మొఘల్ చిత్రకళ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 42: పంక్తి 42:


మొగలుల కాలంలో చాలా కాలంవరకు పోర్ట్రెయిట్‌లు పురుషులవే ఉండేవి. ఉన్నత వంశీయులు, రాచకుటుంబీకులైన పురుషులను వారి వారి సేవకురాళ్లు లేదా ఉంపుడుగత్తెలు సేవిస్తూ ఉండగా గీసిన చిత్రాలే ఎక్కువగా ఉండేవి మొఘల్ రూపపట చిత్రాలలో రాచకుటుంబాలకు చెందిన స్త్రీ మూర్తుల ప్రాతినిధ్యం గురించి పండితుల మధ్య చర్చ జరిగింది. కొంతమంది పండితులు జహానారా బేగం, ముంతాజ్ మహల్ వంటి ప్రసిద్ధ స్త్రీ మూర్తుల యొక్క పోలికలు ఏవీ లేవని పేర్కొన్నారు, మరికొందరు లఘు చిత్రాలలో గల స్త్రీ మూర్తుల చిత్రాలలో వారి ఉనికిని పేర్కొంటున్నారు. దీనికి రుజువుగా వీరు ఫ్రీయర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో భద్రపరిచబడిన మొఘల్ రాకుమారుడు 'దారా షికో' యొక్క ఆల్బమ్ లోని మిర్రర్ పోర్ట్రెయిట్ లో గల ప్రసిద్ధ స్త్రీ మూర్తులను ఉదహరిస్తున్నారు.
మొగలుల కాలంలో చాలా కాలంవరకు పోర్ట్రెయిట్‌లు పురుషులవే ఉండేవి. ఉన్నత వంశీయులు, రాచకుటుంబీకులైన పురుషులను వారి వారి సేవకురాళ్లు లేదా ఉంపుడుగత్తెలు సేవిస్తూ ఉండగా గీసిన చిత్రాలే ఎక్కువగా ఉండేవి మొఘల్ రూపపట చిత్రాలలో రాచకుటుంబాలకు చెందిన స్త్రీ మూర్తుల ప్రాతినిధ్యం గురించి పండితుల మధ్య చర్చ జరిగింది. కొంతమంది పండితులు జహానారా బేగం, ముంతాజ్ మహల్ వంటి ప్రసిద్ధ స్త్రీ మూర్తుల యొక్క పోలికలు ఏవీ లేవని పేర్కొన్నారు, మరికొందరు లఘు చిత్రాలలో గల స్త్రీ మూర్తుల చిత్రాలలో వారి ఉనికిని పేర్కొంటున్నారు. దీనికి రుజువుగా వీరు ఫ్రీయర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో భద్రపరిచబడిన మొఘల్ రాకుమారుడు 'దారా షికో' యొక్క ఆల్బమ్ లోని మిర్రర్ పోర్ట్రెయిట్ లో గల ప్రసిద్ధ స్త్రీ మూర్తులను ఉదహరిస్తున్నారు.

రిజా అబ్బాసి మాదిరిగా గీసినటువంటి ఏక వ్యక్తి (single figures) రూప చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందలేదు, కాని ప్యాలెస్ నేపధ్యంలో ప్రేమికుల దృశ్యాలను పూర్తిగా చిత్రించిన రూపపటాలు తరువాత కాలంలో బాగా జనాదరణ పొందాయి. ముఖ్యంగా చిత్రాలలో ముస్లిం లేదా హిందువుల యొక్క పవిత్ర పురుషులను, ఆధ్యాత్మిక మూర్తులను చూపించే కళా ప్రక్రియ బాగా ప్రాచుర్యం పొందింది.


