భీంపల్లి శ్రీకాంత్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 37: | పంక్తి 37: | ||
}} |
}} |
||
డాక్టర్ [[భీంపల్లి శ్రీకాంత్]] [[మహబూబ్ నగర్ జిల్లా]]<nowiki/>కు చెందిన యువకవి. వృత్తి రీత్యా [[ఉపాధ్యాయుడు| |
డాక్టర్ [[భీంపల్లి శ్రీకాంత్]] [[మహబూబ్ నగర్ జిల్లా]]<nowiki/>కు చెందిన యువకవి. వృత్తి రీత్యా [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయులు]]<nowiki/>లు. |
||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
10:07, 26 అక్టోబరు 2019 నాటి కూర్పు
Bheempally Srikanth డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ | |
---|---|
జననం | డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 24.11.1976 గ్రామం : వేముల, మండలం : మూసాపేట |
నివాస ప్రాంతం | మహబూబ్ నగర్ |
వృత్తి | ప్రభుత్వ ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి, పరిశోధకులు, విమర్శకులు |
మతం | హిందూ |
వెబ్సైటు | |
http://palamurupillalamarri.blogspot.in/ |
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులులు.
జీవిత విశేషాలు
భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశారు.పాలమూరు సాహితి అనే సాహిత్య సంస్థను, పాలమూరు కల్చరల్ అకాడమీ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య, సాంస్కృతిక సేవను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక లోనూ ,సింగిడి తెలంగాణ రచయితల సంఘం లోనూ క్రియాశీలకంగా పనిచేశారు.
రచనల జాబితా
పాలమూరు సాహితి ద్వారా తన సంపాదకత్వంలో అంజలి , పాలమూరు కవితా సుమాలు అనే పుస్తకాలను వెలువరించారు. తరువాత జిల్లాకు చెందిన వందమంది కవుల కవితలను సేకరించి పాలమూరు కవిత పుస్తకాన్ని 2004 లో వెలువరించారు. ఒక జిల్లా నుంచి వచ్చిన ఏకైక వచన కవితా సంకలనమిది.తెలంగాణ మీద హైకూలు రాసి సోది పేరుతో 2004లో వెలువరించారు.అక్షర తపస్వి ఆచార్య ఎస్వీ రామారావు అనే డాక్యుమెంటరికీ రచన చేశారు.కృష్ణా పుష్కరాలకు సంబంధించి పుష్కర కృష్ణవేణి అనే ప్రామాణికమైన గ్రంథాన్ని రచించారు.ప్రేమికులు ప్రయివేట్ ఆడియో ఆల్బానికి పాటలు రాశారు. నేటి విద్యార్థి, నిజం అనే సింగిల్ ఎపిసోడ్లకు మాటలు రాశారు. నాలో ఉన్న ప్రేమ అనే సింగిల్ ఎపిసోడ్ కు కథ, మాటలు రాశారు. ఛాంపియన్ అనే టెలిఫిల్మ్ కు కథ, మాటలు, పాటలు రాయడంతో పాటు దర్శకత్వం వహించారు[1]. ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు (పాగ పుల్లారెడ్డి, మందుముల నరసింగరావు)ల జీవిత చరిత్రలను రచించారు. అలాగే తెలంగాణ తొలి నవల (ఆశాదోషం) నవలను వెలుగులోకి తెచ్చి తన సంపాదకత్వంలో వెలువరించారు.
సంపాదకత్వంలో వచ్చిన పుస్తకాలు
తెలంగాణ అమరవీరుల కవితా సంకలనం అమరం కు సంపాదకత్వం వహించారు.సోది పుస్తకాన్ని తెలంగాణకు పెద్ద దిక్కైన కాళోజి నారాయణరావు కు అంకితమిచ్చారు.
పురస్కారాలు
1996 లో నందమూరి తారక రామారావు స్మారక సాహిత్య అవార్డును అందుకున్నారు. సాహిత్యంలో వీరు చేసిన కృషికి 2002లో జిల్లా స్థాయి ఉత్తమ యూత్ అవార్డు ను అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి సెమినార్లలో పాల్గొన్నారు. 30కి పైగా అవార్డులను అందుకున్నారు. వీరి కవితలకు,కథలకు బహుమతులు కూడా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు,కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక పత్రికలలో వెలువడ్డాయి.
మొగ్గలు ఆధునిక మినివచన కవిత ప్రక్రియ
భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక తెలుగు వచన కవిత్వంలో *మొగ్గలు* అనే కవితా ప్రక్రియ 2017లో ప్రారంభించాడు. ఇది మూడు పాదాల కవిత్వం.మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే మూడవ పాదం దానిని సమర్థించేదిగా ఉంటుంది.
మూలాలు
- ↑ పాలమూరు కవిత,సంపాదకులు:భీంపల్లి శ్రీకాంత్,పాలమూరు సాహితీ, మహబూబ్ నగర్,జనవరి-2004,పేజి-160