మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువకాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సైద్దాంతిక ధృక్పథం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూలత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవితా ప్రక్రియనే [[భీంపల్లి శ్రీకాంత్]] గారు సృష్టించిన " [[మొగ్గలు]] " కవితా ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియ కాదు.అర్ధం చేసుకొని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్తగా వచ్చే యువకవులకు ఇదీ మంచివేదిక లాంటి ప్రక్రియ అవుతుందనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు. |
ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువకాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సైద్దాంతిక ధృక్పథం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూలత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవితా ప్రక్రియనే [[భీంపల్లి శ్రీకాంత్]] గారు సృష్టించిన " [[మొగ్గలు]] " కవితా ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియ కాదు.అర్ధం చేసుకొని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్తగా వచ్చే యువకవులకు ఇదీ మంచివేదిక లాంటి ప్రక్రియ అవుతుందనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు. |
||
==మొగ్గలు ఆవిర్భావ |
==మొగ్గలు ఆవిర్భావ నేపథ్యం== |
||
ఈ మొగ్గలు ప్రక్రియ |
ఈ మొగ్గలు ప్రక్రియ యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా ''మొగ్గలు'' తెలుగు సాహిత్యములో విరబూసింది. ఈ మొగ్గలు ఆవిర్భవించడానికి ప్రేరణ తన గురువులు [[ఆచార్య మసన చెన్నప్ప]] గారే అంటారు భీంపల్లి. తెలుగు కవితా ప్రక్రియలైన నానీలు, నానోలు, గజళ్ళు,రుబాయిలు రాస్తున్నప్పుడు, అనేక రకాలైన వచనకవితా ప్రక్రియల్లో కవిత్వం రాస్తున్నవాడివి. నీవే ఒక ప్రక్రియ ఎందుకు ప్రారంభించకూడదు అంటూ భీంపల్లికి ఒక చక్కని సూచన చేశారు. కానీ అప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక కవితా ప్రక్రియలు ఉండటం, మళ్ళీ ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తే ఆదరించేవారు ఉంటారా అనే సందేహంతో వారి సూచనను సున్నితంగానే తిరస్కరించారు. అయినా నీకా శక్తి ఉందంటూ భీంపల్లి కవిత్వాన్ని పరామర్శ చేశారు. వారు చెప్పిన ఆర్నెల్లకు గాని ఈ ప్రక్రియ విరబూయలేదు. ఇది కూడా యాదృచ్చికంగా జరిగిన సంఘటన. వారి ఆశీస్సులతోనే ఈ మొగ్గలు విరబూస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని పరిమళింపజేస్తున్నాయి.మొగ్గలు మరింతగా విరబూయడానికి యువకవి బోల యాదయ్య మరో కారణమంటారు భీంపల్లి. అతని ప్రోత్సాహం, సహకారం వల్లే [[మొగ్గలు]] తెలుగు సాహిత్యంలో నిత్యనూతనంగా విరబూస్తూ పరిమళిస్తున్నాయంటారు భీంపల్లి. |
||
==మొగ్గలు నామకరణం== |
==మొగ్గలు నామకరణం== |
10:01, 26 అక్టోబరు 2019 నాటి కూర్పు
తెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స | |
---|---|
తెలుగు సాహిత్యం యుగ విభజన | |
నన్నయకు ముందు | సా.శ. 1000 వరకు |
నన్నయ యుగం | 1000 - 1100 |
శివకవి యుగం | 1100 - 1225 |
తిక్కన యుగం | 1225 - 1320 |
ఎఱ్ఱన యుగం | 1320 – 1400 |
శ్రీనాధ యుగం | 1400 - 1500 |
రాయల యుగం | 1500 - 1600 |
దాక్షిణాత్య యుగం | 1600 - 1775 |
క్షీణ యుగం | 1775 - 1875 |
ఆధునిక యుగం | 1875 – 2000 |
21వ శతాబ్ది | 2000 తరువాత |
తెలుగు భాష తెలుగు లిపి ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా తెలుగు సాహితీకారుల జాబితాలు | |
తెలుగు సాహిత్యంలో మూడు పాదాల ఆధునిక మినీ వచన కవితా ప్రక్రియ మొగ్గలు . ఈ కవితా ప్రక్రియను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భీంపల్లి శ్రీకాంత్ ప్రవేశపెట్టారు.
- ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
- మొగ్గలుగా కవితావనంలో విరబూయడానికి
- మొగ్గలు సాహిత్య క్షేత్రంలో పండే నిత్య పంట
ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువకాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సైద్దాంతిక ధృక్పథం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూలత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవితా ప్రక్రియనే భీంపల్లి శ్రీకాంత్ గారు సృష్టించిన " మొగ్గలు " కవితా ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియ కాదు.అర్ధం చేసుకొని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్తగా వచ్చే యువకవులకు ఇదీ మంచివేదిక లాంటి ప్రక్రియ అవుతుందనడంలో ఎలాంటి అత్యుక్తి లేదు.