==మొఘల్ చిత్రకళా వికాసం==
==మొఘల్ చిత్రకళా వికాసం==

02:43, 19 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

ముఘల్ శైలిలో బాబర్ సభలోని ఒక దృశ్యము

మొఘల్ చిత్రకళ (ఆంగ్లం: Mughal Painting) దక్షిణాసియాలో విలసిల్లిన ఒక ప్రత్యేకమైన చిత్రకళాశైలి. దీనికి మూలం పర్షియన్ లఘుచిత్రలేఖనం. మంగోల్ (చైనీస్) చిత్రకళా స్ఫూర్తితో వృద్ధి చెందిన పర్షియన్ చిత్రకళాశైలి, ఈ మొఘల్ చిత్రకళాశైలికి స్ఫూర్తి నిచ్చింది. భారతదేశాన్ని పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల ఆస్థానంలో 16,17 శతాబ్దాల కాల పరిదిలో ఈ శైలి పరిఢవిల్లింది. హుమాయూన్ ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రకళ అక్బర్ కాలంలో ఉన్నతస్థాయికి వికసించింది. తరువాత జహంగీర్ కాలంలో శిఖర స్థాయికి చేరుకొని, ఆ తరువాత ఔరంగజేబు కాలంలో క్షీణించి అదృశ్యమైంది. మొఘల్ చిత్రకళా శైలిలో మన్సూర్, అబ్దుల్ సమద్, అబుల్ హాసన్ ఉస్తాద్, మురాద్, దశవంత్, కేశవ్, ముకుంద్ మొదలైన వారు మేటి చిత్రకారులుగా వెలుగొందడమే కాకుండా మొఘల్ దర్బారులను సైతం అలంకరించారు. ఈ చిత్రకళాశైలిపై హిందూ, బౌద్ధ, జైన మతాలు ప్రభావం చూపాయి.

ఈ శైలిలో రూపొందించిన చిత్రాలు లఘుచిత్రాలుగా (miniatures) వున్నాయి. సాధారణంగా వీటి పరిమాణం అంగుళాల కొలతల్లో ఉంటాయి. భారతదేశంలో లఘుచిత్రాలను నూలువస్త్రంపై, చేతితో తయారైన కాగితంపై , చెక్క ఫలకాలపైన గీయడం అనేది మొఘల్ చక్రవర్తుల కాలం నుండి ప్రారంభమైంది. మొఘల్ చిత్రకళకు పూర్వం మనదేశంలో లఘుచిత్రణ కేవలం తాళపత్రాలపై మాత్రమే జరిగేది. అక్బర్ చక్రవర్తి పోషణలో ఆగ్రాలో ఒక ఇంపీరియల్ చిత్రశాల స్థాపించబడింది. మొఘల్ చిత్ర శైలిలో అద్భుతమైన చిత్రాలను సృష్టించడంలో దర్బారుకు చెందిన మేటి చిత్రకారులతో పాటు ఈ చిత్రశాలకు చెందిన వందలాది చిత్రకారుల సామూహిక కృషి తోడ్పడింది.

మొఘల్ చిత్రకళ దాదాపుగా లఘుచిత్రాలకే పరిమితమైందని చెప్పవచ్చు. వీరి లఘుచిత్రాలలో కొన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రాలుగా ఉంటే, మరికొన్ని ఆల్బమ్ (muraqqa) చిత్రాలుగా వున్నాయి. మొఘల్ చిత్రకారులు ఆల్బమ్‌ల కోసం అనేక లఘుచిత్రాలలో పుష్పాలు, మొక్కలు, పక్షులు, జంతువులను ప్రధానంగా తీసుకొని వాటిని ఎంతో వాస్తవికతతో చిత్రీకరించారు.

మొఘల్ చిత్రకళా శైలిలో పర్షియన్ క్లాసిక్ గ్రంధాలతో పాటు భారతీయ గ్రంధాలకు కూడా చిత్రరచన కొనసాగింది. వీటిలో పేర్కొనతగ్గది. "హంజనామా" అనే పర్షియన్ బృహత్గ్రంధం. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ గ్రంథంలోని దృశ్యాలకు సంబంధించి సుమారు 1400 కు పైగా చిత్రాలను 100 మందికి పైగా భారతీయ చిత్రకారులు సమిష్టికృషితో ఒక పెద్ద నూలువస్త్రంపై చిత్రించడం జరిగింది. ఇదే కోవలో బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా, పాద్ షా నామా వంటి రాచరిక 'స్వీయ చరిత్ర' గ్రంధాల లోని దృశ్యాలకు చిత్ర రచన సాగింది. అదేవిధంగా భారత, రామాయణ, హరివంశం, శుకసప్తతి గాధలు వంటి కావ్యాలను పర్షియన్ భాషలో అనువదించి వాటికి సైతం రమణీయమైన చిత్రాలను గీయడం జరిగింది.

మొఘల్ చిత్రకళలో వైవిధ్యత అత్యధికం. వీరి చిత్రాలలో వైవిధ్యభరితమైన దృశ్యాలు విరివిరిగా కనిపిస్తాయి. ముఖ్యంగా దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు, ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలు మొదలైనవి అనేకంగా అలరిస్తాయి.

