దుద్వా జాతీయ ఉద్యానవనం: కూర్పుల మధ్య తేడాలు
చి వర్గం:భారతదేశ ఉద్యానవనాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:పర్యాటక ప్రదేశాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
[[వర్గం:భారతదేశ ఉద్యానవనాలు]] |
[[వర్గం:భారతదేశ ఉద్యానవనాలు]] |
||
[[వర్గం:పర్యాటక ప్రదేశాలు]] |
18:33, 24 అక్టోబరు 2019 నాటి కూర్పు
దుద్వా జాతీయ ఉద్యానవనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్ష్మీపూర్ ఖేర్ అనే ప్రాంతంలో ఉంది.
చరిత్ర
ఈ ఉద్యానవనం 490.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనం 1879 లో దుధ్వా పులుల రిజర్వ్ గా ఏర్పరిచారు. ఆ తరువాత 1958 లో ఈ ప్రాంతంలో ఉన్న చిత్తడి జింకల కోసం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా చేశారు.ఇలా 1977 లో ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా గుర్తించబడింది. ఈ ఉద్యానవనాన్ని 1987 లో పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు మరియు ‘ప్రాజెక్ట్ టైగర్’ పరిధిలోకి తీసుకువచ్చారు.
మరిన్ని విశేషాలు
ఈ ఉద్యానవనం యొక్క ప్రాంతం ఎగువ గంగా మైదానం పరిధిలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సాల్ అడవులు ఎల్లప్పుడూ దట్టంగా ఉంటాయి మరియు ఉత్తర ఉష్ణమండల అర్ధ-సతత హరిత అడవి, ఉత్తర భారత తేమతో కూడిన ఆకురాల్చే అడవి, ఉష్ణమండల కాలానుగుణ చిత్తడి అటవీ మరియు ఉత్తర ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవిగా వర్గీకరించవచ్చు. ఇందులో ఉన్న వృక్షజాలంలో సాల్, అస్నా, షిషామ్, జామున్, గులార్, సెహోర్ మరియు బహేరా వంటి జాతుల వృక్షాలు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో 19% పచ్చిక భూములు ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో నదులు, సరస్సులు మరియు చిత్తడి నేలలు ఉన్నాయి. ఈ ఉద్యానవనం భారతదేశంలోని ఉన్న అత్యుత్తమ అడవులలో ఒకటి, ఇందులో ఉన్న కొన్ని చెట్లు 150 సంవత్సరాలకు పైగా మరియు 70 అడుగుల (21 మీ) ఎత్తులో ఉంటాయి.