మొగ్గలు ఆవిర్భావ నేపథ్యం
ఈ మొగ్గలు ప్రక్రియ యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా మొగ్గలు తెలుగు సాహిత్యములో విరబూసింది. ఈ మొగ్గలు ఆవిర్భవించడానికి ప్రేరణ తన గురువులు ఆచార్య మసన చెన్నప్ప గారే అంటారు భీంపల్లి. తెలుగు కవితా ప్రక్రియలైన నానీలు, నానోలు, గజళ్ళు,రుబాయిలు రాస్తున్నప్పుడు, అనేక రకాలైన వచనకవితా ప్రక్రియల్లో కవిత్వం రాస్తున్నవాడివి. నీవే ఒక ప్రక్రియ ఎందుకు ప్రారంభించకూడదు అంటూ భీంపల్లికి ఒక చక్కని సూచన చేశారు. కానీ అప్పటికీ తెలుగు సాహిత్యంలో అనేక కవితా ప్రక్రియలు ఉండటం, మళ్ళీ ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తే ఆదరించేవారు ఉంటారా అనే సందేహంతో వారి సూచనను సున్నితంగానే తిరస్కరించారు. అయినా నీకా శక్తి ఉందంటూ భీంపల్లి కవిత్వాన్ని పరామర్శ చేశారు. వారు చెప్పిన ఆర్నెల్లకు గాని ఈ ప్రక్రియ విరబూయలేదు. ఇది కూడా యాదృచ్చికంగా జరిగిన సంఘటన. వారి ఆశీస్సులతోనే ఈ మొగ్గలు విరబూస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని పరిమళింపజేస్తున్నాయి.మొగ్గలు మరింతగా విరబూయడానికి యువకవి బోల యాదయ్య మరో కారణమంటారు భీంపల్లి. అతని ప్రోత్సాహం, సహకారం వల్లే మొగ్గలు తెలుగు సాహిత్యంలో నిత్యనూతనంగా విరబూస్తూ పరిమళిస్తున్నాయంటారు భీంపల్లి.
మొగ్గలు నామకరణం
పూలు వికసించడానికి ముందు గలరూపం మొగ్గలు.మొగ్గ దశలో ఉన్న పువ్వులాగనే ఆనందాన్నిస్తుంది. పూలు పూసే క్రమంలో మొగ్గలనేవి ఒక దశను సూచిస్తున్నాయి. భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక కవితా రూపాలకు తానొక స్వీయ కవితా రూపాన్ని అందించి, దానికో పేరు పెట్టడం అతని నూతన కవితా తృష్ణను తెలియజేస్తుంది. మూడు చుక్కలు పెట్టి ముచ్చటగొలిపేవే మొగ్గలు. మొగ్గలు ప్రక్రియను భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికం గా మొదలు పెట్టారు. మొగ్గలను మొదటగా Nov- 20 / 2017 నాడు అంకురార్పణ చేసారు. భీంపల్లి వారి మొదటి మొగ్గలు కవిత
- కొన్ని అక్షరాలు చాలు
- కవిత్వాన్ని ఆవిష్కరించడానికి
- వాక్యం రసాత్మక కావ్యం
మొగ్గలు కవితా లక్షణాలు
- మొగ్గలు మూడు పాదాల కవిత్వం
- ఎలాంటి అక్షర నియమం కానీ ఛందస్సు కానీ లేదు.
- ఈ మొగ్గలు మూడుపాదాల కవిత్వం అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు.
- మూడు పాదాలలో మొదటి పాదంకు కొనసాగింపుగా రెండవ పాదం వుండాలి. అంటే మొదట పాదంలో వాక్యం అంతం కారాదు.
- మొదటి రెండు పాదాలు భావయుక్తంగా అర్ధవంతంగా చెబితే, సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ, మూడవపాదం ముక్తాయింపుగా ఉంటుంది.
- మరో విధంగా చెప్పాలంటే కొన్ని సార్లు మొదటి రెండు పాదాలు ఒక "సంశ్లిష్ట వాక్యం" లా ఉండాలి. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చ.
- ఈ మూడవపాదం ఒక నినాదంగా, సూక్తిగా చెప్పబడుతుంది. ఈ మూడవ పాదాన్ని చెప్పడంవల్ల కవి ఒక కొత్త నినాదాన్ని సూక్తిని చెప్పినట్లవుతుంది.
- వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి, ఈ నూతన ప్రక్రియకు ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు.
