రక్తకన్నీరు (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with 'రక్త కన్నీరు ప్రసిద్ధి పొందిన రంగస్థల నాటకం. వామపక్ష భావజాల...'
 
పంక్తి 20: పంక్తి 20:


== బాహ్య లంకెలు ==
== బాహ్య లంకెలు ==

* [https://www.youtube.com/watch?v=Mf6-XmbQhxs Nagabhushanam Raktha kanneeru Drama + india andhra pradesh bhimavaram telugu hindu city]

14:11, 6 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

రక్త కన్నీరు ప్రసిద్ధి పొందిన రంగస్థల నాటకం. వామపక్ష భావజాల నేపథ్యంలో సామాజిక ఇతివృత్తాలతో రూపొందిన ఈ నాటకంలో నాగభూషణం నటనాచాతుర్యం రంగస్థలాన్ని శోభాయమానం చేసింది. ఇది ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం.

విశేషాలు

ఆనాడు తమిళ నాట ఎం.ఆర్‌.రాధా, మనోహర్‌ ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం రంగస్థల సంచలనం. ఈ నాటకాన్ని తమిళ వేదికలపై 5000ల సార్లు ప్రదర్శించాడు. ఈయన రూపంలో దగ్గర పోలికలున్న తెలుగులో నాగభూషణం నాటక రంగం నుంచి చిత్ర రంగంలోకి వచ్చి ఏదినిజం చిత్రంతో హీరో అయ్యాడు. ఆ చిత్రం పరాజయం పొందటంతో మరి చిత్రాలు రాక చిన్న వేషాలకు పరిమితం అయ్యాడు. రక్తకన్నీరు నాటక ప్రదర్శన నాగభూషణాన్ని ఆకర్షించింది. అప్పుడు ఎంఆర్‌ రాధా నాటకాన్ని హక్కులు కోరాడు. తాను తెలుగులో తాను వేస్తానన్నాడు. అందుకు రాధా ఒప్పుకున్నాడు.

తెలుగులోకి అనువాదం

ఆ రోజుల్లో తమిళంలో శ్రీ యమ్. ఆర్. రాధా గారు ఒక కుష్టువాని పాత్రను ధరించి ఒక నాటకాన్ని ప్రదర్శించేవారు. దానికి తమిళ దేశంలో విశేష ఆదరణ లభించింది. ఆ నాటకాన్ని చూసిన నాగభూషణంగారు, ఆ తమిళ నాటకాన్ని తెలుగు వాతావరణానికి సరిపోయేటట్లుగా అనువదించమని అధ్యాపకుడు, రచయిత అయిన పాలగుమ్మి పద్మరాజు ని కోరారు. పద్మరాజు ఆ పనిని విజయవంతంగా పూర్తిచేశాడు. అదే’రక్తకన్నీరు’నాటకం. ఈ నాటకాన్ని తెలుగులొ రాయించి అద్భుతంగా ప్రదర్శించారు. నాగభూషణంగారు ఆ నాటకాన్ని తన స్వంత బృందంతో దేశమంతా కొన్ని వేల ప్రదర్సనలు ఇవ్వటమేకాకుండా, ‘రక్తకన్నీరు’ నాగభూషణంగా ప్రసిద్ధి చెందారు. [1]

విజయవంతం

తెలుగులో రక్తకన్నీరు నాటకం పెద్ద హిట్‌ అయ్యింది. అయితే తమిళంలో ఎం.ఆర్‌. రాధా ఎప్పటికప్పుడు రాజకీయ వైఫల్యాలను నాటకంలో వ్యంగ్యంగా దుయ్యబట్టడంతో ఆ నాటకం అంటే తమిళులు చెవి కోసుకునేవారు. తెలుగులో కూడా అంతకంటే పెద్దగా తెలుగు ప్రజలు నాగభూషణం నాటకానికి బ్రహ్మరధం పట్టారు.[2] నాగభూషణం ఇంటిపేరు రక్తకన్నీరుగా మారిపోయింది.[3]

తొలి ప్రదర్శనలకు వచ్చిన ప్రతిస్పందన 'రక్తకన్నీరు' మీద నాగభూషణానికి మమకారాన్ని పెంచింది. ఈ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించాడు. మద్రసులోనే కాక తెలుగు నాట అనేక ముఖ్య పట్టణాలలో ఈ నాటకం ప్రదర్శితమైంది. ప్రదర్శనల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నాటకానికి ఆదరణ హెచ్చింది. జనం తండోపతండాలుగా నాటక ప్రదర్శనకు వచ్చేవారు. సూర్యాపేటలో ఈ నాటక ప్రదర్శనని జనం కిక్కిరిసి చూశారు. తెలంగాణలోని అనేక పట్టణాల్లో ఈ ప్రదర్శనకు వచ్చిన స్పందన అనూహ్యం. అంతగా జనాన్ని ఆకట్టుకున్న నాటకం 'రక్తకన్నీరు'లో శారద, వాణిశ్రీ[4]లు కూడా భిన్నమైన పాత్రల్ని పోషించారు.

ఆ నాటకం ఇతివృత్తం, అందులో నాగభూషణం వేసిన పాత్ర, ఆయన చెప్పే డైలాగులు జనాన్ని విపరీతంగా ఆకర్షించేవి. ఆయనే స్వయంగా దాదాపు రెండువేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. ఒకవైపున సినిమారంగంలో అవకాశాలు పెరుగుతున్నప్పటికీ 'రక్తకన్నీరు' ప్రదర్శనలు మాత్రం ఆపలేదు. ఒకనెలలో దాదాపు ముప్పయి ప్రదర్శనలు ఇచ్చారు. కొన్నిసార్లు రాత్రి రెండుసార్లు నాటక ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలున్నాయి. తర్వాతకాలంలో సినిమాలకు ఎక్కువ సమయం ఇవ్వాలన్న ఒత్తిడి పెరగడంతో 'రక్తకన్నీరు' ప్రదర్శనలు తగ్గించారు.[5]

ఈ నాటకం తెలుగునాట ఐదువేల సార్లకు పైగా ప్రదర్శించబడింది.

మూలాలు

  1. "కథలరాజు- పద్మరాజు". మాలిక పత్రిక (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-09-05. Retrieved 2020-09-06.
  2. "జనం మెచ్చిన నటుడు | సోపతి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-09-06.
  3. "నటభూషణం... విలనిజానికి భూషణం నాగభూషణం". www.yuvnews.com. Retrieved 2020-09-06.
  4. P, Vimala (2020-08-03). "Legendary Actress Vanisri Turns 72 – A Style Icon of Telugu Films". telugu navyamedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-06.
  5. "Visalaandhra Daily Telugu News Paper -కామెడీ విలన్ల డిక్షనరీ... రాధా". 54.243.62.7. Retrieved 2020-09-06.

బాహ్య లంకెలు