఠ గావించిన దివ్యమందిరంగా పేరుగాంచింది.

నీటిపారుదల భూమి

2337 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[1]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79

బయటి లింకులు

[3] ఈనాడు తీర్ధయాత్ర, నవంబరు,2013. 10వ పేజీ.