హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27: పంక్తి 27:
|chief1_name=-
|chief1_name=-
|nativename=
|nativename=
|preceding1=[[హైదరాబాదు మహానగరపాలక సంస్థ]] భాగం
|preceding1=[[హైదరాబాదు మహానగరపాలక సంస్థ]]<nowiki/>లో భాగం
|logo=
|logo=
|logo_width=
|logo_width=

06:18, 15 జనవరి 2020 నాటి కూర్పు

హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
సంస్థ వివరాలు
స్థాపన 1975
Preceding agency హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగం
Dissolved 2008
Superseding agency హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ
అధికార పరిధి హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
ప్రధానకార్యాలయం హైదరాబాదు
17°21′57″N 78°28′33″E / 17.36583°N 78.47583°E / 17.36583; 78.47583
కార్యనిర్వాహకులు -, చైర్మన్
-, వైస్ చైర్మన్
Parent agency తెలంగాణ ప్రభుత్వం
Child agency గృహ మరియు పట్టణ అభివృద్ధి సంస్థ
వెబ్‌సైటు
http://www.hmda.gov.in/huda/index.html

హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) 1975లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశ తీర్మానం ఆధారంగా ఏర్పాటుచేయబడింది. 2008లో పరిసర మండలాలతో విలీనం చేయడం ద్వారా దీని అధికార పరిధి విస్తరించబడి హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థగా మారింది.[1] 2004 నుండి 2008 వరకు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హుడా చైర్మన్‌గా పనిచేశాడు.[2]

విధులు - బాధ్యతలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యురాలు సరోజినీ పుల్లారెడ్డి ఈ సంస్థ తొలి చైర్‌పర్సన్‌గా, ఐఏఎస్ వసంత్ బవా తొలి వైస్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు.

తొలినాళ్ళలో హుడా కార్యకలాపాలు హైదరాబాదు మహానగర ప్రాంతంలో ఉండేవి. 1976 ప్రారంభంలో, అహ్మదాబాదుకు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సిఇపిటి) ఒక మండల ప్రణాళికను రూపొందించి, క్రిస్టోఫర్ చార్లెస్ బెన్నింగర్ ఆధ్వర్యంలో యూసఫ్‌గూడ ప్రాంతంలో ఒక టౌన్‌షిప్‌ను సిద్ధం చేయడానికి ముందుకువచ్చింది. ఇందులో 200 నుండి 1000 చదరపు అడుగుల వరకు ఉన్న స్థలాల్లో 2000 కంటే ఎక్కువ ఇళ్ళు ఉన్నాయి. ఫుట్‌పాత్‌లు, వీధి దీపాలు, నీటి సరఫరా, మురుగునీటి సౌకర్యాలను అందించబడింది. ఇళ్ళు నిర్మించుకోవడానికి కేంద్ర అభివృద్ధి ఆర్థిక సంస్థ నుండి గృహ మరియు పట్టణ అభివృద్ధి సంస్థ (హడ్కో) ద్వారా తక్కువ వడ్డీ రుణాలు పొడిగించబడ్డాయి. ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ) నుండి విస్తరణ దశలో ఉంది. హుడా ముఖ్య ప్రణాళిక ప్లానర్‌గా వాస్తుశిల్పి అనంత్ భిడే ఉన్నాడు.

ఇతర వివరాలు

  1. సరోజినీ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో మాస్టర్‌ ప్లాన్‌, శాటిలైట్‌ టౌన్‌షిప్‌, హస్తినాపురం శాటిలైట్‌ టౌన్‌షిప్‌ వంటి పథకాలు విజయవంతంగా అమలయ్యాయి.[3]

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 25 March 2009. Retrieved 12 January 2020.
  2. The Hindu, Andhra Pradesh (12 June 2004). "Sudheer Reddy takes charge as HUDA chief". Archived from the original on 13 జనవరి 2020. Retrieved 13 January 2020.
  3. ఆంధ్రజ్యోతి, వార్తలు (11 January 2016). "మహిళా మేయర్‌ సరోజినీ పుల్లారెడ్డి". Archived from the original on 13 January 2016. Retrieved 12 January 2019.

ఇతర లంకెలు