ప్రారంభంలో ఇలస్ట్రేషన్ (illustrations) చిత్రణగా మొదలైన ఈ చిత్రకళ తరువాత కాలంలో రూపపట (Portrait) చిత్రణలోకి వికసించింది. మాతృక అయిన పర్షియన్ చిత్రకళతో పోలిస్తే మొఘల్ చిత్రకళాకారులు లఘుచిత్రాల కంటే వాస్తవిక రూప చిత్రపటాల్లొనే మరింత ఆసక్తిని కనపరిచారు. రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవికధోరణితో వున్న ఆ నాటి రూపపట చిత్రాలు మొఘల్ చిత్రకళలో ఒక నూతన ఒరవడిని సృష్టించాయి.

ఔరంగజేబు కాలంలో రాజాదరణను కోల్పోయిన అనేక చిత్రకారులు ఇతర రాజ్యాలకు తరలిపోయారు. తదనంతరకాలంలో మొఘల్ చిత్రకళా శైలి ఇతర హిందూ, ముస్లిం ప్రాంతీయ రాజ్యాలకు, ఆ తరువాత సిక్కు ప్రాంతీయ రాజ్యాలకు వ్యాపించింది. ఇది ఆయా సంస్థానాలలో అనేక ప్రాంతీయ చిత్రకళా శైలులను అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. ఈ కాలంలోనే చిత్రకళ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హిందూ పురాణేతిహాస గాథా చిత్రణతో ముడిపడటం కనిపిస్తుంది. అయితే ప్రాంతీయ చిత్రకళారీతులకు సంబందించిన చిత్రాలు రాశి పరంగా ఎక్కువగా వున్నప్పటికీ వాసి పరంగా తక్కువ సొగసుతో అభివ్యక్తమయ్యాయి. వీటిని తరచుగా "మొఘల్ తదనంతర", "ఉప-మొఘల్" లేదా "ప్రాంతీయ మొఘల్" చిత్రకళగా అభివర్ణిస్తారు.

మొఘల్ చిత్రకళ-ఆవిర్భావం

మొఘల్ చిత్రకళకు మూలం పర్షియన్ చిత్రకళ. ఈ పర్షియన్ చిత్రకళ మంగోలియన్ చిత్రకళ చేత ప్రభావితమైంది. పర్షియాలో సఫావి (Safawi) రాజవంశీయులు ఈ చిత్రకళాభిమానంతో మంగోలియన్ చిత్రకారులను తమదేశానికి ఆహ్వానించి వారిచే తమ ప్రజలకు ఈ చిత్రకళారీతిని నేర్పింప చేశారు. పర్షియా సఫావి సుల్తాన్ 'షా ఇస్మాయిల్' కాలంలో, బిహజాద్, మిరాక్ వంటి విఖ్యాత చిత్రకారుల కృషితో ఈ మంగోలియన్ చిత్రకళ పూర్తిస్థాయి పర్షియన్ చిత్రకళగా రూపుదిద్దుకొంది. భారతదేశంలో మొఘుల్ చక్రవర్తి హుమాయూన్ పదవీచ్యుతుడైనపుడు దేశం వదిలి పర్షియాలో తలదాచుకొన్నాడు. సహజంగా చిత్రకళాభిమాని అయిన హుమాయూన్ పర్షియాలో ఆశ్రయం పొందుతున్నప్పుడు, అక్కడ బిహజాద్ వంటి మేటి ఆస్థాన చిత్రకారుల పరిచయ సంపర్కంతో ఈ పర్షియన్ చిత్ర శైలి పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. క్రీ.శ. 1555 లో తిరిగి భారతదేశానికి వచ్చిన తరువాత తనతోపాటు మీరు సయ్యద్ ఆలీ, క్వాజా అబ్దుస్ సమద్ అనే విఖ్యాత చిత్రకారులను తీసుకొనివచ్చాడు. ముఖ్యంగా క్వాజా అబ్దుస్ సమద్ రాకతో భారతదేశంలో మొఘల్ చిత్రకళ ప్రారంభం అయినట్లుగా చెప్పవచ్చు. 1562 నాటికి సుల్తాన్ దర్బారులో కొలువుతీరిన పర్షియన్ చిత్రకారులు భారతీయ చిత్రకారులకు తమ నూతన చిత్రకళారీతులను నేర్పించడం ప్రారంభించారు. దానితో భారతదేశంలో మొఘల్ చిత్రకళ వేళ్లూనుకోవడం ప్రారంభమైంది.

