కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి యర్రా రామారావు, పేజీ కె. వి. కె. రామారావు ను కె.వి.కె.రామారావు కు తరలించారు: వికీ ప్రామాణికం
(తేడా లేదు)

16:59, 26 అక్టోబరు 2019 నాటి కూర్పు

కొరిటాల వెంకటకోదండ రామారావు
K.V.K
జననం1940,నవంబరు,23
గుంటూరు జిల్లా,నరసరావుపేట మండలం, నరసరావుపేట పట్టణం
విద్యబి.ఎస్.సి., ఎం.ఎ., డి.ఎల్.ఎస్.సి.,
వృత్తివిశ్రాంత గ్రంధాలయాధికారి, (యస్.యస్.యన్.కళాశాల)
నరసరావుపేట రంగస్థలి గౌరవ అధ్యక్షులు
ఈనాడు జర్నలిష్టు
సేఫ్ ఫార్మాష్యూటికల్స్ మాజీ యమ్.డి.
నరసరావుపేట టౌనుహాలు మాజీ కార్యదర్శి
నరసరావుపేట ద్విశతాభ్ది ఉత్సవాల సావనీర్ కమిటీ అధ్యక్షులు
భార్య / భర్తసరస్వతి
పిల్లలుబాబు శ్రీనివాస్,శ్రీదేవి,జయశ్రీ
తండ్రివేంకటరత్తయ్య, దత్తు తండ్రి పేరయ్య
తల్లిరామకోటమ్మ, దత్తు తల్లి రత్తమ్మ

కె.వి.కె.రామారావు జర్నలిస్టు. అతను ఈనాడు రామారావు గా అందరికి సుపరిచితుడు.

జీవిత విశేషాలు

రామారావు నరసరావుపేట పట్టణంలో 1940 నవంబరు 23న కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ దంపతులకు జన్మించాడు. అతని దత్తత తల్లిదండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మలు.

బాల్యం,విద్యాభ్యాసం

ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణం, పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు, దుర్గా ఫొటో స్టూడియో మధ్యలో ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ ఇతని ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవాడు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవాడు.రాదాకృష్ణ చిన్న గిన్నెలో భస్మాన్ని వెలిగించి ఫొటో తీసేవాడు.బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో తీసేవాడు.ఆ తరువాత ప్లాష్ లైట్లు యుగం వచ్చింది.అలా ఒక్కటొక్కటీ రాదాకృష్ణ దగ్గర చిన్నతనంలో నేర్చుకున్నాడు. ఉత్సాహంగా తను ఏరోజు ఏమి నేర్చుకుందీ,తన తోటివారికి చెప్పేవాడు.ఆరో తరగతి నుండి యస్.యస్.యల్.సి. (11వ తరగతి) వరకు మునిసిపల్ హైస్కూలులో చదివాడు.

యవ్వనం, ఉన్నత విద్యాభ్యాసం

దస్త్రం:KVK Ramarao-1.jpg
నందమూరి తారక రామారావు నరసరావుపేట పట్టణం వచ్చిన సందర్బంగా ఈనాడు విలేఖరిగా కెవికె రామారావు

ఇంటర్మీడియట్ నరసరావుపేట పట్టణంలోని యస్.యస్.యన్.కళాశాలలో చదివాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఆటల వైపు మొగ్గు చూపాడు.ఇంతలో ఇతని తండ్రి వెంకటరత్తయ్య ఉద్యోగరీత్యా చీరాల బదిలీ అయినందున, చీరాల వి.ఆర్.ఎస్. అండ్ వై.ఆర్.ఎన్. కళాశాలలో బి.ఎ. డిగ్రీ చదివిన సమయంలోను అదే ఆటలనందు ఆసక్తి కొనసాగించాడు.కళాశాలలో రెండు సంవత్సరాలు క్రికెట్ టీము కెప్టెన్ గా వ్యవరించాడు.మరో వైపు నాటకాల నందు ఆసక్తి పెంపొందించుకొని, డైరెక్షన్ పరంగా నడక సాగించాడు.ఆంధ్రా యూనివర్శిటీ నుండి లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందాడు.

