39,158
దిద్దుబాట్లు
(విభాగాల విభజన) ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం |
(కాలక్రమానికి అనుగుణంగా సమాచారం సర్దాను) ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
== బాల్యం ==
చిత్తజల్లు పుల్లయ్య [[1898]]లో [[కాకినాడ]]లో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ చాలా చురుకైన కుర్రాడు. 1921 లో ఆయన బి.ఎ.చదువుతున్న సమయంలో కాకినాడలో జాతీయ [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలకు వెళ్లిన పుల్లయ్య మీద జాతీయభావాల ప్రభావం పడింది. వెంటనే ఇంగ్లీషు చదువుకు స్వస్తి చెప్పి, ఖద్దరు దుస్తులు కట్టడం మొదలెట్టారు. కాంగ్రెస్ సేవాదళంలో చేరేందుకు బొంబాయి వెళ్లారు.
== సినీ రంగంలో ==
[[రఘుపతి వెంకయ్య]], అతని కుమారుడు [[రఘుపతి ప్రకాష్]] దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి [[సినిమా]] నిర్మాణ సంస్థ 'స్టార్ ఆఫ్ ది ఈస్ట్' ను స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ మూగచిత్రాన్ని నిర్మించారు (ఇది మూగచిత్రం గనుక "మొదటి తెలుగువాడి సినిమా" అనడం ఉచితం). ప్రకాష్ దర్శకత్వం వహించడమే కాకుండా ఈ చిత్రంలో [[భీష్ముడు|భీష్ము]]<nowiki/>ని పాత్రను కూడా పోషించారు. 'డి కాస్టెల్లో' (De Castello) అనే [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] యువతి గంగ పాత్రను ధరించింది. తరువాత ప్రసిద్ధులైన సి.పుల్లయ్య, [[వై.వి.రావు]]లూ ప్రకాష్ అనుచరులుగా తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పుల్లయ్య [[కాకినాడ]]<nowiki/>లో 'భక్తమార్కండేయ' మూక్తీ చిత్రాన్ని 1925 లో నిర్మించి విడుదల చేసాడు. ఒక తెలుగు వాడు ఆంధ్రదేశంలో నిర్మించిన మూకీ 'భక్తమార్కండేయ'. ఇందులో పుల్లయ్య యమునిగా నటించాడు.
టాకీ సినిమా వచ్చిన తర్వాత మళ్లీ పుల్లయ్య దృష్టి సినిమా మీదకు మళ్ళింది. అదే సమయంలో ఈయన గురించి తెలుసుకున్న కలకత్తాలోని ఈస్టిండియా ఫిలిం కంపెనీ వారు, తమ తెలుగు చిత్ర నిర్మాణ విభాగానికి ఇంచార్జ్ గా పుల్లయ్యను ఆహ్వానించారు. ఈస్టిండియా కంపెనీకి ఆయన రూపొందించిన తొలి సినిమా 'సతీ సావిత్రి'. ఆనాటి రంగస్థల ప్రముఖులు [[వేమూరి గగ్గయ్య]], [[రామతిలకం]] అందులో నటించారు. తర్వాత దేవకీ బోస్ బెంగాలీలో 'లవకుశ' ప్లాన్ చేస్తుంటే, ఆ సబ్జక్ట్ పుల్లయ్యను ఆకర్షించింది. దాంతో, ఆ కంపెనీకే దీనిని తెలుగులో తీయడానికి రెడీ అయ్యారు పుల్లయ్య. [[బలిజేపల్లి లక్ష్మీకాంత కవి]] స్క్రిప్ట్ రాశారు. [[పారుపల్లి సుబ్బారావు]], సీనియర్ శ్రీరంజని ఇందులో సీతారాములుగా నటించారు. రథాలు, సెట్లు, కాస్ట్యూమ్స్ వంటి వాటిని [[బంగ్లా భాష|బెంగాలీ]] వెర్షన్ కి వాడిన వాటినే వాడారు. 1934 లో విడుదలైన సినిమా గొప్ప విజయం సాధించింది. 1963లో ఇదే సినిమాను తన తనయుడు సి.యస్.రావుతో కలిసి పుల్లయ్య పునర్నిర్మించాడు. తెలుగులో తొలి రంగుల చిత్రంగా నమోదైన లవకుశలో [[ఎన్.టి.రామారావు]], [[అంజలీదేవి]] సీతారాములుగా నటించగా, నాగయ్య వాల్మీకిగా నటించారు. పుల్లయ్య తీసిన అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఇదీ ఒకటి.
|