ఈ విధంగా మంగోలియన్ చిత్రకళ పర్షియాలో పర్షియన్-మంగోలియన్ పద్దతిగా ఏర్పడింది. 1560 వరకు భారతదేశంలో ఈ పద్దతి అమలులో ఉండేది 1562 నాటికి ఇది అప్పటికే భారతదేశంలో వాడుకలో వున్న స్థానిక విజయనగరం, బీజాపూర్, అహ్మద్ నగర్, రాజపుత్ర చిత్రకళా పద్దతులతో కలసి భారత-పర్షియా-మంగోలియా సమ్మేళన రీతిగా రూపొందింది. దీనినే మొఘల్ చిత్రకళా రీతి అని వ్యవహరిస్తారు. 1562 లో చిత్రించిన "అక్బర్ దర్బార్ లో తాన్ సేన్ ప్రవేశించిన దృశ్యం" చిత్రపటంలో ఈ మొఘల్ చిత్రకళా రీతి మొట్టమొదటగా కనిపిస్తుందని విమర్శకులు పేర్కొంటారు.

మొఘల్ చిత్రకళా విస్తృతి

మొఘల్ చిత్రకళా విస్తృతి ప్రధానంగా రెండు దిశలలో కొనసాగింది.
1. గ్రంథ చిత్రణ (Illustrated books)
2. దర్బారీ చిత్రణ

ఒక గ్రంధం లోని విషయాలను వివరిస్తూ గీయబడిన చిత్రాలను ఇలస్ట్రేషన్స్ (గ్రంథస్త విషయవివరణ చిత్రాలు)గా పేర్కొంటారు. ఈ విధంగా ఒక గ్రంధానికి చిత్రాలు చేర్చబడటాన్ని ఇలస్ట్రేటెడ్ చిత్రరచన లేదా గ్రంథ చిత్రణ గా వ్యవహరిస్తారు. ఆగ్రాలోని రాచరిక చిత్రశాలకు చెందిన మొఘల్ చిత్రకారులు పర్షియన్ భాషలో వున్న వందలాది గ్రంధాలకు రమ్యమైన చిత్రాలు గీసేవారు. ఈ విధంగా రాచరిక చిత్రశాల పర్షియన్ క్లాసిక్ గ్రంధాలతో పాటు అనువాదిత భారతీయ కావ్యాలకు సైతం ఎక్కువ సంఖ్యలో గ్రంథ ప్రతులను (ఇలస్ట్రేటెడ్ కాపీ) రూపొందించేది.

దర్బారీ చిత్రకళ మొఘల్ చక్రవర్తుల ప్రీతర్ధ్యం రూపుదిద్దుకొంది. దీనిలో భాగంగా వైవిధ్యభరితమైన దృశ్యాలు కోకోల్లలుగా చిత్రించబడ్డాయి. దర్బారు దృశ్యాలు, సంఘటనలతో పాటు ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణులు, వేట దృశ్యాలు, యుద్ధ దృశ్యాలతో కూడిన చిత్రాలు అనేకంగా అలరిస్తాయి. దీనిలో మరో భాగమైన రూపచిత్రణ (portraiture) లో చక్రవర్తి, అతని రాచకుటుంబీకులు, ఉన్నతోద్యోగులను చిత్రించిన మూర్తి చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి.

