ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:కడప జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:కడప జిల్లా కవయిత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Molla.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:Molla text.jpg|200px|మొల్ల]]<center> ]]
[[బొమ్మ:Molla.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:Molla text.jpg|200px|మొల్ల]]<center> ]]
'''[[ఆతుకూరి మొల్ల]]''' (1440-1530) 16వ శతాబ్దపు [[తెలుగు]] కవయిత్రి. తెలుగులో [[మొల్ల రామాయణము]] గా ప్రసిద్ధి చెందిన ద్విపద [[రామాయణము]]ను రాసినది. ఈమె [[కుమ్మరి]] కుటుంబములో జన్మించింది. మొల్ల [[శ్రీ కృష్ణదేవరాయలు]] సమయము ([[16వ శతాబ్దము]]) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.
'''ఆతుకూరి మొల్ల''' (1440-1530) 16వ శతాబ్దపు [[తెలుగు]] కవయిత్రి. తెలుగులో [[మొల్ల రామాయణము]] గా ప్రసిద్ధి చెందిన ద్విపద [[రామాయణము]]ను రాసినది. ఈమె [[కుమ్మరి]] కుటుంబములో జన్మించింది. మొల్ల [[శ్రీ కృష్ణదేవరాయలు]] సమయము ([[16వ శతాబ్దము]]) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.


==జీవిత కాలము==
==జీవిత కాలము==
పంక్తి 81: పంక్తి 81:
[[వర్గం:1440 జననాలు]]
[[వర్గం:1440 జననాలు]]
[[వర్గం:1530 మరణాలు]]
[[వర్గం:1530 మరణాలు]]
[[వర్గం:సాహిత్యంలో మహిళలు]]
[[వర్గం:కడప జిల్లా కవయిత్రులు]]
[[వర్గం:కడప జిల్లా కవయిత్రులు]]

05:15, 1 జూలై 2019 నాటి కూర్పు

మొల్ల

ఆతుకూరి మొల్ల (1440-1530) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. తెలుగులో మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును రాసినది. ఈమె కుమ్మరి కుటుంబములో జన్మించింది. మొల్ల శ్రీ కృష్ణదేవరాయలు సమయము (16వ శతాబ్దము) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది మరియు రమనీయమైనది.

జీవిత కాలము

మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. మరియు అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా క్రీ.శ. 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడాను. ఈమె కులావంశ సంజాత. ఇంటి పేరు ఆతుకూరివారు.వంగడమునుబట్టి కుమ్మరి మొల్ల అని విశ్వమున వ్యవహరించబడుచున్నది. ఈమె జనకుడు కేతనపెట్టి. గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుడుని స్మరించియుండుటచే ఈమె శ్రీనాధుడు తరువాత కాలమున ఉండెడిదని తెలియుచున్నది.చరిత్ర పరిశోధకులు 1525సం. ప్రాంతమని నిర్ణయించారు. ఈమె ఆజన్మబ్రహ్మచారిణి అని చెప్పెదరు.

స్వస్థలం : కడప జిల్లా గోపవరం మండలము గోపవరం గ్రామము .ఈ గ్రామము కడప పట్టణమునకు 56 కి.మీ దూరములో ఉన్నది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.

గావ్య సంపద క్రియలు నిఘంటువులును-గ్రామము లేవియు నెఱుఁగ, విఖ్యాత గోప

వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత - నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి

నెల్లూరు దగ్గర ఇంకో గోపవరం ఉన్నా గానీ అక్కడ శ్రీకంఠ మల్లేశ్వరస్వామి ఆలయం లేదు. మొల్ల తాను శ్రీ కంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నానని స్వయంగా చెప్పింది. శ్రీరామాలయమూ గోపవరంలోనే ఉంది. తరతరాలుగా జనం చెప్పుకునే మొల్ల బండ ఉంది. గ్రామస్థులు ఈ బండకు పూజ చేయడం ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు ఈ గోపవరంలో బస చేసినట్లుగా స్థానికులు చెప్పుకొంటూ ఉంటారు. మొల్ల పూర్వీకులు ఆత్మకూరుకు చెంది ఉంటారనీ, అందుకే ఆతుకూరు ఇంటిపేరు అయిందనీ కొందరి అభిప్రాయం. కుమ్మరి కులానికి చెందిన మొల్ల ఈ ప్రాంతానికి చెందినదనడానికి గోపవరం దగ్గర కుమ్మరి కులాలవారూ ఉన్నారు. మొల్ల నివసించిన ఇల్లుగా గోపవరంలో పాడుబడిన ఇల్లు ఉంది. పెద్దన & తెనాలి రామలింగడు కూడా గోపవరం వచ్చి మహా భక్తురాలైన కవయిత్రి మొల్ల గారిని దర్శించినట్లు ఆమెపై చేసిన దూసను మన్నించవలసినది గా ప్రాధేయపడ్డారు.

వాంగ్మయ మూలాల ఆధారముగా మొల్ల స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని, చిన్న తనములోనే తల్లిని కోల్పోగా తండ్రి కేసన శెట్టి గారు ఈమెను గారాబముగా పెంచెనని తెలుస్తున్నది. ఈమెకు తండ్రి అంటే అమిత ఇష్టము. చివరి దాకా తండ్రి యొక్క ఇంటి పేరునే ఉపయోగించడము మూలాన మొల్ల పెళ్ళి చేసుకోలేదని అనుకోవచ్చు.

మొల్ల రామాయణము

మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో[1] కూడుకున్నది. ఈ కావ్యమును మొల్ల కేవలము ఐదు రోజులలో రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక భాషకు దగ్గరగా ఉంది.

మొల్ల శైలికి ఉదాహరణలు

దస్త్రం:Molla Writings.jpg
మొల్ల రామాయణం తాటాకు ప్రతి

తోయజదళాక్షి వలరాయడిటు లేచి పటుసాయకములేర్చి ఇపుడేయగ దొడంగెన్
తోయదపథంబున నమేయరుచి తోడ నుదురాయడును మించి వడ గాయగ గడంగెన్
కోయిలలు కీరములు కూయగ నళివ్రజము లేయెడల జూచినను మ్రోయుచు చెలంగెన్
నాయెడల కృపారసము నీయకవివేకమున నీయెడల నుండుతిది న్యాయమె లతాంగీ

జడలు దాలిచి తపసుల త్సందమునను
తమ్ముడును తాను ఘోర దుర్గమ్ములందు
కూరగాయలు కూడుగా కుడుత్సునట్టి
రాముడేరీతి లంకకు రాగలండు

విశేషములు

తనకు శాస్త్రీయమైన కవిత్వజ్ఞానం లేదనీ, భగవద్దత్తమైన వరప్రసాదంవల్లనే కవిత్వం చెబుతున్నాననీ ఆమె అన్నది. కాని ఆమె అనేక సంస్కృత, తెలుగు పూర్వకవులను స్తుతించిన విధం చూస్తే ఆమెకు వారి రచనలతో గణనీయమైన పరిచయం ఉండిఉండాలనిపిస్తున్నది. తనకు పాండిత్యం లేదని మొల్ల వ్రాసినది సంస్కృతిలో భాగమైన అణకువ, విధేయత వంటి లక్షణాల కారణంగానే తప్ప వేరే కాదని స్త్రీ రచయిత్రుల చరిత్ర వ్రాసిన నిడదవోలు మాలతి భావించారు.[2]

