సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 14: పంక్తి 14:
| staff =
| staff =
| circulation = 10,91,079 <ref name=ABC2018H1>{{cite web| url=http://www.auditbureau.org/files/JJ2018%20Highest%20Circulated%20amongst%20ABC%20Member%20Publications%20(across%20languages).pdf|title=Details of most circulated publications for the audit period Jan – Jun 2018 | publisher=[[Audit Bureau of Circulations (India)|Audit Bureau of Circulations]] |accessdate=27 December 2018}}</ref>
| circulation = 10,91,079 <ref name=ABC2018H1>{{cite web| url=http://www.auditbureau.org/files/JJ2018%20Highest%20Circulated%20amongst%20ABC%20Member%20Publications%20(across%20languages).pdf|title=Details of most circulated publications for the audit period Jan – Jun 2018 | publisher=[[Audit Bureau of Circulations (India)|Audit Bureau of Circulations]] |accessdate=27 December 2018}}</ref>
| headquarters = [[హైదరాబాద్]],[[ఆంధ్రప్రదేశ్]]
| headquarters = [[హైదరాబాద్]],[[తెలంగాణ]]
| ISSN =
| ISSN =
| website = http://www.sakshi.com
| website = http://www.sakshi.com

00:23, 19 ఆగస్టు 2019 నాటి కూర్పు

సాక్షి
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
ప్రచురణకర్తజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
సంపాదకులువి మురళి
స్థాపించినది2008-03-24
హైదరాబాదు,
కేంద్రంహైదరాబాద్,తెలంగాణ
Circulation10,91,079 [1]
జాలస్థలిhttp://www.sakshi.com

సాక్షి తొలిగానే 23 ఎడిషనులతో ప్రారంభించబడి అతి తక్కువ కాలంలో తెలుగు దినపత్రికలలో రెండవ స్థానానికి చేరింది.

చరిత్ర

సాక్షి మార్చి 24, 2008న 23 ఎడిషనులతో ప్రారంభించబడింది. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. తొలిగా ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడింది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతుంది. దీనిలో కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

తొలిదశలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు. సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై.పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు. [2] ప్రస్తుతం సంపాదకీయ సంచాలకుడుగా గా కె రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

అమ్మకాలు, చదువరులు

అమ్మకాలు

ఎబిసి 2018 జనవరి - జూన్ గణాంకాల ప్రకారం, పత్రిక సగటున 10,91,079 పత్రిక అమ్మకాలతో దేశంలో ఏడవ స్థానంలో నిల్చింది.[1] అంతకు ముందు అర్ధసంవత్సరపు గణాంకాలతో పోల్చితే 1.7% తగ్గుదల కనబడింది.

చదువరులు

ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 30,86,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 85,98,000 గా వుంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 4.7% పెరిగింది.[3]

‌విమర్శలు

సాక్షి చిహ్నం

ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.[4].

మూలాలు

  1. 1.0 1.1 "Details of most circulated publications for the audit period Jan – Jun 2018" (PDF). Audit Bureau of Circulations. Retrieved 27 December 2018.
  2. గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 79. {{cite book}}: Cite has empty unknown parameter: |1= (help)
  3. "Indian Readership Survey Q2,2019" (PDF). 2019-08-14. Archived from the original (PDF) on 2019-08-17.
  4. "సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక". ఆంధ్రప్రభ. 2010-11-22. Retrieved 2014-03-17.

బయటి లింకులు