నాయిని నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు. |
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు. |
||
== తెలంగాణ ఉద్యమం == |
== తెలంగాణ ఉద్యమం - రాజకీయ ప్రస్థానం == |
||
తొలి, మలి దశల [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమాల్లో]] చురుకుగా పాల్గొన్నాడు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి [[ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచాడు. 1978లో [[టి. అంజయ్య]]పై గెలిచాడు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిని.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు. |
|||
== రాజకీయ ప్రస్థానం == |
|||
ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు. |
ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు. |
||
04:27, 22 అక్టోబరు 2020 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నాయిని నరసింహారెడ్డి | |||
| |||
తెలంగాణ తొలి హోం శాఖామంత్రి
| |||
పదవీ కాలం జూన్ 2, 2014 – డిసెంబరు 11, 2018 | |||
నియోజకవర్గం | ముషీరాబాద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మే 1934 (age 89) నేరడుగొమ్ము, నల్గొండ జిల్లా, తెలంగాణ | ||
మరణం | 2020 అక్టోబరు 22[1] | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | నాయిని అహల్య | ||
సంతానం | నాయిని దేవేందర్ రెడ్డి , సమతా రెడ్డి |
నాయిని నరసింహారెడ్డి (మే 12, 1934 - అక్టోబరు 22, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచితుడైన నరసింహారెడ్డి, తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి, రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర మొదటి హోంమంత్రిగా పనిచేశాడు.
జీవిత విషయాలు
నరసింహారెడ్డి 1934, మే 12న దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం తాలూకు నేరడుగొమ్ము గ్రామంలో జన్మించాడు. పలు కంపెనీల్లో కార్మిక సంఘం నేతగా ఎన్నికై, 1970లలో హైదరాబాదుకు వచ్చి వీఎస్టీ కార్మిక సంఘం నేతగా అనేకసార్లు ఎన్నికయ్యాడు.
నరసింహారెడ్డికి అహల్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు (సమతా రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి) ఉన్నారు.
తెలంగాణ ఉద్యమం - రాజకీయ ప్రస్థానం
తొలి, మలి దశల తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నాడు. జనతా పార్టీ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో, హైదరాబాదు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహారెడ్డి ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచాడు. 1978లో టి. అంజయ్యపై గెలిచాడు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2001లో తెరాసలో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ సర్కారులో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా చేసిన నాయిని.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ అనంతరం తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా అతని అనుభవాన్ని దృష్టిలో ఉంచుని ప్రస్తుత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయిని కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు.కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు.
మరణం
నరసింహారెడ్డికి కరోనా సోకడంతో 2020, సెప్టెంబరు బంజారాహిల్స్లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందాడు. కొవిడ్ నెగటివ్ వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో అక్టోబరు 13న జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ 2020, అక్టోబరు 22న (అర్ధరాత్రి 12.25 గంటలకు) మరణించాడు.
మూలాలు
- ↑ "మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత". Archived from the original on 2020-10-22. Retrieved 2020-10-22.