గ్రంథ చిత్రణ

మొఘల్ చిత్ర శైలిలో వెలువడిన సచిత్ర గ్రంధాలలో (ఇలస్ట్రేటెడ్ గ్రంధాలు) 1550 నాటి తుతినామ గ్రంధం బహుశా మొట్టమొదటిది కావచ్చు. ఆగ్రా రాచరిక చిత్రశాలలో రూపుదిద్దుకున్న ఈ గ్రంధం ప్రస్తుతం అమెరికా లోని క్లీవ్‌ల్యాండ్ ఆర్ట్‌ మ్యూజియంలో ఉంది. దీనిలో సుమారు 250 వరకు సరళమైన లఘుచిత్రాలు (miniatures) వున్నాయి. దీనితో పోలిస్తే అక్బర్ చే పురమాయించబడిన "హంజనామా" అనే పర్షియన్ బృహత్గ్రంధం (4800 పేజీలతో, 46 సంపుటిలతో ఉండేది) చాలా విశిష్టమైనది. అసాధారణమైన పెద్ద పేజీలతో (69 సెం.మీ. x 54 సెం.మీ.) వున్న ఈ గ్రంధంలో అందులోను సాధారణ కాగితం మీద కాకుండా ఒక పెద్ద నూలు వస్త్రంపై దాదాపు 1,400 కు పైగా లఘుచిత్రాలు చిత్రించబడ్డాయి. అమీర్ హంజా అనే పారశీక వీరుని ప్రేమగాధావృత్తంతో కూడి వున్న ఈ గ్రంథంలో శృంగార సన్నివేశాలు, బెదిరింపు సంఘటనలు, తృటిలో తప్పించుకోనే దృశ్యాలు, హింసాత్మక దృశ్యాలు-ఇత్యాది దృశ్యాలను వివరిస్తూ అనేక చిత్రాలు గీయబడ్డాయి. ఈ గ్రంధానికి బొమ్మలు సమకూర్చడం 1562 లో ప్రారంభమై 1577 వరకూ అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం కొనసాగింది. ఈ బృహత్కార్యానికి మొదట సయ్యద్ ఆలీ తబ్రీజి తరువాత అబ్దుస్ సమద్ చిత్రకారులు నేతృత్వం వహించారు. ఈ అసాధారణ చిత్ర రచనా కృషిలో భారతదేశం నలుమూలల నుండి వచ్చిన సుమారు వంద మందికి పైగా చిత్రకారులు సమిష్టిగా పాలుపంచుకున్నారు. అక్బర్ యొక్క రాతప్రతి (manuscript) లో దాదాపు 1400 లఘుచిత్రాలు ఉన్నాయి. ఈ గ్రంధంలో ప్రతీ పేజీని తెరవగానే ఒక లఘుచిత్రం, ఆ చిత్రాన్ని చూసిన చక్రవర్తికి అర్థమయ్యేటట్లు ఆ పేజీ వెనుక భాగాన చిత్రానికి సంబంధిత వచనం వ్రాయబడింది. 1580 నాటికి మొఘల్ రాచరిక చిత్రశాల ఇటువంటి అనేక గ్రంధాలకు చిత్రరచన చేయించింది.

మొఘల్ రాజవంశపు జీవిత చరిత్ర గ్రంధాలు కూడా లఘుచిత్రాలతో చిత్రించబడ్డాయి. ఈ సంప్రదాయం బాబర్ నామా గ్రంధంతో ప్రారంభమైనప్పటికీ, అక్బర్ కి ముందున్న కాలంలో రాచరిక జీవితచరిత్ర గ్రంధాలకు చిత్రాలు సమకూర్చబడలేదు. తుర్కీ భాషలో వున్న బాబర్ స్వీయ చరిత్ర 'తుజ్ కీ బాబరీ'ను అతని మనవడు అక్బర్ పర్షియన్ భాషలోకి బాబర్ నామా (1589) పేరుతొ అనువదింపచేసాడు. తరువాత దానిని నాలుగు సుందరమైన సచిత్ర రాతప్రతులలో చిత్రింపచేసాడు. ఒక్కొక్క ప్రతిలో 183 లఘుచిత్రాలు ఉన్నాయి. అక్బర్ 1590 లలో తన వంశ పూర్వీకుడైన తైమూర్ జీవిత చరిత్ర 'జాఫర్ నామా' (యాజ్డి విరచితం) గ్రంధానికి సచిత్ర రచన చేయించాడు. కాని అతని అత్త గుల్ బదన్ బేగం, తన తండ్రి హుమాయున్ జీవిత చరిత్రను వ్రాసినప్పటికీ, దానికి సంబందించిన సచిత్ర రాతప్రతి పూర్తిగా లభ్యం కాలేదు. అక్బర్ జీవిత చరిత్రను అబ్దుల్ ఫైజీ 'అక్బర్ నామా' పేరుతొ పర్షియన్ భాషలో వ్రాయడం జరిగింది. 1594 లో పూర్తయిన అక్బర్ నామా సచిత్ర గ్రంథ చిత్రరచనాకృషిలో బసవన్ వంటి ప్రఖ్యాత చిత్రకారునితో సహా మొత్తం 49 మంది చిత్రకారులు పాలుపంచుకున్నారు. 116 లఘుచిత్రాలతో వున్న అక్బర్ నామా సచిత్ర రాత ప్రతి ప్రస్తుతం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో వుంది. అదేవిధంగా జహంగీర్ స్వీయ చరిత్ర జహంగీర్ నామా (తజక్-ఎ-జహంగీరి), షాజహాన్ జీవిత చరిత్ర 'పాద్ షా నామా' గ్రంధాలకు రమణీయమైన లఘుచిత్రాలు కూర్చడం జరిగింది. పాద్ షా నామా గ్రంధం (1650)తో రాచరిక స్వీయ చరిత్ర గ్రంధాలకు ఘనంగా సచిత్ర రచనలు చేయడం ఆగిపోయింది.