- మొగ్గలు కవితా ప్రక్రియలో మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవ పాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తం చేయడం ఎంతో రమణీయ పొందిక.
మొగ్గల కవితా వికాసం
మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ. మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్ ట్రాగ్రామ్ మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి. అంతేకాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్, అలాగే ఫేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్ ఉంది. వీటి నిర్వాహకులు భీంపల్లి శ్రీకాంత్. మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరిచూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాల అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు. ఇప్పటి వర్తమాన కవులనుంచి ప్రముఖ కవులదాకా వెయ్యిమందికిపైగా మొగ్గలు నేటికీ ఆవిష్కరిస్తున్నారు.ఇది చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యున్నత వేగంగా ఈ మొగ్గలు విరభూస్తున్నాయి. కవుల ఆదరణతోనే ఈ మొగ్గలు పరిమళిస్తున్నాయి. ఈ మొగ్గలు సులభమైన ప్రక్రియ కావడంతో విరివిగా కవులు వైవిధ్యమైన శైలితో భిన్నమైన వస్తువుతో మొగ్గలు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు కవితా ప్రక్రియను సహస్రాధిక కవులు రాయడం విశేషం.ప్రతి రోజూ "మొగ్గలు" గ్రూపులో మొగ్గలు ఎవరో ఒకరు రాస్తూనే ఉంటారు. పండుగలు, ప్రముఖుల జయంతులు, ప్రత్యేకమైన దినోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా మొగ్గలను రాస్తున్నారు.
తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు
నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, మన తెలంగాణ, మనం పత్రిక, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ, సూర్య, వార్త, గణేష్, మొదలైన దినపత్రికల్లో స్వర్ణపుష్పం, సాహితి ప్రస్థానం, విశాలాక్షి, అష్టాక్షరి, మొదలైన మాసపత్రికలో మగ్గాలు ప్రచురితమయ్యాయి. అలాగే అంతర్జాల పత్రికలైన విహంగ, నవ్య మీడియా, భాగ్యనగర్ పోస్ట్, ప్రతిలిపి వంటి వాటిలో కూడా మొగ్గలు పరిమళించాయి. ఏ కవితా ప్రక్రియ అయినా వికసించాలంటే పత్రికా సంపాదకుల సహకారం ఉండాల్సిందే, వారి సహకారం ఉంటేనే, ఏ ప్రక్రియ అయినా రాణించగలదు. ఆయా పత్రికల సంపాదకుల ప్రోత్సాహంతో నేటికీ మొగ్గలు పత్రికల్లో వెలుగు చూస్తున్నాయి.
అంతర్జాతీయ మాసపత్రికలో మొగ్గలు
అమెరికా సిలికానాoద్ర వారి సుజనరంజిని అంతర్జాల మే నెల మాసపత్రిక కవితా స్రవంతి శీర్షికలో వారి భీంపల్లి శ్రీకాంత్ వారి చదువు మొగ్గలు, ప్రచురితమయ్యాయి. రెండు నెలలకు ఓసారి వచ్చే పశ్చిమ బెంగాల్ వారి ఒరవడి ఏడవ సంచిక గ్రీష్మ సంచికలో కవి హృదయం అనే భీంపల్లి శ్రీకాంత్ వారి మొగ్గలు ప్రచురితమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి అక్షర దీపిక మే నెల మాసపత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి నాన్న మొగ్గలు ప్రచురితమయ్యాయి. అమెరికా వారి తెలుగు మాస పత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి *అమ్మ మొగ్గలు* ప్రచురితమయ్యాయి.ఇంకా మధురవాణి, సంచిక, విహంగ తెలుగుతల్లి కెనడా తదితర వెబ్ మ్యాగజైన్ లలో వీరి మొగ్గలు ప్రచురితమయ్యాయి.
మొగ్గలు కవితా సంపుటాలు
మొగ్గలు కవితా పక్రియలో భీంపల్లి శ్రీకాంత్ మొగ్గలు పేరుతోనే ఆవిష్కరించారు. ఇందులో 300 మొగ్గలు ఉన్నాయి. అనంతరం యువకవి ఉప్పరి తిరుమలేష్ చిరు మొగ్గలును వెలువరించారు. బోల యాదయ్య మట్టి మొగ్గలును రచించారు. ధనాశి ఉషారాణి సిరిరేఖలును వెలువరించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని భీంపల్లి శ్రీకాంత్,ఉప్పరి తిరుమలేష్ బతుకమ్మ మొగ్గలును వెలువరించారు. అలాగే వందమంది కవులతో భీంపల్లి శ్రీకాంత్, గుంటి గోపి, సృజామి ల సంపాదకత్వంలో బతుకమ్మ మొగ్గలు కవితా సంకలనాన్ని వెలువరించారు.