పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 20: పంక్తి 20:


== ఇతర వివరాలు ==
== ఇతర వివరాలు ==
# ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు), నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు వంటి వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం లేదు. దీనిపై ప్రయాణించే వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సివుంటుంది.
# ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు), నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు వంటి వాహనాలకు, ఎడ్లబండ్లు, తోపుడుబండ్లు, వస్తురవాణా వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం లేదు. దీనిపై ప్రయాణించే వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సివుంటుంది.
# దీని నిర్మాణ ప్రణాళికలో మొదట్లో ప్లైఓవర్ మొత్తంలో ఎక్కడా కూడా సబ్ వే నిర్మాణాల ప్రస్తావన లేదు. ప్రజా అవసరాల దృష్ట్యా లక్ష్మీనగర్ జంక్షన్,బుద్వేల్ జంక్షన్, అరాంఘర్ జంక్షన్ వంటి 3 ప్రాంతాలలో సబ్ వే నిర్మాణం చేశారు.
# దీని నిర్మాణ ప్రణాళికలో మొదట్లో ప్లైఓవర్ మొత్తంలో ఎక్కడా కూడా సబ్ వే నిర్మాణాల ప్రస్తావన లేదు. ప్రజా అవసరాల దృష్ట్యా లక్ష్మీనగర్ జంక్షన్, బుద్వేల్ జంక్షన్, అరాంఘర్ జంక్షన్ వంటి 3 ప్రాంతాలలో సబ్ వే నిర్మాణం చేశారు.


== ఇవికూడా చూడండి ==
== ఇవికూడా చూడండి ==

04:00, 21 జూన్ 2020 నాటి కూర్పు

పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
PV_Narasimha_Rao_Expressway.jpg
రాజేంద్రనగర్ వద్ద పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే
Location
Major citiesహైదరాబాదు, తెలంగాణ

పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. భారతదేశ మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆసియాలోనే అతి పెద్దది. శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.[1]

చరిత్ర

2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. 8 లైన్ల వెడల్పున్న రహదారి ప్రణాళికను, తరువాత 4 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్చబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి దీనికి పునాదిరాయి వేయగా.. 28 నెలల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికతో 2005, అక్టోబరులో దీని నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నిర్మాణ పనులు ఆగిపోయి 2009లో పూర్తయింది. 2009, అక్టోబరు 2న ప్రారంభించాల్సివుండగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించడంతో ప్రారంభోత్సవం నిలిపివేయబడింది.

2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రోశయ్య మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.[2][3] ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ. 600 కోట్లు ఖర్చు చేశారు. ఎక్స్‌ప్రెస్‌వే మెహదీపట్నంలోని సరోజినిదేవి కంటి ఆసుపత్రి వద్ద ప్రారంభమై రేతిబౌలి, లక్ష్మీనగర్, అత్తాపూర్, హైదర్‌గూడా, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్ మీదుగా వెళ్ళి అరాంఘర్ సమీపంలో జాతీయ రహదారి 44తో కలుస్తోంది.

ఇతర వివరాలు

  1. ద్విచక్ర, త్రిచక్ర (ఆటోలు), నాలుగు చక్రాల సెవన్ సీటర్ ఆటోలు వంటి వాహనాలకు, ఎడ్లబండ్లు, తోపుడుబండ్లు, వస్తురవాణా వాహనాలకు ఈ ఎక్స్‌ప్రెస్ వే పైకి ప్రవేశం లేదు. దీనిపై ప్రయాణించే వాహనాలు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సివుంటుంది.
  2. దీని నిర్మాణ ప్రణాళికలో మొదట్లో ప్లైఓవర్ మొత్తంలో ఎక్కడా కూడా సబ్ వే నిర్మాణాల ప్రస్తావన లేదు. ప్రజా అవసరాల దృష్ట్యా లక్ష్మీనగర్ జంక్షన్, బుద్వేల్ జంక్షన్, అరాంఘర్ జంక్షన్ వంటి 3 ప్రాంతాలలో సబ్ వే నిర్మాణం చేశారు.

ఇవికూడా చూడండి

మూలాలు

  1. తెలుగు వెబ్ దునియా, తెలుగు వార్తలు (19 October 2009). "ప్రారంభమైన పివి ఎక్స్‌ప్రెస్ వే". www.telugu.webdunia.com. Retrieved 17 June 2020.
  2. "Longest Elevated Expressway inaugurated in Hyderabad". India Trends. 9 October 2009. Archived from the original on 21 July 2011. Retrieved 17 June 2020.
  3. "Hyderabad gets India's longest flyover". NDTV. 20 October 2009. Archived from the original on 31 May 2018. Retrieved 17 June 2020.