మొఘల్ చిత్రకళా రీతిలో ప్రాచీన పర్షియన్ కావ్య సంపుటిలకు కూర్చిన లఘుచిత్రాలు సాధారణంగా రాశిలో తక్కువ (ఇరవై వరకు) అయినప్పటికి వాసిలో మాత్రం ఘనంగా వున్నాయి. అక్బర్ కాలంలో ప్రాచీన పర్షియన్ గ్రంధాలతో పాటు పర్షియన్లోకి అనువాదితమైన భారత, రామాయణ, హరివంశం లాంటి హిందూ పురాణేతిహాసాలకు, కావ్యాలకు కూడా సుందరమైన చిత్రాలు గీయడం జరిగింది. ఉదాహరణకు అక్బర్ వద్ద పర్షియన్ అనువాదిత రామాయణానికి సంబంధించి ఒక సచిత్ర గ్రంథ రాతప్రతి, రంజ్ నామా (మహాభారతానికి పర్షియన్ అనువాదం) కు సంబంధించి నాలుగు సచిత్ర గ్రంథ రాతప్రతులు వుండేవి. ఆక్బర్ శుకసప్తతి గాథలను తూతినామా పేర పర్షియన్ భాషలోకి అనువదింపచేయడమే కాకుండా దానిని రమణీయమైన చిత్రాలతో అలకరింపచేసాడు. ఈ కాలంలోనే లీలావతి, లైలా-మజ్ను వంటి అనేక గ్రంధాలు చక్కని చిత్రాలతో వెలువడ్డాయి.

జంతువులు, మొక్కల చిత్రణ

మొఘల్ చిత్రకళలో ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న అంశం మొక్కలు, జంతువుల చిత్రణ. వీటిని మొఘల్ చిత్రకారులు అత్యంత ప్రతిభావంతంగా జీవకళ ఉట్టిపడేటట్లు వాస్తవికతతో చిత్రించారు. బాబర్ స్వీయ చరిత్ర 'బాబర్ నామా' లో పుష్పాల, మొక్కలు, జంతువులకు సంబంధించిన అనేక వర్ణనలు వున్నాయి. అక్బర్ కాలంలో ఈ గ్రంధానికి, దానిలోని వర్ణనల కనుగుణంగా అందమైన చిత్రాలు జతపరచబడ్డాయి. పక్షులు, జంతువుల చిత్రాలు గీయడంలో ఉస్తాద్ మన్సూర్ మంచి ప్రావీణ్యం కనపరిచాడు. మొఘల్ చిత్రకళా చరిత్రకారుడైన మిలో సి. బీచ్ ప్రకారం మొఘల్ చిత్రకళలో సహజత్వం ఉట్టిపడుతుండేది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన తొలినాటి జంతు చిత్రాలను పరిశీలిస్తే, వారు తాము ఎన్నుకొన్న చిత్రవస్తువు (theme) ను కొత్తగా, వినూత్నంగా పరిశీలించడం కన్నా, ఆ వస్తువు లోనే వైవిధ్యత ఎక్కువగా ప్రదర్శించారని తెలుస్తుంది. మొఘల్ చిత్రకారులు చిత్రించిన జంతువుల బొమ్మలపై, చైనా దేశంలో కాగితంపై తయారైన సాదా సీదా జంతు చిత్రాల ప్రభావం కొంతమేరకు ఉందని గుర్తించడం జరిగింది.

