గోల్కొండ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎మూలాలు: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు → వర్గం:ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్
పంక్తి 239: పంక్తి 239:
[[వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
[[వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
[[వర్గం:దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]

11:47, 24 మార్చి 2020 నాటి కూర్పు

గోల్కొండ ఎక్స్‌ప్రెస్
Golconda Express
ఆలేరు వద్ద డబ్ల్యుఎపి4 లోకోమోటివ్‌తో గోల్కొండ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్
స్థానికతతెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుగుంటూరు
గమ్యంసికింద్రాబాద్ జంక్షన్
ప్రయాణ దూరం385 km (239 mi)
సగటు ప్రయాణ సమయం8 గం. 15 ని. ఎగువ, దిగువ
ప్రయాణము కొరకు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)17201 / 17202
సదుపాయాలు
శ్రేణులుఎసి చైర్ కార్, రెండవ సిట్టింగ్, నిబంధనలు లేనివి
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం46.91 km/h (29.15 mph) హాల్టులతో సరాసరి
మార్గపటం

గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మధ్య నడిచే ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్. 17201/17202 సంఖ్యలతో నడిచే ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ కు చెందినది. మొత్తం 383 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించేందుకు సుమారు 8 గంటల సమయం తీసుకుంటూ నెమ్మదిగా ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందింది. సికింద్రాబాద్, గుంటూరు మధ్య ఉన్న మొత్తం 24 (గుంటూరు, సికింద్రాబాద్ సహా) స్టేషన్లలోనూ ఈరైలు ఆగుతుంది.

పేరు

హైదరాబాదు నగరంలోని చారిత్రక గోల్కొండ కోట పేరును ఈ రైలుకు పెట్టారు. గోల్కొండ కోట హైదరాబాదు లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. హైదరాబాదును పరిపాలించిన కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ కోటను నిర్మించారు.

రికార్డులు

1973లో ప్రారంభించిన ఈ రైలు అప్పట్లో భారతదేశంలోనే అతి వేగంగా ఆవిరితో నడిచే ప్యాసింజర్ రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది.[1]

సమయ పట్టిక

గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరు- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈ క్రింది సమయ పట్టికను అనుసరించి నడుస్తుంది

సంఖ్య స్టేషన్ పేరు రాక బయలుదేరుట ఆగు సమయం ప్రయాణ దూరం
1 గుంటూరు జంక్షన్ (GNT) ఆరంభం 05:45 0 0 కి.మీ.
2 గోగాముక్ (PDKN) 05:52 05:53 1 నిమిషం 6 కి.మీ.
3 నంబూరు (NBR) 05:59 06:00 1 నిమిషం 9 కి.మీ.
4 మంగళగిరి (MAG) 06:10 06:11 1 నిమిషం 20 కి.మీ.
5 విజయవాడ జంక్షన్ (BZA) 06:45 07:00 15 ని. 32 కి.మీ.
6 రాయనపాడ్ (RYP) 07:13 07:14 1 నిమిషం 44 కి.మీ.
7 కొండపల్లి (KI) 07:28 07:29 1 నిమిషం 50 కి.మీ.
8 ఎర్రుపాలెం (YP) 07:46 07:47 1 నిమిషం 74 కి.మీ.
9 మధిర (MDR) 07:59 08:00 1 నిమిషం 89 కి.మీ.
10 బోనకలు (BKL) 08:13 08:14 1 నిమిషం 105 కి.మీ.
11 ఖమ్మం (KMT) 08:35 08:36 1 నిమిషం 134 కి.మీ.
12 డోర్నకల్ జంక్షన్ (DKJ) 08:54 08:55 1 నిమిషం 156 కి.మీ.
13 గార్ల (GLA) 09:00 09:01 1 నిమిషం 161 కి.మీ.
14 మహబూబాబాద్ (MABD) 09:15 09:16 1 నిమిషం 180 కి.మీ.
15 కే సముద్రం (KDM) 09:27 09:28 1 నిమిషం 196 కి.మీ.
16 నెక్కొండ (NKD) 09:40 09:41 1 నిమిషం 211 కి.మీ.
17 వరంగల్ (WL) 10:13 10:15 2 నిమిషాలు 241 కి.మీ.
18 కాజీపేట్ జంక్షన్ (KZJ) 10:33 10:35 2 నిమిషాలు 251 కి.మీ.
19 ఘన్ పూర్ (GNP) 10:56 10:57 1 నిమిషం 271 కి.మీ.
20 జనగాం (ZN) 11:14 11:15 1 నిమిషం 299 కి.మీ.
21 ఆలేర్ (ALER) 11:29 11:30 1 నిమిషం 313 కి.మీ.
22 భువనగిరి (BG) 11:59 12:00 1 నిమిషం 336 కి.మీ.
23 మౌలాలీ (MLY) 12:38 12:40 2 నిమిషాలు 377 కి.మీ.
24 సికింద్రాబాద్ జంక్షన్ (SC) 13:45 ముగింపు 0 383 కి.మీ.

విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ రైలు 15 నిమిషాల పాటు ఆగుతుంది. ఇక మిగతా అన్ని స్టేషన్లలో కేవలం 1 నిమిషం నుంచి 2 నిమిషాల సేపు మాత్రమే ఆగుతుంది.

మార్గం

గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు గుంటూరులో ఉదయం 5:45 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కు మధ్యాహ్నం 13:45గంటలకు చేరుతుంది[2]. తిరుగు ప్రయాణంలో రెండవ రేక్ రైలు సికింద్రాబాద్ లో మధ్నాహ్నం 13:05 గంటలకు బయలు దేరి గుంటూరు స్టేషన్ కు రాత్రి 21:20 గంటలకు చేరుతుంది. ఆలేరు, ఖాజీపట, వరంగల్లు, విజయవాడ స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.

రైలు ప్రమాదాలు

జులై 2, 2003 ఉదయం వరంగల్ సమీపంలో గొల్గొండ ఎక్స్ ప్రెస్ రైలు వంతెన పైనుంచి కింద పడిపోయింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రయాణికులు చనిపోయారు.[3][4] 1999లోనూ అప్పటి ఆంధ్రప్రదేశ్ (ప్రస్తుతం తెలంగాణ) రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ఘన్ పూర్ (స్టేషన్) సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది.

చిత్రమాలిక

17202 గుంటూరు హద్దుతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నల్గొండ జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషను ప్రవేశిస్తున్న చిత్రం

మూలాలు

  1. Bryan Morgan (1985), The Great Trains, Rh Value Publishing, p. 206
  2. "Golconda Express timetable". cleartrip.com. Retrieved 2015-07-21.
  3. "Golconda Express toll rises to 21". Rediff. July 3, 2003. Retrieved 2015-07-21.
  4. V Subrahmanyam and D Krishna Reddy (July 2, 2003). "Golconda Express derails, 18 dead". Retrieved 2015-07-21.