గ్రంధావతారికను బట్టి ఈమె తక్కిన కవయిత్రులవలె గురువునొద్ద విద్యనభ్యసించలేదని, గోపరపు శ్రీకంఠ మల్లేశుకృపను కవిత్వమును చెప్పనేర్చినదనియు తెలియుచున్నది. ఈమె కావ్యలక్షణాదికముల నేమియు నెరుంగక పోయినను నన్నయ తిక్కనాది కవుల గ్రంథములను మాత్రము క్షుణ్ణముగా చదివినదని ఈమె పద్యముల తీరు నడకలను బట్టి చెప్పవచ్చును.ఈమెపై పోతన కవితా ప్రభావము ఎక్కువగాగలదు. పలికెడది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట... అని పోతన చెప్పిన మాదిరిగనే ఈమె రామాయణమందు చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన, మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్ అని పల్కినది. సర్వగుణాకరుడు శ్రీరాముని చరితమును నెందరెన్ని విధముల రచన గావించినను నవ్యతకలిగి వీనులవిందై, యమృతపు సోనలపొందై యలరారు చుండుటతానీ గ్రంథమును చేపట్టుటకు కారణమని చెప్పినిది.మరియు అట్టి మహాత్ముని చరితమును కందువ మాటల్ నందముగా కూర్చి పఠితలకు శ్రోతలకు విందును గూర్తునని ముందంజ వేసింది. గ్రంథావతారిక యందు చెప్పబడిన విషయముల వల ఈమె పూర్వకవుల సంప్రదాయమునే అనుసరించి కావ్యారంభమున అయోధ్యాపుర వర్ణనతో ప్రారంభమై, దశరుధుని పుత్రకామేష్ఠి, శ్రీరామచంద్రుని జననమాదిగా రావణవధానంతరము ముగియుచున్నది.ఉత్తరరామాయణముని స్పృశించలేదు.

సాధారణముగా కవులు వర్ణనాదులయందు జటిలమై, సుదీర్ఘమైన సమాసము ల నొడగూర్చితమ పాండిత్యప్రకర్షను చూపింతురు.శాబ్దాడంబరమునకు ప్రాధాన్యమిచ్చి ప్రబంధయుగమున పుట్టిన మొల్ల శబ్దాడంబరమునకు లోనుగాక యలతి యలతి పదములతోనే రచన సాగించి పేరొనొందినది. చిన్ని చిన్ని గీతములలో పెద్ద భావముల నిముడ్చుట ఈమె సహజ గుణము. జడలు ధరియించి తపసుల చందమునను, దమ్ముడును దాను ఘోరదురమ్ములందు కూరగాయలు కూడుగాగుడుచునట్టి, రాముడేరీతి లంకకు రాగలడు. పదబంధముల యందు ఈమెకు చక్కని నేర్పు ఉంది.

తిక్కన వలె ఈమె పాత్రలను కండ్లకు కట్టునటుల చింత్రించ గలదు. హనుమంతుడు సముద్రమున దాటునపుడు ఈమె ఆప్రాంతమును చూచినది గాబోలు అనిపించును, ఆసముద్రోల్లంఘన మెంత సత్యసముపేతముగా వర్ణించెనో చూడండి:

మొగము బిగించి, పాదముల మొత్తముగానట నూదిత్రొక్కి,నీ
టుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున వార్చి బాహు ల
త్యగణితలీలమాచి, వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్
నగము సగంబు క్రుంగ గపినాధుడు నింగి దాటె రివ్వునన్!!!

ఇవి కూడా చూడండి

మూలములు, వనరులు

  1. *వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 94-97 (ఆంగ్లములో) [1]
  2. నిడదవోలు, మాలతి (2013). Telugu Women Writers, 1950-1975 (PDF). Retrieved 24 May 2015.
  • మొల్ల (తెలుగు వైతాళికులు సిరీస్ లో) - రచన: సి. వేదవతి - ప్రచురణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (2006)
  • 1957 భారతి మాస పత్రిక. వ్యాసము - ఆంధ్రకవయిత్రులు-మొల్ల వ్రాసినవారు నరసింహం.

బయటి లింకులు