రూపపట చిత్రణ (portraiture)

మొఘల్ యుగంలో చిత్రకారులు మొదటినించి వాస్తవికతను ఆధారంగా చేసుకొని రూపపట చిత్రాలను రూపొందించారు. నిజానికి వాస్తవిక చిత్రణ (realistic portraiture) అనేది పర్షియన్ లఘుచిత్రకళలో గాని లేదా అంతకు పూర్వం వున్న భారతీయ చిత్రకళలో గాని ఒక లక్షణంగా ఎన్నడూ లేదు. ఒక విధంగా మొఘల్ చిత్రకారులతోనే వాస్తవిక రూపపట చిత్రాలను గీయడం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రూపపట చిత్రాలన్నీ టెంపెరా పద్దతిలో గీయబడ్డ నీటి వర్ణ చిత్రాలు. అక్బర్ పాలనా కాలం వరకూ మొఘల్ చిత్రకారులు రూపపటాలను పార్శ్వ దృష్టితో చిత్రించేవారు. ఈ పద్దతిలో వ్యక్తి ముఖం నేరుగా వీక్షకుడిని చూస్తుంటే, మిగిలిన శరీరంలో సగభాగం వీక్షకుడి వైపు తిరిగివుండేది. పాదాలు కూడా సమంగా కాకుండా ఒకదాని వెనుక వున్నట్లుగా చిత్రించేవారు. ఇటువంటి పర్షియన్ సంప్రదాయ చిత్రణ, జహంగీర్ కాలంలో ప్రక్కకు పెట్టబడింది. ముఖ్యంగా జహంగీర్ కాలంలో రూపపట చిత్రణలో సృజనాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. మూడువంతుల ప్రొఫైల్ లో చిత్రాలను రూపొందించే పద్దతి ఆచరణలోకి వచ్చింది. పాదాలు, చేతుల చిత్రణలో కూడా సృజనాత్మకత మరింతగా పెరిగింది.

మొగలుల కాలంలో చాలా కాలంవరకు పోర్ట్రెయిట్‌లు పురుషులవే ఉండేవి. ఉన్నత వంశీయులు, రాచకుటుంబీకులైన పురుషులను వారి వారి సేవకురాళ్లు లేదా ఉంపుడుగత్తెలు సేవిస్తూ ఉండగా గీసిన చిత్రాలే ఎక్కువగా ఉండేవి మొఘల్ రూపపట చిత్రాలలో రాచకుటుంబాలకు చెందిన స్త్రీ మూర్తుల ప్రాతినిధ్యం గురించి పండితుల మధ్య చర్చ జరిగింది. కొంతమంది పండితులు జహానారా బేగం, ముంతాజ్ మహల్ వంటి ప్రసిద్ధ స్త్రీ మూర్తుల యొక్క పోలికలు ఏవీ లేవని పేర్కొన్నారు, మరికొందరు లఘు చిత్రాలలో గల స్త్రీ మూర్తుల చిత్రాలలో వారి ఉనికిని పేర్కొంటున్నారు. దీనికి రుజువుగా వీరు ఫ్రీయర్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో భద్రపరిచబడిన మొఘల్ రాకుమారుడు 'దారా షికో' యొక్క ఆల్బమ్ లోని మిర్రర్ పోర్ట్రెయిట్ లో గల ప్రసిద్ధ స్త్రీ మూర్తులను ఉదహరిస్తున్నారు.

రిజా అబ్బాసి మాదిరిగా గీసినటువంటి ఏక వ్యక్తి (single figures) రూప చిత్రాలు అంతగా ప్రజాదరణ పొందలేదు, కాని ప్యాలెస్ నేపధ్యంలో ప్రేమికుల దృశ్యాలను పూర్తిగా చిత్రించిన రూపపటాలు తరువాత కాలంలో బాగా జనాదరణ పొందాయి. ముఖ్యంగా చిత్రాలలో ముస్లిం లేదా హిందువుల యొక్క పవిత్ర పురుషులను, ఆధ్యాత్మిక మూర్తులను చూపించే కళా ప్రక్రియ బాగా ప్రాచుర్యం పొందింది.

మొఘల్ చిత్రకళా వికాసం

హుమాయూన్ (1530–40 నుండి 1555–56 వరకు)

అక్బర్ (1556-1605)

జహంగీర్ (1605–25)

షాజహాన్ (1628–59)

ఔరంగజేబు (1658–1707)

కడపటి మొఘలాయిలు (1707-1806)

మొఘల్ చిత్రకారులు

భారతీయ కళలపై మొఘల్ చిత్రకళ ప్రభావం

దృశ్యమాలికలు

రిఫరెన్సులు

బయటి లింకులు

మూలాలు