ఉద్యోగ ఆరంగేట్రం

దస్త్రం:KVK Ramarao-4.jpg
ఉత్తమ విలేఖరి అవార్డు అందుకున్న సందర్బంగా ఈనాడు అధినేత రామోజీరావుతో కెవికె రామారావు

లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తాను ఇంటర్మీడియట్ చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరాడు. ప్రధాన వృత్తిలోకి చేరినా ఇతనికి ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,సాంస్కృతిక రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అంతంతమాత్రంగా జరిగేవి. ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు పనిచేసేవాడు. అతను కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవాడు.సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని అతనుకున్న నమ్మంకంతో ఒప్పు కునేవాడు కాదు.అతనికి ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు. అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి, అతనిలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటిక పోటీలను 12 సంవత్సరాలు వరుసగా రామారావు ఆధ్వర్యంలో జరిగాయి.కళాశాలలోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు దాదావు ఇతని కృషితోనే జరిగాయి.గోవాలో జరిగిన ఆల్ ఇండియా గ్రంధాలయాధికారులు కాన్ఫెరెన్స్ సందర్బంగా గ్రంధాలయాల నిర్మాణానికి కేంధ్ర ప్రభుత్వ గ్రాంటును ఇస్తున్నట్టు తెలుసుకుని,డిల్లీ వెళ్ళి 4,65000/- తీసుకువచ్చి 1979లో గ్రంధాలయ నిర్మాణం చేసిన ఘనత రామారావుదే.

ఈనాడు రామారావుగా గుర్తింపు

దస్త్రం:KVK Ramarao-2.jpg
నరసరావుపేట రంగస్థలి నాటకోత్సవాల సందర్బంగా సినీనటి జయప్రదతో కెవికె రామారావు

ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు 1979 లో ఈనాడు విలేకరిగా చేరి 1998 వరకు పనిచేసాడు.ఆ రకంగా పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు చాలా దగ్గరయ్యాడు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలు,గ్రామాల వార్తలు ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి. వార్తలు నిష్పక్షపాతంగా ఉండేవి. జరిగింది జరిగినట్లుగా రాయటంలో ఆయనకు సరిలేరు అనే భావన ప్రజలలో ఉండేది. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు (విలేఖరి) గా ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు.అలాగే రామారావు ఈనాడు దిన పత్రిక అధినేత రామోజిరావు గుర్తింపుకూడా పొందాడు.

సేఫ్ మేనేజింగ్ డైరెక్టరుగా పదవీ నిర్వహణ

నరసరావుపేట - సత్తెనపల్లి రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీ,దాని మూడు అనుబంధ కంపెనీలు నష్టాల బాటలో పయనించే సమయంలో మేనేజింగ్ డైరెక్టరుగా 2000 సంవత్సరంలో పదవీ భాధ్యతలు స్వీకరించి, 2008 వరకు పనిచేసాడు.కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి లాభాలవైపు మరలించి మొదటిసారిగా షేర్ హోల్డర్సుకు డివిడెంట్లు పంచిన మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా పేరు పొందాడు.కంపెనీ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటించి,కంపెనీ నుండి వెలువడే వ్యర్ధ పదార్థాలు ప్రజలకు హాని కలిగించని రీతిలో పర్యావరణం కాపాడాడు.ఇతను పని చేసిన సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులుగా ఉన్న అనేకమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాడు.ప్రభుత్వం నుండి మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ఉత్తమ కంపెనీ అవార్టును స్వీకరించాడు.

పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు

ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి.[1] అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి, కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించాడు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గా నియమితులయ్యాడు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి, సావనీరును గొప్పగా తన చేతుల మీదుగా తీర్చిదిద్దాడు. అంతేగాదు 1916 ఆ ప్రాంతంలో నరసరావుపేటకు మొదటిసారిగా శౌరయ్య బ్రదర్స్ తొలి బస్సును ప్రవేశపెట్టిన విషయంపై "మా ఊరొచ్చిన మరబండి" అనే వ్వాసం బస్సును గురించి, ఆ బస్సును నడుపుటకు అప్పడు వాళ్లు పడిన సాదక బాధకాలు నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికలో కళ్లకు కనపడినట్లు రాసారు.[2]


మూలాలు

  1. నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 సందేశం (నాంది)
  2. నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 ఇదీ   వరస|"మా ఊరొచ్చిన మరబండి"| పేజీ నెం.99

వెలుపలి లంకెలు